పొట్టి శ్రీరాములు విగ్రహంపై రాజకీయ రచ్చ: వైసీపీ విమర్శలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు స్పందన!
అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్ తరాలకు ఆయన త్యాగనిరతిని చాటిచెప్పాలనే సంకల్పంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇది తమ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. కేవలం దోపిడీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియదంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల…

