వెలగపూడిలో భారీ అగ్నిప్రమాదం: ఎల్ అండ్ టీ పైపులు దహనం.. ఆందోళనలో స్థానికులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డులోని ఎన్9 జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్వ ఉంచిన ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం ఒక్కసారిగా ఉధృతమైంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లని పొగ ఆ ప్రాంతమంతా అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…

