AP

AP

విశాఖలో జీ 20 సదస్సు అన్ని ఏర్పాట్లు పూర్తి..

జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు ఏపీ మంత్రులు. సదస్సు కోసం స్టీల్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కేవలం సుందరీకరణే కాకుండా శాశ్వత నిర్వహణకు చర్యలు చేపట్టామని వివరించారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధానికి తగ్గట్లు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు.. కొత్తగా 5 బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. G -20 ఏర్పాట్లపై…

AP

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీకి అమ్ముడుపోయారనే అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే…

APNationalTELANGANA

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు..

తన పార్లమెంట్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడంపై కాంగ్రెస్ ముఖ్య నేత, రాహుల్ గాంధీ స్పందించారు. చాలా ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దేశం కోసం గళం విప్పుతానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తాను భారతదేశ స్వరం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు రాహుల్. దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. మరోవైపు ప్రముఖ రాజకీయ నేతలు రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ సీఎం…

AP

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ సంచలన ఆరోపణలు..

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సభలో వివరించారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం జగన్.. చంద్రబాబు పాలనలో అవినీతే టార్గెట్‌గా సంచలన వివరాలు వెల్లడించారు. షాపూర్జీ పల్లోంజి సంస్థకు రూ. 8 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి రూ.143 కోట్లు వసూలు చేశారన్నారు సీఎం జగన్‌. పల్లోంజి ప్రతినిధిగా మనోజ్‌ వాసుదేవ్, చంద్రబాబు తరపున ప్రతినిధిగా…

AP

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది…గత సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 9 మంది ఎమ్మెల్సీల‌ను మాత్రమే క‌లిగి ఉన్న వైసీపీ బ‌లం 45 కు చేరింది.. దీంతో పూర్తిస్థాయిలో కౌన్సిల్ లో ప‌ట్టు సాధించింది వైసీపీ.   ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో శాసన సభ ఆమోదం…

AP

వైసీపీ లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్‌ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు నిర్ధారణకు వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌…

AP

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్..

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్ ఉంది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు ఈ లీవ్ వినియోగించుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా జగన్ సర్కార్ ఆ నిబంధనను తీసేసింది. సర్వీస్ టైమ్‌లో ఎప్పుడైనా వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని అధికారులకు జగన్…

AP

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం…

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి ఇవాళ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్‌పటేల్‌…

AP

ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించింది. ఆమెకు 23 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. స్తవానికి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన.. కోటంరెడ్డి, ఆనం.. టీడీపీకి ఓటు వేసినా.. ఆ పార్టీ బలం…

AP

సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మరో లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. పలు జిల్లాల్లో వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువుల కూడా చనిపోయాయి అని లేఖలో పేర్కొన్న ఆయన.. జంగారెడ్డిగూడెంలోని తాడువాయి గ్రామానికి మెట్ల సంధ్య,…