APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

 

పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస గ్రామంలో మంచినీటి పైపులైన్లు, మంచి నీటి ట్యాంక్ తప్ప ప్రజల దాహం తీర్చడం లేదని ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా గ్రామంలో ఇదే దుస్థితి అని మండిపడ్డారు. ప్రజలు చేతిపంపులు, నూతులు బావిలు మీద ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. ఇక వేసివి కాలంలో అయితే తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు ఓట్లు కోసం వస్తారే తప్ప సమస్యలను మాత్రం పెడ చెవిని పెడుతున్నారని మూడు రోజుల్లో సమస్యపరిష్కరించని యెడల కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.