News

National

ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్‌ సంచలన ప్రకటన..

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గత రాత్రి భారీ దాడులు నిర్వహించామని తెలిపారు. అవసరమైతే మరోసారి కూడా అదే స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌ తీరుతెన్నులు మారకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   టర్కీలోని అంకారాలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని ప్రస్తావించారు. గత రాత్రి తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించామని, అవసరమైతే ఈ…

TELANGANAUncategorized

నాకు మంత్రి పదవి ఇవ్వండి.. నీళ్లు తెచ్చి చూపిస్తా: హరీశ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే, కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.   మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు పవర్‌పాయింట్…

TELANGANA

రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి..!

ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లింగ్ మరియు కేంద్ర నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందగమనం, కేంద్రం ఇస్తున్న రుణాల వినియోగం, సన్నబియ్యం పంపిణీలో కేంద్ర వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు.   కొనుగోళ్లలో వైఫల్యం..   రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి…

TELANGANA

రవాణా శాఖలో తెలంగాణ సర్కార్ సంచలన జీవో..!

మైనర్లు వాహనాలు నడపడిపితే మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199-ఏ ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది. జీవోను బుధవారం విడుదల చేసింది. అన్ని రవాణాశాఖ కార్యాలయాలకు జీవో కాపీలను పంపించింది. 18ఏళ్ల లోపు వయస్సు గల వారికి వాహనాలు నడపడానికి ఇవ్వవద్దనితల్లిదండ్రులు, సంరక్షకులకు రవాణాశాఖ విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.   సెక్షన్ 199-ఏ ప్రకారం.. మోటారు…

AP

మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మతపరమైన అంశాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. అమరావతి వేదికగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్వేషాలు రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు.   జగన్ వ్యాఖ్యలపై కౌంటర్..   గతంలో అమరావతి అని, ఆ తర్వాత…

AP

‘గ్లోబల్ లెవెల్లో’ ఏపీ హస్తకళల ..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళల వారసత్వానికి పుట్టినిల్లని, ఒక జాతి యొక్క అసలైన గొప్పతనం ఆ దేశం నిర్మించిన భవనాల్లో కాకుండా, అక్కడి కళాకారుల్లోనే కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని అంబేద్కర్ కళావేదికలో ఘనంగా ప్రారంభమైన ‘ఏపీ హస్తకళా మహోత్సవం 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళాకారుల స్టాల్స్‌ను ఆయన సందర్శించి, వారి అద్భుతమైన ప్రతిభను అభినందించారు.   శ్రమకు…

TELANGANA

‘డిజిటల్ గవర్నెన్స్’కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్..

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.…

TELANGANA

సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం..

తెలంగాణ ఆర్థిక రంగానికి, సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సంతకం చేశారు. ఈ మైనింగ్ లీజ్ కేటాయింపు తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.…

TELANGANA

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్..

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.   ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు   వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు)…

AP

నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు..!

చరిత్ర అనేది కేవలం పుస్తకాల్లో దాగుండేది కాదు.. భూగర్భంలో, అడవుల్లో, నదీ తీరాల్లో శిలల రూపంలో నిగూఢంగా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అవి బయటపడి మన పూర్వీకుల జీవన విధానాన్ని మన కళ్లకు కడతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక ఆవిష్కరణ జరిగింది. సాహసోపేతమైన అన్వేషణకు నిలయమైన నల్లమల పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో భారత పురావస్తు శాఖ (ASI) శాసన విభాగం చేపట్టిన ప్రత్యేక సర్వేలో రెండు అత్యంత అరుదైన, ప్రాచీనమైన…