News

CINEMA

దళపతి విజయ్‌కు భార్య సంగీత షాక్: కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు.. 26 ఏళ్ల బంధానికి ముగింపు?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేతగా వెలుగొందుతున్న విజయ్ వ్యక్తిగత జీవితంలో పెను భూకంపం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట, సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్ట్ నేతల భేటీ: ‘తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు’.. ప్రభుత్వ సరెండర్ పాలసీపై ప్రశంసలు!

ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ), నూనె నరసింహారెడ్డి తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో ప్రభుత్వ సహాయం, లొంగిపోయిన వారికి పునరావాసం మరియు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని దేవ్‌జీ ప్రశంసించడమే కాకుండా, ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతం కంటే ప్రజాస్వామ్య మార్గమే శరణ్యమని తాము నమ్ముతున్నట్లు…

AP

పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక…

TELANGANA

ఏపీ అసెంబ్లీలో సందడి: స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి విక్రమార్క!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో భట్టితో పాటు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా స్పీకర్‌కు ఆహ్వాన పత్రికను అందించి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే శ్రావణి మరియు ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి

*ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే, శ్రావణి గారు, ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు,* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు గారితో పాటు కలసిన ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు* నియోజకవర్గం లోని పలు అంశాలపై చర్చించారు.

TELANGANA

కేటీఆర్, హరీశ్‌రావువి అన్నీ అబద్ధాలే: కాళేశ్వరం వైఫల్యాలపై మంత్రి పొంగులేటి ధ్వజం

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ దూరమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఆశించిన ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, వారి విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన ఆక్షేపించారు. గత పాలకులు దాదాపు రూ.…

AP

తమ్ముడూ.. నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా: నూతలపాటి నాగభూషణం మృతిపై నారా లోకేశ్ భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ యువజన విభాగమైన ‘తెలుగు యువత’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం అకాల మరణం పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగభూషణంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. “తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా…

CINEMA

ఒకటైన ‘విరోష్’: నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక భావోద్వేగ పోస్ట్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ బంధంపై గత కొన్నేళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట పెళ్లి పీటలెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజయ్‌ను ‘నా భర్త’ అని పరిచయం చేస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. “హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!” అంటూ…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ 99 రోజుల యాక్షన్ ప్లాన్: ఎన్నికల టార్గెట్‌గా నలుగురు మంత్రులతో సబ్ కమిటీ!

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో వేగం పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా **99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (Action Plan)**ను ఖరారు చేసింది. దీని పర్యవేక్షణ కోసం నలుగురు కీలక మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

AP

కోటపల్లిలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ: డాక్టర్ ధర్మరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమం

26-02-2026 తేదిన తనకల్ మండలం, కొక్కంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోటపల్లి సచివాలయం పరోధిలో. వున్న C.G ప్రాజెక్ట్…పాఠశాలలో డాక్టర్ ధర్మ రాజు గారి ఆధ్వర్యంలో 40..మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మరాజు గారు, MPHEO… వెంకటరమణ గారు,C.G.. ప్రాజెక్ట్ స్కూల్ S.O గారు, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ గణేష్ కుమార్ రెడ్డి, MLHP/CHO అయేషా,సచివాలయం ANM పద్మావతి.. KGBV స్కూల్, anms..మరియు ఆశా కార్యకర్తలు..పాల్గొన్నారు సార్.