AP

ఏపీలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం- లెవెల్ క్రాసింగ్‌పై ట్రాఫిక్ జామ్

పుట్టపర్తి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.

పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

ఏపీలో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తంగా ఉండటం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. భారీగా వాహనాలు రాకపోకలు సాగించే లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు వచ్చినప్పుడు గేట్ వేయలేదు. లెవెల్ క్రాసింగ్ వద్ద విధి నిర్వహణలో ఉంటూ రైలు వచ్చినప్పుడు వాహనాలు రాకపోకలు సాగించకుండా అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్ వేయాల్సిన ఉద్యోగి గైర్హాజర్ కావడం దీనికి కారణం.