CINEMA

పెళ్లి తర్వాత తొలిసారి షాకింగ్ లుక్‌లో కియారా.. శృతిమించిన అందాల జాతర

రీసెంట్ గా తన ప్రియుడిని పెళ్లాడిన కియారా అద్వానీ.. అంతలోనే తిరిగి ట్రాక్ ఎక్కేసింది. శృతిమించిన అందాల జాతర చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కియారా అందాల తడికి నెటిజన్లు మైమరచిపోతున్నారు. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన కియారా అద్వానీ షాకింగ్ లుక్ లో కనిపించింది. అందాల వడ్డనకు పెళ్లితో సంబంధం లేదు అన్నట్లుగా రెచ్చిపోయింది. జీ సినిమా అవార్డ్స్ వేడుకకు వచ్చిన కియారా.. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డ్రెస్ వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి తర్వాత తొలిసారి ఊహించని స్థాయిలో ఇలా అందాల ప్రదర్శన చేయడం చూసి అంతా షాకవుతున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ ఈ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రొఫెషనల్ లైఫ్ తో వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కియారా ఈ ఫొటోలతో స్పష్టం చేసింది. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కియారా అద్వానీ.

సినిమా సినిమాకు తన క్రేజ్ రెట్టింపయ్యేలా మేకోవర్ అవుతోంది. తాజాగా ఆమె కనిపించిన విధానాన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా కియారా స్టెప్స్ వేగంగా పడబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల పాటు సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేసిన కియారా అద్వానీ.. రీసెంట్ గానే ఆయనతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 7 కియారా- సిద్దార్ధ్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్ వేదికైంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బంపర్ హిట్ అందుకుంది కియారా. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భాగమవుతోంది కియారా అద్వానీ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.