News

TELANGANA

కొండా సురేఖ స్థానంలో ఎవరు?.. కేబినెట్‌ విస్తరణపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు..

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపైనే అధిష్ఠానంతో చర్చ జరిగిందని తెలిపారు.కొండా సురేఖను మంత్రి వర్గం…

National

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ హతం..

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ యాసిర్ హతమయ్యాడు. యూస్‌మార్గ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.యూస్‌మార్గ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాల రాకను…

AP

ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేసిన ఆయన, వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. శనివారం వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముఖ్య…

TELANGANA

సమస్యలు గాలికొదిలేసి దేనికి ఈ సంబరాలు?: రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వేడుకలను జరుపుకోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పరిపాలనా విధానాన్ని, ఆయన పనితీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుత…

AP

ఏపీలో మున్సిపల్ పోరుకు కొత్త రూల్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నూతన నిబంధనలతో కూడిన మూడు కీలక జీవోలను జారీ చేసింది.డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. మున్సిపల్…

National

ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో ఎయిర్‌పోర్ట్‌..

దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. ఈ కుండపోత వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, పలు విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లించారు.వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ ప్రభావంతో మధ్యాహ్నం 3:30 నుంచి…

TELANGANA

మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు..? కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు వైరల్..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు? గురువారం సాయంత్రం మీడియాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆమె ప్రెస్ మీట్ చూసినవాళ్లు మాత్రం, పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పలువురు రాజకీయ నేతలు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. చెప్పాల్సిన వన్నీ…

TELANGANA

కేసీఆర్‌కు బిగ్ షాక్..! సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నాచేయాలని నర్ణయించింది. అందుకోసం ఈనెల 6వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. గత వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అటు అసెంబ్లీకి సైతం హాజరుకాకుండా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్…

AP

ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పవన్ హెచ్చరిక..!

రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) తీరుపై రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తూ, మరోవైపు గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో సగం కాలుష్యానికి ఈ కంపెనీయే కారణమని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం దగ్గర నుంచి లైసెన్సు రద్దు వరకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం…

AP

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడు జాన్ సైదా హర్యానాలో అరెస్ట్..

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ జాన్ సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను షేక్ జాన్ సైదా (రబ్బానీ) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి…