AP

గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో , శాలువా కప్పి సన్మానించారు.ఎమ్మెల్యే పర్వత ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు.అవినీతి రహిత పాలనే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపినట్లు 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు గొంతిన సురేష్, మామిడి నరసింహమూర్తి, చందక నాని,కొంగన కుమార స్వామి,నేదుళ్ళ శ్రీను,ఆకుల వీరబాబు,సేరు కృష్ణ,దలే చిట్టిబాబు, జమిందార్,మండల అభివృద్ధి అధికారి వెంకటాచలం,సచివాలయ కన్వీనర్లు మరియు సిబ్బంది,గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.