News

TELANGANA

ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్‌లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.   ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్…

National

బెంగాల్‌లో బీజేపీ మరో సంచలన నిర్ణయం..!

బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లకు, హిందూ దేవాలయాల అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అలాగే కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వెనుకబడిన తరగతుల జాబితా (OBR)ను రద్దు చేసి.. కోటా అర్హతను నిర్ణయించడానికి కొత్త ప్యానెల్ ఏర్పాటు కేబినేట్ అమోదం తెలిపింది.…

TELANGANA

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త మండల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వేగంగా కొత్త కమిటీలు ఏర్పాటు కావాలని టీపీసీసీ ఆదేశించింది. అయితే ఇప్పటికే మూడేళ్ల పాటు కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం లేదు. కొత్తోళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. కానీ కొత్తగా మండల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వారు, అప్పటికే పార్టీలో కనీసం మూడేళ్ల పాటు కార్యకర్త గా పనిచేసి ఉండాలి. ఈసారి కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పారదర్శకమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది.…

TELANGANA

పోలీసుల చేతికి కొత్త అస్త్రం..! కృత్రిమ మేధతో సోషల్​ మీడియాపై నిఘా..

సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపటానికి హైదరాబాద్ పోలీసులు సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’ని సమకూర్చుకున్నారు. ఏఐ ఆధారితంగా పని చేసే దీని ద్వారా సోషల్ మీడియాలో జనం మధ్య విభేధాలు రెచ్చగొట్టేలా…వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసేలా పోస్టులు పెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టటంతోపాటు వారిపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ విభాగం రూపొందించిన సాక్ ఐ గురించి కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు తెలియచేస్తూ గతంలో సోషల్…

AP

లోకేష్ కాదు.. ‘లవ్ కాష్’.. అంబటి సెటైర్లు..!

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు రోడ్డెక్కాయి. గుంటూరు నగరంలో మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.   రిక్షా తొక్కిన మాజీ మంత్రి..   ధరల పెంపుదలపై తన నిరసనను వినూత్నంగా తెలియజేసేందుకు అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆయన స్వయంగా రిక్షా తొక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పెరిగిన ధరలతో…

National

‘ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..

ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమేనంటూ సోషల్‌ మీడియాలో రచ్చకు దారితీశారు.   సోషల్‌ మీడియాలో ప్రజల అలవాట్లు, వారి జీవితంలోని వివిధ దశలు ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై ఓ వైరల్‌ థ్రెడ్‌ నడుస్తోంది. అందులో ఫొటోలు పెట్టడం, రీల్స్‌ చేయడం, వంట ఫొటోలు షేర్‌ చేయడం వంటి పనులపై జోకులు పేలాయి. ఈ చర్చలోకి ఎంటర్‌ అయిన మస్క్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే…

TELANGANA

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్‌ 15 నుంచి ప్రక్రియ షురూ..

తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాతో పంచుకున్నారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు.   ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు ఇస్తారని…

TELANGANA

బండి సంజయ్ సంచలన ప్రకటన..! నా కుమారుడ్ని పోలీసులకు అప్పగించాను..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో చట్ట ప్రకారం విచారణకు సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.   ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టం ముందు నా కుమారుడు అయినా, సామాన్యుడు అయినా అందరూ సమానమే. పోలీసులపై ఉన్న గౌరవంతోనే భగీరథ్‌ను అప్పగించాను.…

AP

ఏపీ ప్రజలకు చంద్రబాబు బంపర్ ఆఫర్..! మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు…

జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మూడో సంతానానికి రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘పిల్లలే సంపద’ పేరుతో త్వరలోనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.   శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జనాభా తగ్గుదల రేటు ఆందోళన కలిగిస్తోందని, దేశ ప్రగతికి పిల్లలే అసలైన సంపద…

TELANGANA

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.   ఆసుపత్రికి చేరుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. శకుంతల గారి గుండెకు స్టంట్ వేసి, ప్రస్తుతం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  …