AP

AP

టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్..!

ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణే ముఖ్యం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నాయకుడు, కార్యకర్తను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలను ఎంతటి నాయకులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారుని గుర్తు చేశారు.   ఉద్యోగాలు కల్పన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కష్టం, త్యాగంతో…

AP

ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ…

AP

ఏపీపై ఎల్‌నినో పంజా.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు.   ఈ సందర్భంగా అధికారులు పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో జూలై నెలలో ఏకంగా 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సగటున…

AP

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా..! ఎప్పుడంటే..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హంగామా మొదలవుతోంది. ఓ వైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పార్టీలు నేతలు, కేడర్‌ను అలర్ట్ చేయడంతో రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.   ఏపీలో స్థానిక సంస్థల హంగామా- తొలుత సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఓటర్ల…

AP

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతల ఐక్యత, వారి భేటీలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంతాప సభ ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ మంటలు రాజేసింది. ముద్రగడ కుటుంబంలో జరిగిన సంతాప సభకు హాజరై తన పక్కన కూర్చున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కాపులు ఒకటైతే చంద్రబాబుకు భయం.. కాపులందరూ…

AP

సీఐ నాగరాజు కేసులో మలుపు.. కస్టడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. నిందితుడిని రాజమండ్రి జైలులోనే విచారించాలంటూ గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దర్యాప్తునకు అనుకూలంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.   విచారణ కోసం సీఐ నాగరాజును విజయవాడలోని దర్యాప్తు కేంద్రానికి గానీ,…

AP

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు..

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో జోగి రమేష్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం స్థానికంగానే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.   వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఆరోపణలు బాధితురాలు మేఘన పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం…

AP

ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..

కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అనంతరం సంజీవని బహిరంగ సభలో మాట్లడారు. సీఎం అంటే సెక్రటేరీయేట్‌లో ఉండే చీఫ్ మినిస్టరే కాదు.. ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన.. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని, నెలలో నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నాంమని తెలిపారు.   రాష్ట్రవ్యాప్తంగా…

AP

మంగళగిరి కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు…

AP

ఉండి వైసీపీలో కలకలం.. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న పీవీఎల్ నరసింహరాజు..?

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఆయన ఈరోజే తన అధికారిక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది.…