CINEMA

మళ్లీ పెళ్లి`కి బిగ్ షాక్‌.. రేపు రిలీజ్ కష్టమేనా?

దాదాపు నాలుగేళ్లు నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గుర్తింపు సంపాదించుకున్న నరేష్‌(Naresh), పవిత్ర లోకేష్‌.. జంటగా ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే `మళ్లీ పెళ్లి`. ఈ చిత్రానికి ఎం. ఎస్. రాజు దర్శకత్వం వహించగా.. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించారు. ఇందులో నరేష్‌, పవిత్ర ప్రధాన పాత్రలను పోషిస్తే.. వనిత విజయ్ కుమార్‌, జయసుధ, శరత్‌బాబు, అనన్య నాగళ్ల తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

మే 26న తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్‌, ట్రైలర్ లు సినిమాపై బాగానే అంచనాలు పెంచాయి. అలాగే గత రెండు వారాల నుంచి నరేష్‌, పవిత్ర(pavitra) వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచారు. పైగా మళ్లీ పెళ్లి సినిమా నరేష్ బయోపిక్ అని పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. టీజర్‌, ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని ఫ్రూవ్ చేశాయి.

కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఇది బయోపిక్ కాదు అంటూ బల్లలు గుద్ది చెబుతున్నారు. ఇదిలా ఉండే.. విడుదలకు సరిగ్గా ఒక్కరోజు ముందుకు ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(ramya raghupathi) `మళ్లీ పెళ్లి` సినిమా విడుదలను ఆపేందుకు రంగంలోకి దిగింది.

ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ రమ్య కోర్టు మెట్లు ఎక్కింది. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో పలు సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ.. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ రమ్య