విజయవాడలో డీఎస్సీ టీచర్ల ‘ఆత్మగౌరవ ర్యాలీ’.. వైసీపీపై ఫైర్..
తమ నియామకాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో భారీ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న ఆరోపణలు వెంటనే ఆపకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 7,000 మందికి పైగా నూతన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన…

