News

TELANGANA

కవిత పార్టీ వివాదంపై కేటీఆర్ కౌంటర్..!

దిల్లీలో పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు వివాదంపై ఆయన స్పందించారు. ‘టీఆర్ఎస్ పేరు పెట్టడంపై కొందరు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మా పార్టీ పేరును వాడుకోవాలని చూస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. బంధం కంటే పార్టీనే ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.   మరోవైపు ఫార్మూలా రేస్ కేసుకు గురించి కూడా కేటీఆర్…

TELANGANA

వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది” అని విద్యార్థులకు ఉద్బోధించారు.   విద్యార్థినులతో ముఖ్యమంత్రి.. వనపర్తి…

AP

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.   విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి   చిన్నారులపై…

AP

అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్… సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి…

National

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్..!

ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ దిగ్గజం ‘స్విగ్గీ’ వినియోగదారుల కోసం మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ద్వారా ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. తొలిదశలో భాగంగా బుధవారం బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు.   వినియోగదారులు ఇకపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్…

National

భారత్‌ చుట్టూ విదేశీ నిఘా..? వరుస ఘటనల వెనుక ఏం జరుగుతోంది..?

భారత్‌తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస ఘటనలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తుల అరెస్టులు, బంగ్లాదేశ్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి అనుమానాస్పద మృతి వంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదు.   నేపాల్‌ సరిహద్దులో అమెరికా పౌరుడు ఈ నెల ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలి సరిహద్దు…

AP

ఏపీ పాలనలో వినూత్న ప్రయోగం..!

ఆంధ్రప్రదేశ్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్) ఆధారంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.   ఈ సరికొత్త విధానం ద్వారా…

AP

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది.   తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953, జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం,…

TELANGANA

మీనాక్షి నటరాజన్‌కు కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించారు.   సురేఖ వివరించిన…

TELANGANA

హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు..

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించినప్పుడే వారి నుంచి మెరుగైన ఉత్పాదకతను సాధించగలమని తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు సామాజిక భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.   మంగళవారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ – 2026 ప్రారంభోత్సవంలో మంత్రి…