ఇస్లామాబాద్లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం సాయంత్రం ఈ కీలక సమావేశం మొదలైనట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఖలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. ఇరాన్కు చెందిన వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, లెబనాన్లో పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలు, స్తంభింపజేసిన తమ ఆస్తులను…

