News

TELANGANA

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.   ఆసుపత్రికి చేరుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. శకుంతల గారి గుండెకు స్టంట్ వేసి, ప్రస్తుతం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  …

TELANGANA

బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కిందిస్థాయి నుంచి పైకి వచ్చారని, కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుపై ముఖ్యమంత్రి స్పందించారు. బండి భగీరథ్ పారిపోవడం తప్పని స్పష్టం చేశారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.   అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని,…

AP

ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు..

ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA – ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర…

AP

ఏపీ అంటే ‘అడ్వాన్స్‌డ్ ప్రదేశ్’..! రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ రంగ పటంలో అగ్రస్థానంలో నిలుపుతూ, రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.   ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, యావత్ భారత రక్షణ రంగ స్వావలంబన ప్రయాణంలో…

National

అలర్ట్… ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్..! కారణం అదేనా..?

దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన 12.4 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆలిండియా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయంటూ కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.   అనియంత్రిత ఆన్‌లైన్ అమ్మకాలు,…

TELANGANA

బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం..!

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక మైనరా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో.. దానిపై రీ-వెరిఫికేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మధ్యంతర బెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.   మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చన్న…

National

రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత..! న్యాయవాదిగా న్యాయస్థానానికి మాజీ సీఎం..

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూటు మార్చారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఆమె బయటకు వచ్చారు. నల్లటి న్యాయవాది గౌను ధరించి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎన్నికల సందర్భంగా జరిగతిన హింసాకాండ ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కలకత్తా హైకోర్టుకు హాజరయ్యారు.   రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత   బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కత…

TELANGANA

తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ..!

తెలంగాణలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలపడం, రోజుల తరబడి వదిలేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వాహనదారుల జేబుకు చిల్లు పడటమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాన్ని…

National

ఉత్తర్‌ప్రదేశ్‌లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లో నిన్న‌ సాయంత్రం సంభవించిన పెను తుపాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం, ధూళి, బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ విలయానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రకృతి ప్రకోపానికి వందలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.   అధికారిక లెక్కల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 16 మంది మరణించారు. భదోహీలో 15 మంది,…

AP

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.   ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల…