AP

AP

జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు..? షర్మిల కీలక వ్యాఖ్యలు..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బట్టబయలైందని, విపక్షం ముసుగులో ఉన్నది ఆర్ఎస్ఎస్ పక్షమేనని తేలిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. “దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.   తన ఐదేళ్ల…

APCINEMATELANGANA

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు,…

AP

మహిళా బిల్లును వ్యతిరేకించి ఏం సాధించారు?: జగన్..

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.   లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026కు మూడింట రెండొంతుల మెజారిటీ లభించని నేపథ్యంలో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్…

AP

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు… విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్..

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.   వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు…

AP

ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం..!

రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్-హౌస్ సెన్సెస్ ప్రక్రియలో భాగంగా, తొలి వ్యక్తిగా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.   అమరావతిలోని తన నివాసంలో se.census.gov.in వెబ్ సైట్ ద్వారా చంద్రబాబు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ…

AP

ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు.

రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.   ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్…

APNationalTELANGANA

ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన..

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవని, పైగా సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని నిర్దిష్ట లెక్కలతో సహా వివరించారు.   మహిళా…

AP

తెలుగుదేశ పార్టీలో కీలక మార్పులు..! ఉపాధ్యక్షుడిగా నారా లోకేష్..

నుంచి యువ సైన్యాన్ని రెడీ చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడులను నియమించింది. ఇదే కాకుండా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ హైకమాండ్.   తెలుగుదేశ పార్టీలో కీలక మార్పులు   ఎట్టకేలకు టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ,…

AP

2029లో వచ్చేది నేనే..! జగన్ మాస్ వార్నింగ్..

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు గారూ.. కళ్ళు మూసి తెరిచేసరికే మరో మూడేళ్లు అయిపోతుంది.. వచ్చేది మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే! ఈ జువ్వలదిన్నెలో మత్స్యకారుల పొట్టకొట్టి మీరు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను తిరిగి తీసుకుంటాం.. ఆ ప్రైవేట్ డిఫెన్స్…

AP

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ, ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాజధానిని రాత్రికి రాత్రే నిర్మించలేరని ఆయన స్పష్టం చేశారు.   ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చారిత్రక నగరాల నిర్మాణాన్ని గుర్తుచేశారు. 1537లో కెంపె గౌడ స్థాపించిన బెంగళూరు, 1591లో కులీ కుతుబ్ షా నిర్మించిన…