News

AP

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

అనంతపురం:ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజమే అవసరమని రేజూనియా కంపెనీ పేర్కొంది. అనంతపురం II REZ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (రెస్సోనియా) జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఒక ప్లాస్టిక్ వ్యర్థాల డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం మొదటగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డిస్పెన్సర్‌లో వేసింది. ఈ…

AP

తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం..! బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

దేశంలో రాజకీయాలు రూటు మార్చాయి. పార్టీని నమ్ముకున్న నేతలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మిగతా పార్టీల నేతలు వలస పోతున్నాయి. జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలదీ అదే దారి. మొన్నటివరకు బలంగా కనిపించిన బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, అధికారం పోయిన తర్వాత అంతర్గత కలహాలు మొదలయ్యాయి.   తారాస్థాయికి చేరిన టీఎంసీలో సంక్షోభం   ఆ పార్టీలోని అసంతృప్తులు వ్యతిరేక జెండా ఎగురవేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆ పార్టీకి…

TELANGANA

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన..

కృష్ణమ్మ జలాలతో పాలమూరు జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ,కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత…

TELANGANA

తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.   గాంధీ ఆసుపత్రిలో.. ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్…

AP

తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు..

తిరుమల కల్తీ నెయ్యి కేసు పేరెత్తగానే వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటర్ కావడం కొత్త మలుపు తిరిగింది. బుధవారం ఏకంగా ఆరు రాష్ట్రాల్లోని 15 చోట్ల దాడులు చేసింది. దాదాపు రూ.60 లక్షలు సీజ్ చేసింది ఈడీ. దీని ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది.   తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు  …

AP

చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..

గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తీవ్ర వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.   కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంటాడుతున్నాయి. గురువారం అమరావతిలో చంద్రబాబు మంత్రి వర్గం సమావేశమైంది. సమావేశానికి ముందు నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం. వివిధ అంశాలపై కేబినెట్‌లో…

TELANGANA

పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. జల సౌధలో సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.   పాలమూరులో సీఎం పర్యటన   ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి…

TELANGANA

పవన్ సంచలన ప్రకటన..! తెలంగాణలో జనసేన పోటీ..!

హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు అర్పించారని పవన్ గుర్తుచేశారు. వారిపైన ఉన్న గౌరవంతో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పాలకుల గురించి ఒక్కమాట కూడ అనలేదని అన్నారు. తెలంగాణ అంటే తనకు అంత ఇష్టమని స్పష్టం చేశారు.   తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను శంకిస్తే సహించేది…

TELANGANA

మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి అమరవీరులను అవమానించేలా ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.   తెలంగాణ మీ అయ్య జాగీరా?   తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ తన మనసులోని ద్వేషాన్ని, వివక్షను బయటపెట్టుకున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం…

National

తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా..!

తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు.   మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. అయితే, పార్టీలో తనకు సరైన అవకాశాలు లభించడం…