AP

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ బి. వీరబాబు, కానిస్టేబుల్ నెం.3851/ఆర్‌పీఎఫ్/కదిరి, కదిరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెం.1లో విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి…

AP

రామాయపట్నం పోర్టుపై జగన్ ట్వీట్… కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

రామాయపట్నం పోర్టు విషయంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును టీడీపీ పెద్దల జేబులు నింపేందుకు ఓ భారీ స్కామ్‌గా మార్చారని, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేందుకు సిద్ధమయ్యారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.   మా హయాంలో పురోగతి……

AP

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు..!

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న కరోనా కేసుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌లో ఆర్‌ఎఫ్‌-5 ఒకటి. ఈ వేరియంట్‌ కేసులు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.   ఏపీలో కరోనా కేసుల కలకలం-ఏపీలో కరోనా కేసుల గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. కడప జిల్లాకు చెందిన నాలుగు కేసులు నమోదైన పేషెంట్ల నుంచి నమూనాలను తీసి…

AP

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. నేతలతో అధినేతలు సమావేశాలు, కేడర్‌తో భేటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గామన్నారు.   ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షురూ-ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం షురూ అవుతోంది. అక్టోబరు లేకుంటే నవంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూటమి భావిస్తోంది. ఈలోగా నేతలు, కేడర్‌ని…

AP

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి రావడం ప్రజల్లో కొద్దిగా టెన్షన్ పుట్టిస్తోంది. దానికి తోడు నలుగురు చనిపోయారనే వార్త ఈ ఆందోళనను మరింత పెంచింది. అయితే, దీనిపై వైద్యారోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రజలు అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి సులభంగా అర్థం చేసుకుందాం. వైరస్ ఎక్కడికీ పోలేదు.. ఎందుకు పెరుగుతోందంటే?…

AP

‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరించిన వైఎస్ జగన్..

వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.   ఈ యాప్‌ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది. కార్యకర్తలు ఈ యాప్‌ను…

AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక అప్ డేట్..

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) కార్యకలాపాలు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు మధ్య నాటికి విమాన సర్వీసులు మొదలవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.   విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన తేదీ ఖరారైన వెంటనే,…

AP

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.   విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి   చిన్నారులపై…

AP

అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్… సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి…

AP

ఏపీ పాలనలో వినూత్న ప్రయోగం..!

ఆంధ్రప్రదేశ్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్) ఆధారంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.   ఈ సరికొత్త విధానం ద్వారా…