వ్యవసాయంలో ఏపీకి మరో మైలురాయి ‘VB-G-RAM-G’ అమలుపై కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ…..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పురోగతి, ఉపాధి హామీ పథకాలపై ఇరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు…

