టాలీవుడ్లో ఐశ్వర్య అర్జున్కు నిరాశ: బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ ‘సీతా పయనం’
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన ‘సీతా పయనం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సీనియర్ హీరోల వారసులు కథానాయికలుగా రాణిస్తున్న తరుణంలో, ఐశ్వర్య కూడా టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తుందని భావించినప్పటికీ, ఈ సినిమా ఫలితం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. స్వయంగా అర్జున్ ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించి భారీ రిస్క్ తీసుకోవడం గమనార్హం. నిజానికి ఐశ్వర్య కోలీవుడ్లో ఎంట్రీ…

