News

National

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు..!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ.. రాయితీలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 22ఏళ్ల పిటిషనర్.. 2025 నీట్ యూజీ పరీక్షలకు హాజరయ్యాడు. సదరు అభ్యర్థి జనరల్ కేటగిరీకి చెందిన వాడైనా ఆర్థికంగా వెనకబడిన తరగతి (ఈడబ్ల్యుఎస్)కి చెందిన వాడన్న సర్టిఫికెట్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు 18.9లక్షల నుంచి 25లక్షల వరకు ఉండటంతో…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. రంగంలోకి అధినేత పవన్..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీ భాగ్యనగరంపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ వంటి పార్టీలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉనికిని చాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తోంది.   క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు జనసేనాని కార్యాచరణ మొదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మిగతా పార్టీల నుండి వచ్చే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడానికి…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఆయనపై నమోదైన కొన్ని రాజకీయ కేసుల వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయాల్లో నమోదయ్యే ఇలాంటి కేసులు ప్రజాప్రతినిధులకు తరచూ తలనొప్పిగా మారుతుంటాయి. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి చట్టపరమైన చిక్కులు తొలిగిపోయినట్లయింది.…

AP

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..

దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్‌పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరి‌గా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్‌(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.   రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం   విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు…

AP

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు..

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏం జరుగుతోంది? మాజీ సీఐ నాగరాజును దాదాపు 8 గంటల పాటు సిట్ విచారించిందా? విచారణలో నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? సిట్ ఐజీ విచారించినా నాగరాజు నోరువిప్పలేదా? నాగరాజు సైలెంట్‌పై ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది?   సాయికృష్ణ అదృశ్యం కేసు.. ముగిసిన సిట్ విచారణ   సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. మంగళవారం సస్పెండ్ సీఐ నాగరాజుని అరెస్టు చేసిన సిట్ అధికారులు, మధ్యాహ్నం…

AP

ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ..

*ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ* (కనేకల్ డేట్ లైన్) కనేకల్ మండలం ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాలలో రేసోనియా కంపెనీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్టు పంపిణీ బుధవారం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఒక్కచదువుతో సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు…కణేకల్లు మండలంలోని ఎర్రగుంట జిల్లా పరిషత్ వున్నత పాఠశాలలో రెజోనియా కంపెనీ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందచేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండలకన్వినర్ వన్నారెడ్డి హాజరయ్యారు..ఆయనతోపాటు రెజోనియా కంపెనీ…

TELANGANA

దిల్లీ వేదికగా తెలంగాణ మెట్రో డీల్ సఫలం..!

హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం.. ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు సీఎం వరుసగా రెండ్రోజులు స‌మావేశ‌మ‌య్యారు. తొలుత సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి మనోహర్ లార్ ఖట్టర్ నివాసంలో మరోమారు అంశంపై చర్చించారు.  …

TELANGANA

రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ సంచలన వాఖ్యలు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్ రెడ్డి కన్నంతా మెట్రో భూముల మీదే పడింది. ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ పక్కా ఉంటుంది” అని ఆరోపించారు.   మెట్రో సమీపంలో 280 ఎకరాల విలువైన భూములు…

TELANGANA

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ..

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ సముదాయంలోని మహాకాళి అమ్మవారి ఆలయంలోకి చొరబడి, వెండి కిరీటంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో భక్తులు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.   మంగళవారం ఉదయం నిత్య పూజల కోసం వచ్చిన అర్చకులు ఆలయ ద్వారాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణంలోని పై…

AP

సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా కీలక వ్యాఖ్యలు..

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం సాయికృష్ణ అదృశ్యం కేసును మరింత సంచలనాత్మకం చేసింది. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక సాక్ష్యాలైన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది” అని అన్నారు.   సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై…