News

National

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అనే ముఖ్యమైన ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, పర్యావరణ న్యాయ వ్యవస్థల బలోపేతంపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ అంతర్జాతీయ వేదికపై…

TELANGANA

ఎర్రవల్లి భూముల సర్వేలో మరో ట్విస్ట్‌.. 180 ఎకరాలు మావేనంటున్న రైతులు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూముల సర్వేలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల భూమిపై రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన సర్వే మూడో రోజుకు చేరుకోగా, ఈ వివాదంలోకి పొరుగున ఉన్న వెంకటాపూర్ గ్రామస్థులు ప్రవేశించారు. సర్వే చేస్తున్న భూమిలో తమ వాటా కూడా ఉందని వారు కొత్త వాదనను…

TELANGANA

అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌‍పీ) దాఖలు చేశారు.బీఆర్ఎస్ తరపున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై శుక్రవారం హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం విదితమే. సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం పార్టీ…

AP

కరవులో రైతాంగం.. దోపిడీలో కూటమి ప్రభుత్వం: పేర్ని నాని

అధికార పీఠం ఎక్కేందుకు ఊహాజనిత హామీలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పూర్తిగా పక్కనబెట్టేసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందక, సరైన ప్రణాళికలు లేక కరవు కోరల్లో చిక్కుకుని రైతాంగం అల్లాడిపోతుంటే… కూటమి నాయకులు మాత్రం పాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకోవడంలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ అందించిన పారదర్శక సంక్షేమ పథకాల కంటే మిన్నగా పథకాలు ఇస్తామంటూ…

AP

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా..? ఈడీ క్లారిటీ..!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈడీ ప్రెస్ నోట్‌లో ‘జంతువుల కొవ్వు’ అనే పదం లేకపోవడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో తిరుమల లడ్డూలో అసలు ఏం జరిగింది? జంతువుల కొవ్వు ఉందా? లేదా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న కి పెట్టె ప్రసాదంలో నెయ్యికి…

AP

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గనులపై మైనింగ్ శాఖ దాడి.. క్వారీ యంత్రాలు, వాహనాలు స్వాధీనం..

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన గనుల్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులపై మైనింగ్ శాఖ అధికారులు ఈరోజు మెరుపు దాడులు నిర్వహించారు. సాంకేతిక బృందాలతో కలిసి రంగంలోకి దిగిన అధికారులు మైనింగ్ సరిహద్దులు, పరిమితికి మించిన క్వారీయింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అధునాతన మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నిబంధనలను…

National

మెడికల్‌ షాపుల్లో సీసీటీవీ నిఘాలోనే మందులు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు..

డాక్టర్ల సిఫార్సుతో విక్రయించే మందులపై కేంద్రం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్‌ పొందిన రిటైల్‌ కేంద్రాల్లో ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా మందులు విక్రయించే సమయంలో సీసీ కెమెరా నిఘా తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది.సెప్టెంబర్‌ 8న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. రిజిస్టర్డ్‌ వైద్యుడు సూచించిన ఏదైనా మందును హోల్‌సేల్‌ విక్రయాలు మినహా ఇతర మార్గాల్లో సరఫరా చేసే సమయంలో లైసెన్స్‌ పొందిన ప్రాంగణంలో…

TELANGANA

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..

తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 20న ఓటర్ల నమోదుకు సంబంధించి పబ్లిక్ నోటీసు జారీ చేయనున్నారు. అప్పటి నుంచి నవంబర్ 6 వరకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నవంబర్ 25న ముసాయిదా…

TELANGANA

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ప్రభుత్వ దృష్టి.. రంగంలోకి రెవెన్యూ అధికారులు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫామ్‌హౌస్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేస్తున్నారు.ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లు, ప్రస్తుత భూ రికార్డుల వివరాలతో అధికారులు సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌…

AP

రాష్ట్రంలో తీవ్ర కరవుపై ముందస్తు చర్యలు శూన్యం: కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజం..

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమవుతున్న కరవు, వర్షాభావ పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాల వారీగా పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సెప్టెంబర్‌ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని, మొత్తం 688 మండలాల్లో 628 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.…