మళ్లీ అదే సెంటిమెంట్తో… జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.గతంలో అధికారం కోసం…

