వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు..
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్ ఫైర్ అయ్యారు.…

