News

TELANGANA

వైద్య చరిత్రలోనే అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ..!

వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, క్లిష్టమైన ఘనతను సొంతం చేసుకుని హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోగికి ఒకే సమయంలో ఏకంగా ఐదు కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి, దేశ వైద్య రంగం చూపును తనవైపు తిప్పుకుంది. కార్పొరేట్ ఆస్పత్రులకే సవాల్ విసిరేలా, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సరికొత్త అద్భుతం జరగడం భారతీయ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.   మృత్యువుపై పోరాటం సిరిసిల్ల…

TELANGANA

మూసీ పునరుజ్జీవనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే ప్రతిష్టాత్మక ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ కీలక దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలి విడతలో భాగంగా రూ. 7,345 కోట్ల భారీ బడ్జెట్‌తో 21 కిలోమీటర్ల మేర మూసీ నది సుందరీకరణ, పునరుద్ధరణ పనుల టెండర్లకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాదు, ఈ మెగా ప్రాజెక్టు పనులను…

TELANGANA

మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ..! నేను రెడీ..! మీరు సిద్ధమా..?

మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల ను వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని…

AP

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం పవన్ విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగిందని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని, గవర్నర్ మార్గదర్శకత్వం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.   అంతకుముందు, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ఈగల్’ విభాగం చీఫ్, సైబర్…

AP

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్ డబ్ల్యూ రాయలమీస ఉక్కు కర్మాగార పనులను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల.. కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంతో రాయలసీమలో నవశకం మెుదలైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత…

AP

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్..!

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్‌ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళను ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మించనున్నారు.   కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్   ఢిల్లీలో ఏపీ భవన్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఆ బాధ్యతను…

AP

పవన్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారుస్తాం: సీఎం చంద్రబాబు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా నిధులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పనిదినాలు కల్పించి, రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తుల కల్పనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్…

TELANGANA

స్పీడ్ పోస్టులో గంజాయి దందా.. భారీ నెట్‌వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్..

భారత తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ సేవలను అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతరాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌-న్యూ) అధికారులు రట్టు చేశారు. ఝార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయడంతో పాటు, హైదరాబాద్‌లో గంజాయి కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   పోలీసుల కథనం ప్రకారం, ఝార్ఖండ్‌లోని గిరిడ్ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ…

Uncategorized

వాహనదారులకు గుడ్ న్యూస్..! రెండు, మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..

వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు, మూడు నెలల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన గురువారం వెల్లడించారు.   పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన నిల్వలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వినియోగిస్తున్నాయని మంత్రి వివరించారు. దీనివల్ల…

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం… సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ..

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన…