AP

AP

పెమ్మసానిపై ఏఐ వీడియో.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు..

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక ఏఐ-జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఈ కేసు రిజిస్టర్ చేశారు.   కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసినట్టుగా ఉన్న ఒక ఏఐ వీడియోను అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో ద్వారా పెమ్మసాని…

AP

సీదిరి అప్పలరాజుకు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు..

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు కోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. సీదిరి అప్పలరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఆయన జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.   వివరాల్లోకి వెళితే.. జులై 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ…

AP

మంచిర్యాల జిల్లాలో వింత… వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు..!

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. వర్షపు నీటితో పాటు చిన్నపాటి చేపలు వీధుల్లోకి కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోడ్లపై కనిపిస్తున్న ఆ చేపలను పట్టుకోవడానికి పిల్లలు, యువకులు పోటీపడ్డారు.   పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వరద నీటిలో చేపలు కొట్టుకురావడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కొందరు ఇవి…

AP

అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే చంద్రబాబే: కాకాణి గోవర్ధన్..

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో ఏమీ సాధించకుండా టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలకు తమ ముఖం కూడా చూపించలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.   ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీల అమలులో ప్రభుత్వం కోతలు పెడుతోందని విమర్శించిన కాకాణి, “అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే…

AP

మహిళా ఎస్సైని తోసేసిన వైసీపీ నేత..!

శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ పర్యటించిన సందర్భంగా జిల్లా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనకు సంబంధించి రోడ్‌షోలు, జనసమీకరణ చేయకూడదని పోలీసులు విధించిన నిబంధనలు, ఆంక్షలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధిక్కరించారు.   మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్ నాయకత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు… జైలుకు కిలోమీటరు ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు…

AP

ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్.. మంత్రి నారా లోకేష్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయ‌ని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరిస్తున్నాయని ఆయన వెల్ల‌డించారు. పత్తికొండ సమీపంలోని హోసూరు వద్ద టాటా పవర్…

AP

టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్..!

ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణే ముఖ్యం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నాయకుడు, కార్యకర్తను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలను ఎంతటి నాయకులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారుని గుర్తు చేశారు.   ఉద్యోగాలు కల్పన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కష్టం, త్యాగంతో…

AP

ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ…

AP

ఏపీపై ఎల్‌నినో పంజా.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు.   ఈ సందర్భంగా అధికారులు పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో జూలై నెలలో ఏకంగా 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సగటున…

AP

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా..! ఎప్పుడంటే..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హంగామా మొదలవుతోంది. ఓ వైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పార్టీలు నేతలు, కేడర్‌ను అలర్ట్ చేయడంతో రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.   ఏపీలో స్థానిక సంస్థల హంగామా- తొలుత సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఓటర్ల…