పవన్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారుస్తాం: సీఎం చంద్రబాబు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా నిధులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పనిదినాలు కల్పించి, రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తుల కల్పనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్…

