News

TELANGANA

తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు సర్కార్ ‘ప్రగతి’ ప్లాన్..?

రెండు వారాల పాటు సర్కార్ బిజీ బిజీ గా గడపనున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో డిపార్ట్ మెంట్ నుంచి యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. ఇందులో…

TELANGANA

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నేడు టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు..!

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటఫికేషన్లను జారీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. జూన్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని, ఇకపై ప్రతి నెలా రెండు, మూడు నోటిఫికేషన్లను జారీ…

AP

మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ..

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మంత్రి నారా లోకేష్. అందుకోసం ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. దేశంలో కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు ఎవరు? ఏయే విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేశారు. మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశమయ్యారు.   భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ స్కేల్…

APNational

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానలంన్నింటికి నామినేషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   నామినేషన్లు విత్ డ్రా.. జూన్ 8వ తేది వకరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది.…

AP

‘పీపీపీ’ అంటూ పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.   ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఆయనను ప్రేమగా ‘పీపీపీ’ (PPP-పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్) గారు అని పిలుచుకుంటాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఎన్నికల…

AP

భారత్ భూభాగాలను మేమూ ఆక్రమించాం: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

భారత్-నేపాల్ మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. భారత్ తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తున్న నేపాల్… తాము కూడా భారత భూభాగాలను కొన్నిచోట్ల ఆక్రమించామని ఆ దేశ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగగా, గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వివరణ ఇచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టింది.   ఈ ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రసంగించిన 35 ఏళ్ల…

TELANGANA

యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్..! ఇకపై యాప్ లో బుకింగ్..!

ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు చెపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందన్నారు. ఫర్టిలైజర్ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతు వారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు…

TELANGANA

నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రెండో విడత పనులకు శంకుస్థాపన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు జిల్లాలోని కెరమెరి మండలం కొత్తారి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం స్వయంగా…

AP

ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు..?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి పెరగనుందా? ఈ అంశంపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు విద్యాశాఖ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం పేర్కొన్నారు.   నెల్లూరు జిల్లా కావలి డిప్యూటీ డీఈవో ఎం. హరిప్రసాద్ పదవీ విరమణ సన్మాన సభలో మువ్వా రామలింగం ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అవుతున్న…

AP

విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాలు జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు

రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భారీ భూ కుంభకోణాల వెనుక వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.   నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీ నేతలపై వేయాలని వైసీపీ ప్లాన్ చేసిందని, అయితే తీరా విచారణలో…