News

TELANGANA

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు..!

దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తన సేవలను మరింత విస్తృతం చేయాలని, కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో శనివారం సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్…

TELANGANA

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ప్రజా కళాకారుడు గద్దరన్నకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.   ఆడబిడ్డల ఫోన్లు వినేవాడు…

AP

కుప్పంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నాయంటున్నారు… వెలికితీస్తాం: సీఎం చంద్రబాబు..

తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, దేశానికే ఆదర్శంగా నిలిపే ‘స్వర్ణ కుప్పం’ నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా… రూ.118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.   కుప్పంలోనూ బంగారు గనులు…

AP

ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం… ప్రధాని మోదీకి బెదిరింపులు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఆన్‌లైన్‌లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్‌పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ పర్యటనను, ప్రవాస భారతీయులతో జరగనున్న భారీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు వెలువడింది.   వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.…

AP

61 ఏళ్ల భూ సమస్యకు తెరదించిన సీఎం చంద్రబాబు..! రైతుల కళ్లలో ఆనందం..

ఆరు దశాబ్దాలుగా తమ బతుకుల్లో అలుముకున్న అనిశ్చితికి తెరపడింది. మూడు తరాలుగా సాగుచేస్తున్న భూమికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తమదన్న హక్కు పత్రాలు చేతికి అందడంతో ఆ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. శనివారం కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ…

TELANGANA

వైద్య చరిత్రలోనే అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ..!

వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, క్లిష్టమైన ఘనతను సొంతం చేసుకుని హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోగికి ఒకే సమయంలో ఏకంగా ఐదు కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి, దేశ వైద్య రంగం చూపును తనవైపు తిప్పుకుంది. కార్పొరేట్ ఆస్పత్రులకే సవాల్ విసిరేలా, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సరికొత్త అద్భుతం జరగడం భారతీయ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.   మృత్యువుపై పోరాటం సిరిసిల్ల…

TELANGANA

మూసీ పునరుజ్జీవనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే ప్రతిష్టాత్మక ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ కీలక దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలి విడతలో భాగంగా రూ. 7,345 కోట్ల భారీ బడ్జెట్‌తో 21 కిలోమీటర్ల మేర మూసీ నది సుందరీకరణ, పునరుద్ధరణ పనుల టెండర్లకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాదు, ఈ మెగా ప్రాజెక్టు పనులను…

TELANGANA

మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ..! నేను రెడీ..! మీరు సిద్ధమా..?

మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల ను వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని…

AP

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం పవన్ విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగిందని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని, గవర్నర్ మార్గదర్శకత్వం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.   అంతకుముందు, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ఈగల్’ విభాగం చీఫ్, సైబర్…

AP

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్ డబ్ల్యూ రాయలమీస ఉక్కు కర్మాగార పనులను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల.. కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంతో రాయలసీమలో నవశకం మెుదలైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత…