News

National

కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పైలెట్ మృతి..

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం.. ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక ఫైటర్ జెట్‌ విమానం.. రతన్‌గఢ్ ప్రాంతంలోని ఓ పొలాల్లోకి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పైలెట్‌‌కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఎయిర్ ఫోర్స్‌ అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   ప్రమాదం వివరాలు సాధారణ శిక్షణ…

TELANGANA

హైదరాబాద్ లో మరో డ్రగ్ ముఠా గుట్టు రట్టు.. లేడీ హైహిల్స్ లో డ్రగ్స్ పెట్టుకుని సరఫరా..

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ప్రకంపనలు.. వైజాగ్‌, హైదరాబాద్‌లో డాక్టర్లే డ్రగ్స్ కొంటూ ఇంతలా దొరుకుతున్నారేంటి? ఎందరికో ఆరోగ్య పాఠాలు చెప్పే డాక్టర్లే ఇలా డ్రగ్స్ వాడ్డమేంటి? అటు వైజాగ్ ఇటు హైదరాబాద్‌లోనూ సేమ్ సీన్.. ఈ మూడు కేసుల్లోనూ డాక్టర్లే కామన్ పాయింట్. గతంలో పట్టుబడ్డ డాక్టర్లు ఎవరు? ఎలాంటి వారు? డాక్టర్లు ఎందుకిలా డ్రగ్స్ కి బానిసలవుతున్నారు? డాక్టర్లే ప్రమాదకర మాదక ద్రవ్యాలు వాడ్డమేంటి?తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఈగల్ టీం…

TELANGANA

ఆ తప్పుకు కేసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి: సీఎం రేవంత్..

కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కో తప్పుకు ఒక్కో కొరడా దెబ్బ అంటే.. కేసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాలని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లను తరలించుకుపోతే.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోతాయి.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు…

AP

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం..

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, నిబంధనలు పాటిస్తూ చేసే చట్టబద్ధమైన బియ్యం ఎగుమతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.   సచివాలయంలోని తన ఛాంబర్‌లో…

AP

మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి.. సీరియస్ వార్నింగ్..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సరైన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వ పాలన ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినేట్ సమావేశంలో చంద్రబాబు.. మంత్రుల పట్ల ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   పనితీరుపై అసంతృప్తి నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించినా, ఈ విషయాన్ని ప్రజలకు తగిన స్థాయిలో తెలియజేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ నిర్వహణలో…

AP

ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన హస్తిన వెళ్తున్నారు.   వివరాల్లోకి వెళితే, ఈ నెల 14వ తేదీన, అంటే వచ్చే సోమవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి శాఖల మంత్రులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు.  …

National

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం..

బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని, అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు.   విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు లాంఛనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్…

Uncategorized

తెలంగాణలో మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు..! అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు ..

తెలంగాణలో మహిళలపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళలు ఏకంగా చట్ట సభల్లో కూర్చొనే అవకాశం వస్తున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు వస్తాయని తెలిపారు. మరో పది కలిపి 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పకనే చెప్పారు.   రాజేంద్రనగర్‌‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో సోమవారం వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు ముఖ్యమంత్రి. అనంతరం ఏర్పాటు…

National

ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు.. ఐదుగురికి హైకోర్టు నోటీసులు..!

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జా స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి.. ఈమేరకు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ…

AP

2027 నాటికి పోలవరం పూర్తవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి అంత సమాధానం దొరకబోతోంది. మరో రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేయాలని సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో పోలవరం పనులు ఎంతవరకొచ్చాయ్? ఏయే పనులు.. ఏ దశలో ఉన్నాయ్? ఓవరాల్‌గా.. పోలవరం ప్రోగ్రెస్ ఏంటి? అనే దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం…