News

National

అది ఓ చారిత్రక రాత్రి..! స్వాతంత్ర్యం ఆగస్టు 15, అర్ధరాత్రే ఎందుకు..?

అది ఓ చారిత్రక రాత్రి.. తెల్లవారితే దేశం మొత్తం స్వేచ్ఛా భారతాన్ని చూడబోతోంది. కానీ స్వాతంత్ర్యం ప్రకటించాల్సిన సమయం దగ్గరపడే కొద్దీ ఓ విచిత్రమైన చర్చ మొదలైంది. ఆగస్టు 15న భారత్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం శుభం కాదని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. తేదీని మార్చే పరిస్థితి లేదు. దీంతో అదే తేదీలో.. ఓ ప్రత్యేక సమయాన్ని ఎంచుకునే ఆలోచన తెరపైకి వచ్చింది. చివరకు అర్ధరాత్రి వేళ భారత్‌ స్వేచ్ఛను అందుకుంది.మౌంట్‌బాటన్‌ ఖరారు చేసిన ఆగస్టు 151947…

TELANGANA

తెలంగాణ రాజకీయాలపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్..

తెలంగాణ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. నిజాయితీగా పని చేసే నాయకులు మద్దతుగా నిలిస్తే.. తమిళనాడు మాదిరిగా మార్చేస్తామని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కాకుండా వలస వచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలియని వారు ఉండరు. ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం…

AP

డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అందుబాటులో ఉన్న మంత్రులు లంచ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 వివాదం, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ అనుకూలురకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికే అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేశారని మంత్రులు…

AP

అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం..!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్ దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టానికి ఫలితం దక్కుతోంది. తాజాగా రాజధాని అమరావతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. పనులు విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వేగంగా జరుగుతున్నాయి. గురువారం ప్రజాప్రతినిధుల టవర్స్‌ని…

AP

ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త బలం..! 58 ఆధునిక వాహనాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను సమకూర్చారు.ఈ కొత్త వాహనాల్లో వేర్వేరు అవసరాలకు తగినట్లుగా మూడు రకాలు ఉన్నాయి. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు…

TELANGANA

రేషన్‌ కార్డులపై ‘స్మార్ట్‌’ రాజకీయం.. మోదీ ఫొటో ఎందుకు లేదంటూ బీజేపీ ఫైర్‌..!

తెలంగాణలో కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే పంపిణీకి ముందే కార్డులపై రాజకీయ వివాదం మొదలైంది.కార్డుపై ఇద్దరి ఫొటోలే..ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డు నమూనాలో సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో…

National

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి పాక్‌ ఉగ్రవాద సంస్థలు..

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను పాక్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హమాస్‌ నుంచి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌ (జేఈఎం)కు యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ వ్యూహం పన్నుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా హమాస్‌, పాక్‌ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలపై భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధం సాగించేలా లష్కర్‌, జైష్‌ను సిద్ధం చేయడం…

National

భారత్‌తో సరిహద్దు వివాదం..! చేతులెత్తేసిన నేపాల్..

భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఖరారు చేసిన 1816 నాటి చారిత్రక సుగౌలీ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదని నేపాల్ ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ ఈ విషయాన్ని ప్రతినిధుల సభలో స్వయంగా…

TELANGANA

కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ..! కోర్టులో ఉత్కంఠ.. సెప్టెంబర్ 9కి వాయిదా..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక…

AP

ఏపీలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వారు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి రాష్ట్రంలోనే విలువ ఆధారిత…