News

TELANGANA

సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్..

బిఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి ఏమైనా చూసుకుందామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ తరహాలో పనిచేయాలంటూ బొగ్గు గని కార్మికులకు పిలుపునిచ్చారు. పని చేస్తే పెద్ద ఎత్తున చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సింగరేణి జిఎం ఆఫీస్‌ను తగలబెడితే డబ్బులు అవే వస్తాయి అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   శాంతి భద్రతలకు…

AP

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..!

అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్   తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే…

National

ఆధార్ కొత్త నిర్ణయం…!

టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషితో మమేకం అయ్యింది ఆధార్. వినియోగదారులు ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా ఆధార్ తీసుకెళ్లాల్సిందే లేకుంటే చివరకు బస్సులు సైతం ఎక్కనీయరు. తాజాగా ఆధార్‌కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యాప్‌ని క్లోజ్ చేసింది ప్రభుత్వం. అసలేం జరిగింది?   ఆధార్ కొత్త నిర్ణయం   టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే విషయంలో రకరకాల మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ విషయంలో మార్పులు చేర్పులు…

AP

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు. కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు.   ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.…

TELANGANA

పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు పోక్సో కేసుకు సంబంధించి మల్కాజ్‌గిరి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ప్రాసిక్యూషన్ పిటిషన్‌పై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.   విచారణ కోసం భగీరథ్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు మూడు రోజులకు మాత్రమే అనుమతించింది. దీంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని…

National

తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు…

TELANGANA

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ..!

సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.   కేంద్రం వైఖరిపై…

TELANGANA

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్..

పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ బీజేపీ ఇబ్బంది పెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ‘రైతు ఘోస – బీజేపీ భరోసా’ పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా ఆడుతుందన్నారు.   నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా…

AP

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం… ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు..

జనసేన పార్టీలో తన పుష్కర కాలం నాటి సహనానికి స్వస్తి పలుకుతున్నానని, ఇకపై పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీని ఒక సైనిక పటాలంలా ముందుకు నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి తొలి అడుగుగా, అంతర్గత…

AP

ఏపీ తీరానికి కొత్త రూపు..! సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక ‘విజన్ ప్లాన్’ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే, తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.   ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా…