News

TELANGANA

సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!

హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా…

TELANGANA

తెలంగాణలో బీజేపీ సరికొత్త ప్లాన్.. !

తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. ఇకపై వరుస కార్యక్రమాలతో యాక్టివ్ మోడ్ లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు విరామం లేకుండా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం సులువయ్యేలా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణను…

National

టీవీ చానళ్లకు భారీ ఎదురుదెబ్బ…! ఇకపై గంటకు 12 నిమిషాల యాడ్స్..

టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల సమయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విధించిన పరిమితిని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయరాదన్న నిబంధన రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, ప్రాంతీయ ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.   జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై…

AP

గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ..! ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్..

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, దానిని సమర్థంగా గ్రిడ్‌కు అనుసంధానించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా, సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3’ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.   రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి…

APTELANGANA

హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

హైదరాబాద్ ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నించిన ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డీసీపీ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. నకిలీ పత్రాలతో బ్రహ్మనాయుడు, మరికొందరు కలిసి గండిపేటలో భూమి కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసిందని అన్నారు.   గండిపేట సర్వే నెంబర్ 18లో భూమిని కబ్జా చేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని…

National

అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సూచన..

అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కెన్-బెట్వా ప్రాజెక్టు నమూనాను ఉదహరించారు.   భారతదేశంలో మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు కెన్-బెట్వా ప్రాజెక్టు. మధ్యప్రదేశ్‌లోని కెన్ నదిలో ఉన్న అదనపు జలాలను కాలువ ద్వారా…

AP

ఏపీ మద్యం కుంభకోణం కేసు… ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈడీ సుమారు ఏడున్నర గంటల పాటు విచారించింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరి పేర్లను అధికారులకు చెప్పలేదని వెల్లడించారు.   మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ కెసిరెడ్డికి మాత్రమే తెలుసని చెప్పానని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్…

TELANGANA

సరికొత్త రికార్డు..! ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే .?

హైదరాబాద్ మహా నగరంలో మరోమారు భూములు.. రికార్డు ధర పలికాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా.. ఎకరం ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం నిర్వహించగా ఈ రికార్డు ధర దక్కింది. 2025 డిసెంబర్ లో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. రూ.177 కోట్లు ధర పలికింది. అప్పట్లో 7 ఎకరాలకు గానూ టీజీఐఐసీకి రూ.1357.59 కోట్ల ఆదాయం…

TELANGANA

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ .!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు.   రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ స్పూర్తి   కులమతాలకు, ప్రాంతాలకు,…

AP

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు..

టీడీపీ మహానాడు నిర్వహణపై మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నిర్వహించిన మహానాడును ఆమె ఒక ‘హైబ్రిడ్ మహానాడు’ గా అభివర్ణిస్తూ, ఇది ముమ్మాటికీ అట్టర్‌ఫ్లాప్ షో అని కొట్టిపారేశారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఒకవైపు నాయకులు స్పీచ్‌లు దంచుతుంటే, మరోవైపు జనాన్ని ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డాన్సులు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.   ఈ మహానాడు వేదికలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్…