News

AP

అమరావతి పేరుతో రాయలసీమకు తీరని అన్యాయం: రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆరోపణ

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం,అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం విభజనకు ముందు విభజన తర్వాత అప్పటి కేంద్రం వేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చేస్తూనే ఉన్న ఆగిత్యం అంతాఇంతా కాదన్నది జగమెరిగిన నగ్న సత్యము……. …. 1956నుండి2014వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా వచ్చిన ముఖ్యమంత్రులలో ఎక్కువగా నేనే నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ కేవలం హైదరాబాద్…

National

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.   తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ…

AP

లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు.. రెండు గంటలపాటు చర్చ, కాంగ్రెస్ పూర్తి మద్దతు

ఏపీ శాశ్వత రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. జీవో అవర్ ప్రారంభంలో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో జనవిశ్వాస, ఎఫ్‌సీఆర్ఏ(ఫారెన్ కంటిబ్యూషన్‌కు సంబంధించినది) వీటితోపాటు ఏపీ పునర్విభజన బిల్లు కూడా రానుంది.   లోక్‌సభలో ఏపీ పునర్విభన బిల్లులో రాజధాని అమరావతిపై చర్చ   ఏపీ రాజధాని అమరావతి బిల్లుపై సభలో రెండు గంటలపాటు చర్చ జరగనుంది. తొలుత ఈ బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశ పెట్టారు.…

AP

ఏపీ రాజధానిగా మావిగన్.. జగన్ సరికొత్త ప్లాన్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి ఒక భారీ రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ మూడు నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతానికి ‘మావిగన్’ (MAVIGUN) అనే సరికొత్త పేరును జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   రాష్ట్ర…

TELANGANA

కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్..

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. రెండు, మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షం ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల…

National

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్..

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.   ఢిల్లీ సమీపంలో.. ఈ…

TELANGANA

ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు..

గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి తక్షణ…

AP

రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్…

AP

ఇక‌ ప్రతి నెల 4వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని…

AP

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్‌పై హర్షం: కదిరిలో క్రికెటర్ల కేక్ కటింగ్ వేడుకలు

RDT FCRA రెన్యూవల్ పట్ల క్రికెటర్ల హర్షం ఇటీవల ఉమ్మడి జిల్లాలకు వరం లాంటి ఆర్డీటీ సంస్థకు ( FCRA ) లైసెన్స్ రెన్యూవల్ అవడం తో ప్రతి ఒక్కరు హర్షించారు.అందులో భాగంగా ఈరోజు ప్రభుత్య డిగ్రీ కళాశాల మైదానం నందు గల క్రికెట్ నెట్స్ నందు కదిరి వర్ధమాన, పూర్వ క్రికెటర్లు, క్రికెట్ శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి ఆనందం పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ కదిరి రీజియన్ RD రఘురామ్, నల్లచెరువు ఏరియా ATL…