జగన్పై మంత్రి అనిత సంచలన విమర్శలు..
అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. రైతులు నేలపైన భోజనాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించడం…

