News

TELANGANA

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి..? కవిత షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు.   హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్…

TELANGANA

నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ విజ్ఞప్తి

కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌’లో భాగంగా తమకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామన్న రేవంత్.. మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు.   కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన…

AP

సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు..!రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించిన సిట్..

విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ కీలక విషయాలు బయటపెట్టంది. పోలీసు కస్టడీలో దెబ్బల కారణంగానే సాయికృష్ణ మరణించినట్టు తేల్చింది. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను బయటకు తెలియకుండా నిందితుడు నాగరాజు మాయం చేశాడని ప్రస్తావించింది.   సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక విషయాలు   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.…

TELANGANA

ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ప్రభుత్వం కోసం కష్టపడే ఉద్యోగుల భద్రతను కాపాడటం…

AP

పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్‌,…

National

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్: పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నిందితులు!

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.   రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్…

National

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు..!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ.. రాయితీలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 22ఏళ్ల పిటిషనర్.. 2025 నీట్ యూజీ పరీక్షలకు హాజరయ్యాడు. సదరు అభ్యర్థి జనరల్ కేటగిరీకి చెందిన వాడైనా ఆర్థికంగా వెనకబడిన తరగతి (ఈడబ్ల్యుఎస్)కి చెందిన వాడన్న సర్టిఫికెట్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు 18.9లక్షల నుంచి 25లక్షల వరకు ఉండటంతో…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ వంటి పార్టీలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది.   క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మిగతా పార్టీల నుండి వచ్చే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఆయనపై నమోదైన కొన్ని రాజకీయ కేసుల వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయాల్లో నమోదయ్యే ఇలాంటి కేసులు ప్రజాప్రతినిధులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి చట్టపరమైన చిక్కులు తొలిగిపోయినట్లయింది.…

AP

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..

దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్‌పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరి‌గా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్‌(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.   రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం   విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు…