News

National

శబరిమల కేసులో కీలక మలుపు..! సుప్రీంలో ఆసక్తికర పోరాటం..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, చట్టపరమైన పోరాటాలకు వేదికగా మారింది. ముఖ్యంగా 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన గళాన్ని వినిపించింది. ఆలయ సంప్రదాయాలను గౌరవించడం ప్రాథమిక బాధ్యత అని, ఇందులో ఎలాంటి లింగ వివక్ష…

TELANGANA

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం..! సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ..

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులు అలాగే నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు.   తెలంగాణలో ఉన్న అత్యాధునిక…

TELANGANA

సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ..? వారికి చెక్ పెట్టినట్లేనా..?

తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ.. ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు.…

AP

మావిగన్.. ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం రాష్ట్రానికి పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.   మావిగన్ లేదా అయోధ్య..? పేర్ని నాని ప్రతిపాదన   మాజీ ముఖ్యమంత్రి…

AP

అమరావతికి మోదీ సర్కార్ భారీ గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో భారీ ముందడుగు పడింది. నవ్యాంధ్ర రాజధానిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం మొత్తం రూ. 2,534 కోట్లు మోదీ సర్కార్ వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదం…

TELANGANA

200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు..

అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయలతో బీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానెళ్లను కొనుగోలు చేసి, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బీఆర్‌ఎస్ బురదజల్లుతోందని, వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.   కేవలం ఇంట్లో కూర్చుంటే అధికారం రాదని, ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ అనే నిజాన్ని గుర్తించి ఫీల్డ్‌లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు,…

National

మణిపూర్‌లో రాకెట్ దాడి… ఇద్దరు చిన్నారుల మృతి..

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఒక ఇంటిపైకి రాకెట్ దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మంగళవారం ఉదయం మొయిరాంగ్ గ్రామంలోని ట్రింగ్లాబి అవాంగ్ లేకై అనే ప్రాంతంలో జరిగింది.   ప్రాథమిక సమాచారం ప్రకారం, సమీపంలోని కొండ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించినట్లు భావిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్‌లో ఉన్న సరిహద్దు భద్రతా దళ అధికారి ఒయినం మలెంగాన్బా నివాసంపైకి ఈ రాకెట్ దూసుకువచ్చింది. ఘటన…

TELANGANA

బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్….

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన ‘పిరికిపంద చర్యలు’గా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి…

AP

ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… తిరిగి ప్రారంభమైన ‘ఎన్టీఆర్ వైద్య సేవ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) తమ సమ్మెను విరమించుకుంది. దీంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.   ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే సమ్మె విరమించినట్లు ‘ఆషా’ ప్రతినిధులు తెలిపారు. మొత్తం బకాయిల్లో భాగంగా రూ.1,000 కోట్లను 10 రోజుల్లో చెల్లించేందుకు…