AP

AP

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ..

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం అవాస్తవమని, దీనికి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు విచారణలో గుర్తించారు.   ఈ కేసు వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనలో…

AP

గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా స్పెషల్ ఫోకస్..!

గాజువాక నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఐటీ మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి అంశాలపై సవివరంగా చర్చించారు.   ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్   దాదాపు రెండు గంటల పాటు సాగిన…

AP

స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల..

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరు చెప్పుకుని ‘ఒక్క ఛాన్స్’ అంటూ సీఎం అయిన జగన్, ఐదేళ్ల పాలనలో కేవలం స్విచ్‌లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్లీ మళ్లీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి…

AP

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన..

తన వార్డులో అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఉషా దేవి శంఖ్వార్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు చేయించుకుని నిరసన తెలిపారు. తన వార్డులో పౌర సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని, అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కొద్ది రోజులుగా ఆమె మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలుపుతున్నారు.   అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం…

AP

ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్..

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు అత్యంత చురుగ్గా సాగింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరఫరా వ్యవస్థ సమన్వయంపై లోతుగా చర్చించారు.   అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మర్యాదపూర్వకంగా భేటీ అయి, ప్రజా…

AP

లోకేష్ కాదు.. ‘లవ్ కాష్’.. అంబటి సెటైర్లు..!

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు రోడ్డెక్కాయి. గుంటూరు నగరంలో మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.   రిక్షా తొక్కిన మాజీ మంత్రి..   ధరల పెంపుదలపై తన నిరసనను వినూత్నంగా తెలియజేసేందుకు అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆయన స్వయంగా రిక్షా తొక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పెరిగిన ధరలతో…

AP

ఏపీ ప్రజలకు చంద్రబాబు బంపర్ ఆఫర్..! మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు…

జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘పిల్లలే సంపద’ పేరుతో త్వరలోనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.   శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జనాభా తగ్గుదల రేటు ఆందోళన కలిగిస్తోందని, దేశ ప్రగతికి పిల్లలే అసలైన సంపద…

AP

ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు..

ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA – ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర…

AP

ఏపీ అంటే ‘అడ్వాన్స్‌డ్ ప్రదేశ్’..! రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ రంగ పటంలో అగ్రస్థానంలో నిలుపుతూ, రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, యావత్ భారత రక్షణ రంగ స్వావలంబన ప్రయాణంలో…

AP

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.   ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల…