News

TELANGANA

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.   రూ. 13 వేల కోట్లు.. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు.   నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆపై పార్టీ ఆఫీసు…

AP

సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్..!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.   తల్లి విజయలక్షి ఎమోషనల్.. సాయి కృష్ణ మృతి…

National

ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు..

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఓ అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని భారత సైన్యం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య ఏ రంగంలోనూ, ఏ స్థాయిలోనూ కరచాలనాలు లేకపోవడం తెలిసిందే.   పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు…

AP

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం..

భారతదేశ బంగారు ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా అవతరించనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది.   జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌’ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్…

AP

గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే మృతుని కుటుంభ సభ్యులను ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం వైఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ వారి కుటుంభ సభ్యులను పరామర్షిచారు. అనంతరం వారికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు.   మే నెల 9వ తేదీన.. కూటమి ప్రభుత్వం పై తీత్రస్థాయిలో మండిపడ్డారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని…

TELANGANA

నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత సంచలన నిజాలు…

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుని, సొంతంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అనే పార్టీ మనుగడలో ఉందంటే దానికి కారణం తానేనని స్పష్టం చేశారు.   తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం…

TELANGANA

రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.   “వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 30వ తేదీన మధిరలో నిర్వహించబోయే ‘రైతు సమ్మేళనం’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను నేరుగా విడుదల…

National

విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి..!

భారత వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన మైలురాయి నమోదైంది. విత్తన నాణ్యతను మెరుగుపరిచి, పంట దిగుబడిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ‘స్మార్ట్ సీడ్ కోటింగ్’ సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవిష్కరించింది. ఈ బయోపాలిమర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో 30 శాతం వరకు అదనపు దిగుబడి సాధించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఈ నూతన విధానాన్ని…

AP

ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్..

బెంగళూరులో ఎదురవుతున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలుగా మలుచుకోవడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో చొరవ చూపారు. భూమి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఓ ప్రముఖ స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వెంటనే స్పందించిన లోకేశ్.. ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించారు.   బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ (Pixxel) అనే స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్, తమ శాటిలైట్ తయారీ కేంద్రం కోసం నగరం శివార్లలో…