AP

SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం

ఏలూరు జిల్లా
SC సెల్ ఆధ్వర్యంలో
యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

బడేటి రాధాకృష్ణ (చంటి) ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్

ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి ఆశీస్సులతో SC సెల్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను సమీకరించి ఒక రోజు ముందుగా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం యువగళం పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది

బడేటి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలను తెలుసుకొని మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం అనే ప్రతిష్టాత్మకమైనటువంటి మహా పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు

పార్లమెంట్ SC సెల్ అధ్యక్షుడు యాళ్ల సుజీరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రోడ్ షోలకు ఉభయ రాష్ట్రాలలో కూడా జన ప్రభంజనాన్ని చూసినటువంటి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తట్టుకోలేక ఈ మహా పాదయాత్రను అడ్డుకోవాలని కుయుక్తులు పన్నటం సరిగాదని గతంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా పోలీసువారి చేత సెక్యూరిటీని ఏర్పాటు చేశారని ప్రస్తుత ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోవాలని మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా లోకేష్ గారు చేపట్టిన యువగళం కార్యక్రమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు