విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఆ శిథిలాల నుంచి నవ్యాంధ్రను పునర్నిర్మిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చట్టసభ గౌరవాన్ని తగ్గించి, దానిని ‘బూతుల అడ్డా’గా మార్చారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభా గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యతని, ఇటీవల…

