కుప్పంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నాయంటున్నారు… వెలికితీస్తాం: సీఎం చంద్రబాబు..
తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, దేశానికే ఆదర్శంగా నిలిపే ‘స్వర్ణ కుప్పం’ నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా… రూ.118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కుప్పంలోనూ బంగారు గనులు…

