ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్..!
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోనే విలువ ఆధారిత…

