News

National

ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం సాయంత్రం ఈ కీలక సమావేశం మొదలైనట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఖలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి.   ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, లెబనాన్‌లో పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలు, స్తంభింపజేసిన తమ ఆస్తులను…

TELANGANA

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   అంగన్వాడీ టీచర్ల…

AP

అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి నాలుగోసారి మోసపోయారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు.   రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, కేవలం అమరావతిపైనే లక్షల కోట్లు కుమ్మరించడం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అమరావతి నగరం…

TELANGANA

అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. శనివారం నాడు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.   ఈ ఆపరేషన్‌లో భాగంగా, భూకబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం.ఏ.…

AP

మీడియా రంగంలోకి ఎంట్రీ.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన..

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబ్ పేల్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ను లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ మీడియా.. బ్యాలెన్స్‌డ్, అన్‌బయాస్డ్, ట్రూత్‌కు కట్టుబడి ఉంటుందన్నారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, పేదల సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ డిజిటల్ మీడియా సక్సెస్…

AP

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి….

  అసమానతలు, అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు ఒక్కడే నిలబడి “విద్యే శక్తి ” అని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప యోధుడు పూలే…. వైయస్సార్ విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర యాదవ్ కదిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైయస్సార్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు సాయి నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200 వ జయంతిని పురస్కరించుకొని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రయాదవ్,…

National

అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం.. న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా..

అలహాబాద్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలుస్తోంది. అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.   అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం   2025 మార్చి 14న ఢిల్లీలో జస్టిస్‌ యశ్వంత్‌వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన ఇంటి నుంచి…

TELANGANA

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ మాసీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. తన పాత మిత్రుడిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే పంపాడు.. మీతో కలిసి పని చేయమని” అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి తన కుమారులు..…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డి పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సిద్దిపేట వేదికగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయిందని ఆయన ఆరోపించారు.   గతంలో పీసీసీ నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రులు నడుచుకునే…

AP

ఏపీ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ రోజా..

ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే హాట్ హాట్‌గా మొదలయ్యాయి. పలు అంశాలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎంట్రీ ఇచ్చారు. సూటిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను టార్గెట్ చేశారు. మీరు వారికి దత్తపుత్రిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలేం జరుగుతోంది.   ఏపీ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ రోజా   ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అభివృద్ధి విషయం కాసేపు పక్కన…