AP

AP

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..!

హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని తెలిపారు. పార్వతీపురం మన్యం సీతంపేటలో సవర కళాకారుల సెంటర్ పనులను ప్రారంభించారు. వీబీ-జీ రామ్ జీ నిధులతో సవర కళాకారుల సెంటర్ నిర్మాణం చేయనున్నారు. వీటికోసం మదనపల్లి, అనంతపురం, పెడనల్లో సెంటర్ల కోసం స్థలాల గుర్తించారు. త్వరలో మదనపల్లి, అనంతపురం, పెడనల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని…

AP

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను.

విజయనగరం జిల్లాలో వైసీపి కి పెద్ద షాక్ తగిలింది.బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. తనతో పాటు అనుచరులు కూడా టీడీపీలో చేరడం విశేషం. చంద్రబాబు స్వయంగా చిన్న శ్రీనుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.…

AP

కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన..! సీఎం అభ్యర్థి ఎవరంటే..?

“అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే” అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన… భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఏపీని రూ. 12 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే…

AP

డీఎస్సీలో భారీ స్కామ్ జరిగింది.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసి, సీబీఐతో విచారణ జరిపించాలి: సజ్జల..

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామక ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇది ‘క్యాష్ ఫర్ టీచర్ పోస్ట్’ స్కామ్ అని అభివర్ణించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సోమవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో…

AP

ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేసిన ఆయన, వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. శనివారం వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముఖ్య…

AP

ఏపీలో మున్సిపల్ పోరుకు కొత్త రూల్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నూతన నిబంధనలతో కూడిన మూడు కీలక జీవోలను జారీ చేసింది.డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. మున్సిపల్…

AP

ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పవన్ హెచ్చరిక..!

రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) తీరుపై రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తూ, మరోవైపు గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో సగం కాలుష్యానికి ఈ కంపెనీయే కారణమని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం దగ్గర నుంచి లైసెన్సు రద్దు వరకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం…

AP

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడు జాన్ సైదా హర్యానాలో అరెస్ట్..

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ జాన్ సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను షేక్ జాన్ సైదా (రబ్బానీ) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి…

AP

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం..! డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్..

ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం…

AP

అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు..: మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.…