News

National

ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం..

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సవాళ్లను, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాల వైఫల్యాలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.   గ్రీక్ సిటీ టైమ్స్ తన కథనంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సూచీలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా…

TELANGANA

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.   మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి…

AP

అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై చారిత్రక తీర్మానం చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే, ప్రతిపక్ష నేత జగన్ బెంగళూరులో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అంశం…

AP

అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ…-: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని… అది అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అద్భుతం, అజరామరమని అభివర్ణించారు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని పునరుద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించారు.   అమరావతికి చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన…

TELANGANA

మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు..?: కేటీఆర్ నిలదీత..

మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్టవిరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.   తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని…

AP

అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు అగ్నికి ఆహుతి..

  ఓబులవారిపల్లి మండలంలోని పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో 5 ఎకరాల అరటి తోట దగ్ధమైంది. వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతులకు చెందిన 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. డ్రిప్ పైపులు, ఇతర పరికరాలు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…

TELANGANA

ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే.   మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను…

AP

రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి యత్నించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.     పూర్తి వివరాల్లోకి వెళితే… ఆకివీడులోని స్థానిక రామాలయ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని స్థానికుల ఆహ్వానం మేరకు రఘురామరాజు ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.…

National

సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..! తీవ్ర ఉద్రిక్తతలపై చర్చ..

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత, నిత్యావసరాల సరఫరా, రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో… చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.   అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు…

TELANGANA

కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గోవాలోని పోండా ఉప ఎన్నిక క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన పేరు ప్రకటించారు.   పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.   కేరళ,…