AP

AP

ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు..

ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA – ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర…

AP

ఏపీ అంటే ‘అడ్వాన్స్‌డ్ ప్రదేశ్’..! రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ రంగ పటంలో అగ్రస్థానంలో నిలుపుతూ, రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, యావత్ భారత రక్షణ రంగ స్వావలంబన ప్రయాణంలో…

AP

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.   ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల…

AP

ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..! వారంలో ఒక రోజు ‘నో వెహికిల్ డే’..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని…

AP

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.   ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి…

AP

సైబర్ నేరాలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్..!

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేరాల కట్టడికి పటిష్ఠమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమే లక్ష్యంగా సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా…

AP

నారా లోకేష్ టీజర్ ట్వీట్..! మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. “మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?” అంటూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. దీనికి జతగా, ఓ అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం ఆకాశంలోకి దూసుకెళ్తున్న ఏఐ (ఏఐ) వీడియోను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ ద్వారా పుట్టపర్తిలో రాబోతున్న భారీ ప్రాజెక్టుపై ఆయన అంచనాలను పెంచారు.   శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో…

AP

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..! రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్..

గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. ప్రతిఘటించిన దుండుగులు, కాల్పుల ప్రారంభించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగింది?   గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..   గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రేల్వే గేట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ సిగ్నల్స్ దగ్గర…

AP

పార్టీ నుంచి దూరం పై యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు..!

తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదని ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. శ్యామలకు కౌంట్‌‌డౌన్ మొదలైందని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వారు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.   ఆ ప్రేమ ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తన…

AP

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువుపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని తెలిపారు.   గత ఏప్రిల్ నాటికే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవ్వడం ప్రాజెక్టు నిర్మాణం…