News

AP

భారత్ భూభాగాలను మేమూ ఆక్రమించాం: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

భారత్-నేపాల్ మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. భారత్ తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తున్న నేపాల్… తాము కూడా భారత భూభాగాలను కొన్నిచోట్ల ఆక్రమించామని ఆ దేశ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగగా, గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వివరణ ఇచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టింది.   ఈ ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రసంగించిన 35 ఏళ్ల…

TELANGANA

యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్..! ఇకపై యాప్ లో బుకింగ్..!

ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు చెపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందన్నారు. ఫర్టిలైజర్ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతు వారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు…

TELANGANA

నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రెండో విడత పనులకు శంకుస్థాపన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు జిల్లాలోని కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం స్వయంగా…

AP

ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు..?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి పెరగనుందా? ఈ అంశంపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు విద్యాశాఖ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం పేర్కొన్నారు.   నెల్లూరు జిల్లా కావలి డిప్యూటీ డీఈవో ఎం. హరిప్రసాద్ పదవీ విరమణ సన్మాన సభలో మువ్వా రామలింగం ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అవుతున్న…

AP

విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాలు జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు

రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.   నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీ నేతలపై వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అయితే తీరా విచారణలో…

National

దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్..

దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు.   దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు…

AP

ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.   ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించేందుకు కాలువలు తెరిచే తేదీలు, నీటి పంపిణీ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. మే 31వ తేదీ…

TELANGANA

సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని కాంగ్రెస్ నాయకులు డీజీపీకి లేఖ ఇచ్చారు.   బాల్క సుమన్ ఏమన్నారు?   బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన…

TELANGANA

నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్..

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు.   ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే.. ‘మేమేమన్నా దీవానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా’ అని ఒకాయన మాట్లాడారు. మరి…

AP

ఏపీ ‘మెగా డీఎస్సీ’ వివాదాలపై తేల్చి చెప్పిన విద్యాశాఖ..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నిర్వహణపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ నియామక ప్రక్రియ అంతా పక్కా ప్లానింగ్‌తో, అత్యంత పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మెరిట్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు.   ముఖ్యమంత్రి తొలి సంతకం.. భారీ నోటిఫికేషన్   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.…