AP

AP

నాగబాబుకు కీలక పదవి.. కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ (Green Executive Committee) చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విశేషంగా పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవుల విస్తరణే లక్ష్యంగా పనిచేసే ఈ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీకి…

AP

ప్రతి ఏటా డీఎస్సీ..! ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… డీఎస్సీ నిర్వహణ, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకంగా 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి…

AP

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: వైసీపీకి చంద్రబాబు సవాల్ ..

మెగా డీఎస్సీ నియామకాల్లో ఒక్క డీవియేషన్ కూడా జరగలేదని, ప్రతిభ ఆధారంగానే అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ చేస్తున్నది కేవలం హిట్ అండ్ రన్ ఆరోపణలేనని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల జగన్ జెన్ జీ వృద్ధులతో ఫేక్ ప్రదర్శనలు చేయిస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ…

AP

విజయవాడలో డీఎస్సీ టీచర్ల ‘ఆత్మగౌరవ ర్యాలీ’.. వైసీపీపై ఫైర్..

తమ నియామకాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో భారీ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న ఆరోపణలు వెంటనే ఆపకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 7,000 మందికి పైగా నూతన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన…

AP

డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అందుబాటులో ఉన్న మంత్రులు లంచ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 వివాదం, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ అనుకూలురకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికే అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేశారని మంత్రులు…

AP

అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం..!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్ దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతోంది. తాజాగా రాజధాని అమరావతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వేగంగా జరుగుతున్నాయి. గురువారం ప్రజాప్రతినిధుల టవర్స్‌ని…

AP

ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త బలం..! 58 ఆధునిక వాహనాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను సమకూర్చారు.ఈ కొత్త వాహనాల్లో వేర్వేరు అవసరాలకు తగినట్లుగా మూడు రకాలు ఉన్నాయి. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు…

AP

ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోనే విలువ ఆధారిత…

AP

ఏపీలో మోగనున్న స్థానిక నగారా.. ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలు..

ఏపీ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గతంలో జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 17న ఓటర్ల…

AP

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు..! నాణేనికి మరో వైపు చూపిస్తా..! జగన్ షాకింగ్ కామెంట్స్..

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శాసనసభను దాదాపు రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత…