News

TELANGANA

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ.. మల్లు రవికి కీలక విజ్ఞప్తి..!

టిపిసిసి క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాసారు. తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటి ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ విజ్ఞప్తి చేసారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో…

TELANGANA

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు..!

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. లండన్ యూనివర్సిటీలోని సెనేట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర…

AP

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన “జాబ్ క్యాలెండర్-2026″ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆగస్టు 22, 2026న జీవో నెం.81ను జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు), డీఎస్సీ వంటి…

AP

డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం..! జగన్‌కు నారా లోకేశ్ ఐదోసారి సవాల్..

డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!” అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా…

National

బీజేపీ కొత్త టీమ్‌తో ప్రధాని మోదీ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నూతన జాతీయ పదాధికారులతో సమావేశమయ్యారు. కొత్త ఆలోచనలు, దృక్పథాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో పార్టీకి ఉన్న సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సంస్థాగత సమావేశాలు ఇలాంటి కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఫొటోలను పంచుకున్నారు. “సంస్థాగత సమావేశాలు పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలతో సంబంధాలు…

National

చక్కెర ధరల పెరుగుదల..! కేంద్రం క్లారిటీ..!

చక్కర ధరల పెరుగుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఇప్పటికే భారీగా చక్కెర ధరలు పెరిగాయి. దీంతో జూలై 20న కిలో చక్కెర ధర దాదాపుగా రూ.48.18 పలికింది. దీంతో ఆగస్టు 20న రూ.55.70కి చక్కెర ధర పెగింది. కేవలం నెల రోజుల్లో కిలో చక్కెరపై రూ.7.52 పెరిగింది. చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసకుందని తెలిపింది. ఇథనాల్‌కు చక్కెర మళ్లించడం…

TELANGANA

వివేకానంద కేసులో కొత్త మలుపు, ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్ల ఈడీ సోదాలు..

ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లోని ఓపెన్ స్కైస్‌లోని ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం,…

AP

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన…

TELANGANA

ఎకరం రూ.264 కోట్లు.. రాయదుర్గంలో ఆల్ టైమ్ రికార్డు ధర..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా రూ. 264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ విక్రయం ద్వారా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీకి రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌లో భూమి ధరకు సంబంధించి ఇదే ఆల్ టైమ్ రికార్డ్.రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెం. 83/1లో ఉన్న ప్లాట్ నెం. P1 కోసం…

TELANGANA

కుమార్తె వ్యాఖ్యల వివాదం..! త్వరలో నిజాలు బయటపెడతా: కొండా సురేఖ…

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు.వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత…