News

National

డబ్బుతో కొనేశారు… ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అవన్నీ బూటకమని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ (బీజేపీ) డబ్బులు ఇచ్చి, ఒత్తిడి చేసి మీడియా సంస్థల ద్వారా వాటిని ప్రసారం చేయించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.   స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోకుండా నిరోధించడం, మే 4న…

TELANGANA

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు.   ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని…

AP

ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1,192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో సింహభాగం, అంటే రూ. 1,123.15 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పూడికతీత వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులకు ఊతం లభిస్తుంది. మిగిలిన రూ. 69.01 కోట్లు అడ్మిన్ కాంపోనెంట్ కోసం వినియోగించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ…

AP

ఏపీ క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.   క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే…   1.…

TELANGANA

బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చి హ్యాక్ చేస్తున్నారని తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కేటీఆర్, హరీశ్ రావులు ప్రజల ముందు పెట్టారని అన్నారు.   తమ…

National

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. !

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజాగా విడుదలైన వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. అదే సమయంలో దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అస్సాం రాష్ట్రంలో కాషాయ జెండా మరోసారి…

AP

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి..

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు.   కేకే రాజు కామెంట్స్..   కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు,…

AP

ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు..

ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీనితో వర్చువల్ విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తి ఈ విచారణలోకి వచ్చి వీటిని ప్లే చేసినట్లు వెల్లడైంది.   ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ కేసును విచారిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి.…

TELANGANA

కవితకు ‘టీఆర్ఎస్’ షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ..!

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కవితకు తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం షాకిచ్చారు. కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారడంతో బాలరంగం తన పార్టీని 2023లో రిజిస్టర్ చేయించారు. ఈ నేపథ్యంలో కవిత ‘టీఆర్ఎస్’ పార్టీని రిజిస్టర్ చేయవద్దని, అలా చేస్తే తన పార్టీకి నష్టం జరుగుతుందని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.   తన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల…

AP

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష…