AP

AP

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.   ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి…

AP

సైబర్ నేరాలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్..!

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేరాల కట్టడికి పటిష్ఠమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమే లక్ష్యంగా సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా…

AP

నారా లోకేష్ టీజర్ ట్వీట్..! మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. “మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?” అంటూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. దీనికి జతగా, ఓ అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం ఆకాశంలోకి దూసుకెళ్తున్న ఏఐ (ఏఐ) వీడియోను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ ద్వారా పుట్టపర్తిలో రాబోతున్న భారీ ప్రాజెక్టుపై ఆయన అంచనాలను పెంచారు.   శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో…

AP

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..! రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ట్యాంపరింగ్ ప్లాన్..

గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. ప్రతిఘటించిన దుండుగులు, కాల్పుల ప్రారంభించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగింది?   గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..   గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రేల్వే గేట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ సిగ్నల్స్ దగ్గర…

AP

పార్టీ నుంచి దూరం పై యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు..!

తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదని ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. శ్యామలకు కౌంట్‌‌డౌన్ మొదలైందని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వారు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.   ఆ ప్రేమ ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తన…

AP

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువుపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని తెలిపారు.   గత ఏప్రిల్ నాటికే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవ్వడం ప్రాజెక్టు నిర్మాణం…

AP

జనసేనలో కుమ్ములాటలు..? కారణం ఎవరు..?

జనసేన పార్టీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక గొడవ లేదా వివాదాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకరు పోతే మరొకరు పార్టీని ప్రజల్లో చీప్ చేసేస్తున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనసేనానికి ఏమో ఆరోగ్యం బాలేదు. ఇటీవల ఆయనకు సర్జరీ అయ్యింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పవన్ కళ్యాణ్ పెద్దగా హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో…

AP

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచడం, కొత్తగా నిధుల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన…

AP

వ్యవస్థలు గాడి తప్పాయా..? అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీలో పోలీసు యంత్రాంగం తన ప్రాథమిక విధులను విస్మరించి, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ తన పంథాను మార్చుకుందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే నేడు ప్రశ్నించే గొంతుకలను అణచివేసే…

AP

పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు.   వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించినందుకే తాను ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూనే తప్పులను ఎత్తిచూపడం…