భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం.. నేడే ‘విక్రమ్-1’ ప్రయోగం..!
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, దేశంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఈ చరిత్రాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికైంది. ‘ఆగమన్’ (రాక) అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ మిషన్ను నేడు ఉదయం 11:30 గంటలకు ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి ఈ ప్రయోగం జరగనుంది. విక్రమ్-1 రాకెట్…

