త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు..
ఎన్సీఈఆర్టీలో త్రిభాషా సూత్రానికి సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు నోటీసులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు…

