News

TELANGANA

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..

ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని, అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్…

TELANGANA

సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా..?: కేటీఆర్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని… కేసీఆర్ హయాంలో లభించిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో మళ్లీ పాతకాలపు కరెంటు కోతలు పునరావృతమవుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన రైతులు తమ కష్టాలను వెళ్లబోసుకుంటున్న వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకుంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కాంగ్రెస్…

AP

ఎల్ నినోపై చంద్రబాబు సమగ్ర వ్యూహం..! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

రాష్ట్రంపై ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై లోతుగా చర్చించి, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తును ఒక సవాల్‌గా స్వీకరించి, రైతులు, వినియోగదారులపై దాని ప్రభావం పడకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో…

AP

డీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకొస్తా: జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి/సంస్థకు ఎలా…

National

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. సర్వం సిద్ధమన్న ప్రధాని మోదీ..

ఈ వారాంతంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సర్వ సన్నద్ధమైంది. ఈ కీలక కార్యక్రమానికి భారత్ సిద్ధంగా ఉందని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే ఈ 18వ బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలోని భారత్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ప్రపంచ నేతలకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన భారత్…

National

“బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?”.. మీడియాపై పినరయి విజయన్ ఫైర్..

కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు గురించి మీడియా వెంటపడడంతో సహనం కోల్పోయారు. “నాతో పాటు బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?” అని వారిపై విరుచుకుపడ్డారు.వివరాల్లోకి వెళితే… బుధవారం చంగనచేరికి వెళుతుండగా మార్గమధ్యంలో విజయన్ మధ్యాహ్నం కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్‌లో ఆగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఆయన కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ…

AP

మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌తో… జగన్ పాదయాత్ర 2.Oకు ముహూర్తం ఖరారు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.గతంలో అధికారం కోసం…

TELANGANA

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర..? కేసీఆర్‌పై అసెంబ్లీలో రేవంత్‌ ఆరోపణలు..!

అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై మాటల దాడికి పాల్పడటం పార్లమెంట్‌, ముంబయి, పుల్వామా దాడులతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.శాసనసభలో బుధవారం మాట్లాడిన సీఎం.. స్పీకర్‌ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌ను దూషించిన ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఇలాంటి ఘటన తర్వాత కేసీఆర్‌ స్వయంగా స్పీకర్‌తో మాట్లాడి…

AP

ఏపీలో స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి ఓటర్ల జాబితాలను తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలు: సెప్టెంబర్ 11: ఫొటో సహిత ఓటర్ల జాబితాల ప్రదర్శన సెప్టెంబర్ 14: పోలింగ్ కేంద్రాల ముసాయిదా (Draft)…

TELANGANA

ఆ బూతులు భరించలేకనే కడుపు మండి మాట్లాడా!: కేసీఆర్ పై వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే శంకర్ వివరణ..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన రాజకీయ దుమారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును కోరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన అంగీకరించారు. అయితే, సభలోనూ బయటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను, మహిళా మంత్రులను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత అసభ్యకరంగా, కులాల పేరుతో దూషిస్తూ లక్ష్మణరేఖ…