News

TELANGANA

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌.. ఎన్విడియా వెరా రూబిన్‌ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్..!

హైదరాబాద్‌కు మరో మణిహారంగా నిలవనుంది ఏఐ ఫ్యాక్టరీ. ఆసియాలో మొదటి అత్యంత అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌ను ఏఎం ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఫార్మాలోనే కాదు ఐటీ రంగంలోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. తాజాగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండంలో తొలిసారి అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్లలో…

TELANGANA

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ..!

తన బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏళ్ల బిడ్డ, కొడుకు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ…

AP

టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్..!

గొడ్డలి పార్టీకి ఒక అలవాటు ఉందని, వాళ్ల మనుషులను వాళ్లే చంపుకుంటారని ఆరోపించారు మంత్రి లోకేష్. ఆ నింద మనపై వేశారని అన్నారు. తండ్రి హత్య కేసులో  ఆనాడు సునీత సహా అందరూ నమ్మారని, ఇవాళ అసలు వాస్తవాలు బయటపడ్డాయన్నారు. గొడ్డలి, కోడికత్తి, గులకరాయి వంటి ఘటనలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని డ్రామాలు వస్తాయోనని, ఈ విషయంలో అందరం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకరోజు ఒక కన్ను, రెండో రోజు మరో కన్నుకు కట్టుకట్టారని ఎద్దేశా…

AP

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్..!

మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి మాజీ సీఎం జగన్ కొత్త విషయాలు చెబుతుంటారు. ఈసారి కూడా అదే చేశారు. కాకపోతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి అంటగలిపే ప్రయత్నం చేశారు. ఆయన అరెస్టు వెనుక ముమ్మాటికీ ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో వైసీపీ ఆఫీసులో మాట్లాడిన ఆయన, కొన్ని విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై…

AP

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం జగన్..

చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగాయి మాజీ సీఎం జగన్. కేవలం మూడు అంశాలను ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు.…

National

నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికుల గల్లంతు.. తీవ్ర ఆందోళన..

హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది బృందంలోని 140 మంది ఆచూకీ తెలియకపోవడమే ఇందుకు కారణం. భోటేకోశీ నదికి బుధవారం ఆకస్మికంగా పోటెత్తిన వరదల కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 95 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారని ప్రాథమిక సమాచారం అందుతోంది.వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు టూర్ ఏజెన్సీ…

National

తొలిసారిగా మహిళలకు కమాండో శిక్షణ.. ఎన్ఎస్‌జీ కీలక ముందడుగు..

భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాట విభాగంలో మహిళల కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) చారిత్రాత్మక ముందడుగు వేసింది. తొలిసారిగా వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) మహిళా సిబ్బంది కోసం హర్యానాలోని మానేసర్‌లోని ఎన్ఎస్‌జీ శిక్షణా అకాడమీలో ‘మహిళా కమాండో కన్వర్షన్ కోర్సు’ (ఎంసీసీసీ)ను ప్రారంభించింది.నారీశక్తి సాధికారతలో ఇదొక నూతన అధ్యాయమని ఎన్ఎస్‌జీ పేర్కొంది. ‘సాహసవంతులే నాయకత్వం వహిస్తారు’ (She Who Dares, Leads) అనే…

AP

తెలిసి తెలిసి నా గొంతు కోశారు.. ఇది పక్కా ప్రణాళికతో చేసిన మోసం..! మేఘన సంచలన ప్రెస్ మీట్..

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో చెలరేగిన వివాదం పెను సంచలనంగా మారింది. ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చి, తన అత్తింటి వారిపై కఠినమైన, తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి ముందే తెలిసి కూడా, కేవలం తమ పరువు కోసం తన జీవితాన్ని బలి చేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అదనపు కట్నం వేధింపుల నుంచి మత మార్పిడి ఒత్తిడి వరకు తాను…

Uncategorized

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ వార్నింగ్..! అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్..

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావని… క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన కీలక సమయమని జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన…

TELANGANA

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేరు కానీ.. విదేశీ విద్య అందిస్తారంట!: బండి సంజయ్..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని… అలాంటప్పుడు విదేశీ విద్యను అందిస్తామని, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు బకాయిలు అందకపోవడంతో రాష్ట్రంలో అనేక కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు…