స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు మళ్లీ అవే హామీలు ఇస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలపై బూటకపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం, జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పుడు ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను విస్మరించి మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని…

