APNationalTELANGANA

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు