AP

AP

26 రకాల వివరాలతో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఎఫ్ బీఎంఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అసెంబ్లీలోని తన చాంబర్‌లో అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్, రైస్ కార్డ్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల వివరాలు వంటి మొత్తం 26 రకాల అంశాలతో పకడ్బందీగా డేటాబేస్ రూపొందించాలని…

AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి రథానికి నూతన గొడుగులు, వస్త్రాల సమర్పణ

శ్రీమత్ ఖాధ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానం, కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మోత్సవాలు -2026 సం!! సందర్భముగా బ్రహ్మ రధోత్సవము (శ్రీ స్వామి వారి తేరు) నకు కావలసిన నూతన గొడుగులు (చిన్నవి-2, పెద్దవి-2), ధ్వజలు, శంకు చక్రాలు, చిత్రవర్ణ లిఖిత తేరు నూతన వస్త్రములు మొదలగునవి కడపల శ్రీకాంత్ రెడ్డి S/o,శివ గంగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, పెద్దకదపవారి పల్లి, తనకల్లు మరియు నాగేళ్ళ లక్ష్మి నరసింహా ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు,…

AP

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

తనకల్లు మండలం బండ్రేవారిపల్లికి చెందిన ఎద్దుల హర్షవర్ధన్ రెడ్డి బుధవారం తనకల్లు మండల కేంద్రంలో వారి స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వైజాగ్ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వైజాగ్ నుండి రైలుకు వచ్చి తనకల్లు లో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం: రూ. 2.22 లక్షల పింఛన్ సొమ్ము స్వాహా

శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పింఛన్ సొమ్ము ను స్వాహా 2.22 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి. ఇరువురి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎంపీడీవో పార్థసారథి శ్రీ సత్య సాయి…

AP

హంస వాహనంపై శ్రీ శారదా స్వరూపుడై దర్శనమిస్తున్న శ్రీవారు

చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో, తెల్లని హంస వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారి రూపం అత్యంత మనోహరంగా ఉంటుంది. సకల విద్యా ప్రదాత అయిన ఆ స్వామి, చేతిలో వీణను ధరించి, మందహాసంతో భక్తులను అనుగ్రహిస్తుంటే ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. జ్ఞానానికి, వివేకానికి ప్రతీక అయిన హంసపై శ్రీవారు కొలువుదీరడం, భక్తులలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుందని వేద పండితులు చెబుతుంటారు. ఈ విశేష అలంకారంలో శ్రీవారిని దర్శించుకోవడం…

AP

వేట్లపాలెం బాణసంచా ఘోరం: 23కు చేరిన మృతుల సంఖ్య – సహాయక చర్యల్లో జాప్యమే శాపమా?

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరుకోగా, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న తర్వాత సుమారు రెండు గంటల పాటు బాణసంచా సామాగ్రి వరుసగా పేలుతూనే ఉండటంతో, అగ్నిమాపక సిబ్బంది గానీ, స్థానికులు గానీ లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టే వీలు లేకుండా పోయింది. ఈ వరుస…

AP

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారూ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. పేదల జీవన భద్రతను బలోపేతం చేయడం, వారికి సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం…

AP

కదిరి పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ: సరికొత్త డిజిటల్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట దంపతులు

*అంకురార్పణ పూజ కార్యక్రమంలో పాల్గొనుటకు ఆలయ ప్రధాన అర్చకులను స్వాగతం పలికిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతులు* కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన Ai ఆన్లైన్ టికెట్ల దర్శనం,ఈ హుండీ, కేసఖండన, ఆటో మేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన సతీమణి శ్రీమతి కందికుంట యశోద…

AP

పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే శ్రావణి మరియు ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి

*ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే, శ్రావణి గారు, ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు,* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు గారితో పాటు కలసిన ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు* నియోజకవర్గం లోని పలు అంశాలపై చర్చించారు.