TechnologyTELANGANA

ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ

ర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్‌ జీపీటీని సృష్టించింది.

ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ బింగ్ ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ ఛాట్‌ బోట్స్‌ ద్వారా సంక్లిష్ట అంశాల్ని సైతం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పడానికి కృత్రిమమేధతో నడిచే ఈ ఛాట్‌బోట్స్‌ ఉపకరిస్తాయి.

గత ఏడాది వచ్చిన ఛాట్‌ బోట్‌ ద్వారా 2 నెలల్లో 10 కోట్ల యూజర్లను సొంత చేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో 375 మంది ఉద్యోగుల చిన్న స్టార్టప్ ఓపెన్ ఏఐ 30 బిలియన్‌ డాలర్ల విలువైనదైంది. దీంతో, పోటీగా బార్డ్ ను తేవడంలో గూగుల్‌ తొందరపడక తప్పలేదు. గూగుల్‌ 6 సంవత్సరాలు కష్టపడి బార్డ్‌ను డెవలప్‌ చేసింది. గూగుల్‌ తన బార్డ్‌ను టెస్ట్‌ చేసే దశలోనే కొన్ని పదాల జవాబులు తప్పుగా చెప్పినట్లు రాయిటర్స్‌ ప్రకటించడంతో గగ్గోలు మొదలైంది. దీంతో సక్సెస్‌ ఫుల్‌గా వెలుతున్న మైక్రోసాఫ్ట్‌ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు 7.8 శాతం పడిపోయాయి. 100 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సెర్చ్‌లో గూగుల్‌దే ఆధిపత్యం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సర్చ్‌ చేస్తే ఇట్టు దొరుకుతుంది. ఈ సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా కిందటి ఏడాది గూగుల్‌ 10వేల కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది.