News

TELANGANA

సెమీకండక్టర్ రంగానికి రెడ్ కార్పెట్.. సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..

భవిష్యత్తు ప్రపంచ సాంకేతిక రంగాన్ని, కృత్రిమ మేధస్సు విప్లవాన్ని శాసించబోతున్న సెమీకండక్టర్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ పరికరాలు, చిప్ డిజైనింగ్, తయారీ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా, తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ బృందం ప్రకటించింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య,…

Uncategorized

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ.. 30 రోజుల్లో నివేదిక: రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన ఆయన, ఈ విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందో లేదో నిగ్గుతేల్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. విచారణలో…

AP

స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు మళ్లీ అవే హామీలు ఇస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి..

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలపై బూటకపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం, జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పుడు ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను విస్మరించి మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని…

AP

రూ. 2000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. వెనక్కి తీసుకోబోమన్న కేంద్రం..

రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నూతన విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని, దీనిపై పునరాలోచన చేసే ఉద్దేశం లేదని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అయితే, ఈ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం…

AP

లక్ష్యాలు చేరకపోతే ఈ సమావేశాలెందుకు..? ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు..

రాష్ట్రంలోని అన్ని రంగాలను, వర్గాలను బలోపేతం చేసేలా రుణాలను అందించాలని, లక్ష్యాలను చేరుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో బుధవారం జరిగిన 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన పాల్గొని, వివిధ అంశాలపై అధికారులకు, బ్యాంకర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రయోజనం ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “సూక్ష్మ, చిన్న, మధ్య…

National

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు ఖరారు.. కస్టమర్లపై భారం లేదన్న ఎన్‌పీసీఐ..

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు చేసే చెల్లింపులపై కొన్ని రుసుములను ప్రవేశపెట్టినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.ఎన్‌పీసీఐ తాజా నిబంధనల ప్రకారం, వ్యాపార చెల్లింపులలో (మర్చంట్ పేమెంట్స్) రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. అయితే, ఈ…

TELANGANA

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్‌ అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు…

TELANGANA

ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: కవిత..

ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వారిని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర అభివృద్ధిలో కీలక…

AP

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖలోని తన నివాసంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఆయన ఆకస్మిక మృతి వార్త ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆళ్ల నాని వయసు 56 సంవత్సరాలు. 1969లో ఏలూరులోని శనివారపుపేటలో జన్మించారు.ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, ఆంధ్రా…

AP

ఏపీలో స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు.. ఈనెల 22న ఓటర్ల జాబితా..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 41 పట్టణ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పరిధిలో రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ ఓటర్ల జాబితాలను రూపొందించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని…