News

National

తొలిసారిగా మహిళలకు కమాండో శిక్షణ.. ఎన్ఎస్‌జీ కీలక ముందడుగు..

భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాట విభాగంలో మహిళల కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) చారిత్రాత్మక ముందడుగు వేసింది. తొలిసారిగా వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) మహిళా సిబ్బంది కోసం హర్యానాలోని మానేసర్‌లోని ఎన్ఎస్‌జీ శిక్షణా అకాడమీలో ‘మహిళా కమాండో కన్వర్షన్ కోర్సు’ (ఎంసీసీసీ)ను ప్రారంభించింది.నారీశక్తి సాధికారతలో ఇదొక నూతన అధ్యాయమని ఎన్ఎస్‌జీ పేర్కొంది. ‘సాహసవంతులే నాయకత్వం వహిస్తారు’ (She Who Dares, Leads) అనే…

AP

తెలిసి తెలిసి నా గొంతు కోశారు.. ఇది పక్కా ప్రణాళికతో చేసిన మోసం..! మేఘన సంచలన ప్రెస్ మీట్..

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో చెలరేగిన వివాదం పెను సంచలనంగా మారింది. ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చి, తన అత్తింటి వారిపై కఠినమైన, తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి ముందే తెలిసి కూడా, కేవలం తమ పరువు కోసం తన జీవితాన్ని బలి చేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అదనపు కట్నం వేధింపుల నుంచి మత మార్పిడి ఒత్తిడి వరకు తాను…

Uncategorized

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ వార్నింగ్..! అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్..

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావని… క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన కీలక సమయమని జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేరు కానీ.. విదేశీ విద్య అందిస్తారంట!: బండి సంజయ్..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని… అలాంటప్పుడు విదేశీ విద్యను అందిస్తామని, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు బకాయిలు అందకపోవడంతో రాష్ట్రంలో అనేక కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు…

TELANGANA

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు..! మంత్రి పదవి నుండి తొలగింపు..?

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి అందించింది. అలాగే మరో సందర్భంలో సీనియర్‌ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చినట్లు కమిటీ ఛైర్మన్‌, ఎంపీ మల్లు రవి వెల్లడించారు.మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను ఉపేక్షించబోమని చెప్పారు.…

TELANGANA

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: సీఎం రేవంత్‌..

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. బ్రిటన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.బ్రిటన్‌ పర్యటనకు అనుమతించారని, కానీ అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.…

Uncategorized

మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆయన్ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ…

TELANGANA

కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

AP

ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు..

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదేపదే వాటిని అప్‌లోడ్ చేసే పనిలేకుండా ‘డేటా ఇంటిగ్రేషన్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

National

కేంద్రంపై సీజేపీ ఆగ్రహం..! సెప్టెంబర్ 5న మరోసారి భారీ నిరసనకు పిలుపు..!

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ నిరసన ర్యాలీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ వరకు…