News

TELANGANA

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల దొంగతనంతో పాటు…

National

భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం..

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం 428.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.   అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఈ ప్రతిపాదనలను…

TELANGANA

రేపు పులివెందులకు వెళుతున్న జగన్.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి జూన్ 25 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమీక్షలు జరపడంతో పాటు ప్రజలను నేరుగా కలవనున్నారు.   రేపు సాయంత్రానికి జగన్ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు…

TELANGANA

డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.   డీటీఓ వెంకన్న మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదనే బలమైన సందేహాన్ని హరీశ్‌రావు లేవనెత్తారు. “రాష్ట్రంలో…

AP

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు..

విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం సీఐ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు పెద్ద డ్రామానే సాగింది. ఆయన్ని అరెస్ట్ చేయవద్దని ఓ వర్గం ఆందోళనకు పిలుపు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది?   విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు   విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వ్యవహారం కాస్త రాజకీయ రంగు…

TELANGANA

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.   రూ. 13 వేల కోట్లు.. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన…

TELANGANA

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు.   నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆపై పార్టీ ఆఫీసు…

AP

సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్..!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.   తల్లి విజయలక్షి ఎమోషనల్.. సాయి కృష్ణ మృతి…

National

ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు..

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఓ అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని భారత సైన్యం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య ఏ రంగంలోనూ, ఏ స్థాయిలోనూ కరచాలనాలు లేకపోవడం తెలిసిందే.   పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు…

AP

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం..

భారతదేశ బంగారు ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా అవతరించనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది.   జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌’ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్…