AP

AP

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖలోని తన నివాసంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఆయన ఆకస్మిక మృతి వార్త ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆళ్ల నాని వయసు 56 సంవత్సరాలు. 1969లో ఏలూరులోని శనివారపుపేటలో జన్మించారు.ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, ఆంధ్రా…

AP

ఏపీలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు.. ఈనెల 22న ఓటర్ల జాబితా..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 41 పట్టణ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పరిధిలో రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని…

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. తల్లి రక్త నమూనాల సేకరణ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఈ రక్త నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని అనుమానాస్పద శాంపిల్స్‌తో తల్లి డీఎన్ఏను సరిపోల్చనున్నారు. దీని ద్వారా బాధితుడిని…

AP

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన కొత్త వ్యూహం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహాలను రూపొందించేందుకు.. పార్టీ ఇప్పటికే సమన్వయ కమిటీని వేసింది. ప్రస్తుతానికి.. 14 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో.. సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల…

AP

చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా..?

బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పాక.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు కూడా  రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అసలు పోరు మొదలైంది. భీమిలి ఇన్‌చార్జి పదవి కోసం.. పోటీ పెరిగింది. ఎందుకంటే.. ఇది వైసీపీకి కీలక స్థానం. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు…

AP

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం..!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ అంశంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ తీస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి వంచించారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు…

AP

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..!

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హవాల్దార్‌ మల్లేశ్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ డీలర్లతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మల్లేశ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు పలు అనుమానాస్పద అంశాలు కనిపించినట్లు సమాచారం. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధ డీలర్‌ను ఫాలో అవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు…

AP

ఎల్ నినోపై చంద్రబాబు సమగ్ర వ్యూహం..! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

రాష్ట్రంపై ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై లోతుగా చర్చించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తును ఒక సవాల్‌గా స్వీకరించి, రైతులు, వినియోగదారులపై దాని ప్రభావం పడకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో…

AP

డీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకొస్తా: జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి/సంస్థకు ఎలా…

AP

మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌తో… జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.గతంలో అధికారం కోసం…