సూరంపల్లి వేదికగా సీఎం చంద్రబాబు ఆగ్రహం: రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల.. కల్తీ నెయ్యి దోషులపై హెచ్చరిక!
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడటంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని, కానీ గత ప్రభుత్వం స్వార్థం కోసం సాక్షాత్తు ఆ దేవుడి సేవలనే అపవిత్రం చేసిందని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుంటే విపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, అయితే భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన…

