News

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. తల్లి రక్త నమూనాల సేకరణ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఈ రక్త నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని అనుమానాస్పద శాంపిల్స్‌తో తల్లి డీఎన్ఏను సరిపోల్చనున్నారు. దీని ద్వారా బాధితుడిని…

National

పహల్గాం దాడిపై బ్రిక్స్ దేశాల తీవ్ర ఖండన.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్..

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు ఉగ్రవాదంపై కీలక తీర్మానం చేశాయి. 2025లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 12న ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’లో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశాయి.2025 ఏప్రిల్ 22న పహల్గాంపై జరిగిన ఉగ్రదాడిని అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నట్లు బ్రిక్స్ నేతలు తమ…

TELANGANA

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా..? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు..

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారన్నారు. ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు గొప్పులు చెప్పుకుంటూ సభను తన అడ్వర్ టైజ్ మెంట్ కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.…

AP

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన కొత్త వ్యూహం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహాలను రూపొందించేందుకు.. పార్టీ ఇప్పటికే సమన్వయ కమిటీని వేసింది. ప్రస్తుతానికి.. 14 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో.. సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల…

AP

చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా..?

బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పాక.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు కూడా  రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అసలు పోరు మొదలైంది. భీమిలి ఇన్‌చార్జి పదవి కోసం.. పోటీ పెరిగింది. ఎందుకంటే.. ఇది వైసీపీకి కీలక స్థానం. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు…

AP

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం..!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ అంశంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ తీస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి వంచించారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు…

National

పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుక..!

బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు బహూకరించారు.సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరస్పరం కరచాలనం చేసుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై వారు కూలంకషంగా…

TELANGANA

22ఏ అనేది పొరపాటు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం: హరీశ్ రావు

తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22ఏ వివాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాలో భూములను చేర్చడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో చేసిన పెద్ద దుర్మార్గమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులతో బీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ పేరుతో ప్రజల భూములకు ‘భూ హారతి’…

AP

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..!

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హవాల్దార్‌ మల్లేశ్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ డీలర్లతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మల్లేశ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు పలు అనుమానాస్పద అంశాలు కనిపించినట్లు సమాచారం. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధ డీలర్‌ను ఫాలో అవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు…

TELANGANA

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..

ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని, అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్…