AP

AP

అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్… ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.   ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం…

AP

ఏపీకి పెట్టుబడుల వరద.. సింగపూర్‌లో ఏడు రోజుల పాటు మంత్రుల వ్యూహాత్మక పర్యటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఏపీకి చెందిన మంత్రుల బృందం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటన ఏప్రిల్ 21న ప్రారంభమై, ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలను రాష్ట్రంలో అమలు చేయడం ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ నేతలు ఈ…

AP

పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా ఒక కీలకమైన ఫైలుపై సంతకం చేసి, పేదల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.56.39 కోట్లను విడుదల చేస్తూ ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ధి చేకూరనుంది.   ఉగాది, నూతన సంవత్సరం వంటి ప్రత్యేక సందర్భాల్లో పేదలకు మేలు చేసే కార్యక్రమంతోనే తన…

AP

ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ..

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేసింది ప్ర‌భుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) జీవో ఎంఎస్ నంబర్ 43ను విడుదల చేసింది.   2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి అనుకూలంగా ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ…

AP

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత..

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.   రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి… మధ్యాహ్నం ఒంటిగంటకు కోయంబత్తూరులో నిర్వహించే…

AP

జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు..? షర్మిల కీలక వ్యాఖ్యలు..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బట్టబయలైందని, విపక్షం ముసుగులో ఉన్నది ఆర్ఎస్ఎస్ పక్షమేనని తేలిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. “దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.   తన ఐదేళ్ల…

APCINEMATELANGANA

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు,…

AP

మహిళా బిల్లును వ్యతిరేకించి ఏం సాధించారు?: జగన్..

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.   లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026కు మూడింట రెండొంతుల మెజారిటీ లభించని నేపథ్యంలో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్…

AP

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు… విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్..

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.   వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు…

AP

ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం..!

రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్-హౌస్ సెన్సెస్ ప్రక్రియలో భాగంగా, తొలి వ్యక్తిగా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.   అమరావతిలోని తన నివాసంలో se.census.gov.in వెబ్ సైట్ ద్వారా చంద్రబాబు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ…