News

TELANGANA

ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలవను: కల్వకుంట్ల కవిత..

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీతో భవిష్యత్తులో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, “ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సంబంధాలు వేరని, రాజకీయాలు వేరని ఆమె తేల్చి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడం తమ సిద్ధాంతం కాదని కూడా అన్నారు.పార్టీ నుంచి తనను బహిష్కరించిన తీరుపై…

TELANGANA

బీఆర్ఎస్ చేతబడి చేయిస్తోంది.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత…

TELANGANA

టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. వచ్చే వారం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర..!

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రెండు కీలక ప్రకటనలతో ఉద్యోగార్థుల్లో కొత్త…

Uncategorized

కశ్మీర్‌లో ఆసక్తికర పరిణామం..టాప్ టెర్రరిస్ట్ ఇంటిపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..!

జమ్మూ కశ్మీర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా దళాల మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. షాపియాన్‌లోని వారి నివాసంపై తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అబిద్ రంజాన్ షేక్, లోయలో…

AP

విజయవాడలో డీఎస్సీ టీచర్ల ‘ఆత్మగౌరవ ర్యాలీ’.. వైసీపీపై ఫైర్..

తమ నియామకాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో భారీ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న ఆరోపణలు వెంటనే ఆపకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 7,000 మందికి పైగా నూతన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన…

TELANGANA

కల్తీకి చెక్.. తెలంగాణలో ‘టీజీ సేఫ్’ ఏర్పాటు..!

తెలంగాణలో ఆహార, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఔషధ నియంత్రణ (డ్రగ్స్ కంట్రోల్) విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థకు ‘టీజీ సేఫ్’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అని నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు…

National

హిందువులపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు.. పాత పేరుతో చురక అంటించిన జావేద్ అక్తర్..

ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. జర్దారీపై ఉన్న పాత అవినీతి ఆరోపణలను గుర్తుచేస్తూ, ‘మిస్టర్ 10%’ అంటూ ఎద్దేవా చేస్తూ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.అసలేం జరిగిందంటే..పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ…

National

అది ఓ చారిత్రక రాత్రి..! స్వాతంత్ర్యం ఆగస్టు 15, అర్ధరాత్రే ఎందుకు..?

అది ఓ చారిత్రక రాత్రి.. తెల్లవారితే దేశం మొత్తం స్వేచ్ఛా భారతాన్ని చూడబోతోంది. కానీ స్వాతంత్ర్యం ప్రకటించాల్సిన సమయం దగ్గరపడే కొద్దీ ఓ విచిత్రమైన చర్చ మొదలైంది. ఆగస్టు 15న భారత్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం శుభం కాదని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. తేదీని మార్చే పరిస్థితి లేదు. దీంతో అదే తేదీలో.. ఓ ప్రత్యేక సమయాన్ని ఎంచుకునే ఆలోచన తెరపైకి వచ్చింది. చివరకు అర్ధరాత్రి వేళ భారత్‌ స్వేచ్ఛను అందుకుంది.మౌంట్‌బాటన్‌ ఖరారు చేసిన ఆగస్టు 151947…

TELANGANA

తెలంగాణ రాజకీయాలపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్..

తెలంగాణ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. నిజాయితీగా పని చేసే నాయకులు మద్దతుగా నిలిస్తే.. తమిళనాడు మాదిరిగా మార్చేస్తామని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కాకుండా వలస వచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలియని వారు ఉండరు. ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం…

AP

డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అందుబాటులో ఉన్న మంత్రులు లంచ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 వివాదం, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ అనుకూలురకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికే అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేశారని మంత్రులు…