News

National

భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి..

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung) మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఆయనకు అధికారిక సైనిక వందనం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన సైనికుల గౌరవాన్ని స్వీకరించారు. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటన వెనుక కీలక అజెండా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటి సందర్భంగా ఇరువురి నేతల మధ్య చర్చకు…

Uncategorized

కేసీఆర్ సంచలన ప్రకటన..! బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం…

జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో అమలవుతున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తామని ప్రకటించారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…

AP

పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా ఒక కీలకమైన ఫైలుపై సంతకం చేసి, పేదల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.56.39 కోట్లను విడుదల చేస్తూ ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ధి చేకూరనుంది.   ఉగాది, నూతన సంవత్సరం వంటి ప్రత్యేక సందర్భాల్లో పేదలకు మేలు చేసే కార్యక్రమంతోనే తన…

AP

ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ..

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేసింది ప్ర‌భుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) జీవో ఎంఎస్ నంబర్ 43ను విడుదల చేసింది.   2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి అనుకూలంగా ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ…

TELANGANA

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.   అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలిస్తారు. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తూరిపల్లికి…

TELANGANA

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం..

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు   హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని…

TELANGANA

ప్రజల్లోకి గులాబీ అధినేత కేసీఆర్..!

గులాబీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాఆశీర్వాద సభ పేరుతో మళ్లీ ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటివరకు మౌనంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరిపై మాటల తూటాలు సందిస్తారనే ఆసక్తి ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.   ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలు కానుంది. కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాలపై తనదైనశైలీలో విమర్శనాస్త్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు లేవు. తప్పులను…

National

లక్షల కోట్ల అప్పుతో రాజధానా..? అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు..

ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ ప్రతిపాదించిన అమరావతి నమూనాతో పాటు వైసీపీ ప్రస్తావించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ, ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు.   ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయి రెడ్డి విశ్లేషిస్తూ.. “1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో…

AP

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత..

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.   రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి… మధ్యాహ్నం ఒంటిగంటకు కోయంబత్తూరులో నిర్వహించే…

National

మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు..!

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాతే రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఈ అడ్డంకులను అధిగమించేందుకు కేంద్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.   ఈ బిల్లు అమలుకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించేందుకు, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో మరోసారి విస్తృత స్థాయి చర్చలు జరపాలని…