News

TELANGANA

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: సీఎం రేవంత్‌..

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. బ్రిటన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.బ్రిటన్‌ పర్యటనకు అనుమతించారని, కానీ అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.…

Uncategorized

మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆయన్ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ…

TELANGANA

కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

AP

ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. టెక్నాలజీతోనే సేవలు: సీఎం చంద్రబాబు..

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదేపదే వాటిని అప్‌లోడ్ చేసే పనిలేకుండా ‘డేటా ఇంటిగ్రేషన్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

National

కేంద్రంపై సీజేపీ ఆగ్రహం..! సెప్టెంబర్ 5న మరోసారి భారీ నిరసనకు పిలుపు..!

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ నిరసన ర్యాలీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ వరకు…

AP

ఏపీలో స్థానిక ఎన్నికలంటూ ప్రచారం.. ఎస్ఈసీ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఈ ఫేక్ షెడ్యూల్‌ను ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠినమైన సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు.ఎన్నికల కమిషన్ అధికారిక చిహ్నాలు, లోగోలను…

TELANGANA

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ.. మల్లు రవికి కీలక విజ్ఞప్తి..!

టిపిసిసి క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాసారు. తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటి ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ విజ్ఞప్తి చేసారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో…

TELANGANA

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు..!

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. లండన్ యూనివర్సిటీలోని సెనేట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర…

AP

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన “జాబ్ క్యాలెండర్-2026″ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆగస్టు 22, 2026న జీవో నెం.81ను జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు), డీఎస్సీ వంటి…

AP

డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం..! జగన్‌కు నారా లోకేశ్ ఐదోసారి సవాల్..

డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!” అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా…