వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో పాటు…

