AP

AP

డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అందుబాటులో ఉన్న మంత్రులు లంచ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 వివాదం, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ అనుకూలురకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికే అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేశారని మంత్రులు…

AP

అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం..!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్ దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతోంది. తాజాగా రాజధాని అమరావతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వేగంగా జరుగుతున్నాయి. గురువారం ప్రజాప్రతినిధుల టవర్స్‌ని…

AP

ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త బలం..! 58 ఆధునిక వాహనాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను సమకూర్చారు.ఈ కొత్త వాహనాల్లో వేర్వేరు అవసరాలకు తగినట్లుగా మూడు రకాలు ఉన్నాయి. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు…

AP

ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోనే విలువ ఆధారిత…

AP

ఏపీలో మోగనున్న స్థానిక నగారా.. ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలు..

ఏపీ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గతంలో జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 17న ఓటర్ల…

AP

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు..! నాణేనికి మరో వైపు చూపిస్తా..! జగన్ షాకింగ్ కామెంట్స్..

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శాసనసభను దాదాపు రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత…

AP

ఉప్పాడ తీరానికి రక్షణ కవచం.. పవన్ సమక్షంలో మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం..

కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తీవ్రమైన కోత కారణంగా దెబ్బతింటున్న ఈ తీరాన్ని పరిరక్షించేందుకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ ప్రాజెక్టు కింద రూ.323 కోట్ల వ్యయంతో ఉప్పాడ తీరంలో రక్షణ గోడ…

AP

నకిలీ పోలీసులతో ర్యాలీలా..? వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు..

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు.…

AP

ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలకు కూటమి పార్టీల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. మిత్రపక్షాల నాయకులను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు, విద్వేషపూరిత ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంయుక్తంగా హెచ్చరించాయి. ఈ మేరకు ‘ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ’ పేరుతో ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి.గత కొంతకాలంగా కూటమి పార్టీల…

AP

డీఎస్సీపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు..

డీఎస్సీ‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తేవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? దాని పేరుతో నిరసనలు.. ర్యాలీలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోందా? ఈ ఇష్యూ ద్వారా జెన్ జీలను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసిందా? డీఎస్సీ వ్యవహారంపై కోర్టు కూడా సీబీఐ విచారణకు ససేమిరా చెప్పినా, ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? సోమవారం నిరసన ర్యాలీలో కీలక నేతలు అరెస్టుతో పెద్దగా స్పందన లేదా? ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది డీఎస్సీ నిర్వహించింది.…