AP

AP

ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల..

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎన్నికల సంఘం.. స్వతంత్రత కోల్పోయిందని, అది పూర్తిగా బీజేపీ ప్రయోజనాలకే పనిచేస్తోందని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఆరోపణలు.. ఇప్పుడు మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.   షర్మిల వ్యాఖ్యల సారాంశం   హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ ఇప్పటికే దేశం ముందుకు ఒక నిజాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం నేడు మోదీ చేతిలో బందీ అయ్యింది.…

AP

ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు మహర్థశ..! ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు..!

అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ఏపీలో చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఏయే రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామో కలెక్టర్లకు వివిధ శాఖల కార్యదర్శులు వివరించారు. ఏడాదిగా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల గురించి జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తెలియజేశారు.   ఏదైనా సమస్యలు వస్తే వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామిక వేత్తలతో కలెక్టర్లు మాట్లాడాలని సంకేతాలు ఇచ్చేసింది ప్రభుత్వం. ఏపీలోని ఐదు డిఫెన్స్ క్లస్టర్లుగా ప్లాన్ చేసింది కూటమి సర్కార్. అందులో ఉత్తరాంధ్ర-రాయలసీమకు మహార్ధశ పట్టనుంది.…

AP

తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు..!

తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. అక్కడ నుంచి సేకరించిన మట్టి నమునానాల్లో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తించారు. యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు పరీక్షల్లో తేలినట్లు సమాచారం. తురకపాలెంలో ICAR నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ మట్టి పరీక్షలు చేసింది. ఎక్కువమంది బాధితులు క్వారీ తవ్వకాల్లో పనులకు వెళ్ళి అక్కడ నీటిని ఉపయోగించడంతోనే యురేనియం అవశేషాలు శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.…

AP

నేడు మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌..

మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజుతో తెరపడనుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలను జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో కూడా అందుబాటులో ఉంచుతామని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి నిన్న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.   మొత్తం 16,347 పోస్టుల…

AP

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణ… సీఎం చంద్రబాబు క్లారిటీ..

ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాము మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోనే ముందుకు వెళుతున్నామని, దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వానివే ఉంటాయని, వైద్య విద్యార్థులకు గానీ, రోగులకు గానీ ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరు బెదిరించినా భయపడే పరిస్థితి…

AP

ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు నోటీసులు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీబీఐ కోర్టు పంపిన నోటీసులను స్వీకరించేందుకు ఆయేషా తల్లిదండ్రులు నిరాకరించారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తమను పదేపదే కోర్టుల చుట్టూ తిప్పడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   వివరాల్లోకి వెళితే, కేసులో నిందితుడిగా ఉన్న పిడతల సత్యంబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం),…

AP

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం: మంత్రి నాదెండ్ల.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.…

AP

మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌ చిక్కు.. వివాహిత అభ్యర్థులకు కొత్త నిబంధన..

మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.  …

AP

నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు..

“మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.   బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష…

AP

తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు..! అసలు కారణం అదేనా..?

గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్ వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.   గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ వద్దకే వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారికి కలుషితమైన సెలైన్లతో పాటు, మోతాదుకు…