News

National

‘ఉగ్రం’ రైఫిల్‌కు కేంద్రం పచ్చజెండా..!

రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ద్విప డిఫెన్స్’ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62×51 ఎంఎం ‘ఉగ్రం’ అసాల్ట్ రైఫిల్, భారత సైన్యం మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్వహించిన కఠిన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. ఈ ఫలితంతో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్) అమ్ములపొదిలోకి ఈ స్వదేశీ ఆయుధం చేరేందుకు మార్గం సుగమమైంది.   రక్షణ పరిశోధన మరియు…

AP

యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు..!

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జులై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు…

AP

నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు.. పవన్ కల్యాణ్ పై పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు..!

ఎపీలో ఒకప్పుడు సుగాలి ప్రీతి మరణం కేసు సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం మల్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతున్నారు.   ఎన్నికలకు ముందు.. ఈ కేసుకు సంభందించి ప్రస్థుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‌పై కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్…

TELANGANA

టూరిజంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష..!

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటిలో సీఎస్ కె. రామకృష్ణారావుతో పాటు పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…

TELANGANA

జీహెచ్‌ఎంసీ చట్టం రద్దు.. సరికొత్త పాలనపై ముసాయిదా విడుదల..!

శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగర పాలనను ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 1955నాటి జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి పలకనుంది. ప్రస్తుత మెట్రోపాలిటన్ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026 ముసాయిదాను ఆదివారం విడుదల చేసింది. 1955లో 15 లక్షల జనాభా ఉన్నప్పటి నిబంధనలు నేటి 1.3 కోట్ల జనాభా కలిగిన మెట్రో నగరానికి సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమీకృత పాలనా…

TELANGANA

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు..!

దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని, కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో శనివారం సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్…

TELANGANA

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ప్రజా కళాకారుడు గద్దరన్నకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.   ఆడబిడ్డల ఫోన్లు వినేవాడు…

AP

కుప్పంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నాయంటున్నారు… వెలికితీస్తాం: సీఎం చంద్రబాబు..

తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, దేశానికే ఆదర్శంగా నిలిపే ‘స్వర్ణ కుప్పం’ నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా… రూ.118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.   కుప్పంలోనూ బంగారు గనులు…

AP

ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం… ప్రధాని మోదీకి బెదిరింపులు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఆన్‌లైన్‌లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్‌పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ పర్యటనను, ప్రవాస భారతీయులతో జరగనున్న భారీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు వెలువడింది.   వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.…

AP

61 ఏళ్ల భూ సమస్యకు తెరదించిన సీఎం చంద్రబాబు..! రైతుల కళ్లలో ఆనందం..

ఆరు దశాబ్దాలుగా తమ బతుకుల్లో అలుముకున్న అనిశ్చితికి తెరపడింది. మూడు తరాలుగా సాగుచేస్తున్న భూమికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తమదన్న హక్కు పత్రాలు చేతికి అందడంతో ఆ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. శనివారం కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ…