News

TELANGANA

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం..

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు   హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని…

TELANGANA

ప్రజల్లోకి గులాబీ అధినేత కేసీఆర్..!

గులాబీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాఆశీర్వాద సభ పేరుతో మళ్లీ ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటివరకు మౌనంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరిపై మాటల తూటాలు సందిస్తారనే ఆసక్తి ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.   ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలు కానుంది. కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాలపై తనదైనశైలీలో విమర్శనాస్త్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు లేవు. తప్పులను…

National

లక్షల కోట్ల అప్పుతో రాజధానా..? అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు..

ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ ప్రతిపాదించిన అమరావతి నమూనాతో పాటు వైసీపీ ప్రస్తావించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ, ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు.   ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయి రెడ్డి విశ్లేషిస్తూ.. “1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో…

AP

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత..

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.   రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి… మధ్యాహ్నం ఒంటిగంటకు కోయంబత్తూరులో నిర్వహించే…

National

మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు..!

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాతే రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఈ అడ్డంకులను అధిగమించేందుకు కేంద్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.   ఈ బిల్లు అమలుకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించేందుకు, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో మరోసారి విస్తృత స్థాయి చర్చలు జరపాలని…

AP

జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు..? షర్మిల కీలక వ్యాఖ్యలు..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బట్టబయలైందని, విపక్షం ముసుగులో ఉన్నది ఆర్ఎస్ఎస్ పక్షమేనని తేలిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. “దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.   తన ఐదేళ్ల…

APCINEMATELANGANA

పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.   వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు,…

TELANGANA

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం…

National

మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే.. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఫైర్..!

భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్’ సవరణను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు “గర్భంలోనే చంపేశాయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడంపై శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా…

TELANGANA

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాటన్ మిల్లు గిడ్డంగిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు ఎగిసిపడటంతో గోదాములో నిల్వ ఉన్న సరుకు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మ్యాట్రెస్ కంపెనీకి కూడా వ్యాపించాయి.   స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…