News

TELANGANA

దిల్లీ వేదికగా తెలంగాణ మెట్రో డీల్ సఫలం..!

హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం.. ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు సీఎం వరుసగా రెండ్రోజులు స‌మావేశ‌మ‌య్యారు. తొలుత సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి మనోహర్ లార్ ఖట్టర్ నివాసంలో మరోమారు అంశంపై చర్చించారు.  …

TELANGANA

రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ సంచలన వాఖ్యలు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్ రెడ్డి కన్నంతా మెట్రో భూముల మీదే పడింది. ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ పక్కా ఉంటుంది” అని ఆరోపించారు.   మెట్రో సమీపంలో 280 ఎకరాల విలువైన భూములు…

TELANGANA

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ..

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ సముదాయంలోని మహాకాళి అమ్మవారి ఆలయంలోకి చొరబడి, వెండి కిరీటంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో భక్తులు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.   మంగళవారం ఉదయం నిత్య పూజల కోసం వచ్చిన అర్చకులు ఆలయ ద్వారాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణంలోని పై…

AP

సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా కీలక వ్యాఖ్యలు..

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం సాయికృష్ణ అదృశ్యం కేసును మరింత సంచలనాత్మకం చేసింది. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక సాక్ష్యాలైన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది” అని అన్నారు.   సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై…

AP

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..! ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం..

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.   భారీగా పారిశ్రామిక పెట్టుబడులు   రాష్ట్రంలో…

National

అంతా అయిపోయింది… అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్..

తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.   శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, డీఎంకే పార్టీ పేరుతో అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతో పాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ…

TELANGANA

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో పాటు…

National

భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం..

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం 428.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.   అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఈ ప్రతిపాదనలను…

TELANGANA

రేపు పులివెందులకు వెళుతున్న జగన్.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు.   రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు…

TELANGANA

డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.   డీటీఓ వెంకన్న మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదనే బలమైన సందేహాన్ని హరీశ్‌రావు లేవనెత్తారు. “రాష్ట్రంలో…