News

AP

పవన్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారుస్తాం: సీఎం చంద్రబాబు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా నిధులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పనిదినాలు కల్పించి, రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తుల కల్పనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్…

TELANGANA

స్పీడ్ పోస్టులో గంజాయి దందా.. భారీ నెట్‌వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్..

భారత తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ సేవలను అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతరాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌-న్యూ) అధికారులు రట్టు చేశారు. ఝార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయడంతో పాటు, హైదరాబాద్‌లో గంజాయి కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   పోలీసుల కథనం ప్రకారం, ఝార్ఖండ్‌లోని గిరిడ్ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ…

Uncategorized

వాహనదారులకు గుడ్ న్యూస్..! రెండు, మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..

వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు, మూడు నెలల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన గురువారం వెల్లడించారు.   పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన నిల్వలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వినియోగిస్తున్నాయని మంత్రి వివరించారు. దీనివల్ల…

AP

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం… సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ..

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన…

TELANGANA

తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్‌గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎర్పాటు చేశారు. ఘతంలో మంత్రి శ్రీధర్ బాబు ఫైలెట్ ప్రాజెక్ట్ క్రింద దీన్ని ఎర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ-క్యాబినెట్ విధానంలో రాష్ట్రంలోని మంత్రులందరు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ఎర్పాటు చేశారు.   వీబీ జీ-రామ్ పథకం.. అయితే తెలంగాణకు ప్రధాన కార్యదర్శి…

National

రామ మందిర విరాళాల కేసులో సంచలన విషయాలు..! తెలిస్తే షాక్ అవుతారు ..

అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాశ్ శుక్లాను పోలీసులు విచారించారు. చోరీ చేసిన నగదును ముందుగా మరుగుదొడ్లలో దాచేవాళ్లమని, తర్వాత అవకాశం చూసుకుని బయటకు తరలించేవాళ్లమని చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఆలయ ట్రస్టీ అనిల్‌ మిశ్రా కీలక పాత్ర పోషించేవారని కూడా అవినాశ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు.…

National

వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం హెచ్చరిక..!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్స్‌తో ఇతరులను మోసగించడం (ఇంపర్సొనేషన్) వంటివి పెరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు బుధవారం వెలువడిన పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   వాట్సాప్ ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. దీనివల్ల వినియోగదారులు తమ…

TELANGANA

మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.   1,700 స్కూళ్ల కోసం.. మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర శిక్ష పరిధిలో…

TELANGANA

పాలనపై చర్చకు సిద్ధం.. తేదీ చెప్పండి: రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.   ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

AP

‘సర్’ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది.. జగన్ షాకింగ్ కామెంట్స్..

“ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవాడి ఓటు హక్కునే కాలరాస్తున్నారు” అంటూ వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్లకు కనీసం ఫారాలు ఇవ్వకుండానే, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వేలాది మంది పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన…