CINEMA

అందరూ చూస్తుండగానే శ్రీదేవిని చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..?

శ్రీదేవి అందాల తారగా అతిలోకసుందరిగా ఇండియాలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ మొదట సౌత్ ఇండస్ట్రీలో రాణించి ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ కి వెళ్ళాక మిథున్ చక్రవర్తి (Mithun Chakravarthy) ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అని వార్త వినిపించినప్పటికీ ఆ తర్వాత బోనీ కపూర్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తుందని గతంలో వార్తలు వినిపించాయి.

అయితే బోనీకపూర్ ని ముందు నుండి శ్రీదేవి (Sridevi) అన్నయ్య అని పిలిచేదట.కానీ బోనికపూర్ మాత్రం శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీదేవికి అన్ని విషయాల్లో తోడునీడగా ఉండి ఆమెను మాయలో పడేసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడట.కానీ బోనీకపూర్ కి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడంతో శ్రీదేవి కాస్త ఆలోచించిందట.కానీ బోనీ కపూర్ (Boney kapoor) మాత్రం నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టు పట్టడంతో శ్రీదేవి కూడా బోనికపూర్ మాయలో పడిపోయిందట.

ఇక పెళ్లి చేసుకోక పోయినప్పటికీ బోనీకపూర్ శ్రీదేవి (Sridevi) ఫంక్షన్లకు,ఈవెంట్లకు అన్నింటికీ కలిసి తిరిగేవారు.దాంతో ఓరోజు బోనికపూర్ తల్లి ఓ సినిమా ఫంక్షన్ లో అందరూ చూస్తుండగానే శ్రీదేవిని చెప్పుతో కొట్టిందట. అయితే అందరి ముందే బోని కపూర్ తల్లి శ్రీదేవిని చెప్పుతో కొట్టడానికి కారణం బోనికపూర్ (Boney kapoor) శ్రీదేవిని పెళ్లి చేసుకుంటే తన మొదటి భార్య ఎక్కడ విడాకులు ఇవ్వనని అంటుందో అనే ఉద్దేశంతో పెళ్లికి ముందే సహజీవనం చేసి శ్రీదేవిని ప్రెగ్నెంట్ చేశాడట.

ఇక ఈ విషయం తెలుసుకున్న బోనికపూర్ తల్లి అందరి ముందు శ్రీదేవి (Sridevi) ని చెప్పుతో కొట్టింది. అలాగే శ్రీదేవి బోనికపూర్ ఇద్దరు కలిసి చేసిన మోసాన్ని తట్టుకోలేక బోని కపూర్ మొదటి భార్య కూడా బోని కపూర్ కి విడాకులు ఇచ్చేసింది. దాంతో శ్రీదేవి బోనికపూర్ ల ప్రేమ పెళ్లికి ఎండ్ కార్డు పడ్డట్లైంది.