APTELANGANA

పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు గాను బెంగళూరు నుండి నారాయణ హృదయాలయ హాస్పిటల్‌ నుండి ప్రత్యే వైద్యుల బృందం ను కుప్పంకు రప్పించారు.

ఉదయం నుండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రిలో ఉండి బాలకృష్ణ సమీక్షిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని మీడియా కు తెలియజేస్తూ ఉన్నాడు. బెంగళూరు నుండి వచ్చిన వైద్యుల బృందం ను తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే తారకరత్న యొక్క భార్య కుప్పం చేరుకున్న తర్వాత ఆమె తో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు.