News

National

బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆమె తోసిపుచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, టీఎంసీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.   ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, 2021, 2024లోనూ…

AP

వాట్సాప్ వేదికగా వైద్య సేవలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు..

ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా… ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్‌ నంబర్‌కు “హాయ్” లేదా “Hi” అని మెసేజ్ పంపి.. తదనంతరం వచ్చే మెనూలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్‌ను ఎంచుకుని ఈ సేవలను…

AP

పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం..

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ…

TELANGANA

రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించారు.. ధర్మపురి అరవింద్ కిలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితతో పార్టీని పెట్టించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’ ప్రభావం కేసీఆర్, కేటీఆర్ పైనే ఉంటుందని అన్నారు. ఇక ఏ పార్టీపై ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఆమెకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు.   రానున్న…

TELANGANA

ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కీలకమైన శుభవార్తలు చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో శనివారం జరిగిన సమావేశంలో వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయాలతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు, మే 5న తలపెట్టిన ధర్నాతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఉద్యోగుల సేవలను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.   జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు ఉద్యోగులందరికీ…

National

డబ్బుతో కొనేశారు… ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. అవన్నీ బూటకమని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ (బీజేపీ) డబ్బులు ఇచ్చి, ఒత్తిడి చేసి మీడియా సంస్థల ద్వారా వాటిని ప్రసారం చేయించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.   స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోకుండా నిరోధించడం, మే 4న…

TELANGANA

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు.   ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని…

AP

ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1,192.16 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో సింహభాగం, అంటే రూ. 1,123.15 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల పూడికతీత వంటి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే పనులకు ఊతం లభిస్తుంది. మిగిలిన రూ. 69.01 కోట్లు అడ్మిన్ కాంపోనెంట్ కోసం వినియోగించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ…

AP

ఏపీ క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.   క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే…   1.…

TELANGANA

బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చి హ్యాక్ చేస్తున్నారని తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కేటీఆర్, హరీశ్ రావులు ప్రజల ముందు పెట్టారని అన్నారు.   తమ…