AP

AP

జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు..

అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. రైతులు నేలపైన భోజనాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించడం…

AP

అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదిక‌గా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర గళం బలంగా వినిపించిన క్షణమిదని ఆయన పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రజల కలలను…

AP

అమరావతి పేరుతో రాయలసీమకు తీరని అన్యాయం: రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆరోపణ

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం,అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం విభజనకు ముందు విభజన తర్వాత అప్పటి కేంద్రం వేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చేస్తూనే ఉన్న ఆగిత్యం అంతాఇంతా కాదన్నది జగమెరిగిన నగ్న సత్యము……. …. 1956నుండి2014వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా వచ్చిన ముఖ్యమంత్రులలో ఎక్కువగా నేనే నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ కేవలం హైదరాబాద్…

AP

లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు.. రెండు గంటలపాటు చర్చ, కాంగ్రెస్ పూర్తి మద్దతు

ఏపీ శాశ్వత రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. జీవో అవర్ ప్రారంభంలో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో జనవిశ్వాస, ఎఫ్‌సీఆర్ఏ(ఫారెన్ కంటిబ్యూషన్‌కు సంబంధించినది) వీటితోపాటు ఏపీ పునర్విభజన బిల్లు కూడా రానుంది.   లోక్‌సభలో ఏపీ పునర్విభన బిల్లులో రాజధాని అమరావతిపై చర్చ   ఏపీ రాజధాని అమరావతి బిల్లుపై సభలో రెండు గంటలపాటు చర్చ జరగనుంది. తొలుత ఈ బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశ పెట్టారు.…

AP

ఏపీ రాజధానిగా మావిగన్.. జగన్ సరికొత్త ప్లాన్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి ఒక భారీ రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ మూడు నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతానికి ‘మావిగన్’ (MAVIGUN) అనే సరికొత్త పేరును జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   రాష్ట్ర…

AP

రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్…

AP

ఇక‌ ప్రతి నెల 4వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని…

AP

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్‌పై హర్షం: కదిరిలో క్రికెటర్ల కేక్ కటింగ్ వేడుకలు

RDT FCRA రెన్యూవల్ పట్ల క్రికెటర్ల హర్షం ఇటీవల ఉమ్మడి జిల్లాలకు వరం లాంటి ఆర్డీటీ సంస్థకు ( FCRA ) లైసెన్స్ రెన్యూవల్ అవడం తో ప్రతి ఒక్కరు హర్షించారు.అందులో భాగంగా ఈరోజు ప్రభుత్య డిగ్రీ కళాశాల మైదానం నందు గల క్రికెట్ నెట్స్ నందు కదిరి వర్ధమాన, పూర్వ క్రికెటర్లు, క్రికెట్ శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ కదిరి రీజియన్ RD రఘురామ్, నల్లచెరువు ఏరియా ATL…

AP

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికేనా..?

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మరోసారి ఏపీ ప్రజలు రాజధాని లేకుండా ఇబ్బందులు పడరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిపి ఆ బిల్లును సభలోని సభ్యులు ఆమోదించారు. అయితే, అమరావతి బిల్లు…

AP

రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం.   నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,00,875 టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది…