TELANGANA

కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు..!

తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాల పెంపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.

 

మూడు జోన్లుగా విభజన

కార్మికుల కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు వీలుగా మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా వర్గీకరించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు వస్తాయి. ఇక జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చారు. కార్మికులు నివసించే ప్రాంతాల ఆధారంగా ఈ వేతనాల పెంపు వర్తిస్తుంది.

 

కేటగిరీల వారీగా కొత్త జీతాలు

జూన్ 1 నుంచి అమలు

గత ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల కోట్లాది మంది కార్మికులు నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేబినెట్ సబ్ కమిటీ అన్ని వర్గాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సిఫార్సులు చేసిందని చెప్పారు. ఈ పెంచిన కొత్త వేతనాలన్నీ జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.