News

TELANGANA

హిల్ట్‌ భూముల కుంభకోణంపై బీఆర్‌ఎస్ పోరాటం: 2 రోజులు క్షేత్రస్థాయి పరిశీలన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి భారత రాష్ట్ర సమితి (BRS) సిద్ధమైంది. హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ (HILTP) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. దీన్ని అడ్డుకోవాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నాయకులతో కూడిన ‘నిజనిర్ధారణ బృందాలను’ (Fact-Finding Committees) నియమించారు.…

National

రాజ్ భవన్‌లు ఇక లోక్ భవన్‌లు; పీఎంఓ ఇక ‘సేవా తీర్థ్’

కేంద్ర ప్రభుత్వం దేశంలో వలస పాలన (British Colonial) వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా, దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్‌ల పేర్లను లోక్ భవన్‌లుగా మార్చాలని నిర్ణయించింది. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా ‘సేవా తీర్థ్’ గా నామకరణం చేసింది. ప్రజలకు దగ్గరగా ఉండే ‘లోక్’ (ప్రజలు) అనే పదాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో హోం మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ మార్పులు దేశంలోని…

CINEMA

సమంత పెళ్లిపై మేకప్ స్టైలిస్ట్, పూనమ్ కౌర్ సంచలన పోస్ట్‌లు

నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ – లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్న తర్వాత, సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ వివాదాలకు ముఖ్య కారణం సమంత పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ మరియు నటి పూనమ్ కౌర్ చేసిన పోస్ట్‌లు. సమంత పెళ్లి తర్వాత ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన సద్నా సింగ్, తన స్టోరీలో “బాధితురాలిగా… విలన్ చాలా…

TELANGANA

పవన్ కళ్యాణ్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత సంచలనం సృష్టిస్తూ, “తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారు”…

AP

పరకామణి చోరీ కేసు: సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ అధికారులు హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించారు. అలాగే, ఈ కేసులో నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆస్తులకు సంబంధించిన నివేదికను కూడా ఏసీబీ అధికారులు హైకోర్టుకు అందజేశారు. ఈ రెండు నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నివేదికను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని నిందితుడు రవికుమార్ తరఫు సీనియర్ న్యాయవాది కోరినప్పటికీ, హైకోర్టు న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు.…

AP

‘పవన్ కల్యాణ్ కోరిక జరగాలి’: ఏపీలో కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలి – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లాలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదికలో మాట్లాడుతూ కీలక రాజకీయ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆయన అన్నారు. మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, 2047 నాటికి స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 58 లక్షలకు పెంచడమే…

National

పార్లమెంట్ డ్రామా కాదు, చర్చా వేదిక: ప్రధాని వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ ఘాటు కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ చట్టసభల్లో ‘డ్రామాలు ఆడవద్దు’ అంటూ విసిరిన వ్యంగ్యాస్త్రాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. సమావేశాల్లో భాగంగా ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. సీరియస్‌ అంశాలపై చర్చ లేకపోతే పార్లమెంట్ దేనికి? అని ఆమె ప్రశ్నించారు. ఆయా అంశాలపై మాట్లాడటమేమీ డ్రామా కాదని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవడమే నిజమైన…

CINEMA

సమంత-రాజ్ నిడిమోరుల వివాహం: లింగ భైరవి ఆలయంలో పెళ్లి, ఫోటోలు షేర్ చేసిన సామ్

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరిగింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన రూమర్స్‌ను నిజం చేస్తూ, సామ్‌-రాజ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం, సమంత రాజ్‌తో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జంట వివాహం కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో గల లింగ భైరవి ఆలయంలో…

AP

కడప-రేణిగుంట గ్రీన్‌ ఫీల్డ్ హైవే పనులు షురూ: వన్యప్రాణుల కోసం 4 భారీ వంతెనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా, మూడేళ్లుగా ముందుకు సాగని కడప – రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్ట్ శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా నిర్మించాల్సి ఉండటంతో పర్యావరణ అనుమతులలో జాప్యం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో అనుమతులు మంజూరు చేయించుకోవడంతో, ప్రస్తుతం కడప-రాజంపేట రహదారి (మొదటి ప్యాకేజీ) పనులు ప్రారంభమయ్యాయి. కడప – రేణిగుంట జాతీయ రహదారి…

TELANGANA

మేడారం జాతర పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2026 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీదారుత్వం చూపకూడదని అధికారులను కఠినంగా ఆదేశించారు. మేడారం జాతర అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతర ప్రాంగణంలో పచ్చదనాన్ని కాపాడాలని, గద్దెల…