News

National

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు ఖరారు.. కస్టమర్లపై భారం లేదన్న ఎన్‌పీసీఐ..

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు చేసే చెల్లింపులపై కొన్ని రుసుములను ప్రవేశపెట్టినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.ఎన్‌పీసీఐ తాజా నిబంధనల ప్రకారం, వ్యాపార చెల్లింపులలో (మర్చంట్ పేమెంట్స్) రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. అయితే, ఈ…

TELANGANA

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్‌ అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు…

TELANGANA

ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: కవిత..

ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వారిని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర అభివృద్ధిలో కీలక…

AP

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖలోని తన నివాసంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఆయన ఆకస్మిక మృతి వార్త ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆళ్ల నాని వయసు 56 సంవత్సరాలు. 1969లో ఏలూరులోని శనివారపుపేటలో జన్మించారు.ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, ఆంధ్రా…

AP

ఏపీలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు.. ఈనెల 22న ఓటర్ల జాబితా..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 41 పట్టణ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పరిధిలో రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని…

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. తల్లి రక్త నమూనాల సేకరణ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఈ రక్త నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని అనుమానాస్పద శాంపిల్స్‌తో తల్లి డీఎన్ఏను సరిపోల్చనున్నారు. దీని ద్వారా బాధితుడిని…

National

పహల్గాం దాడిపై బ్రిక్స్ దేశాల తీవ్ర ఖండన.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్..

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు ఉగ్రవాదంపై కీలక తీర్మానం చేశాయి. 2025లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 12న ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’లో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశాయి.2025 ఏప్రిల్ 22న పహల్గాంపై జరిగిన ఉగ్రదాడిని అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నట్లు బ్రిక్స్ నేతలు తమ…

TELANGANA

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా..? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు..

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారన్నారు. ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు గొప్పులు చెప్పుకుంటూ సభను తన అడ్వర్ టైజ్ మెంట్ కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.…

AP

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన కొత్త వ్యూహం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహాలను రూపొందించేందుకు.. పార్టీ ఇప్పటికే సమన్వయ కమిటీని వేసింది. ప్రస్తుతానికి.. 14 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో.. సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల…

AP

చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా..?

బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీకి గుడ్‌బై చెప్పాక.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు కూడా  రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అసలు పోరు మొదలైంది. భీమిలి ఇన్‌చార్జి పదవి కోసం.. పోటీ పెరిగింది. ఎందుకంటే.. ఇది వైసీపీకి కీలక స్థానం. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు…