News

National

చక్కెర ధరల పెరుగుదల..! కేంద్రం క్లారిటీ..!

చక్కర ధరల పెరుగుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఇప్పటికే భారీగా చక్కెర ధరలు పెరిగాయి. దీంతో జూలై 20న కిలో చక్కెర ధర దాదాపుగా రూ.48.18 పలికింది. దీంతో ఆగస్టు 20న రూ.55.70కి చక్కెర ధర పెగింది. కేవలం నెల రోజుల్లో కిలో చక్కెరపై రూ.7.52 పెరిగింది. చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసకుందని తెలిపింది. ఇథనాల్‌కు చక్కెర మళ్లించడం…

TELANGANA

వివేకానంద కేసులో కొత్త మలుపు, ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్ల ఈడీ సోదాలు..

ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లోని ఓపెన్ స్కైస్‌లోని ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం,…

AP

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు జనసేన కమిటీని నియమించారు. దీనికోసం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మోత్తం 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన…

TELANGANA

ఎకరం రూ.264 కోట్లు.. రాయదుర్గంలో ఆల్ టైమ్ రికార్డు ధర..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా రూ. 264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ విక్రయం ద్వారా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీకి రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌లో భూమి ధరకు సంబంధించి ఇదే ఆల్ టైమ్ రికార్డ్.రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నెం. 83/1లో ఉన్న ప్లాట్ నెం. P1 కోసం…

TELANGANA

కుమార్తె వ్యాఖ్యల వివాదం..! త్వరలో నిజాలు బయటపెడతా: కొండా సురేఖ…

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు.వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత…

TELANGANA

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి పరిపాలనా శాఖ అనుమతిచ్చింది. ప్రస్తుత అంబేద్కర్ భవన్ స్థానంలో 1 సెల్లార్ + గ్రౌండ్ + 10 అంతస్తులతో కొత్త టవర్ ఉంది. 12 ఏళ్లుగా వినియోగంలో లేని పాత అంబేద్కర్ భవన్ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌అండ్‌బీ అధికారులు భవన…

TELANGANA

నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం..! క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ..

సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గంపై తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ, హైదరాబాద్‌లోని కమిటీ ఎదుట హాజరై ఈ మేరకు తన వివరణను సమర్పించారు. తన కుమార్తె అయినంత మాత్రాన ఆమె వ్యక్తం చేసిన రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సముచితం కాదని, అది సహజ న్యాయ సూత్రాలకు…

TELANGANA

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల చట్టబద్ధత, ఉచిత పథకాలకు నిధుల వినియోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాల నిధుల విడుదలపై ఉన్న మధ్యంతర స్టేను ఎత్తివేసేందుకు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్ బెల్స్’ మోగుతున్నాయని హెచ్చరించిన ధర్మాసనం… పరిమితి లేకుండా ఉచిత పథకాలకు నిధులు మళ్లించడం వల్ల ఇతర అత్యవసర…

National

ఆవేశంలో అలా అన్నాను.. ఆర్మీకి క్షమాపణ చెప్పిన లడఖ్ ‘వి ఆర్ జెన్-జీ’ యువతి..

లడఖ్‌లో ‘వీ ఆర్ జెన్ జీ’ అంటూ భారత సైనికులతో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, భారత సైన్యం, జమ్మూ కశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది. సదరు వీడియో వైరల్ అయిన అనంతరం తొలిసారిగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది.లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో, కార్గిల్…

AP

జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: మంత్రి నారా లోకేశ్..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేశ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.“ఏపీపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డీఎస్సీ అంటే ఏమిటో తెలియదు. రెండూ ఒకటే అని…