AP

AP

హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యతా రంగాలకు రుణ పరపతిని పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో రూ.5,11,491 కోట్లతో కూడిన ‘స్టేట్ ఫోకస్ పేపర్’ను ఆయన విడుదల చేశారు. గతేడాది (2025-26) ప్రణాళిక అయిన రూ.4.24 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం.   ఈ రుణ ప్రణాళికలో…

AP

రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు..

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం’ నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.   పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి…

AP

‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను నిలిపివేసిన ట్రంప్..

ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.   ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. “ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం.…

AP

వాట్సాప్ వేదికగా వైద్య సేవలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు..

ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా… ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్‌ నంబర్‌కు “హాయ్” లేదా “Hi” అని మెసేజ్ పంపి.. తదనంతరం వచ్చే మెనూలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్‌ను ఎంచుకుని ఈ సేవలను…

AP

పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం..

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ…

AP

ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1,192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో సింహభాగం, అంటే రూ. 1,123.15 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పూడికతీత వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులకు ఊతం లభిస్తుంది. మిగిలిన రూ. 69.01 కోట్లు అడ్మిన్ కాంపోనెంట్ కోసం వినియోగించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ…

AP

ఏపీ క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.   క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే…   1.…

AP

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి..

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు.   కేకే రాజు కామెంట్స్..   కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు,…

AP

ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు..

ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీనితో వర్చువల్ విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తి ఈ విచారణలోకి వచ్చి వీటిని ప్లే చేసినట్లు వెల్లడైంది.   ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ కేసును విచారిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి.…

AP

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష…