గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు..
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గజరాజుల రక్షణ కోసం ఒక వినూత్నమైన అడుగు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా ‘ఆధార్’ తరహా గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కుంకీ ఏనుగులు అంటే అడవి ఏనుగులను దారికి తెచ్చేందుకు, ఇతర ఆపరేషన్లలో అటవీశాఖకు సాయపడే శిక్షణ పొందిన ఏనుగులు. వీటి రక్షణ, ఆరోగ్యం విషయంలో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ…

