News

TELANGANA

కవిత కొత్త పార్టీ..! తెరవెనుక భారీ స్కెచ్..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తన తదుపరి రాజకీయ అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారా? అంటే తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. రాజకీయ పరిణామాలను గమనిస్తూనే సందర్భాను సారం గళం విప్పుతున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు తెరవెనుక రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆమె వేగంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల,…

TELANGANA

ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మికుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు…

National

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిషాక్…? బీజేపీలోకి రాఘవ్ చద్దా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో విలీనం కానున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది.   ఈరోజు ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా ఈ ప్రకటన…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు….

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఒకవైపు వీరి నివాసాల్లో ఈడీ సోదాలు జరుగుతుండగానే, మరోవైపు న్యాయస్థానంలో కూడా వారికి ఊరట లభించకపోవడం గమనార్హం.   మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరువర్గాల వాదనలు విన్న…

AP

జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. విజయసాయి సంచలన ప్రకటన..!

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జులై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.   రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా, త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు…

National

తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్… రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేఏ అవకాశం కల్పించారు. ఇవాళ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, పశ్చిమ బెంగాల్ లో 152 స్థానాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ…

AP

అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్..?

కలకలం రేపుతున్న అనంతపురంలో హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. అమాయకులను, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు…

AP

అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్..

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తూ వార్షిక కౌలును గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్ట భూములకు ఎకరాకు ఇచ్చే కౌలును రూ.40 వేలకు, జరీబు భూములకు రూ.60 వేలకు పెంచింది. అంతేకాకుండా, రాబోయే పదేళ్లపాటు ప్రతీ ఏటా మెట్ట భూములకు రూ.3 వేలు, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున కౌలు పెంచేందుకు కూడా ఆమోదం తెలిపింది.   గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి…

TELANGANA

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్..

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి.   సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను…

TELANGANA

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది.   1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. సమస్యల…