ఏపీలో మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ ప్రారంభంచిన సీఎం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో, నకిలీ రిజిస్ట్రేషన్లతో వేధిస్తున్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ముందడుగు వేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా, రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. భూ రికార్డులకు తిరుగులేని భద్రత ఈ…

