News

National

భారత్‌ చుట్టూ విదేశీ నిఘా..? వరుస ఘటనల వెనుక ఏం జరుగుతోంది..?

భారత్‌తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస ఘటనలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తుల అరెస్టులు, బంగ్లాదేశ్‌లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి అనుమానాస్పద మృతి వంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదు.   నేపాల్‌ సరిహద్దులో అమెరికా పౌరుడు ఈ నెల ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలి సరిహద్దు…

AP

ఏపీ పాలనలో వినూత్న ప్రయోగం..!

ఆంధ్రప్రదేశ్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్) ఆధారంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.   ఈ సరికొత్త విధానం ద్వారా…

AP

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది.   తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953, జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం,…

TELANGANA

మీనాక్షి నటరాజన్‌కు కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించారు.   సురేఖ వివరించిన…

TELANGANA

హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు..

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించినప్పుడే వారి నుంచి మెరుగైన ఉత్పాదకతను సాధించగలమని తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు సామాజిక భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.   మంగళవారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ – 2026 ప్రారంభోత్సవంలో మంత్రి…

TELANGANA

తెలంగాణ అభివృద్ధికి 6 సూత్రాలు.. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధనపై ఎంపీలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం బీజేపీ ఎంపీలు సైతం చొరవ చూపాలని కోరారు.…

National

నార్వే గుహలో బయటపడ్డ 75,000 ఏళ్ల నాటి రహస్య జీవ ప్రపంచం..!

నార్వేలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఒక అద్భుతమైన చారిత్రక విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 75,000 ఏళ్ల క్రితం, చివరి హిమయుగంలోని ఒక వెచ్చని కాలంలో ఆర్కిటిక్ ప్రాంతం ఎంతటి గొప్ప జీవవైవిధ్యంతో విలసిల్లిందో తెలియజేసే కీలక ఆధారాలను ఒక గుహలో కనుగొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈ ఆవిష్కరణ యూరోపియన్ ఆర్కిటిక్‌లో ఇప్పటివరకు కనుగొన్న జంతు సమాజాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా రికార్డు సృష్టించింది. ఈ గుహలోని సహజ నిక్షేపాలు సున్నితమైన ఎముకలు,…

AP

పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల…

TELANGANA

కాళేశ్వరంపై కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో, గోదావరి జలాలను ఉద్దేశపూర్వకంగానే సముద్రం పాలు చేస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.   సోమవారం కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం…

AP

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌.. 3,168 పోస్టుల భర్తీకి కసరత్తు..

ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్, సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   సమీక్షా సమావేశంలో సీఎస్ పలు…