AP

AP

నేడు తాడేపల్లికి జగన్..!

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని నివాసానికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటారు.   రోడ్డు ప్రమాదానికి సంబంధించి వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి…

AP

ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ వార్నింగ్..!

అహంకారం, ఇగోలను పక్కన పెట్టండి.. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడండి..! కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి జనాలకు వివరించండి..ఇదీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు.. మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లు జనంలోకి వెళుతున్న వేళ.. నారా లోకేశ్ చేసిన హితబోధ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ లోకేశ్ హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?   అంతటి…

AP

టిడ్కో ఇళ్లు మోక్షం వచ్చినట్టేనా. ? టిడ్కో ఇళ్లపై కీలక ప్రకటన..!

టిడ్కో ఇళ్లు మోక్షం వచ్చినట్టేనా? లబ్దిదారులు పుల్ హ్యాపీనా? ఇంతకీ మంత్రి నారాయణ చేసిన ప్రకటన ఏంటి? లబ్దిదారులకు ఏ విధంగా కలిసివస్తుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది. టిడ్కో ఇళ్ల పథకంపై మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు.   టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేసి దీపావళికి అందించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాదు మరికొన్ని కీలక…

AP

కాకాణి కుమార్తె ఖాతాలోకి రూ.70 లక్షలు.. సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..!

సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాణి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు, దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు స‌మాచారం.   కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు…

AP

కర్నూలు జిల్లాలో రిలయన్స్ భారీ ప్లాంట్..! రూ.1622 కోట్లతో

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1622 కోట్ల పెట్టుబడితో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.   వివరాల్లోకి వెళితే, శీతలపానీయాలు, పండ్ల రసాలు, మరియు డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను స్థాపించేందుకు రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.…

AP

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్..

రాయలసీమ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీని వీడి, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు.   సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు.…

AP

ఎమర్జెన్సీ, జగన్ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, అటువంటి నియంతృత్వ పోకడలు, అహంకారం ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ చెల్లవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ మూల సిద్ధాంతాలను ఎవరూ విస్మరించరాదని ఆయన హితవు పలికారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్ 25) 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన “సంవిధాన్ హత్యా దివస్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

AP

ఏపీ మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటి హైకమిషనర్ భేటీ..!

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలిపారు. నిన్న రాజధాని అమరావతిలో మంత్రి నారాయణతో గారెత్ విన్ ఓవెన్‌తో కూడిన ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది.   ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి…

AP

అది ఫేక్ వీడియో అంటారా..? జగన్‌పై షర్మిల ఫైర్..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచించారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన, ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు.   మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా…

AP

సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు..

ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు.   ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు… తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.…