News

AP

కదిరిలో రూ. 10 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశానుసారం కదిరి నిజాం వలి కాలనీ లోని 13 14 15 వార్డులకు సంబంధించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ దాదాపు 10లక్షల వ్యయం తో నిర్మించే దానికి భూమి పూజ చేసిన కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కె ఎస్ దిల్షాదున్నిసా బహావుద్దిన్ గారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహబూబ్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇలాహి,…

AP

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు కె.ఎస్. షానవాజ్

శ్రీ సత్యసాయి జిల్లా SP సతీష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు KS షానవాజ్ గారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా SP గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ గారిని సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు & కదిరి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ KS షానవాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించడం జరిగింది.

CINEMA

ప్రేమలో ఓపిక ఉండాలి: యువతకు నటి మృణాల్ ఠాకూర్ ప్రేమ పాఠాలు!

మృణాల్ ఠాకూర్ తన కొత్త చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బంధాలు చాలా సులభంగా విచ్ఛిన్నమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి గొడవలు రాగానే ఒకరినొకరు సోషల్ మీడియాలో బ్లాక్ చేసుకోవడం, “మా దారులు వేరు” అని సులభంగా విడిపోవడం సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు. పాతకాలపు మనస్తత్వంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే బంధం బలంగా ఉంటుందని సూచించారు.…

AP

IFR మిలన్ 2026: విశాఖ తీరాన ప్రపంచ దేశాల కవాతు.. నౌకాదళ శక్తి ప్రదర్శన!

గురువారం సాయంత్రం ఆర్కే బీచ్‌ రోడ్డులో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలో భారత సైన్యం (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్), కోస్ట్ గార్డ్ బలగాలతో పాటు ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి సుమారు 19 దేశాల నౌకాదళ ప్రతినిధులు తమ దేశాల బ్యాండ్‌లతో కలిసి కవాతు నిర్వహించారు. గగనతలం నుంచి నౌకాదళ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్…

TELANGANA

సిద్దిపేట నుంచే సమరం: మే నెలలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్న తన సంస్థ ఇకపై రాజకీయ వేదికగా మారుతుందని, పార్టీ పేరులో కచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ కరువైందని, ఆ ఖాళీని భర్తీ చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో…

TELANGANA

కాంగ్రెస్ అంటే కరప్షన్, కమీషన్, కలెక్షన్.. బండి సంజయ్ సంచలన విమర్శలు!

రాష్ట్ర మంత్రుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని, త్వరలోనే దానిని బహిర్గతం చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మంత్రుల అవినీతి దందాలకు మధ్యవర్తులుగా మారుతున్నారని, వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ (TPCC) అంటే “తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్ కాంగ్రెస్” అని ఎద్దేవా చేస్తూ, 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర…

AP

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మాజీ సీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు

జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై స్పందించిన అచ్చెన్నాయుడు, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదని, తన సొంత పనుల కోసం ప్రజాధనాన్ని విమానాలకు దుర్వినియోగం చేసిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న పర్యటనలను ‘జల్సాలు’గా అభివర్ణించడం జగన్ ద్వంద్వ…

CINEMA

రామానాయుడు స్టూడియోలో సత్యదేవ్ ‘SD15’ ప్రారంభం: ఫరియా అబ్దుల్లా హీరోయిన్!

వెర్సటైల్ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా తన 15వ చిత్రాన్ని (SD15) బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యువ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్రిషూల్ విజినరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’…

TELANGANA

కేటీఆర్ హెచ్చరిక: “వడ్డీతో సహా చెల్లిస్తాం”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకోవడానికే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, రాజకీయాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు ఉన్న…

TELANGANA

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులు: ఉచిత ప్రయాణంలో నకిలీలకు చెక్!

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఉచిత టికెట్ పొందుతున్నారు, అయితే దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ ఆధార్ కార్డులతో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా, వచ్చే నెల నుంచి మహిళా ప్రయాణికులకు ప్రత్యేకమైన స్మార్ట్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల…