News

NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.   508…

Uncategorized

నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..!కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు.   ఎన్ కౌంటర్ల పేరుతో.. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు..…

TELANGANA

తెలంగాణలో వరి సాగు సగానికి పడిపోనుందా? ఎల్ నినో పై ప్రభుత్వం షాకింగ్ అంచనా..!

ఎల్ నినో పరిస్థితులతో రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో సోమవారం ఇక్రిశాట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే…

AP

టెక్కీ రాధాగాయత్రి కేసులో కొత్త ట్విస్ట్..!

విశాఖ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం రెండువారాల రిమాండ్‌ విధించడంతో జైలుకి తరలించారు.   విశాఖ టెక్కీ రాధాగాయత్రి కేసు కొత్త మలుపు-విశాఖ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లెంక రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

AP

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ అరెస్ట్ జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   అరెస్ట్‌కు దారితీసిన కారణం ఇదే..   ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర…

AP

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు శ్రీకారం..!

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.   బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

TELANGANA

కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు..! దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్..!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు 117 కాదు కదా.. 7 కూడా రావు అని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదన్న విషయం నిజమైతే.. ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనపై అంత నమ్మకం ఉంటే…

TELANGANA

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

క్రైం రివ్యూల్లో ఐపీఎస్ అధికారులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నిందితుడి పూర్వపరాలు, అతడి వివరాలు తెలుసుకొని, కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని అడగాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసులకు చేతకాకపోతే ప్రైవేట్ కేసు పెడతా.. తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్ గా మారిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ వాస్తవం అన్నారు. రాత్రి 11 నుంచి 1 గంట…

AP

ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్..! ఇకపై ఆ పోస్టులు పెడితే..

రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ ఫోటోలు, అవమానించే భాష, అనుమానించే కథనాలు, అసభ్యకరమైన మాటలు సోషల్‌మీడియా ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. దేవుళ్లను, మతాలను అవమానించి సమాజంలో విద్వేషం మంటల్ని పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు బాధ్యత, భయం ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో, మార్ఫింగ్ వీడియోలతో ఏదైనా చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, చివరికి న్యాయమూర్తులను కూడా వదలిపెట్టడం లేదు. టార్గెట్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తున్నారు. స్పెషల్ వార్ ఏర్పాటు ఒక అకౌంట్‌ను…