ఎల్ నినోపై చంద్రబాబు సమగ్ర వ్యూహం..! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!
రాష్ట్రంపై ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై లోతుగా చర్చించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తును ఒక సవాల్గా స్వీకరించి, రైతులు, వినియోగదారులపై దాని ప్రభావం పడకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో…

