భారత్కు పెను ముప్పు తప్పదా..? బ్రహ్మపుత్రపై చైనా ‘వాటర్ బాంబ్’..
భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై (టిబెట్లో యార్లంగ్ త్సాంగ్పో) చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ‘వాటర్ బాంబ్’గా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు, భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మిస్తుండటంతో, ఒకవేళ ఇది విఫలమైతే ఈశాన్య భారత్ సహా బంగ్లాదేశ్లో ఊహించని జలప్రళయం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రముఖ వ్యూహాత్మక విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ కథనం ప్రకారం.. ఈ నిర్మాణ ప్రాంతంలోని నేల…

