ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో ఎయిర్పోర్ట్..
దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. ఈ కుండపోత వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు.వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ ప్రభావంతో మధ్యాహ్నం 3:30 నుంచి…

