News

National

తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు…

TELANGANA

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ..!

సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.   కేంద్రం వైఖరిపై…

TELANGANA

రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్..

పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ బీజేపీ ఇబ్బంది పెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ‘రైతు ఘోస – బీజేపీ భరోసా’ పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా ఆడుతుందన్నారు.   నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా…

AP

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం… ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు..

జనసేన పార్టీలో తన పుష్కర కాలం నాటి సహనానికి స్వస్తి పలుకుతున్నానని, ఇకపై పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీని ఒక సైనిక పటాలంలా ముందుకు నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి తొలి అడుగుగా, అంతర్గత…

AP

ఏపీ తీరానికి కొత్త రూపు..! సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక ‘విజన్ ప్లాన్’ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే, తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.   ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా…

TELANGANA

మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం..

పాకిస్తాన్‌ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.   దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు…

AP

ప్రశ్నిస్తే జైల్లో పెడతారు..? చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం..

కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.   కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ రెడ్డి లాంటి…

TELANGANA

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు ఇప్పుటి నుంచే బీఆర్ఎస్ ప్రిపరేషన్ సాగుతోందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని కేడర్‌ను సిద్ధం చేస్తోందా? ఈ నేపథ్యంలో రోజుకో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశాలకు ఆ పార్టీ ప్లాన్ చేసిందా? కేడర్‌లో ఉత్సాహాన్ని నూరిపోయే ప్రయత్నం చేస్తోందా? అదే సమయంలో అధికార పార్టీ వ్యాఖ్యలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది.   గ్రేటర్‌లో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలకు ఇప్పటి నుంచి రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ చేసింది.…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇకపై ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు..

రాష్ట్రంలోని ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా సంజీవని కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని అని గుర్తుచేశారు. అందుకే ఆ సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.   ఈ రోజుల్లో సంపద…

TELANGANA

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..! రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు..

రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్)లో చేరాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని గృహ, వాణిజ్య కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.   గత ప్రభుత్వ ఒప్పందాన్నే అమలు చేస్తున్నాం: మంత్రి…