గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీ..! ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్..
ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, దానిని సమర్థంగా గ్రిడ్కు అనుసంధానించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా, సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3’ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి…

