News

National

ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో ఎయిర్‌పోర్ట్‌..

దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. ఈ కుండపోత వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు.వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ ప్రభావంతో మధ్యాహ్నం 3:30 నుంచి…

TELANGANA

మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు..? కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు వైరల్..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు? గురువారం సాయంత్రం మీడియాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆమె ప్రెస్ మీట్ చూసినవాళ్లు మాత్రం, పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పలువురు రాజకీయ నేతలు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. చెప్పాల్సిన వన్నీ…

TELANGANA

కేసీఆర్‌కు బిగ్ షాక్..! సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నాచేయాలని నర్ణయించింది. అందుకోసం ఈనెల 6వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. గత వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అటు అసెంబ్లీకి సైతం హాజరుకాకుండా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్…

AP

ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పవన్ హెచ్చరిక..!

రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) తీరుపై రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తూ, మరోవైపు గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో సగం కాలుష్యానికి ఈ కంపెనీయే కారణమని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం దగ్గర నుంచి లైసెన్సు రద్దు వరకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం…

AP

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడు జాన్ సైదా హర్యానాలో అరెస్ట్..

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ జాన్ సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను షేక్ జాన్ సైదా (రబ్బానీ) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి…

AP

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం..! డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్..

ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం…

TELANGANA

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్..!

సీయం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి కొండా సురేఖ బర్తరప్ అవుతుందా లేదా అన్న అనుమానాలకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి కొండా సురేఖని బర్తరప్ చేస్తూ AICC కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం పై కొండా సురేఖ మాట్లాడుతూ తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తనని క్యాబినెట్ నుండి తప్పించారంటూ వాపోయారు. పార్టీ పంపిన షోకాజ్…

TELANGANA

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..! సీఎం పై సంచలన కామెంట్స్!

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్‌ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.…

TELANGANA

2027 వరకు ఎల్‌నినో.. డబ్ల్యూఎంఓ సంచలన హెచ్చరిక.. భారత్‌కు మరో వాతావరణ ముప్పు..

వాతావరణ మార్పులపై ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంఓ) కీలక హెచ్చరిక చేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడుతోందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని తాజా అంచనాలో వెల్లడించింది.సెప్టెంబర్‌ 3న విడుదల చేసిన తాజా నివేదికలో డబ్ల్యూఎంవో ఇంతటి అధిక స్థాయి విశ్వాసంతో ఎల్‌నినో కొనసాగింపుపై అంచనా…

AP

అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు..: మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.…