అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి నాలుగోసారి మోసపోయారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, కేవలం అమరావతిపైనే లక్షల కోట్లు కుమ్మరించడం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అమరావతి నగరం…

