News

NationalTechnology

ఆ వీడియోలు పోస్ట్ చేస్తే 90 రోజుల సస్పెన్షన్.. ‘ఎక్స్’ కొత్త నిబంధన..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.   ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు…

TELANGANA

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ..

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

AP

26 రకాల వివరాలతో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఎఫ్ బీఎంఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అసెంబ్లీలోని తన చాంబర్‌లో అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్, రైస్ కార్డ్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల వివరాలు వంటి మొత్తం 26 రకాల అంశాలతో పకడ్బందీగా డేటాబేస్ రూపొందించాలని…

National

ఇరాన్‌పై యుద్ధంలో ఏఐ ఆయుధాలు రంగంలోకి దించిన అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం నాడు ధృవీకరించారు. పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏఐ సామర్థ్యాలున్న డ్రోన్లు, ఇతర వ్యవస్థలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వాటి పూర్తి వివరాలను వెల్లడించలేనని స్పష్టం చేశారు.  …

National

ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలన్న రష్యా, చైనా… వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం నాడు పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం…

AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి రథానికి నూతన గొడుగులు, వస్త్రాల సమర్పణ

శ్రీమత్ ఖాధ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానం, కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మోత్సవాలు -2026 సం!! సందర్భముగా బ్రహ్మ రధోత్సవము (శ్రీ స్వామి వారి తేరు) నకు కావలసిన నూతన గొడుగులు (చిన్నవి-2, పెద్దవి-2), ధ్వజలు, శంకు చక్రాలు, చిత్రవర్ణ లిఖిత తేరు నూతన వస్త్రములు మొదలగునవి కడపల శ్రీకాంత్ రెడ్డి S/o,శివ గంగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, పెద్దకదపవారి పల్లి, తనకల్లు మరియు నాగేళ్ళ లక్ష్మి నరసింహా ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు,…

AP

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

తనకల్లు మండలం బండ్రేవారిపల్లికి చెందిన ఎద్దుల హర్షవర్ధన్ రెడ్డి బుధవారం తనకల్లు మండల కేంద్రంలో వారి స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వైజాగ్ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వైజాగ్ నుండి రైలుకు వచ్చి తనకల్లు లో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం: రూ. 2.22 లక్షల పింఛన్ సొమ్ము స్వాహా

శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పింఛన్ సొమ్ము ను స్వాహా 2.22 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి. ఇరువురి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎంపీడీవో పార్థసారథి శ్రీ సత్య సాయి…

TELANGANA

రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమికి హైడ్రా రక్షణ..

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న గంధంగూడ ప్రాంతంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. సుమారు రూ.600 కోట్ల విలువ చేసే 6.30 ఎకరాల స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 86/పి లో ఉన్న 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని సీవరేజ్…

TELANGANA

ప్రపంచానికి ఇరాన్ చమురు సెగ.. హార్ముజ్ జలసంధి మూసివేతm.!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది.   ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్‌కు సీనియర్ సలహాదారు అయిన బ్రిగేడియర్…