తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొనుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అతి ఫ్యామిలీ రిజిస్టర్ తీసుకురానున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ప్రభుత్వ సేవలకు ఒకే కుటుంబ రికార్డు అందుబాటులోకి తేచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
మీ సేవా కేంద్రాల ద్వారా..
అయితే కుటుంబ వివరాల ధృవీకరణను సులభతరం చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు రేషన్ కార్డు డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫిట్ని రూపొందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనికోసం రాష్ట్రంలోని మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం రెండు పని దినాల్లో సర్టిఫికెట్ జారీ చేసే విధానం తీసుకురానున్న ప్రభుత్వం ఆలోచిస్తుంది.
త్వరలో అమలు..
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబ సభ్యుల వివరాలను ఒకే రిజిస్టర్లో నమోదు చేయనున్న ప్రభుత్వం పేర్కోంది. రాష్ట్రంలోని పౌరులకు ప్రామాణిక కుటుంబ రికార్డు అందించడమే సర్కార్ లక్ష్యం అని ప్రభుత్వం తెలపింది. అందుకుకోసం ఈ ఫ్యాలీ కార్డును తీసుకురానున్నట్టు తెలపింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ రిజిస్టర్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కోంది.

