ఉక్రెయిన్లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి..
ఉక్రెయిన్లోని ఒడెసా ఓడరేవులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిచివున్న ఒక సరకు రవాణా (కార్గో) నౌకపై జరిగిన భీకర దాడిలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. యుద్ధ వాతావరణం నడుమ జరిగిన ఈ ఘోర ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల సమాచారం ప్రకారం.. గినియా-బిసావు దేశ పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ గోల్డెన్ లియో’ అనే వాణిజ్య నౌక ఒడెసా…

