News

National

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్య..

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే కావడం విశేషం. బుధవారం శ్రీనగర్‌లో ఆయన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు.ఈ సమావేశం అనంతరం సెర్గియో గోర్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌లో ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఇది ఎంతో రమణీయమైన ప్రదేశం” అని…

TELANGANA

సీటు రగడ.. సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు..

పరకాల టికెట్‌పై రేవంత్‌ను ప్రశ్నించిన కొండా సుష్మితరేవూరికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని నిలదీతటికెట్లను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టీకరణకొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నబీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్‌ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా…

TELANGANA

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా..?

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సుమారు 80 మందిని సమగ్రంగా విచారించారు. విచారణ ఆధారంగా.. చెడు వ్యసనాలకు బానిసలైన స్థానిక తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో…

AP

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత ఉందని జగన్‌ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్‌ ఫైర్ అయ్యారు.…

AP

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ..!

ఏపీ శాసనసభలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడింది. రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్-1 అందిస్తుంది. ఎంతో శ్రమించి అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ – 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు.…

TELANGANA

ఈసీ లక్షలాది ఓట్లను తొలగించింది: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ..

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) విచక్షణారహితంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.నగరంలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించలేదని, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారని…

AP

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. బీసీ రిజర్వేషన్లు, ప్రత్యక్ష ఎన్నికలకు ఆమోదం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.…

National

‘ఆపరేషన్ సిందూర్’పై డిస్కవరీ చానల్ డాక్యుమెంటరీ.. ఉలిక్కిపడిన పాకిస్థాన్..!

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై డిస్కవరీ ఛానెల్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆగస్టు 15న ప్రసారమైన “డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్” అనే ఈ డాక్యుమెంటరీతో ఉలిక్కిపడిన పాకిస్థాన్, ఈ డాక్యుమెంటరీపై, భారత్‌పై ఎదురుదాడికి దిగింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టింది.పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ‘ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్’ (ఐఎస్‌పీఆర్) ఈ…

AP

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమ..

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య, అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవిలను శాసనమండలికి నామినేట్ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సిఫార్సులతో కూడిన దస్త్రాన్ని ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న పండుల రవీంద్రబాబు, జాకియా ఖానమ్‌ల పదవీకాలం ముగియడంతో ఈ రెండు…

TELANGANA

భూలక్ష్మి పేరుతో కవిత సంచలనం..! వారికి ఎకరం భూమి ఫ్రీ..!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేదల సంక్షేమం లక్ష్యంగా ఓ భారీ ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. పేదల ఆర్థికాభివృద్ధికి భూమే మూలాధారమని…