News

TELANGANA

శివరాజ్ సింగ్ చౌహాన్ తో రేవంత్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు కీలక గ్రామీణాభివృద్ధి అంశాలు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకాల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.   గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు. ఈసారి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు…

AP

ఏపీపై ఎల్‌నినో పంజా.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు.   ఈ సందర్భంగా అధికారులు పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో జూలై నెలలో ఏకంగా 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సగటున…

TELANGANA

బ్లాక్‌మెయిల్ కోసమే హైడ్రా: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..

హైడ్రా కమిషనర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్లాక్‌మెయిల్ సాధనంగా వాడుకుంటోందని, హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని ఆయన విమర్శించారు.   మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, బిల్డర్లను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికే హైడ్రాను…

TELANGANA

హైదరాబాద్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి..

మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆయన్ను గుర్తించిన పోలీసులు, అనంతరం హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు…

National

కృత్రిమ సూర్యుడి దిశగా చైనా..!

అపరిమితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించే లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. అణు సంలీన రియాక్టర్ కోసం రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ మాగ్నెట్‌ను చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. భవిష్యత్తులో ఫ్యూజన్ ఎనర్జీని సాధించే దిశగా ఇది అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ విజయమని నిపుణులు అభివర్ణిస్తున్నారు.   చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ (ఏఎస్ఐపీపీ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.…

TELANGANA

ఇకనుంచి ఒకే ఒక్క కార్డు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొనుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అతి ఫ్యామిలీ రిజిస్టర్ తీసుకురానున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ప్రభుత్వ సేవలకు ఒకే కుటుంబ రికార్డు అందుబాటులోకి తేచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.   మీ సేవా కేంద్రాల ద్వారా.. అయితే కుటుంబ వివరాల ధృవీకరణను సులభతరం చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు రేషన్ కార్డు డేటా…

AP

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా..! ఎప్పుడంటే..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హంగామా మొదలవుతోంది. ఓ వైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పార్టీలు నేతలు, కేడర్‌ను అలర్ట్ చేయడంతో రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.   ఏపీలో స్థానిక సంస్థల హంగామా- తొలుత సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఓటర్ల…

AP

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతల ఐక్యత, వారి భేటీలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంతాప సభ ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ మంటలు రాజేసింది. ముద్రగడ కుటుంబంలో జరిగిన సంతాప సభకు హాజరై తన పక్కన కూర్చున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కాపులు ఒకటైతే చంద్రబాబుకు భయం.. కాపులందరూ…

TELANGANA

హైకోర్టు సంచలన నిర్ణయం.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తొలగింపునకు ఆదేశాలు..

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన్ను కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్‌ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.   మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్‌ 1, 2లలో…

National

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..! రూ.10, రూ.20 నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.   ఈ ప్రయోగాల్లో భాగంగా రూ. 10, రూ.…