విజయవంతంగా ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన: ఏపీకి రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడుల పంట!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సును విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. ఈ నాలుగు రోజుల పర్యటన ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యవసాయం మరియు టూరిజం వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. శుక్రవారం ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఆయన, అనంతరం…

