News

TELANGANA

కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్..

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. రెండు, మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షం ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల…

National

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్..

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.   ఢిల్లీ సమీపంలో.. ఈ…

TELANGANA

ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..

గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి తక్షణ…

AP

రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్…

AP

ఇక‌ ప్రతి నెల 4వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని…

AP

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్‌పై హర్షం: కదిరిలో క్రికెటర్ల కేక్ కటింగ్ వేడుకలు

RDT FCRA రెన్యూవల్ పట్ల క్రికెటర్ల హర్షం ఇటీవల ఉమ్మడి జిల్లాలకు వరం లాంటి ఆర్డీటీ సంస్థకు ( FCRA ) లైసెన్స్ రెన్యూవల్ అవడం తో ప్రతి ఒక్కరు హర్షించారు.అందులో భాగంగా ఈరోజు ప్రభుత్య డిగ్రీ కళాశాల మైదానం నందు గల క్రికెట్ నెట్స్ నందు కదిరి వర్ధమాన, పూర్వ క్రికెటర్లు, క్రికెట్ శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ కదిరి రీజియన్ RD రఘురామ్, నల్లచెరువు ఏరియా ATL…

AP

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికేనా..?

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మరోసారి ఏపీ ప్రజలు రాజధాని లేకుండా ఇబ్బందులు పడరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిపి ఆ బిల్లును సభలోని సభ్యులు ఆమోదించారు. అయితే, అమరావతి బిల్లు…

AP

రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం.   నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,00,875 టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది…

TELANGANA

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.  …

National

నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన..

నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయుధాలు పట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని సమర్థించేవాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు.   సమాజంలో అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు పట్టడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని…