AP

AP

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన “జాబ్ క్యాలెండర్-2026″ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆగస్టు 22, 2026న జీవో నెం.81ను జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు), డీఎస్సీ వంటి…

AP

డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం..! జగన్‌కు నారా లోకేశ్ ఐదోసారి సవాల్..

డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!” అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా…

AP

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన…

AP

జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: మంత్రి నారా లోకేశ్..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేశ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.“ఏపీపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డీఎస్సీ అంటే ఏమిటో తెలియదు. రెండూ ఒకటే అని…

AP

స్థానిక పోరుకు జనసేన సై..! ఆ వ్యూహం గత ఎన్నికలకే పరిమితమన్న పవన్ కల్యాణ్..

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా, క్షేత్రస్థాయి బలాబలాలకు అనుగుణంగా ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావశీలమైన పోటీ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం…

AP

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత ఉందని జగన్‌ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్‌ ఫైర్ అయ్యారు.…

AP

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ..!

ఏపీ శాసనసభలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడింది. రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్-1 అందిస్తుంది. ఎంతో శ్రమించి అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ – 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు.…

AP

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. బీసీ రిజర్వేషన్లు, ప్రత్యక్ష ఎన్నికలకు ఆమోదం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.…

AP

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమ..

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య, అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవిలను శాసనమండలికి నామినేట్ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సిఫార్సులతో కూడిన దస్త్రాన్ని ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రెండు…

AP

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం.. దేశమే కాదు ప్రపంచమే గర్వించతగ్గ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. అందుకు తగ్గట్లే రాజధాని ప్రాంతంలో చకచకా నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. సీడ్ యాక్సెస్ రోడ్డును సైతం ప్రారంభించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజధానిపై తమ వ్యతిరేక స్వరంగా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా పాటనే విడుదల చేశారు.…