AP

AP

వాట్సాప్ వేదికగా వైద్య సేవలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు..

ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా… ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్‌ నంబర్‌కు “హాయ్” లేదా “Hi” అని మెసేజ్ పంపి.. తదనంతరం వచ్చే మెనూలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్‌ను ఎంచుకుని ఈ సేవలను…

AP

పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం..

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ…

AP

ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1,192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో సింహభాగం, అంటే రూ. 1,123.15 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పూడికతీత వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులకు ఊతం లభిస్తుంది. మిగిలిన రూ. 69.01 కోట్లు అడ్మిన్ కాంపోనెంట్ కోసం వినియోగించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ…

AP

ఏపీ క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.   క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే…   1.…

AP

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి..

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు.   కేకే రాజు కామెంట్స్..   కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు,…

AP

ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు..

ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీనితో వర్చువల్ విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తి ఈ విచారణలోకి వచ్చి వీటిని ప్లే చేసినట్లు వెల్లడైంది.   ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ కేసును విచారిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి.…

AP

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష…

AP

పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు పార్టీ నాయకత్వం తెలిపింది. ఈ క్రమంలో, పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు, ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత జగన్… ఇంధన సంక్షోభాన్ని ‘ప్రభుత్వ ప్రేరేపిత కృత్రిమ కొరత’గా అభివర్ణించారు.   పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు,…

AP

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌..

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ‘డేటా సిటీ’గా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.   శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా…

AP

ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.   కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం గమనిస్తూ, ప్రతీ 3…