News

National

ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే అదనపు గ్యాస్ కార్గోలను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులు స్వయంగా డిస్ట్రిబ్యూషన్…

TELANGANA

2034 వరకు నేనే .. అందరి లెక్కలు తేలుస్తా.. ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యాన్ని వీడి, ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.   గత పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి, అంచనాలు పెంచి వేల కోట్లు వృధా చేశారని, కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం విమర్శించారు.…

TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ..! రేపే కోర్టు తీర్పు..

మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మల భవితవ్యంపై ఉప్పరపల్లి కోర్టులో కీలక వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్.. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న…

AP

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.   విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు   ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది…

AP

అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర..

అమరావతి రాజధాని రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించి, చట్టబద్ధత లభించిన శుభతరుణంలో రాజధాని ప్రాంత మహిళలు తమ భక్తిని, కృతజ్ఞతను చాటుకున్నారు. తమ కలల రాజధాని సాకారం కావాలని ఇన్నాళ్లూ పట్టువదలని దీక్ష చేసిన మహిళా రైతులు, నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి ఆశయం నెరవేరినందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, రాజధాని గ్రామాల నుండి కాలినడకన బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.   కాలి నడకన కనకదుర్గమ్మ చెంతకు..…

AP

పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం: మర్యాదపూర్వక భేటీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ (జేసీ), జిల్లా ఎస్పీ మరియు ఆర్డీవో తదితర అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకగా కలిసి పూల బొకేలను అందజేశారు. అధికారులు గవర్నర్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం గవర్నర్…

AP

వేంపల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు!

వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి గండి వీరన్న గట్టుపల్లి సమీపమున తలుపుల మీదగా కడపకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఆర్టిసి బస్సు పై విద్యుత్ తీగలు అకస్మాత్తుగా బస్సు టాప్ పైన పడడంతో చాకచక్కంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో డ్రైవర్, కండక్టర్ కు ప్రయాణికులకు ఎవరికి ఏం కాలేదని తెలిసింది.

AP

ఉత్ఖంఠ క్రికెట్ పోటీలో కోచింగ్ క్యాంపు B జట్టు విజయం.

ఈరోజు డిగ్రీ కళాశాల మైదానం నందు జరిగిన క్రికెట్ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన కోచింగ్ క్యాంపు A జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేశారు. మొహమ్మద్ 45 దేవేంద్ర 25 ప్రణయ్ 25 not అవుట్ రాణించారు. బౌలర్లు శివాజీ 2 తేజు, సన్నీ చెరో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన B జట్టు చివరి ఓవర్ చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగ సాదిక్…

National

దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ..

జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయనే వాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి…

TELANGANA

భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ,క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా? అనేది రిజిస్ట్రేషన్…