చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు: భూమన..
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, వైసీపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.…

