AP

AP

ఏపీలో మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ ప్రారంభంచిన సీఎం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో, నకిలీ రిజిస్ట్రేషన్లతో వేధిస్తున్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ముందడుగు వేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా, రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.   భూ రికార్డులకు తిరుగులేని భద్రత   ఈ…

AP

కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి వేదికగా మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడదల రజిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు.   చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. రుణాల కోసం…

AP

తిరుమలలో 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ..

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తుల నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.   ఈ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా… కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా…

AP

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌..!

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ నడిపిన బైక్‌ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య…

AP

వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్..!

మంగళగిరి ప్రజాసేవలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం నిరీక్షిస్తున్న పేదల నిరీక్షణకు తెరదించుతూ, రాష్ట్ర విద్యుత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏకంగా 3,000 మంది నిరుపేద కుటుంబాలకు శాశ్వత భూహక్కు పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే, బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1,000 కోట్ల విలువైన ఈ ఆస్తులను…

AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్..!

ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.   ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం   ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ…

AP

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్.. దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కుదిరిన మరో కీలక ఒప్పందం కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు పడింది. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ…

AP

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.   ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు   రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని…

AP

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫ్రంట్ ఆఫీస్ సేవలు.. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని…

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ బి. వీరబాబు, కానిస్టేబుల్ నెం.3851/ఆర్‌పీఎఫ్/కదిరి, కదిరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెం.1లో విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి…