స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్..!
ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి తదితర…

