News

AP

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం..!

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.   బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

TELANGANA

కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు..! దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్..!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు 117 కాదు కదా.. 7 కూడా రావు అని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదన్న విషయం నిజమైతే.. ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనపై అంత నమ్మకం ఉంటే…

TELANGANA

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

క్రైం రివ్యూల్లో ఐపీఎస్ అధికారులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నిందితుడి పూర్వపరాలు, అతడి వివరాలు తెలుసుకొని, కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని అడగాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసులకు చేతకాకపోతే ప్రైవేట్ కేసు పెడతా.. తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్ గా మారిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ వాస్తవం అన్నారు. రాత్రి 11 నుంచి 1 గంట…

AP

ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్..! ఇకపై ఆ పోస్టులు పెడితే..

రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ ఫోటోలు, అవమానించే భాష, అనుమానించే కథనాలు, అసభ్యకరమైన మాటలు సోషల్‌మీడియా ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. దేవుళ్లను, మతాలను అవమానించి సమాజంలో విద్వేషం మంటల్ని పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు బాధ్యత, భయం ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో, మార్ఫింగ్ వీడియోలతో ఏదైనా చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, చివరికి న్యాయమూర్తులను కూడా వదలిపెట్టడం లేదు. టార్గెట్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తున్నారు. స్పెషల్ వార్ ఏర్పాటు ఒక అకౌంట్‌ను…

National

బెంచ్‌పైకి కాగితాలు విసిరి.. సుప్రీంకోర్టులో పిటిషనర్ వీరంగం..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ హద్దులు మీరు ప్రవర్తించాడు. న్యాయమూర్తులపై దూషణలకు దిగడమే కాకుండా, కేసు పత్రాలను వారి వైపు విసిరికొట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా అధికారులు అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు పంపించారు.   అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్,…

AP

అమరావతికి ‘శాంసంగ్ సిటీ’.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు..

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్‌) తయారీలో పేరొందిన డెల్టా ఎక్స్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఎత్తున తయారీ, పరిశోధన యూనిట్లను స్థాపించాలని ఆయన ఈ కంపెనీలను ఆహ్వానించారు.  …

TELANGANA

2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు: సీఎం రేవంత్‌..

2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 25కు పెరుగుతాయని అన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాము ముందే చెప్పి చేసి చూపించామని గుర్తు చేశారు. ఖమ్మం…

AP

చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అనేక అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతోందని ఆయన స్పష్టం చేశారు.  …

TELANGANA

‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో చూపిస్తా: కవిత..

తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే ‘అన్న రాజ్యం’ కాదు.. ‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతును నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని… త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. ‘పాంచజన్యం’ అనే నినాదంతో మార్పు కోసం ముందుకు…