NationalWorld

‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’

జీ 20(G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రాథమికంగా, మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. India assumes G20 presidency: అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్ జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. అందులో ఆయన మరోసారి భారతీయ భావన అయిన ‘వసుధైక కుటుంబం’ను మరోసారి ప్రస్తావించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావన భారతీయులదన్నారు. ‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’ అనేదే తమ సిద్ధాంతమన్నారు.

ఉగ్రవాదం, వాతావరణ మార్పు, కరొనా వంటి మహమ్మారులు.. తదితర సమస్యలను ఒంటరిగా కన్నా ఐక్యంగా ఎదుర్కోవడం అభిలషణీయమన్నారు. సంకుచిత భావనలను ప్రపంచ దేశాలు విడనాడాలన్నారు. India assumes G20 presidency: అన్ని దేశాలను సంప్రదిస్తాం.. జీ 20(G20) సభ్య దేశాలను మాత్రమే కాకుండా, ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను కూడా సంప్రదించిన తరువాతనే జీ 20(G20) ప్రాధాన్యతలను నిర్ణయిస్తామని మోదీ వెల్లడించారు. ప్రపంచ వేదికలపై పెద్దగా స్వరం వినిపించని దేశాలకు ఈ సంవత్సరం జీ 20 గొంతుకగా నిలుస్తుందన్నారు. టీకాలు, ఔషధాలు, ఆహారం, ఎరువులు వంటి నిత్యావసరాలు అన్ని దేశాలకు అందాల్సి ఉందన్నారు. అందరూ బావుండాలంటే, అన్ని దేశాలు వృద్ధి చెందాలంటే, భారత్ విశ్వసించే పంచ భూతాలైన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం లను సమిష్టిగా, సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.