AP

AP

ఏపీ మద్యం కుంభకోణం కేసు… ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈడీ సుమారు ఏడున్నర గంటల పాటు విచారించింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరి పేర్లను అధికారులకు చెప్పలేదని వెల్లడించారు.   మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ కెసిరెడ్డికి మాత్రమే తెలుసని చెప్పానని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్…

AP

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు..

టీడీపీ మహానాడు నిర్వహణపై మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నిర్వహించిన మహానాడును ఆమె ఒక ‘హైబ్రిడ్ మహానాడు’ గా అభివర్ణిస్తూ, ఇది ముమ్మాటికీ అట్టర్‌ఫ్లాప్ షో అని కొట్టిపారేశారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఒకవైపు నాయకులు స్పీచ్‌లు దంచుతుంటే, మరోవైపు జనాన్ని ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డాన్సులు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.   ఈ మహానాడు వేదికలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్…

AP

టీడీపీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన..

మహానాడు సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటన చేశారు.   టీడీపీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన   చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ఆ విధంగా…

AP

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..!

అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్   తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే…

AP

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు. కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు.   ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.…

AP

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం… ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు..

జనసేన పార్టీలో తన పుష్కర కాలం నాటి సహనానికి స్వస్తి పలుకుతున్నానని, ఇకపై పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీని ఒక సైనిక పటాలంలా ముందుకు నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి తొలి అడుగుగా, అంతర్గత…

AP

ఏపీ తీరానికి కొత్త రూపు..! సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక ‘విజన్ ప్లాన్’ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే, తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.   ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా…

AP

ప్రశ్నిస్తే జైల్లో పెడతారు..? చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం..

కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.   కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ రెడ్డి లాంటి…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇకపై ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు..

రాష్ట్రంలోని ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా సంజీవని కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని అని గుర్తుచేశారు. అందుకే ఆ సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.   ఈ రోజుల్లో సంపద…

AP

పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత..

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు.   రాజకీయ కుట్ర కోణం లేకపోతే కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్… అంతదూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని హోం మంత్రి అనిత…