రైతులకు చంద్రబాబు శుభవార్త: రేపే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా ‘అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత నిధులను రేపు (మార్చి 13, శుక్రవారం) విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి, తద్వారా సాగు పనులకు అవసరమైన పెట్టుబడి సాయం రైతులకు సకాలంలో అందుతుందని సీఎం పేర్కొన్నారు.…

