TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు క్యూబాకు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగానే క్యూబాకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సభకు చేగువేరా కూతురు, మనవరాలు వచ్చారు. వీరికి నాయకులు ఘనస్వాగతం పలికారు. క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొంటారు.