AP

AP

పార్టీ నుంచి దూరం పై యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు..!

తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదని ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. శ్యామలకు కౌంట్‌‌డౌన్ మొదలైందని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వారు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.   ఆ ప్రేమ ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తన…

AP

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువుపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని తెలిపారు.   గత ఏప్రిల్ నాటికే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవ్వడం ప్రాజెక్టు నిర్మాణం…

AP

జనసేనలో కుమ్ములాటలు..? కారణం ఎవరు..?

జనసేన పార్టీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక గొడవ లేదా వివాదాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకరు పోతే మరొకరు పార్టీని ప్రజల్లో చీప్ చేసేస్తున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనసేనానికి ఏమో ఆరోగ్యం బాలేదు. ఇటీవల ఆయనకు సర్జరీ అయ్యింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పవన్ కళ్యాణ్ పెద్దగా హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో…

AP

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచడం, కొత్తగా నిధుల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన…

AP

వ్యవస్థలు గాడి తప్పాయా..? అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీలో పోలీసు యంత్రాంగం తన ప్రాథమిక విధులను విస్మరించి, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ తన పంథాను మార్చుకుందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే నేడు ప్రశ్నించే గొంతుకలను అణచివేసే…

AP

పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు.   వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించినందుకే తాను ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూనే తప్పులను ఎత్తిచూపడం…

AP

ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు.. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ‘స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలు’ అనే అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.   రాష్ట్ర అభివృద్ధిలో లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడం అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారులు, రూ.64 వేల కోట్ల విలువైన 624…

AP

ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ ఇక 24 గంటల్లోనే.. !

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ మేరకు రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ఈ వారంలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.   వాహనాల రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న జాప్యంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.…

AP

గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు..

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గజరాజుల రక్షణ కోసం ఒక వినూత్నమైన అడుగు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా ‘ఆధార్’ తరహా గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కుంకీ ఏనుగులు అంటే అడవి ఏనుగులను దారికి తెచ్చేందుకు, ఇతర ఆపరేషన్లలో అటవీశాఖకు సాయపడే శిక్షణ పొందిన ఏనుగులు. వీటి రక్షణ, ఆరోగ్యం విషయంలో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ…

AP

ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన.

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం క్యారియర్ సంస్థ సుమారు రూ. 1,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,000 మందికి ఉపాధి,…