News

National

అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా..

తనతో సహా ఏడుగురు ఎంపీలు భయంతో ఆమ్ ఆద్మీ పార్టీని వీడలేదని, కేజ్రీవాల్ విధానాల కారణంగా బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని విమర్శించారు. పార్టీ కోసం నిత్యం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.   మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం…

TELANGANA

కవిత కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఆవిర్భావం..;

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌)’ పేరుతో తన పార్టీని ప్రకటించి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్‌, దానిపై టీఆర్ఎస్‌…

AP

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు..

ఏపీ లిక్కర్ రవాణా ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు విచారణ కూడా చేపట్టారు.   జూబ్లీహిల్స్‌లోని కారుమూరి నివాసంలో సిట్ అధికారులు ఆయనను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆయన వయసు 60 ఏళ్లు పైబడటంతో, చట్ట ప్రకారం…

AP

11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు..

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన చర్యలపై న్యాయపోరాటం ముమ్మరం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు, కీలక వ్యక్తులకు ఈరోజు ఆయన పంపిన లీగల్ నోటీసులు ఐపీఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పరువుకు భంగం కలిచారంటూ ఏకంగా 11 మందికి ఆయన పరువునష్టం నోటీసులు పంపారు.   అక్రమ కేసులు బనాయించడం, తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా తనను మానసిక వేదనకు గురిచేశారని ఆయన…

TELANGANA

తెలంగాణకు ప్రధాని మోదీ..! మే 9న భారీ బహిరంగ సభ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో తెలంగాణ బీజేపీ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించి పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభను దిగ్విజయం…

TELANGANA

కవిత కొత్త పార్టీ..! తెరవెనుక భారీ స్కెచ్..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తన తదుపరి రాజకీయ అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారా? అంటే తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. రాజకీయ పరిణామాలను గమనిస్తూనే సందర్భాను సారం గళం విప్పుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు తెరవెనుక రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల,…

TELANGANA

ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు…

National

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిషాక్…? బీజేపీలోకి రాఘవ్ చద్దా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో విలీనం కానున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది.   ఈరోజు ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా ఈ ప్రకటన…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు….

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఒకవైపు వీరి నివాసాల్లో ఈడీ సోదాలు జరుగుతుండగానే, మరోవైపు న్యాయస్థానంలో కూడా వారికి ఊరట లభించకపోవడం గమనార్హం.   మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరువర్గాల వాదనలు విన్న…

AP

జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. విజయసాయి సంచలన ప్రకటన..!

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జులై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.   రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా, త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు…