ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేసిన ఆయన, వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. శనివారం వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముఖ్య…

