AP

AP

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.   విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి   చిన్నారులపై…

AP

అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్… సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి…

AP

ఏపీ పాలనలో వినూత్న ప్రయోగం..!

ఆంధ్రప్రదేశ్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్) ఆధారంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.   ఈ సరికొత్త విధానం ద్వారా…

AP

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది.   తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953, జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం,…

AP

పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల…

AP

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌.. 3,168 పోస్టుల భర్తీకి కసరత్తు..

ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్, సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   సమీక్షా సమావేశంలో సీఎస్ పలు…

AP

టెక్కీ రాధాగాయత్రి కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్‌ విధించడంతో జైలుకి తరలించారు.   విశాఖ టెక్కీ రాధాగాయత్రి కేసు కొత్త మలుపు-విశాఖ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లెంక రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

AP

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ అరెస్ట్ జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   అరెస్ట్‌కు దారితీసిన కారణం ఇదే..   ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర…

AP

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం..!

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.   బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…