News

AP

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం..! డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్..

ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం…

TELANGANA

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్..!

సీయం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి కొండా సురేఖ బర్తరప్ అవుతుందా లేదా అన్న అనుమానాలకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి కొండా సురేఖని బర్తరప్ చేస్తూ AICC కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం పై కొండా సురేఖ మాట్లాడుతూ తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తనని క్యాబినెట్ నుండి తప్పించారంటూ వాపోయారు. పార్టీ పంపిన షోకాజ్…

TELANGANA

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..! సీఎం పై సంచలన కామెంట్స్!

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్‌ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.…

TELANGANA

2027 వరకు ఎల్‌నినో.. డబ్ల్యూఎంఓ సంచలన హెచ్చరిక.. భారత్‌కు మరో వాతావరణ ముప్పు..

వాతావరణ మార్పులపై ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంఓ) కీలక హెచ్చరిక చేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడుతోందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని తాజా అంచనాలో వెల్లడించింది.సెప్టెంబర్‌ 3న విడుదల చేసిన తాజా నివేదికలో డబ్ల్యూఎంవో ఇంతటి అధిక స్థాయి విశ్వాసంతో ఎల్‌నినో కొనసాగింపుపై అంచనా…

AP

అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు..: మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.…

Uncategorized

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా..!

అయోధ్య రామ మందిరానికి నూతన సీఈవో గా జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆపరేషన్ సింధూర్ హీరో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా రామ్ మందిర్ తొలి సీఈఓగా కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. రామమందిర పరిపాలనను మరింత పారదర్శకంగా, వృత్తిపరంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక CEO పదవిని సృష్టించి మిశ్రాను ట్రస్టు ఎంపిక చేసింది. భారత వైమానిక దళంలో 38 సంవత్సరాలకు పైగా విశేష సేవలందించిన జితేంద్ర మిశ్రా, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్…

AP

పోలవరం జిల్లాలో విషాద ఘటన..! వికటించిన మాత్రలు..! ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత..

పోలవరం జిల్లా గొల్లగుప్పలో విషాదం చోటు చేసుకుంది. వేసుకున్న మలేరియా మాత్రలు వికటించాయి. ఫలితంగా ఓ చిన్నారి మృతి చెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందర్ని వివిధ ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మంగళవారం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అందులో మలేరియా నివారణకు స్థానిక పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారుల్లో 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు…

TELANGANA

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రాజ్‌నాథ్‌సింగ్, రామ్మోహన్‌నాయుడితో భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్య అతిథిగా సీఎం ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భాగమైన డిఫెన్స్ ఎక్స్‌పోలో…

TELANGANA

నాపై కాదు.. ముందు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: ఢిల్లీలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ… సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె… తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేస్తూ చర్యలు తీసుకోవాలనుకోవడం సరికాదని సురేఖ స్పష్టం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ…

AP

అనకాపల్లి మరో రంగారెడ్డి అవుతుంది.. ఇది ఖాయం.. రాసిపెట్టుకోండి: సీఎం చంద్రబాబు..

ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను సాకారం చేస్తూ, పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి గడ్డపై అడుగుపెట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సాధించిన ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, దాని ఫలితమే ఈ జలయజ్ఞమని అన్నారు.మాట నిలబెట్టుకున్నాం.. పునర్నిర్మాణం చేస్తున్నాం గత ఎన్నికల్లో ప్రధాని…