AP

AP

గోదావరిలో విషాదం: సెల్ఫీ సరదా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది!

భద్రాచలం సమీపంలోని ఏటపాక మండలం కొల్లూగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ (SRMT) కళాశాలలో చదువుతున్న నవదీప్, తేజసాయి, సతీష్ కుమార్, దీపక్, హర్షవర్ధన్ అనే విద్యార్థులు ఉగాది సెలవుల నేపథ్యంలో భద్రాచలం వచ్చారు. అక్కడ తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి నది ఒడ్డున ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. అతడిని కాపాడే ప్రయత్నంలో…

AP

ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్: పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న విన్నపాలను మన్నిస్తూ, మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్…

AP

కదిరి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణం ఈద్గాహ్ మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు #eidmubarak2026 #EidUlFitrMubarak #Kadiri #kandikuntavenkataprasad #kadiriMLAkandikunta

AP

విశాఖ వాసులకు గుడ్ న్యూస్: ఆనందపురం జంక్షన్‌లో భారీ ఫ్లైఓవర్, ట్రాఫిక్ కష్టాలకు చెక్!

విశాఖపట్నం నగరాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే క్రమంలో అత్యంత కీలకమైన ఆనందపురం జంక్షన్‌ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మరో మూడు నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విశాఖ మరియు అనకాపల్లి వైపు నుండి వచ్చే వాహనాల రద్దీని తట్టుకునేలా ఇక్కడ ఒక భారీ ఫ్లైఓవర్ (Flyover) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి. ఏడాదిన్నర నుండి రెండేళ్లలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు…

AP

ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు.

  పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం గూడూరు గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు. నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా. ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

AP

రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులను ఘనంగా సత్కరించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం వెంకట నరసింహ వసంతచార్యుల వారిని సత్కరించిన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

AP

రాయలసీమ బీడు భూముల్లో సోలార్ వెలుగులు: కరువు నేలపై కురుస్తున్న కాసుల వర్షం.. అన్నదాతలకు అండగా కొత్త ప్రాజెక్టులు

సీమలో సోలార్ కాంతులు. ………………………………. *రానున్న కొత్త ప్రాజెక్టులు.. మట్టి మనిషికి మంచి రోజులు. *బీడు పడ్డ రైతు పొలాల్లో విద్యుత్ వెలుగులు. *అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు. ………………………………… ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి మురిసి పోయిన రాయలసీమను కరువు రక్కసి కౌగిలించుకుంది. ప్రతీ ఏటా పచ్చి, వట్టి కరువు కన్నీరు మిగిల్చింది.రైతు కళ్లెదుటే పొలాలు బీళ్లు గా మారాయి. కన్న బిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలు మేత లేక విలవిల లాడుతున్నాయి.ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉన్న…

AP

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వెల్లడి

విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలను వీఎంఆర్డీఏ (VMRDA)కు చెందిన ‘ది డెక్’ భవనం నుండి త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. విశాఖలోని ముడసర్లోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిలో ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తయ్యాయని,…

AP

వెటర్నరీ ఏడీ శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

*కదిరి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పాల్యం శ్రీనివాస్ రెడ్డి గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* డా శ్రీనివాస్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగా లేనందున ఆసుపత్రి లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూన్న విషయం తెలియడంతో వారి స్వగ్రామం కటారుపల్లి లో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట…

AP

ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు భరోసా!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడనుందనే ఊహాగానాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఇది మరో 15 రోజులకు సరిపోతుందని సీఎం వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా సజావుగా సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో…