AP

AP

కదిరి ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగులకు ఊరట: మెట్ల బాధ తప్పిస్తూ ‘వాలు వంతెన’ ప్రారంభించిన ఇన్-చార్జి డిఎం రామకృష్ణ!

కదిరి:- ఆర్టీసీ బస్టాండులో దివ్యాంగుల కొరకు మెట్ల వాలువంతెన ఏర్పాటు:- రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు తేది: 18.3.2026 నుండి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం నకు అనుమతి ఇచ్చినది. తద్వార రోజు వందల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్టాండుకు విచ్చేసి,ప్రయాణం చేస్తున్నారు. మరియు ఆర్టీసీ బస్టాండులో వున్న డిఎం ఆఫీసుకు రోజు వచ్చే దివ్యాంగులతో పాటు పదవీ విరమణ పొందిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగులకు బస్టాండు ఎంట్రన్స్ లో మెట్లను ఎక్కే బాధవుండేది. ఈ…

AP

అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై చారిత్రక తీర్మానం చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే, ప్రతిపక్ష నేత జగన్ బెంగళూరులో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అంశం…

AP

అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ…-: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని… అది అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అద్భుతం, అజరామరమని అభివర్ణించారు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని పునరుద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించారు.   అమరావతికి చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన…

AP

అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు అగ్నికి ఆహుతి..

  ఓబులవారిపల్లి మండలంలోని పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో 5 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు చెందిన 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…

AP

రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.     పూర్తి వివరాల్లోకి వెళితే… ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.…

AP

అమరావతి పై జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న..?

అమరావతి రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. “ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అమరావతి పై మీ స్టాండ్ ఏంటి జే టర్న్ జగన్ గారూ?” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సవాల్ విసిరారు. రాజధానిపై తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూనే, జగన్ ను లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.…

AP

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్…

  శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు.

AP

వడ్డెర్లకు మైనింగ్ లీజులు… మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్..

రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వారి కులవృత్తిని ప్రోత్సహించి, ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని నేడు ఏపీ క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గతంలో లోకేశ్ పాదయాత్ర…

AP

కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ నెల 28న జరగనున్న ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. అనంతరం, పునర్విభజన…

AP

బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పాలాభిషేకం…

  అనంతపురం జిల్లా RDT సంస్థకు సంబంధించిన ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (FCRA) నమోదు పునరుద్ధరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వెలువడిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని అభినందనలు తెలుపుతూ ఈరోజు కదిరి నియోజకవర్గంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.…