News

National

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి పాక్‌ ఉగ్రవాద సంస్థలు..

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను పాక్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హమాస్‌ నుంచి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌ (జేఈఎం)కు యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ వ్యూహం పన్నుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా హమాస్‌, పాక్‌ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలపై భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధం సాగించేలా లష్కర్‌, జైష్‌ను సిద్ధం చేయడం…

National

భారత్‌తో సరిహద్దు వివాదం..! చేతులెత్తేసిన నేపాల్..

భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఖరారు చేసిన 1816 నాటి చారిత్రక సుగౌలీ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదని నేపాల్ ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ ఈ విషయాన్ని ప్రతినిధుల సభలో స్వయంగా…

TELANGANA

కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ..! కోర్టులో ఉత్కంఠ.. సెప్టెంబర్ 9కి వాయిదా..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక…

AP

ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోనే విలువ ఆధారిత…

AP

ఏపీలో మోగనున్న స్థానిక నగారా.. ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలు..

ఏపీ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గతంలో జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 17న ఓటర్ల…

TELANGANA

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం… చట్టబద్ధమైన ప్రక్రియ, అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం జీవోల ఆధారంగానే ప్రజాధనాన్ని వెచ్చించే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై…

National

రాజ్యసభనలో “లుంగీవాలా” వివాదం..!

రాజ్యసభలో బుధవారం ‘లుంగీవాలా’ వివాదం తీవ్ర దుమారం రేపింది. తనను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ఈ పదాన్ని ఉపయోగించారని కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.సోమవారం నాడు సభలో తాను ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో, పంచె కట్టుకుని ఉన్న తనను చూసి వెనుక సీటులో కూర్చున్న సుస్మితా…

National

జెన్-జీకి ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.రైల్వే స్టేషన్లలో…

TELANGANA

కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన..!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలను పరుగులు పెట్టించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పేదలకు ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, డిఫాల్ట్ రైస్‌మిల్లర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కేపీహెచ్‌బీ లో తొలి ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేపీహెచ్‌బీ…

TELANGANA

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ..!

భారత సాయుధ దళాల్లో తెలంగాణ యువత ప్రాతినిధ్యం పెరిగేలా, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లలో వారికి పూర్తి మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) లో ఉన్న ‘బోధి పెవిలియన్’ వేదికగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తో సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…