TELANGANA

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. కోటి చొప్పున అందుకున్నవారు వీరే..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు.

 

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోనూ, సాంస్కృతిక వైభవ వ్యాప్తిలోనూ కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కా యాదగిరి, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి స్వయంగా సీఎం చేతుల మీడుగా పురస్కారాలు అందుకున్నారు. గోరటి వెంకన్న, గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరిలకు చెందిన పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.