News

National

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. !

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజాగా విడుదలైన వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. అదే సమయంలో దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అస్సాం రాష్ట్రంలో కాషాయ జెండా మరోసారి…

AP

అయ్యన్న అరాచకాలపై వైసీపీ సమరభేరి..

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు ఒక కొత్త ‘విష సంస్కృతిని’ ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు.   కేకే రాజు కామెంట్స్..   కేకే రాజు మాట్లాడుతూ.. కోర్టు తీర్పులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లిన తమపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రౌడీలు,…

AP

ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు..

ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీనితో వర్చువల్ విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తి ఈ విచారణలోకి వచ్చి వీటిని ప్లే చేసినట్లు వెల్లడైంది.   ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ కేసును విచారిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి.…

TELANGANA

కవితకు ‘టీఆర్ఎస్’ షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ..!

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కవితకు తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం షాకిచ్చారు. కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారడంతో బాలరంగం తన పార్టీని 2023లో రిజిస్టర్ చేయించారు. ఈ నేపథ్యంలో కవిత ‘టీఆర్ఎస్’ పార్టీని రిజిస్టర్ చేయవద్దని, అలా చేస్తే తన పార్టీకి నష్టం జరుగుతుందని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.   తన టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల…

AP

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష…

AP

పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు పార్టీ నాయకత్వం తెలిపింది. ఈ క్రమంలో, పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు, ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత జగన్… ఇంధన సంక్షోభాన్ని ‘ప్రభుత్వ ప్రేరేపిత కృత్రిమ కొరత’గా అభివర్ణించారు.   పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు,…

AP

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌..

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ‘డేటా సిటీ’గా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.   శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా…

National

ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ..

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత భయాలతో హైదరాబాద్ నగరంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద వరుస కడుతున్నారు. నిన్న, నేడు నగరవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపించింది. నిల్వలు తగ్గిపోవడం లేదా విపరీతమైన డిమాండ్ కారణంగా పలు పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేశారు.   పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ దొరకడం లేదు.…

TELANGANA

శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు..

ప్రజలను భాగస్వాములను చేస్తూ ఫ్యూచర్‌ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సీపీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.   కొంత మంది ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం విషయంలో…

National

ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని.. సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడబోతోందని ఆయన హెచ్చరించారు. “ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలను మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై…