ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు..
ప్రధాని మోదీ ముంబయి పర్యటన వేళ.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఉన్న నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వద్ద మోదీ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. ఇద్దరు అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదుపులోకి తీసుకున్న…

