మంచిర్యాల జిల్లాలో వింత… వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు..!
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. వర్షపు నీటితో పాటు చిన్నపాటి చేపలు వీధుల్లోకి కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోడ్లపై కనిపిస్తున్న ఆ చేపలను పట్టుకోవడానికి పిల్లలు, యువకులు పోటీపడ్డారు. పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వరద నీటిలో చేపలు కొట్టుకురావడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కొందరు ఇవి…

