News

National

దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్..

దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు.   దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు…

AP

ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.   ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించేందుకు కాలువలు తెరిచే తేదీలు, నీటి పంపిణీ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. మే 31వ తేదీ…

TELANGANA

సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు అతనిని అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. ఇటీవల పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన లాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని కాంగ్రెస్ నాయకులు డీజీపీకి లేఖ ఇచ్చారు.   బాల్క సుమన్ ఏమన్నారు?   బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన…

TELANGANA

నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్..

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల జడివాన కురిపించారు.   ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే.. ‘మేమేమన్నా దీవానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా’ అని ఒకాయన మాట్లాడారు. మరి…

AP

ఏపీ ‘మెగా డీఎస్సీ’ వివాదాలపై తేల్చి చెప్పిన విద్యాశాఖ..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నిర్వహణపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ నియామక ప్రక్రియ అంతా పక్కా ప్లానింగ్‌తో, అత్యంత పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మెరిట్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు.   ముఖ్యమంత్రి తొలి సంతకం.. భారీ నోటిఫికేషన్   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.…

TELANGANA

సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!

హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా…

TELANGANA

తెలంగాణలో బీజేపీ సరికొత్త ప్లాన్.. !

తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. ఇకపై వరుస కార్యక్రమాలతో యాక్టివ్ మోడ్ లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు విరామం లేకుండా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం సులువయ్యేలా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణను…

National

టీవీ చానళ్లకు భారీ ఎదురుదెబ్బ…! ఇకపై గంటకు 12 నిమిషాల యాడ్స్..

టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల సమయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విధించిన పరిమితిని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయరాదన్న నిబంధన రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, ప్రాంతీయ ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.   జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై…

AP

గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ..! ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్..

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, దానిని సమర్థంగా గ్రిడ్‌కు అనుసంధానించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా, సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3’ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.   రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి…

APTELANGANA

హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

హైదరాబాద్ ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నించిన ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డీసీపీ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. నకిలీ పత్రాలతో బ్రహ్మనాయుడు, మరికొందరు కలిసి గండిపేటలో భూమి కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసిందని అన్నారు.   గండిపేట సర్వే నెంబర్ 18లో భూమిని కబ్జా చేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని…