మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం..
పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు…

