National

National

జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. ఏవి చౌక? ఏవి ప్రియం?.

పండగ సీజన్ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లుగా, ఈసారి ‘దీపావళి గిఫ్ట్’ రూపంలో పన్నుల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాల్లో బలమైన అంచనాలు నెలకొన్నాయి.   ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం…

National

సాంకేతిక రంగంలో భారత్ మరో భారీ ముందడుగు..! భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్..

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.   ఢిల్లీలో జరిగిన సెమీకండక్టర్ పరిశ్రమల సమావేశంలో ఈ చిప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.…

National

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.   గతంలో భారత్‌కు వచ్చి గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన…

National

ఎస్‌సీఓ వేదికగా ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..

‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని సూటిగా ప్రశ్నించారు.   సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు.…

National

యుద్ధం ముగియాలి.. శాంతి నెలకొనాలి: పుతిన్‌తో భేటీలో మోదీ..

ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని మరోసారి ప్రపంచ వేదికపై స్పష్టం చేశారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా సోమవారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.   ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యుక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. ఇందులో భాగస్వాములైన అన్ని…

National

చైనాతో స్నేహమా..? మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఆదివారం టియాంజిన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న మెతక వైఖరిని ఎండగడుతూ, దేశ భద్రత విషయంలో రాజీ పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా దూకుడుకు, బెదిరింపులకు తలొగ్గడమే భారత కొత్త భద్రతా విధానమా అని సూటిగా ప్రశ్నించింది.   కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ‘ఎక్స్’…

National

టిక్ టాక్ భారత్ లోకి రీఎంట్రీ..!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్ టాక్ మళ్లీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. గురుగ్రామ్ లోని తమ కార్యాలయంలో ఉద్యోగులను నియామించుకోవడానికి టిక్ టాక్ నోటిఫికేషన్ జారీ చేయడం సందేహాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన, డ్రాగన్ అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ నేపథ్యంలో టిక్ టాక్ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేసే…

National

మోదీ-జిన్‌పింగ్ భేటీ.. సరిహద్దు వివాదంపై చర్చలు..

భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాంజిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం భేటీ కానున్నారు. పది నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.   గతంలో 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన…

National

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్..

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.   భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ…

National

నెహ్రూ కలలుగన్న శాంతి ఒప్పందం.. భారత్-చైనా సంబంధాల్లో కీలక అధ్యాయం..

భారత్-చైనా సంబంధాల గురించి చర్ల వచ్చినప్పుడల్లా ‘పంచశీల ఒప్పందం’ ప్రస్తావనకు వస్తుంది. ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ నినాదాలతో స్నేహానికి ప్రతీకగా మొదలైన ఈ ఒప్పందం, చివరికి రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయడం ఒక చారిత్రక విషాదం. సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం వెనుక ఎన్నో ఆశలు, రాజీలు, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉన్నాయి.   చైనాలో నెహ్రూ చారిత్రక పర్యటన 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో…