AP

AP

ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును…

AP

స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

స్టీల్‌ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడేటట్లు చేస్తున్నారని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ ఘటనలో బాధిత కుటుంబాలను సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  …

AP

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన..! వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది..?

కాకినాడ మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన ఏమైంది? మూడు రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. మరి చిన్నారి ఎక్కడ? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పాప కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. తమ కూతురు వస్తుందని తల్లిదండ్రులు, వారి బంధువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం వ్యవహారంలో కొత్త మలుపు   కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారి కనిపించలేదు.…

AP

కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   వివరాల్లోకి వెళితే.. తుని మండలం సి.హెచ్. అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు…

AP

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘మన మిత్ర’ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన…

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం..! 9కి పెరిగిన మృతుల సంఖ్య..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన తీరును వారు పరిశీలించారు.   ప్లాంట్‌లోని SMS-2, STC-3 విభాగాల్లో వేడి లోహ ద్రవం లీకైన ప్రదేశాన్ని హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, సహాయక చర్యలు,…

AP

డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి..

ఏపీ మెగా డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నియామకాల్లో నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే, క్రీడా కోటా కింద కేటాయించిన 421 పోస్టుల్లో 39 పోస్టులు ఇప్పటికీ ఎందుకు ఖాళీగా ఉన్నాయో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.   మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి టీజీ…

AP

ఏపీకి మరో గుడ్ న్యూస్..! ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. !

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.   ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో లభించే భారీ ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఒక డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్…

AP

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు.   గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో…

AP

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్…!

జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.   రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్…