AP

AP

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్…!

జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.   రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్…

AP

ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు.  …

AP

‘ఓజీ’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్..

గుంటూరు జిల్లాలో ఓ మహిళకు వైద్యులు వినూత్న పద్ధతిలో బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ, మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో ‘అవేక్ క్రేనియోటమీ’గా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ ఆసుప‌త్రిలో జరిగింది.   ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో…

AP

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

అనంతపురం:ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజమే అవసరమని రేజూనియా కంపెనీ పేర్కొంది. అనంతపురం II REZ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (రెస్సోనియా) జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఒక ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం మొదటగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డిస్పెన్సర్‌లో వేసింది. ఈ…

AP

తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం..! బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

దేశంలో రాజకీయాలు రూటు మార్చాయి. పార్టీని నమ్ముకున్న నేతలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మిగతా పార్టీల నేతలు వలస పోతున్నాయి. జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలదీ అదే దారి. మొన్నటివరకు బలంగా కనిపించిన బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, అధికారం పోయిన తర్వాత అంతర్గత కలహాలు మొదలయ్యాయి.   తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం   ఆ పార్టీలోని అసంతృప్తులు వ్యతిరేక జెండా ఎగురవేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆ పార్టీకి…

AP

తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు..

తిరుమల కల్తీ నెయ్యి కేసు పేరెత్తగానే వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటర్ కావడం కొత్త మలుపు తిరిగింది. బుధవారం ఏకంగా ఆరు రాష్ట్రాల్లోని 15 చోట్ల దాడులు చేసింది. దాదాపు రూ.60 లక్షలు సీజ్ చేసింది ఈడీ. దీని ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది.   తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు  …

AP

చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..

గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తీవ్ర వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.   కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంటాడుతున్నాయి. గురువారం అమరావతిలో చంద్రబాబు మంత్రి వర్గం సమావేశమైంది. సమావేశానికి ముందు నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం. వివిధ అంశాలపై కేబినెట్‌లో…

AP

చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే సదరు ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   “మేము ఒక చెరువుని కబ్జా చేశామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేసేవారు” అంటూ పవన్ ఘాటుగా…

AP

మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ..

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మంత్రి నారా లోకేష్. అందుకోసం ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. దేశంలో కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు ఎవరు? ఏయే విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేశారు. మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశమయ్యారు.   భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ స్కేల్…

APNational

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానలంన్నింటికి నామినేషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   నామినేషన్లు విత్ డ్రా.. జూన్ 8వ తేది వకరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది.…