AP

AP

‘సర్’ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది.. జగన్ షాకింగ్ కామెంట్స్..

“ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవాడి ఓటు హక్కునే కాలరాస్తున్నారు” అంటూ వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్లకు కనీసం ఫారాలు ఇవ్వకుండానే, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వేలాది మంది పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన…

AP

ఆధారాలు లేని ఆరోపణలు సహించం..! సోషల్‌ మీడియా దుర్వినియోగంపై పవన్‌ తీవ్ర హెచ్చరిక..!

సోషల్‌ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.   మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్‌ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం…

AP

చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు: భూమన..

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, వైసీపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు.   ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.…

AP

ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

AP

అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్..!

నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు నిర్వహణకు వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ సదస్సుపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు వినూత్న ఆలోచనల మార్పిడికి ఈ సదస్సు ఒక వేదిక కానుంది.   సదస్సు వేదిక, ప్రధాన థీమ్   ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య…

APUncategorized

కాపులను దూరం చేయడమే వైసీపీ స్ట్రాటజీ..! ఎమ్మెల్సీ హరిప్రసాద్ షాకింగ్ కామెంట్స్..

మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వైసీపీ పార్టీ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఆయన ఎండగట్టారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ పదవీ బాధ్యతల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.   పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర   జనసేన అధినేత పవన్…

AP

ఏపీ డిజిటల్ భవిష్యత్తుపై చంద్రబాబు ఫోకస్.. సునీల్ మిట్టల్‌తో కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందించడం, డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది.   ఈ భేటీలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సునీల్…

AP

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పెనుమాక గ్రామంలో భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీపై జరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రభుత్వంపై, టీడీపీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   అమరావతి.. ఒక అంతులేని కథ!  …

AP

మార్కెట్లోకి ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం..!

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది. రాష్ట్రంలోనే వెలికితీసిన ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గనుల నుంచి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లను అమ్మకానికి ఉంచారు. ఈ చారిత్రక ఘట్టంతో కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతోంది.   ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లపై ఏపీ…

AP

అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!

ఏపీ రాజధాని అమరావతిలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని ఉండవల్లి సెంటర్ లో రైతులు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఓ దశలో…