AP

AP

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం పవన్ విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగిందని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని, గవర్నర్ మార్గదర్శకత్వం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.   అంతకుముందు, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ఈగల్’ విభాగం చీఫ్, సైబర్…

AP

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్ డబ్ల్యూ రాయలమీస ఉక్కు కర్మాగార పనులను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల.. కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంతో రాయలసీమలో నవశకం మెుదలైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత…

AP

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్..!

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్‌ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళను ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మించనున్నారు.   కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్   ఢిల్లీలో ఏపీ భవన్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఆ బాధ్యతను…

AP

పవన్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారుస్తాం: సీఎం చంద్రబాబు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా నిధులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పనిదినాలు కల్పించి, రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తుల కల్పనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్…

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం… సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ..

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన…

AP

‘సర్’ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది.. జగన్ షాకింగ్ కామెంట్స్..

“ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవాడి ఓటు హక్కునే కాలరాస్తున్నారు” అంటూ వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్లకు కనీసం ఫారాలు ఇవ్వకుండానే, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వేలాది మంది పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన…

AP

ఆధారాలు లేని ఆరోపణలు సహించం..! సోషల్‌ మీడియా దుర్వినియోగంపై పవన్‌ తీవ్ర హెచ్చరిక..!

సోషల్‌ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.   మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్‌ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం…

AP

చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు: భూమన..

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, వైసీపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు.   ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.…

AP

ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

AP

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్..!

నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు నిర్వహణకు వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ సదస్సుపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు వినూత్న ఆలోచనల మార్పిడికి ఈ సదస్సు ఒక వేదిక కానుంది.   సదస్సు వేదిక, ప్రధాన థీమ్   ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య…