CINEMA

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనే కాదు ఓటీటీ సిరిసులతోనూ సౌత్ సత్తా చాటుతున్నారు స్టార్స్. భాషలకతీతంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాదు.. ఓటీటీల్లోనూ ఓ రేంజులో బిజీ అవుతున్నారు. ప్రియమణి, మాధవన్ లాంటి సౌత్ యాక్టర్స్ ఇప్పటికే సిరీసులతో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మరికొందరు బడా స్టార్లు కూడా లేటెస్టుగా జాయినవడం విశేషం. ఓవైపు పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్ లోనే ఫ్యామిలీమ్యాన్ టూ సిరిసులో నెగిటివ్ రోల్ లో నటించి క్రిటిక్స్ నుంచి కూడా అప్రిషియేషన్స్ దక్కించుకుంది సమంత. నిజానికి ఆ సిరీసు మార్కెట్, హైప్ పెరగడానికి సామ్ కూడా బిగ్గెస్ట్ రీజనే. మరోవైపు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో దూత సిరీసుతో నాగచైతన్య కూడా ఓటీటీల్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ తెలుగులోనూ స్టార్ హీరోగా ఉన్న చైతూ ఈ మూవీతో బీటౌన్ లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ ఛడ్డా మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఇక దూత సిరీసుతోనే మోత మోగించాలని గట్టిగా ఫిక్సయ్యాడు చైతూ. వర్సటైల్ యాక్టర్ గా నేషన్ వైడ్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఫర్జీ అనే అమెజాన్ ప్రైమ్ సిరీస్ తో ఫిబ్రవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్, డీకే ఈ సిరీస్ క్రియేటర్స్. ఇప్పటికే పుష్కర్, గాయత్రి విక్రమ్ వేద రీమేక్ తో బీటౌన్ లోనూ హిట్ కొట్టారు. వాళ్లు క్రియేటర్స్ గా వ్యవహిరించిన సుడల్, వదంది లాంటి తమిళ్ సిరీసులు హిందీలోనూ డబ్బయి అక్కడ కూడా పాజిటివ్ రివ్యూస్ సంపాదించుకున్నాయి. దాంతో ఇప్పుడు రాజ్ డీకే క్రియేట్ చేసిన ఫర్జీ సిరీసుపై కూడా మంచి అంచనాలేర్పడ్డాయి.

ఇక గతంలో నవరస లాంటి నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీలోని ఓ కథలో నటించినా ఫుల్ లెంగ్త్ సిరీసులో విజయ్ సేతుపతి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. మరోవైపు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా వస్తోన్న జవాన్ మూవీలో విలన్ రోల్ చేస్తోంది విజయ్ సేతుపతే. ఈలెక్కన ఇటు డైరెక్ట్ హిందీ మూవీతోనూ, సిరీస్ తోనూ బాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు మక్కల్ సెల్వన్. Makkal Selvan Vijay Sethupathi Showing His Ability With OTT రానా దగ్గుబాటి, వెంకీ లాంటి హీరోలు కూడా రానా నాయుడు అనే నెట్ ఫ్లిక్స్ సిరీసుతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. రే డోనోవాన్ అనే అమెరికన్ క్రైమ్ డ్రామాకి అఫీషియల్ అడాప్షన్ గా వస్తోన్న ఈ సిరీసుతో ఓటీటీల్లోనూ ఫ్యాన్సుని అలరించనున్నారు దగ్గుబాటి హీరోస్. మరోవైపు సాయిపల్లవి లాంటి స్టార్ హీరోయిన్ కూడా పావ కదైగల్ అనే ఆంథాలజీలో, సూర్య కూడా నవరస ఆంథాలజీలో నటించిన విషయం తెలిసిందే. అన్నీ కలిసొస్తే వీళ్లుకూడా ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరీ లెక్కన విజయ్ సేతుపతి ఫర్జీ సిరీసుతో ఇంకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోనున్నాడో, ఇంకా ఏ ఏ స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తారో చూడాలి.