దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ..
జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయనే వాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి…

