మావిగన్.. ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి: పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం రాష్ట్రానికి పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మావిగన్ లేదా అయోధ్య..? పేర్ని నాని ప్రతిపాదన మాజీ ముఖ్యమంత్రి…

