News

National

కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..

కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ అధికారికంగా ముగిసినప్పటికీ, పలు కేంద్రాల్లో ఓటర్లు క్యూలలో వేచి ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును మే 4వ తేదీన…

TELANGANA

జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌..

పార్టీ మారితే అంతే. ఏ పార్టీలో ఉంటే ఆ పాటందుకోవాలె. అదే బ‌తుకుదెరువు. బ‌త‌క‌నేర్చిన తెలివి. జీవ‌న్‌రెడ్డి ఇవాళ ఇలా బీఆరెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడో లేదో.. ఓ ప్ర‌క‌ట‌నైతే తెగ వైర‌ల్ అయిపోతా ఉంది. కేంద్రంలో మోడీ పాల‌న‌ను మెచ్చుకున్నాడు మ‌రి జీవ‌న్‌రెడ్డి.   ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో ఉన్నా ఇసుమంత కూడా జాలి లేదు రాహుల్ మీద జీవ‌న్‌కు అని కాంగ్రెసోళ్లు తెగ ఫైర్ అయిపోతున్నారు ఆయ‌న మీద‌. కేంద్రంలో బీజేపీ బెట‌ర్‌.. ఇక్క‌డ కేసీఆర్…

TELANGANA

హస్తం వీడి కారు ఎక్కిన జీవన్ రెడ్డి..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ (BRS)లో చేరునున్న‌ట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న జీవన్ రెడ్డి చేరికను పార్టీ బలోపేతానికి ఒక కీలక మలుపుగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.   గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ, తాను బీఆర్ఎస్…

AP

మావిగన్‌కు రాష్ట్రంలో భారీ స్పందన.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్, బొత్స సంచలన వ్యాఖ్యలు..

విశాఖపట్నం వేదికగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని బొత్స స్పష్టం చేశారు. కేవలం రాజకీయ పదవుల కోసం నీచమైన రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ధ్వజం   వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన సంతకాల…

AP

మావిగన్ జోకర్ అంటూ వైయస్ షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోడరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరని జ్ఞాపకమని, ఆ యాత్రే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ అధికారంలోకి తెచ్చిందని ఆమె…

National

శబరిమల కేసులో కీలక మలుపు..! సుప్రీంలో ఆసక్తికర పోరాటం..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, చట్టపరమైన పోరాటాలకు వేదికగా మారింది. ముఖ్యంగా 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన గళాన్ని వినిపించింది. ఆలయ సంప్రదాయాలను గౌరవించడం ప్రాథమిక బాధ్యత అని, ఇందులో ఎలాంటి లింగ వివక్ష…

TELANGANA

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం..! సీఎం రేవంత్‌ రెడ్డితో టిమ్ రైఫిల్ భేటీ..

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులు అలాగే నూతన ప్రాజెక్టుల స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు.   తెలంగాణలో ఉన్న అత్యాధునిక…

TELANGANA

సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ..? వారికి చెక్ పెట్టినట్లేనా..?

తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ.. ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు.…

AP

మావిగన్.. ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం రాష్ట్రానికి పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.   మావిగన్ లేదా అయోధ్య..? పేర్ని నాని ప్రతిపాదన   మాజీ ముఖ్యమంత్రి…

AP

అమరావతికి మోదీ సర్కార్ భారీ గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో భారీ ముందడుగు పడింది. నవ్యాంధ్ర రాజధానిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం మొత్తం రూ. 2,534 కోట్లు మోదీ సర్కార్ వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదం…