News

National

పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రీడా జట్లకు పచ్చజెండా..!

భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రీడా బృందాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (శాఫ్) గేమ్స్‌లో భారత క్రీడాకారులు పాల్గొంటారని పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని, దీంతో భారత బృందం పాకిస్థాన్‌కు వెళ్లనుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలు…

TELANGANA

అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..!

తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలగా మంచిగా మీరు మమ్మల్ని చూసుకుంటారని మంత్రి సీతక్క అన్నారు. లేని తల్లి గురించి అవమానకరంగా మాట్లాడిన తాత మధును వెంటనే సస్పెండ్ చెయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ విషయంపై కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు సభ్యత్వం తొలగించాలని అన్నారు. స్పీకర్ పై అనుచిత వాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తాతా మదు, నవీన్ రెడ్డిపై చర్యలు…

AP

కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన..! సీఎం అభ్యర్థి ఎవరంటే..?

“అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే” అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన… భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఏపీని రూ. 12 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే…

TELANGANA

ఇది దుశ్శాసన సభ.. మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా?: కేటీఆర్.

ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులపై పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజులుగా పాలన సాగిస్తోందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే తమపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపినట్లే తాము కూడా నిరసన తెలిపేందుకు యత్నించామని,…

AP

డీఎస్సీలో భారీ స్కామ్ జరిగింది.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసి, సీబీఐతో విచారణ జరిపించాలి: సజ్జల..

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామక ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇది ‘క్యాష్ ఫర్ టీచర్ పోస్ట్’ స్కామ్ అని అభివర్ణించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సోమవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో…

TELANGANA

కొండా సురేఖ స్థానంలో ఎవరు?.. కేబినెట్‌ విస్తరణపై పీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు..

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించిన అంశాలపైనే అధిష్ఠానంతో చర్చ జరిగిందని తెలిపారు.కొండా సురేఖను మంత్రి వర్గం…

National

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ హతం..

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ యాసిర్ హతమయ్యాడు. యూస్‌మార్గ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.యూస్‌మార్గ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాల రాకను…

AP

ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేసిన ఆయన, వారి దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. శనివారం వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముఖ్య…

TELANGANA

సమస్యలు గాలికొదిలేసి దేనికి ఈ సంబరాలు?: రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వేడుకలను జరుపుకోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పరిపాలనా విధానాన్ని, ఆయన పనితీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుత…

AP

ఏపీలో మున్సిపల్ పోరుకు కొత్త రూల్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నూతన నిబంధనలతో కూడిన మూడు కీలక జీవోలను జారీ చేసింది.డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. మున్సిపల్…