AP

AP

పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల…

AP

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌.. 3,168 పోస్టుల భర్తీకి కసరత్తు..

ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్, సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   సమీక్షా సమావేశంలో సీఎస్ పలు…

AP

టెక్కీ రాధాగాయత్రి కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్‌ విధించడంతో జైలుకి తరలించారు.   విశాఖ టెక్కీ రాధాగాయత్రి కేసు కొత్త మలుపు-విశాఖ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లెంక రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

AP

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ అరెస్ట్ జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   అరెస్ట్‌కు దారితీసిన కారణం ఇదే..   ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర…

AP

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం..!

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.   బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

AP

ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్..! ఇకపై ఆ పోస్టులు పెడితే..

రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ ఫోటోలు, అవమానించే భాష, అనుమానించే కథనాలు, అసభ్యకరమైన మాటలు సోషల్‌మీడియా ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. దేవుళ్లను, మతాలను అవమానించి సమాజంలో విద్వేషం మంటల్ని పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు బాధ్యత, భయం ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో, మార్ఫింగ్ వీడియోలతో ఏదైనా చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, చివరికి న్యాయమూర్తులను కూడా వదలిపెట్టడం లేదు. టార్గెట్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తున్నారు. స్పెషల్ వార్ ఏర్పాటు ఒక అకౌంట్‌ను…

AP

అమరావతికి ‘శాంసంగ్ సిటీ’.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు..

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్‌) తయారీలో పేరొందిన డెల్టా ఎక్స్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఎత్తున తయారీ, పరిశోధన యూనిట్లను స్థాపించాలని ఆయన ఈ కంపెనీలను ఆహ్వానించారు.  …

AP

చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అనేక అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతోందని ఆయన స్పష్టం చేశారు.  …

AP

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్..

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.   వివరాల్లోకి వెళితే.. మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు పదవుల ద్వారా రెండు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ప్రకాశ్ రెడ్డి ఇటీవల…