AP

AP

వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్..!

మంగళగిరి ప్రజాసేవలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం నిరీక్షిస్తున్న పేదల నిరీక్షణకు తెరదించుతూ, రాష్ట్ర విద్యుత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏకంగా 3,000 మంది నిరుపేద కుటుంబాలకు శాశ్వత భూహక్కు పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే, బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1,000 కోట్ల విలువైన ఈ ఆస్తులను…

AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్..!

ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.   ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం   ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ…

AP

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్.. దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కుదిరిన మరో కీలక ఒప్పందం కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు పడింది. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ…

AP

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.   ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు   రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని…

AP

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫ్రంట్ ఆఫీస్ సేవలు.. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని…

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ బి. వీరబాబు, కానిస్టేబుల్ నెం.3851/ఆర్‌పీఎఫ్/కదిరి, కదిరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెం.1లో విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి…

AP

రామాయపట్నం పోర్టుపై జగన్ ట్వీట్… కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

రామాయపట్నం పోర్టు విషయంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును టీడీపీ పెద్దల జేబులు నింపేందుకు ఓ భారీ స్కామ్‌గా మార్చారని, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేందుకు సిద్ధమయ్యారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.   మా హయాంలో పురోగతి……

AP

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు..!

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న కరోనా కేసుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌లో ఆర్‌ఎఫ్‌-5 ఒకటి. ఈ వేరియంట్‌ కేసులు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.   ఏపీలో కరోనా కేసుల కలకలం-ఏపీలో కరోనా కేసుల గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. కడప జిల్లాకు చెందిన నాలుగు కేసులు నమోదైన పేషెంట్ల నుంచి నమూనాలను తీసి…

AP

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. నేతలతో అధినేతలు సమావేశాలు, కేడర్‌తో భేటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గామన్నారు.   ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షురూ-ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం షురూ అవుతోంది. అక్టోబరు లేకుంటే నవంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూటమి భావిస్తోంది. ఈలోగా నేతలు, కేడర్‌ని…

AP

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి రావడం ప్రజల్లో కొద్దిగా టెన్షన్ పుట్టిస్తోంది. దానికి తోడు నలుగురు చనిపోయారనే వార్త ఈ ఆందోళనను మరింత పెంచింది. అయితే, దీనిపై వైద్యారోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రజలు అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి సులభంగా అర్థం చేసుకుందాం. వైరస్ ఎక్కడికీ పోలేదు.. ఎందుకు పెరుగుతోందంటే?…