AP

AP

పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత..

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు.   రాజకీయ కుట్ర కోణం లేకపోతే కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్… అంతదూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని హోం మంత్రి అనిత…

AP

రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం…

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు.   “వ్యాపార నిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), కార్యనిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్) రెండూ కలిసిన ప్రదేశం…

AP

లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా జరిగే 29వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF 2026)లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇస్తున్నట్లు సాధారణ…

AP

సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్..!

దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. మీడియాలో హైలైట్ కావాలనే.. ఏంటో తెలీదుగానీ సీఎం చంద్రబాబుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మావిగన్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.   నెల రోజుల తర్వాత మీడియా ముందు జగన్   దాదాపు నెల రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు…

AP

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్… భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్..

ఇవాళ జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ‘చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ఇవ్వొచ్చనిపించిందని, ఆయన అద్భుత నటనకు ‘భాస్కర్ అవార్డు’ గ్యారంటీ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, జగన్‌పై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత కుటుంబాన్నే కాకుండా, సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని కూడా జగన్ మోసం చేశారని ఆరోపించారు.   జగన్ కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు…

AP

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ..

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం అవాస్తవమని, దీనికి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు విచారణలో గుర్తించారు.   ఈ కేసు వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనలో…

AP

గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా స్పెషల్ ఫోకస్..!

గాజువాక నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఐటీ మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి అంశాలపై సవివరంగా చర్చించారు.   ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్   దాదాపు రెండు గంటల పాటు సాగిన…

AP

స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల..

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరు చెప్పుకుని ‘ఒక్క ఛాన్స్’ అంటూ సీఎం అయిన జగన్, ఐదేళ్ల పాలనలో కేవలం స్విచ్‌లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్లీ మళ్లీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి…

AP

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన..

తన వార్డులో అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఉషా దేవి శంఖ్వార్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు చేయించుకుని నిరసన తెలిపారు. తన వార్డులో పౌర సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని, అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కొద్ది రోజులుగా ఆమె మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలుపుతున్నారు.   అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం…

AP

ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్..

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు అత్యంత చురుగ్గా సాగింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరఫరా వ్యవస్థ సమన్వయంపై లోతుగా చర్చించారు.   అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మర్యాదపూర్వకంగా భేటీ అయి, ప్రజా…