News

AP

ఘోర బస్సు ప్రమాదం…. కనీసం 10 మంది సజీవదహనం……

  ఆంధ్రప్రదేశ్: * మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. * మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. * కనీసం 10 మంది సజీవదహనం అయ్యారు. * మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. * చందూ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్తేందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. *…

AP

విజయవాడలో ఉగ్ర కలకలం… ముగ్గురు యువకుల అరెస్ట్..

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులు మంగళవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)‌లను అదుపులోకి తీసుకున్నారు.   విజయవాడలోని వించిపేటలో నిందితుల నివాసాల సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నివాసాల్లో సోదాలు…

National

మతం మారితే రిజర్వేషన్లు కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

రాజ్యాంగబద్ధంగా సంక్రమించే రిజర్వేషన్ ఫలాల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు (SC) కేటాయించిన ప్రయోజనాలు కేవలం నిర్దేశిత మతాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేస్తూ, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై ఎస్సీ రిజర్వేషన్ల కింద పొందే రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలకు అనర్హులవుతారని న్యాయస్థానం తేల్చి చెప్పింది.   అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన…

TELANGANA

జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..

జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం టీపీసీస అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అంతర్గత పరిణామాలు గందరగోళానికి దారితీయడంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నేరుగా రంగంలోకి దిగింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.   ఈ సంక్షోభ నివారణ…

TELANGANA

డీలిమిటేషన్ పై పోరాటం.. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి- సీఎం రేవంత్ రెడ్డి..

“నేను దేశ రాజకీయాల్లో పనిచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మోడీ త్రీడి పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతం ఐక్యం కావల్సి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి కేంద్రంలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు…

AP

జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. నోవాటెల్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు. కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను ప్రతి గ్రామంలోనూ నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.   ముఖ్యంగా పార్టీని…

AP

కదిరిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం: ‘టీబీ అంతం – మన పంతం’ అంటూ భారీ ర్యాలీ

ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కదిరి టీబి యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న సాయంత్రం పూట జ్వరము వస్తూ ఉన్న దగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడిన బరువు తగ్గిపోతున్న వారు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గల్ల పరీక్ష మరియు వీలైతే ఎక్సరే కూడా చేయించుకోవాలి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే…

National

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు..

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు.   విశ్వసనీయ వర్గాల సమాచారం…

AP

ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో భారీ అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఇండియా ఏర్పాటు చేయనున్న మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌గా నిలవనున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా, పారిశ్రామిక ఆవిష్కరణలలో ఏపీని ముందంజలో నిలుపుతుందని ఆయన…

TELANGANA

దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్..

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద వాహనాల రాకపోకల కోసం మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతులు సాధించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.   సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సుచిత్ర జంక్షన్ నుంచి ప్యారడైజ్…