రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్.. ఫ్రీగా డిజిటల్ కోచింగ్.. డిప్యూటీ సీఎం భట్టి..!
తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి ప్రకటించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద రూ.110 కోట్ల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద రూ. 25 కోట్ల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్ కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక, పాలనపారమైన అనుమతులు మంజూరయ్యాయని భట్టి విక్రమార్క…

