News

National

“బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?”.. మీడియాపై పినరయి విజయన్ ఫైర్..

కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు గురించి మీడియా వెంటపడడంతో సహనం కోల్పోయారు. “నాతో పాటు బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?” అని వారిపై విరుచుకుపడ్డారు.వివరాల్లోకి వెళితే… బుధవారం చంగనచేరికి వెళుతుండగా మార్గమధ్యంలో విజయన్ మధ్యాహ్నం కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్‌లో ఆగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఆయన కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ…

AP

మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌తో… జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.గతంలో అధికారం కోసం…

TELANGANA

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర..? కేసీఆర్‌పై అసెంబ్లీలో రేవంత్‌ ఆరోపణలు..!

అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై మాటల దాడికి పాల్పడటం పార్లమెంట్‌, ముంబయి, పుల్వామా దాడులతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.శాసనసభలో బుధవారం మాట్లాడిన సీఎం.. స్పీకర్‌ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌ను దూషించిన ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఇలాంటి ఘటన తర్వాత కేసీఆర్‌ స్వయంగా స్పీకర్‌తో మాట్లాడి…

AP

ఏపీలో స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి ఓటర్ల జాబితాలను తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలు: సెప్టెంబర్ 11: ఫొటో సహిత ఓటర్ల జాబితాల ప్రదర్శన సెప్టెంబర్ 14: పోలింగ్ కేంద్రాల ముసాయిదా (Draft)…

TELANGANA

ఆ బూతులు భరించలేకనే కడుపు మండి మాట్లాడా!: కేసీఆర్ పై వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే శంకర్ వివరణ..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన రాజకీయ దుమారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును కోరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన అంగీకరించారు. అయితే, సభలోనూ బయటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను, మహిళా మంత్రులను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత అసభ్యకరంగా, కులాల పేరుతో దూషిస్తూ లక్ష్మణరేఖ…

National

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు..

ప్రధాని మోదీ ముంబయి పర్యటన వేళ.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఉన్న నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వద్ద మోదీ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. ఇద్దరు అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదుపులోకి తీసుకున్న…

TELANGANA

ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్..

తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధు చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తున్నారన్న సమాచారంతో బీఆర్‌ఎస్‌ నేతలు అలెర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే ఎర్రవల్లి వద్ద ఘర్షణ వాతావరణం ఉండటంతో శాంతి భద్రతల కారణంగా కేటీఆర్‌, హరీశ్‌రావులను మాత్రం హకీంపేట ప్రాంతంలో…

TELANGANA

తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు .!

తెలంగాణ శాసన సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ పై తెలంగాణ అసెంబ్లీ ముందు దరుసుగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలైన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శాసన మండలి షెసన్స్‌ మొత్తానికి హజరుకాకుండా వీరిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సంఘటన రాజకీయంగా…

AP

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..!

హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేయాలని తెలిపారు. పార్వతీపురం మన్యం సీతంపేటలో సవర కళాకారుల సెంటర్ పనులను ప్రారంభించారు. వీబీ-జీ రామ్ జీ నిధులతో సవర కళాకారుల సెంటర్ నిర్మాణం చేయనున్నారు. వీటికోసం మదనపల్లి, అనంతపురం, పెడనల్లో సెంటర్ల కోసం స్థలాల గుర్తించారు. త్వరలో మదనపల్లి, అనంతపురం, పెడనల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని…

AP

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను.

విజయనగరం జిల్లాలో వైసీపి కి పెద్ద షాక్ తగిలింది.బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. తనతో పాటు అనుచరులు కూడా టీడీపీలో చేరడం విశేషం. చంద్రబాబు స్వయంగా చిన్న శ్రీనుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.…