News

National

త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఎన్‌సీఈఆర్టీలో త్రిభాషా సూత్రానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు నోటీసులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.   ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు…

TELANGANA

గాంధీ భవన్‌లో ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ హజ్రీ మధ్య ఘర్షణ..

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ ఒకరినొకరు కొట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం సందర్భంగా ఈ రసాభాస జరిగింది. మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ కళ్ల ముందే చొక్కాలు పట్టుకొని ఫిరోజ్, ఉస్మాన్ ఘర్షణకు దిగారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఈ వివాదం చెలరేగింది.   తొలుత ఉస్మాన్‌ అల్‌ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ ఒక్కసారిగా కిందపడ్డారు. సీనియర్…

TELANGANA

ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు..

తెలంగాణను డిజిటల్‌ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   కేంద్రంతో కీలక చర్చలు   అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద రాష్ట్రంలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు ఒప్పందాన్ని…

TELANGANA

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా..? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా? దాదాపు పుష్కరకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన, మనసులోని బాధ, ఆలోచనను బయట పెట్టారా? ఈ క్రమంలో కాపు నేతలకు వార్నింగ్ ఇచ్చారా? ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా వైసీపీకి తగిలినట్టేనా? అవుననే అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. అసలేం జరిగింది?   కాపు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్   రాజమహేంద్రవరంలో మంగళవారం పార్టీ కార్యకర్తలకు కోసం ఏర్పాటు…

AP

టీడీపీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన..

మహానాడు సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటన చేశారు.   టీడీపీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన   చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ఆ విధంగా…

TELANGANA

సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్..

బిఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి ఏమైనా చూసుకుందామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ తరహాలో పనిచేయాలంటూ బొగ్గు గని కార్మికులకు పిలుపునిచ్చారు. పని చేస్తే పెద్ద ఎత్తున చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సింగరేణి జిఎం ఆఫీస్‌ను తగలబెడితే డబ్బులు అవే వస్తాయి అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   శాంతి భద్రతలకు…

AP

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..!

అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్   తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే…

National

ఆధార్ కొత్త నిర్ణయం…!

టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషితో మమేకం అయ్యింది ఆధార్. వినియోగదారులు ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా ఆధార్ తీసుకెళ్లాల్సిందే లేకుంటే చివరకు బస్సులు సైతం ఎక్కనీయరు. తాజాగా ఆధార్‌కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యాప్‌ని క్లోజ్ చేసింది ప్రభుత్వం. అసలేం జరిగింది?   ఆధార్ కొత్త నిర్ణయం   టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే విషయంలో రకరకాల మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ విషయంలో మార్పులు చేర్పులు…

AP

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు. కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు.   ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.…

TELANGANA

పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు పోక్సో కేసుకు సంబంధించి మల్కాజ్‌గిరి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ప్రాసిక్యూషన్ పిటిషన్‌పై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.   విచారణ కోసం భగీరథ్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు మూడు రోజులకు మాత్రమే అనుమతించింది. దీంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని…