News

National

దూసుకొస్తున్న ఎన్ నినో..! భారత్‌పై దాని ప్రభావం ఎంతో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.   దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో .. ఆల్రెడీ సంకేతాలు   ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌…

TELANGANA

అడవి పందులను బెదరగొట్టడానికే బతుకమ్మ చీరాలు..! బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను అడవి పందులను బెదరగొట్టడానికే ఉపయోగపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడిన రేవంచ్.. గత పాలనలో నాణ్యతలేని చీరలను పంపిణీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆ క్వాలిటీ లేని చీరలను ఆడబిడ్డలు.. చేల గట్ల వద్ద పక్షులను, అడవి పందులను బెదరకొట్టడానికి వాడారని సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం అందించిన చిలుకపచ్చ రంగు చీరను మంత్రి…

TELANGANA

ఫ్లెక్సీలు, బ్యానర్లకు అధికారులు చెక్..! రాష్ట్రంలో కొత్త అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ..!

పండుగలు, పబ్బాలు, జాతరలు, రాజకీయ నాయకుల బర్త్ డ్ లు, రాజకీయ సమావేశాలు, మిత్రుల జన్మదినోత్సవాలు వంటి సందర్భాల్లో మీరు శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇకపై కుదరదంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు. హైదరాబాద్ మహానగర శోభను దెబ్బతీసేలా నగరంలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లకు అధికారులు చెక్ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవలే సర్కారు కోర్ అర్బన్ రీజియన్ తో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని…

AP

కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   వివరాల్లోకి వెళితే.. తుని మండలం సి.హెచ్. అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు…

AP

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘మన మిత్ర’ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన…

TELANGANA

రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్.. ఫ్రీగా డిజిటల్ కోచింగ్.. డిప్యూటీ సీఎం భట్టి..!

తెలంగాణ‌లో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశ‌గా కృత నిశ్చ‌యంతో ప్రజాప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి ప్ర‌క‌టించారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద రూ.110 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న బాబాసాహెబ్ అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్, నింబోలి అడ్డా వ‌ద్ద రూ. 25 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న ఎస్సీ హాస్టల్ కు స‌ంబంధించి స్థ‌ల ప‌రిశీల‌న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇప్ప‌టికే ఈ రెండు భ‌వ‌నాల‌కు సంబంధించి ఆర్థిక‌, పాల‌న‌పార‌మైన అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క…

National

పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే.. దాని ఆధారంగా వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టం చేసింది.   తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో అతనిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్…

TELANGANA

‘ఇండియా’ కూటమి భేటీ..! 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ

బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని మిత్రపక్షాలకు సూచించారు.   సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్, “కలిసికట్టుగా ఉంటేనే మన మనుగడ సాధ్యం” అని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు, అధికార పక్షాన్ని సమర్థంగా…

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం..! 9కి పెరిగిన మృతుల సంఖ్య..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన తీరును వారు పరిశీలించారు.   ప్లాంట్‌లోని SMS-2, STC-3 విభాగాల్లో వేడి లోహ ద్రవం లీకైన ప్రదేశాన్ని హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, సహాయక చర్యలు,…

AP

డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి..

ఏపీ మెగా డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నియామకాల్లో నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే, క్రీడా కోటా కింద కేటాయించిన 421 పోస్టుల్లో 39 పోస్టులు ఇప్పటికీ ఎందుకు ఖాళీగా ఉన్నాయో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.   మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి టీజీ…