News

TELANGANA

వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్..

పెద్దపల్లిలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల గార్డెన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు.   రేవంత్ పాలనపై ఘాటు విమర్శలు   రేవంత్ రెడ్డి ఎన్ని తలకిందుల తపస్సులు చేసినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో తమ…

TELANGANA

కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ..! కవిత సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, పటాన్ చెరు లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, పటాన్ చెరు, సంగారెడ్డి లో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలే నడుస్తున్నాయని అన్నారు.   కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ   అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులంతా ఒకరికి…

National

జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.   నిన్న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము చేపట్టిన శాంతియుత నిరసన ఒక చరిత్ర అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. “‘బొద్దింకలు’ ఏకమైతే…

AP

ఏపీకి మరో గుడ్ న్యూస్..! ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. !

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.   ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో లభించే భారీ ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఒక డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్…

AP

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు.   గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో…

AP

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్…!

జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.   రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్…

AP

ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు.  …

National

ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్… ప్రపంచంలో ఇదే మొదటిసారి..!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో మైలురాయిని అధిగమించింది. ఏఐ సహాయంతో రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్, ప్రాథమిక దశ మానవ ప్రయోగాల్లో (క్లినికల్ ట్రయల్స్) విజయవంతమైంది. భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఇది ఒక కీలక పరిణామమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.   ‘pEVAC-PS’ పేరుతో పిలిచే ఈ నూతన వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 39 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని,…

TELANGANA

సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కేటీఆర్ ఒక లేఖ రాశారు.   సింగరేణిలోని పలు స్టాక్‌యార్డులలో బొగ్గు నిల్వల…

AP

‘ఓజీ’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్..

గుంటూరు జిల్లాలో ఓ మహిళకు వైద్యులు వినూత్న పద్ధతిలో బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ, మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో ‘అవేక్ క్రేనియోటమీ’గా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ ఆసుప‌త్రిలో జరిగింది.   ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో…