News

National

ముఖ్యమంత్రిగా ఆ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్..

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు.   తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై…

AP

జనసేనలో కుమ్ములాటలు..? కారణం ఎవరు..?

జనసేన పార్టీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక గొడవ లేదా వివాదాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకరు పోతే మరొకరు పార్టీని ప్రజల్లో చీప్ చేసేస్తున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనసేనానికి ఏమో ఆరోగ్యం బాలేదు. ఇటీవల ఆయనకు సర్జరీ అయ్యింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం పవన్ కళ్యాణ్ పెద్దగా హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో…

AP

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచడం, కొత్తగా నిధుల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన…

TELANGANA

తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను… ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ..

తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, వారి కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని అన్నారు.   ప్రధాని మోదీ తన…

TELANGANA

తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా తెలంగాణలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.   ప్రధాని ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టుల వివరాలు ఇవి: హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్: ఇందులో భాగంగా సూరారం నుంచి మహబూబ్‌నగర్…

AP

వ్యవస్థలు గాడి తప్పాయా..? అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీలో పోలీసు యంత్రాంగం తన ప్రాథమిక విధులను విస్మరించి, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ తన పంథాను మార్చుకుందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే నేడు ప్రశ్నించే గొంతుకలను అణచివేసే…

AP

పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక: బాలినేని..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు.   వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించినందుకే తాను ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూనే తప్పులను ఎత్తిచూపడం…

TELANGANA

బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..!

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆయనపై పోక్సో కేసు నమోదు కాగా, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు యువతి కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.   హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి శుక్రవారం పేట్‌బషీరాబాద్…

National

నేడే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం..! 9 మంది మంత్రులతో తొలి కేబినెట్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రభుత్వంలో హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు పార్టీ వర్గాలు శనివారం వెల్లడించాయి.   విజయ్‌తో పాటు తొలి విడతలో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం…

TELANGANA

నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హాజరు కావాలని కోరుతూ కేంద్రం శనివారం ఆహ్వాన పత్రం అందజేసింది.   జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని…