News

World

Pakistan Army: అధికారిక కమ్యూనికేషన్‌కు వాట్సాప్‌కు బదులు వీచాట్‌.. పాక్ ఆర్మీ కీలక నిర్ణయం?

పాకిస్థాన్ ఆర్మీ తన అధికారిక సమాచార మార్పిడిలో వాట్సాప్ వినియోగాన్ని నిలిపివేసి, చైనాకు చెందిన మెసేజింగ్ యాప్ వీచాట్‌కు మారాలని సిబ్బందికి ఆదేశించినట్లు ఓ నివేదిక పేర్కొంది. అధికారిక సంభాషణల్లో నిఘా, డేటా లీక్‌, హ్యాకింగ్‌ వంటి భద్రతా ముప్పులు ఉండొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీ అధికారులు, సైనికులు అధికారిక చాట్స్‌, సమాచార మార్పిడికి క్రమంగా వీచాట్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సున్నితమైన సైనిక సమాచారం…

National

PM Modi: కొత్త రాజ్యసభ ఎంపీలకు మోదీ కీలక సూచనలు.. 100% హాజరుపై ఫోకస్

నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్త ఎంపీల కోసం తన నివాసంలో మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. వీలైనంత…

AP

Kurnool: వృద్ధురాలి ఆత్మహత్య కేసులో 12 మందిపై BNS 108 కింద కేసు

కర్నూలు జిల్లా గోనెగండ్లలో 72 ఏళ్ల చాకలి ఈరమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. వృద్ధురాలి భూమికి సంబంధించి ఇతరులకు పాస్‌బుక్‌ మంజూరు చేయడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై, అలాగే ఆమెపై మరో వర్గం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు కర్రెన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి భూమి విషయంలో అధికారులు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు వేధింపులకు…

Business

LIC: LICలో 6.5% వాటా విక్రయం.. పాలసీదారులు, ఇన్వెస్టర్లపై ప్రభావం ఎలా ఉంటుంది?

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LICలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ వాటా తగ్గడంతో పాటు మార్కెట్‌లో ప్రజల వాటా పెరగనుంది. దీంతో పాలసీదారులు, పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వం LICలో వాటాను ఎందుకు విక్రయించాల్సి వస్తోందంటే.. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల్లో కనీసం…

TELANGANA

మియాపూర్‌లో చైన్ స్నాచింగ్.. కొరియర్ బాయ్‌గా వచ్చి మహిళపై పెప్పర్ స్ప్రే

మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుర్వేద మందుల కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షాల్ (20)…

Health

గుప్పెడు పచ్చ పెసలు రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

శరీరానికి ప్రోటీన్, పోషకాలు అందించేందుకు చాలామంది పాలు, గుడ్లపై ఆధారపడుతుంటారు. అయితే మన వంటింట్లో సులభంగా లభించే పచ్చ పెసలు కూడా మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పలు పోషకాలు ఉండటంతో సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఆధునిక జీవనశైలిలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, పోషకాహార లోపం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పచ్చ పెసలను మొలకలు కట్టించి లేదా నానబెట్టి తీసుకోవడం…

Business

UPI లావాదేవీలకు మరింత భద్రత.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంకుల కీలక చర్యలు

డిజిటల్ యుగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నగదు అవసరం లేకుండా క్షణాల్లో చెల్లింపులు చేసుకునే సౌకర్యం ఉండటంతో కోట్లాది మంది యూపీఐ యాప్‌లను వినియోగిస్తున్నారు. అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్ల మాయలో పడి తమ డబ్బును కోల్పోతున్నారు. ఫేక్ పేమెంట్ రిక్వెస్టులు, మోసపూరిత లింకులు, నకిలీ కస్టమర్…

TELANGANA

సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన.. విద్యార్థులతో ప్రతిజ్ఞ

సూర్యాపేటలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పోలీసు శాఖ, సూర్యాపేట బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న జయ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లు జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని, మంచి భవిష్యత్తు,…

AP

కర్నూలులో ఉద్రిక్తత.. గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. యాదవ కుటుంబాలను…

National

ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై FSSAI కొరడా.. విక్రయాలపై తక్షణ నిషేధం

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విస్కీ, రమ్ ప్రియులకు, ప్రముఖ మద్యం తయారీ సంస్థలకు షాక్ ఇచ్చింది. డయాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రెవ్ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే పలు ప్రముఖ బ్రాండ్ల విక్రయాలపై తక్షణ నిషేధం విధించినట్లు సమాచారం. ఆహార, పానీయాల భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో కొన్ని ఉత్పత్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు…