జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్య..
జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే కావడం విశేషం. బుధవారం శ్రీనగర్లో ఆయన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు.ఈ సమావేశం అనంతరం సెర్గియో గోర్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్లో ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఇది ఎంతో రమణీయమైన ప్రదేశం” అని…

