సీఎం రేవంత్కు మంత్రి పొన్నం లేఖ..!
హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా…

