News

National

ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం.. నాణ్యతా లోపాలే కారణం..

ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, లాల్జీ గోధూ కంపెనీలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలు విక్రయిస్తున్న కాంపౌండెడ్ ఇంగువ (హింగ్ పౌడర్) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, వాటి అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’…

AP

సజ్జల నాపై దాడి చేశారు..! వైసీపీకి విజయసాయిరెడ్డి సంచలన లేఖ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఏంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన లేఖ ఇప్పడు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత ఇప్పటివరకు మాట్లాడని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్షలు గుప్పించారు… గత 02022లో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతికంగా దాడి చేసారని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ…

TELANGANA

మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ..

మజ్లిస్ పార్టీ (AIMIM)కి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తున్నట్లు ఎంఐఎం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రహమత్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఆ పత్రాన్ని శాసనమండలి ఛైర్మన్ కు అందజేయాలని పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్ లో మైనర్…

TELANGANA

కేబినెట్‌లో మార్పులు అవసరం: గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వం పనితీరులో నూతనోత్తేజం వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను అరికట్టి, క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు.ప్రస్తుతం రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ కొరవడిందని గుత్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీనియర్ నేత…

National

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు..

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సుమోటోగా పోలీసులు FIR నమోదు చేసారు. కోల్‌కతాలోని క్యాథడ్రల్ రోడ్డులో తృణమూల్ ఛాత్ర పరిషత్ ప్రభుత్వ (TMCP) వ్యవస్థాపక దినోత్సవ సభ జరిగింది. దీంతో ఈ సభకు సంబంధించి కొన్ని షరతులును కోల్‌కతా హైకోర్టు విదించింది. రోడ్డులో ఒక వైపు ట్రాఫిక్ కోసం ఖాళీగా ఉంచాలని, కేవలం 1,500 మంది మాత్రమే సభకు హాజరుకావాలని కోర్టు తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును పూర్తిగా మూసివేశారని, అనుమతించిన పరిమితికి…

AP

అమరావతిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ: కొల్లు రవీంద్ర..

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోబోతున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. భారతదేశానికే ఆదర్శంగా రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’తో పాటు ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడానికి పీవీ సింధు, పుల్లెల…

TELANGANA

ఓటర్ల తొలగింపుపై సీఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన నోటీసులు, పరిశీలనలు వెలువడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు సమగ్ర పరిశీలన అత్యవసరమని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నిర్ణయించిన గడువులోగా నోటీసులకు స్పందించడం, అభ్యంతరాలు నమోదు…

AP

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య (మెడికల్) కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజును 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రుసుములు 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్నాయి. ఎంబీబీఎస్ (MBBS) ఫీజులు: కన్వీనర్ కోటా: రూ. 18,150 మేనేజ్‌మెంట్ కోటా: రూ. 14.52 లక్షలు ఎన్నారై కోటా: రూ. 43.56 లక్షలు బీడీఎస్ (BDS) ఫీజులు: కన్వీనర్ కోటా: రూ. 15,730 మేనేజ్‌మెంట్…

TELANGANA

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట..! శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..!

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని…

AP

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు..! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో రకంగా జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక చరిత్ర. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ప్రకటించామని, సెప్టెంబర్ 2వ తేదీన పోలవరం లెఫ్ట్ కెనాల్‌కి జలహారతి ఇస్తాంమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల దశాబ్దాల కల అయినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు…