AP

AP

ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పవన్ హెచ్చరిక..!

రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) తీరుపై రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తూ, మరోవైపు గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో సగం కాలుష్యానికి ఈ కంపెనీయే కారణమని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం దగ్గర నుంచి లైసెన్సు రద్దు వరకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం…

AP

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడు జాన్ సైదా హర్యానాలో అరెస్ట్..

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ జాన్ సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను షేక్ జాన్ సైదా (రబ్బానీ) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి…

AP

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం..! డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్..

ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం…

AP

అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు..: మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.…

AP

పోలవరం జిల్లాలో విషాద ఘటన..! వికటించిన మాత్రలు..! ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత..

పోలవరం జిల్లా గొల్లగుప్పలో విషాదం చోటు చేసుకుంది. వేసుకున్న మలేరియా మాత్రలు వికటించాయి. ఫలితంగా ఓ చిన్నారి మృతి చెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందర్ని వివిధ ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మంగళవారం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అందులో మలేరియా నివారణకు స్థానిక పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారుల్లో 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు…

AP

అనకాపల్లి మరో రంగారెడ్డి అవుతుంది.. ఇది ఖాయం.. రాసిపెట్టుకోండి: సీఎం చంద్రబాబు..

ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను సాకారం చేస్తూ, పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి గడ్డపై అడుగుపెట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సాధించిన ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, దాని ఫలితమే ఈ జలయజ్ఞమని అన్నారు.మాట నిలబెట్టుకున్నాం.. పునర్నిర్మాణం చేస్తున్నాం గత ఎన్నికల్లో ప్రధాని…

AP

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా.!

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ ఫేక స్వామీజీ బండారం బట్టబయలైంది. సంతాన ప్రాప్తి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తానంటూ నమ్మించి అమాయకులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ దంపతుల వద్ద దాదాపుగా రెండు కోట్లకు పైగా డబ్బు కాజేసిన సంఘటన కలకలం రేపుతుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్ళచెరువు సమీపంలో నైమిసారణ్యం ఆశ్రమం నిర్వహిస్తూ రమణ పొలకల స్వామి అలియాస్ రమణానంద మహర్షి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్టు దంపతులు పేర్కోన్నారు. అయితే బెంగళూరు ప్రాంతానికి చెందిన…

AP

వెలిగొండ ప్రాజెక్టుపై క్రెడిట్ చోరీ మొదలు..! ఎక్స్ వేదికగా కొన్ని విషయాలు బయటపెట్టిన జగన్..

ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ మొదలైందా? కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రతీ పని తమ ఘనతేనని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? నిన్న భోగాపురం ఎయిర్‌పోర్టు.. నేడు వెలిగొండ ప్రాజెక్టు.. రేపు పోలవరం ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం ఏది చేసినా తాము చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్  వైఎస్ ఖాతాలోకి వైసీపీ జమ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. వెలిగొండ…

AP

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమైంది. పశ్చిమ ప్రకాశంలోని కరవు పీడిత ప్రాంతాలకు జీవనాడిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ప్రాజెక్టు సొరంగాల నుంచి ఉరకలేస్తూ వచ్చిన కృష్ణా జలాలకు ఆయన భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ చారిత్రక ఘట్టంతో ఆ ప్రాంత రైతులు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా…

AP

సజ్జల నాపై దాడి చేశారు..! వైసీపీకి విజయసాయిరెడ్డి సంచలన లేఖ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఏంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన లేఖ ఇప్పడు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత ఇప్పటివరకు మాట్లాడని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్షలు గుప్పించారు… గత 02022లో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతికంగా దాడి చేసారని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ…