News

AP

‘గ్లోబల్ లెవెల్లో’ ఏపీ హస్తకళల ..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళల వారసత్వానికి పుట్టినిల్లని, ఒక జాతి యొక్క అసలైన గొప్పతనం ఆ దేశం నిర్మించిన భవనాల్లో కాకుండా, అక్కడి కళాకారుల్లోనే కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని అంబేద్కర్ కళావేదికలో ఘనంగా ప్రారంభమైన ‘ఏపీ హస్తకళా మహోత్సవం 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళాకారుల స్టాల్స్‌ను ఆయన సందర్శించి, వారి అద్భుతమైన ప్రతిభను అభినందించారు.   శ్రమకు…

TELANGANA

‘డిజిటల్ గవర్నెన్స్’కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్..

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.…

TELANGANA

సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం..

తెలంగాణ ఆర్థిక రంగానికి, సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సంతకం చేశారు. ఈ మైనింగ్ లీజ్ కేటాయింపు తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.…

TELANGANA

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్..

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.   ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు   వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు)…

AP

నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు..!

చరిత్ర అనేది కేవలం పుస్తకాల్లో దాగుండేది కాదు.. భూగర్భంలో, అడవుల్లో, నదీ తీరాల్లో శిలల రూపంలో నిగూఢంగా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అవి బయటపడి మన పూర్వీకుల జీవన విధానాన్ని మన కళ్లకు కడతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక ఆవిష్కరణ జరిగింది. సాహసోపేతమైన అన్వేషణకు నిలయమైన నల్లమల పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో భారత పురావస్తు శాఖ (ASI) శాసన విభాగం చేపట్టిన ప్రత్యేక సర్వేలో రెండు అత్యంత అరుదైన, ప్రాచీనమైన…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!

భారతదేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వాడుతున్నాయి. ‘కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థలోనే AIని ఒక భాగం చేస్తోంది. ఏదో ఒకటి రెండు పథకాలకు మాత్రమే AIని పరిమితం చేయకుండా, సిటిజన్ సర్వీసులు, రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా అనలిటిక్స్, సంక్షేమ పథకాల డెలివరీ వీటన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఒక పెద్ద డిజిటల్ వ్యవస్థను…

National

‘ఉగ్రం’ రైఫిల్‌కు కేంద్రం పచ్చజెండా..!

రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ద్విప డిఫెన్స్’ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62×51 ఎంఎం ‘ఉగ్రం’ అసాల్ట్ రైఫిల్, భారత సైన్యం మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్వహించిన కఠిన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. ఈ ఫలితంతో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్) అమ్ములపొదిలోకి ఈ స్వదేశీ ఆయుధం చేరేందుకు మార్గం సుగమమైంది.   రక్షణ పరిశోధన మరియు…

AP

యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు..!

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జులై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు…

AP

నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు.. పవన్ కల్యాణ్ పై పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు..!

ఎపీలో ఒకప్పుడు సుగాలి ప్రీతి మరణం కేసు సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం మల్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతున్నారు.   ఎన్నికలకు ముందు.. ఈ కేసుకు సంభందించి ప్రస్థుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‌పై కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్…

TELANGANA

టూరిజంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష..!

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటిలో సీఎస్ కె. రామకృష్ణారావుతో పాటు పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…