News

TELANGANA

తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్..!

రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ’ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.   వివిధ శాఖల…

TELANGANA

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం..!

రాష్ట్ర కేబినెట్ మీటింగ్ శనివారం సెక్రటేరియట్ లో జరగనున్నది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు మంత్రులతో పాటు ముఖ్య అధికారులంతా హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఆసరా ఫించన్లు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్, జర్నలిస్టులకు ఇళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన పొదుపు, సోలార్ వినియోగం తో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. కొత్త పథకాలపై కేబినెట్ నిర్ణయం…

National

సరిహద్దులు దాటిన ‘బొద్దింకల ఉద్యమం’..! బయోలో ఆసక్తికర కొటేషన్స్….

భారత్‌లో వ్యంగ్యంగా పుట్టిన ‘బొద్దింకల ఉద్యమం’ ఇప్పుడు సరిహద్దులు దాటి పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు పాకింది. అక్కడి సోషల్ మీడియా వేదికలను ప్రస్తుతం ఈ ‘బొద్దింకల పార్టీలు’ ముంచెత్తుతున్నాయి. పాక్ లోని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అక్కడి జెన్-Z యువత పెద్ద ఎత్తున కాక్రోచ్ మూవ్ మెంట్ ను లేవనెత్తుతున్నారు. అక్కడి పార్టీలను ప్రతిబింబించేలా కాక్రోచ్ పార్టీల పేర్లు పెట్టి.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.   భారత్‌లో పుట్టిన ‘సీజేపీ’ (CJP) వాస్తవానికి…

AP

పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత..

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై పోలీసులు ఇప్పటికే లోతైన విచారణ జరుపుతున్నారని ఆమె వెల్లడించారు.   రాజకీయ కుట్ర కోణం లేకపోతే కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్… అంతదూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని హోం మంత్రి అనిత…

AP

రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం…

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు.   “వ్యాపార నిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), కార్యనిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్) రెండూ కలిసిన ప్రదేశం…

AP

లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా జరిగే 29వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF 2026)లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇస్తున్నట్లు సాధారణ…

AP

సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్..!

దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. మీడియాలో హైలైట్ కావాలనే.. ఏంటో తెలీదుగానీ సీఎం చంద్రబాబుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మావిగన్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.   నెల రోజుల తర్వాత మీడియా ముందు జగన్   దాదాపు నెల రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు…

TELANGANA

రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ..!

తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు…

National

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాక్రోచ్ పార్టీ..! ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ..!

భారతదేశంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, దాన్ని పెద్ద పార్టీగా చేసేందుకు దశాబ్దాల కాలం పడుతుంది. కేవలం 5 రోజుల్లో… అవును, కేవలం 5 రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించి, ఏకంగా దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను దాటేసిన ఒక వింత పొలిటికల్ మూవ్‌మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   దాని పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP). ఏంటి..…

TELANGANA

కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు..!

తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాల పెంపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.   మూడు జోన్లుగా విభజన కార్మికుల కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు వీలుగా మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా వర్గీకరించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2…