News

AP

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికేనా..?

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మరోసారి ఏపీ ప్రజలు రాజధాని లేకుండా ఇబ్బందులు పడరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిపి ఆ బిల్లును సభలోని సభ్యులు ఆమోదించారు. అయితే, అమరావతి బిల్లు…

AP

రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం.   నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,00,875 టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గతేడాది…

TELANGANA

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.  …

National

నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన..

నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయుధాలు పట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని సమర్థించేవాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు.   సమాజంలో అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు పట్టడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని…

TELANGANA

హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు..! శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా…

హైదరాబాద్‌లో భారీ అక్రమ గ్యాస్ సిలిండర్ల రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ శ్మశాన వాటికలో అక్రమంగా నిల్వ ఉంచిన 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఈ దందాకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.   హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సోమవారం ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు అధిక…

AP

సౌత్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన కదిరి విద్యార్థులు

ఆదివారం అనంతపురంలో అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కదిరి విద్యార్థులు కథస్ ఈవెంట్లో 10 మంది విద్యార్థులు పాల్గొని విజయభేరి ముగించారు వారిలో 6 మంది గోల్డ్ మెడల్ సాధించగా 4 గురు సిల్వర్ మెడల్ సాధించారు వారిలో బ్రౌన్ బెల్ట్ విభాగంలో అసద్ గోల్డ్ మెడల్ సాధించగా నాజిష్ సిల్వర్ మోడల్ సాధించాడు బ్లాక్ బెల్ట్ విభాగాలలో హానిక రాయల్. భవ్య గోల్డ్ మెడల్ సాధించారు…

AP

కదిరి ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగులకు ఊరట: మెట్ల బాధ తప్పిస్తూ ‘వాలు వంతెన’ ప్రారంభించిన ఇన్-చార్జి డిఎం రామకృష్ణ!

కదిరి:- ఆర్టీసీ బస్టాండులో దివ్యాంగుల కొరకు మెట్ల వాలువంతెన ఏర్పాటు:- రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు తేది: 18.3.2026 నుండి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం నకు అనుమతి ఇచ్చినది. తద్వార రోజు వందల మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్టాండుకు విచ్చేసి,ప్రయాణం చేస్తున్నారు. మరియు ఆర్టీసీ బస్టాండులో వున్న డిఎం ఆఫీసుకు రోజు వచ్చే దివ్యాంగులతో పాటు పదవీ విరమణ పొందిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగులకు బస్టాండు ఎంట్రన్స్ లో మెట్లను ఎక్కే బాధవుండేది. ఈ…

National

ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం..

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సవాళ్లను, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాల వైఫల్యాలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.   గ్రీక్ సిటీ టైమ్స్ తన కథనంలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సూచీలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా…

TELANGANA

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.   మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజారవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, ఈ నగరానికి…

AP

అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై చారిత్రక తీర్మానం చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే, ప్రతిపక్ష నేత జగన్ బెంగళూరులో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అంశం…