News

AP

ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును…

TELANGANA

ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..

తెలంగాణాను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు.   కేవలం 150 రోజుల రికార్డు సమయంలో ఫ్యూచర్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి…

National

దేశాన్ని కాంగ్రెస్‌ అగాధంలోకి నెట్టింది: మోదీ.

భారత చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును అధిగమించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డీయే కూటమి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఈ ఘనత తన వ్యక్తిగత విజయమేమీ కాదని, ఎన్‌డీయే కుటుంబం సాధించిన ఉమ్మడి విజయమని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, 2014 తర్వాత దేశంలో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాలు..   • నెహ్రూ రికార్డును అధిగమించడం తన…

AP

స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

స్టీల్‌ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడేటట్లు చేస్తున్నారని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ ఘటనలో బాధిత కుటుంబాలను సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  …

AP

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన..! వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది..?

కాకినాడ మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన ఏమైంది? మూడు రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. మరి చిన్నారి ఎక్కడ? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పాప కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. తమ కూతురు వస్తుందని తల్లిదండ్రులు, వారి బంధువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం వ్యవహారంలో కొత్త మలుపు   కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారి కనిపించలేదు.…

National

దూసుకొస్తున్న ఎన్ నినో..! భారత్‌పై దాని ప్రభావం ఎంతో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.   దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో .. ఆల్రెడీ సంకేతాలు   ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌…

TELANGANA

అడవి పందులను బెదరగొట్టడానికే బతుకమ్మ చీరాలు..! బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను అడవి పందులను బెదరగొట్టడానికే ఉపయోగపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడిన రేవంచ్.. గత పాలనలో నాణ్యతలేని చీరలను పంపిణీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆ క్వాలిటీ లేని చీరలను ఆడబిడ్డలు.. చేల గట్ల వద్ద పక్షులను, అడవి పందులను బెదరకొట్టడానికి వాడారని సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం అందించిన చిలుకపచ్చ రంగు చీరను మంత్రి…

TELANGANA

ఫ్లెక్సీలు, బ్యానర్లకు అధికారులు చెక్..! రాష్ట్రంలో కొత్త అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ..!

పండుగలు, పబ్బాలు, జాతరలు, రాజకీయ నాయకుల బర్త్ డ్ లు, రాజకీయ సమావేశాలు, మిత్రుల జన్మదినోత్సవాలు వంటి సందర్భాల్లో మీరు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇకపై కుదరదంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు. హైదరాబాద్ మహానగర శోభను దెబ్బతీసేలా నగరంలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లకు అధికారులు చెక్ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవలే సర్కారు కోర్ అర్బన్ రీజియన్ తో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని…

AP

కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   వివరాల్లోకి వెళితే.. తుని మండలం సి.హెచ్. అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు…

AP

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘మన మిత్ర’ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన…