గోదావరిలో విషాదం: సెల్ఫీ సరదా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది!
భద్రాచలం సమీపంలోని ఏటపాక మండలం కొల్లూగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ (SRMT) కళాశాలలో చదువుతున్న నవదీప్, తేజసాయి, సతీష్ కుమార్, దీపక్, హర్షవర్ధన్ అనే విద్యార్థులు ఉగాది సెలవుల నేపథ్యంలో భద్రాచలం వచ్చారు. అక్కడ తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి నది ఒడ్డున ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. అతడిని కాపాడే ప్రయత్నంలో…

