News

AP

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్…!

జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.   రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్‌తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్…

AP

ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు.  …

National

ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్… ప్రపంచంలో ఇదే మొదటిసారి..!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో మైలురాయిని అధిగమించింది. ఏఐ సహాయంతో రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్, ప్రాథమిక దశ మానవ ప్రయోగాల్లో (క్లినికల్ ట్రయల్స్) విజయవంతమైంది. భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఇది ఒక కీలక పరిణామమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.   ‘pEVAC-PS’ పేరుతో పిలిచే ఈ నూతన వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 39 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని,…

TELANGANA

సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కేటీఆర్ ఒక లేఖ రాశారు.   సింగరేణిలోని పలు స్టాక్‌యార్డులలో బొగ్గు నిల్వల…

AP

‘ఓజీ’ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్..

గుంటూరు జిల్లాలో ఓ మహిళకు వైద్యులు వినూత్న పద్ధతిలో బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ, మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో ‘అవేక్ క్రేనియోటమీ’గా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ ఆసుప‌త్రిలో జరిగింది.   ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో…

AP

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

అనంతపురం:ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజమే అవసరమని రేజూనియా కంపెనీ పేర్కొంది. అనంతపురం II REZ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (రెస్సోనియా) జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఒక ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం మొదటగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డిస్పెన్సర్‌లో వేసింది. ఈ…

AP

తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం..! బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

దేశంలో రాజకీయాలు రూటు మార్చాయి. పార్టీని నమ్ముకున్న నేతలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మిగతా పార్టీల నేతలు వలస పోతున్నాయి. జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలదీ అదే దారి. మొన్నటివరకు బలంగా కనిపించిన బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, అధికారం పోయిన తర్వాత అంతర్గత కలహాలు మొదలయ్యాయి.   తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం   ఆ పార్టీలోని అసంతృప్తులు వ్యతిరేక జెండా ఎగురవేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆ పార్టీకి…

TELANGANA

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన..

కృష్ణమ్మ జలాలతో పాలమూరు జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ,కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత…

TELANGANA

తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.   గాంధీ ఆసుపత్రిలో.. ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్…

AP

తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు..

తిరుమల కల్తీ నెయ్యి కేసు పేరెత్తగానే వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటర్ కావడం కొత్త మలుపు తిరిగింది. బుధవారం ఏకంగా ఆరు రాష్ట్రాల్లోని 15 చోట్ల దాడులు చేసింది. దాదాపు రూ.60 లక్షలు సీజ్ చేసింది ఈడీ. దీని ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది.   తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు  …