AP

AP

మార్కెట్లోకి ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం..!

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది. రాష్ట్రంలోనే వెలికితీసిన ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గనుల నుంచి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లను అమ్మకానికి ఉంచారు. ఈ చారిత్రక ఘట్టంతో కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతోంది.   ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లపై ఏపీ…

AP

అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!

ఏపీ రాజధాని అమరావతిలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని ఉండవల్లి సెంటర్ లో రైతులు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఓ దశలో…

AP

‘బటన్లు నొక్కితే ఓట్లు పడవు’..! 11 సీట్లకు పరిమితం చేసినా మారరా..? వైసీపీ పై పవన్ కళ్యాణ్ ఫైర్..

విపక్ష వైసీపీపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికి కూడా ఇష్టానికి నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 వచ్చినా.. భాష విషయంలో వెనక్కి తగ్గం అన్న రీతిలో వైసీపీ నేతల ప్రవర్తన ఉంటోందని సెటైర్లు వేశారు. మీరు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి అంటూ చురకలు అంటించారు.  …

AP

సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు..!రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించిన సిట్..

విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ కీలక విషయాలు బయటపెట్టంది. పోలీసు కస్టడీలో దెబ్బల కారణంగానే సాయికృష్ణ మరణించినట్టు తేల్చింది. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను బయటకు తెలియకుండా నిందితుడు నాగరాజు మాయం చేశాడని ప్రస్తావించింది.   సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.…

AP

పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్‌,…

AP

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..

దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్‌పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరి‌గా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్‌(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.   రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం   విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు…

AP

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు..

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏం జరుగుతోంది? మాజీ సీఐ నాగరాజును దాదాపు 8 గంటల పాటు సిట్ విచారించిందా? విచారణలో నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? సిట్ ఐజీ విచారించినా నాగరాజు నోరువిప్పలేదా? నాగరాజు సైలెంట్‌పై ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది?   సాయికృష్ణ అదృశ్యం కేసు.. ముగిసిన సిట్ విచారణ   సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. మంగళవారం సస్పెండ్ సీఐ నాగరాజుని అరెస్టు చేసిన సిట్ అధికారులు, మధ్యాహ్నం…

AP

ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ..

*ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ* (కనేకల్ డేట్ లైన్) కనేకల్ మండలం ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాలలో రేసోనియా కంపెనీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్టు పంపిణీ బుధవారం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఒక్కచదువుతో సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు…కణేకల్లు మండలంలోని ఎర్రగుంట జిల్లా పరిషత్ వున్నత పాఠశాలలో రెజోనియా కంపెనీ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందచేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండలకన్వినర్ వన్నారెడ్డి హాజరయ్యారు..ఆయనతోపాటు రెజోనియా కంపెనీ…

AP

సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా కీలక వ్యాఖ్యలు..

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం సాయికృష్ణ అదృశ్యం కేసును మరింత సంచలనాత్మకం చేసింది. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక సాక్ష్యాలైన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది” అని అన్నారు.   సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై…

AP

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..! ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం..

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.   భారీగా పారిశ్రామిక పెట్టుబడులు   రాష్ట్రంలో…