News

National

భారత రైల్వేలో నవశకం..! పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు..

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 17న ప్రారంభించనున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ అడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ…

TELANGANA

కాంగ్రెస్ స్కామ్‌ల సర్కార్..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.   హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం…

AP

‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరించిన వైఎస్ జగన్..

వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.   ఈ యాప్‌ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది. కార్యకర్తలు ఈ యాప్‌ను…

TELANGANA

గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు..!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.   ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం…

AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక అప్ డేట్..

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) కార్యకలాపాలు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు మధ్య నాటికి విమాన సర్వీసులు మొదలవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.   విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన తేదీ ఖరారైన వెంటనే,…

TELANGANA

కవిత పార్టీ వివాదంపై కేటీఆర్ కౌంటర్..!

దిల్లీలో పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు వివాదంపై ఆయన స్పందించారు. ‘టీఆర్ఎస్ పేరు పెట్టడంపై కొందరు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మా పార్టీ పేరును వాడుకోవాలని చూస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. బంధం కంటే పార్టీనే ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.   మరోవైపు ఫార్మూలా రేస్ కేసుకు గురించి కూడా కేటీఆర్…

TELANGANA

వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది” అని విద్యార్థులకు ఉద్బోధించారు.   విద్యార్థినులతో ముఖ్యమంత్రి.. వనపర్తి…

AP

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.   విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి   చిన్నారులపై…

AP

అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్… సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి…

National

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్..!

ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ దిగ్గజం ‘స్విగ్గీ’ వినియోగదారుల కోసం మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ద్వారా ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. తొలిదశలో భాగంగా బుధవారం బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు.   వినియోగదారులు ఇకపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్…