వైసీపీ మాజీ ఎమ్మెల్యే గనులపై మైనింగ్ శాఖ దాడి.. క్వారీ యంత్రాలు, వాహనాలు స్వాధీనం..
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన గనుల్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులపై మైనింగ్ శాఖ అధికారులు ఈరోజు మెరుపు దాడులు నిర్వహించారు. సాంకేతిక బృందాలతో కలిసి రంగంలోకి దిగిన అధికారులు మైనింగ్ సరిహద్దులు, పరిమితికి మించిన క్వారీయింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అధునాతన మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నిబంధనలను…

