“బాత్రూమ్లోకి కూడా వస్తారా?”.. మీడియాపై పినరయి విజయన్ ఫైర్..
కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు గురించి మీడియా వెంటపడడంతో సహనం కోల్పోయారు. “నాతో పాటు బాత్రూమ్లోకి కూడా వస్తారా?” అని వారిపై విరుచుకుపడ్డారు.వివరాల్లోకి వెళితే… బుధవారం చంగనచేరికి వెళుతుండగా మార్గమధ్యంలో విజయన్ మధ్యాహ్నం కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్లో ఆగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఆయన కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ…

