మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు..
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్తో సహా ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం స్థానికంగానే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది. వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఆరోపణలు బాధితురాలు మేఘన పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం…

