News

TELANGANA

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! ఇకపై స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ స్కీమ్ ..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది.   పథకం ముఖ్య ఉద్దేశ్యం.. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం భోజనం…

TELANGANA

ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా..! విద్యార్థులు, యువత రాక, పేపర్ లీకేజీలపై ఆగ్రహం..

దేశంలో ఎడ్యుకేషన్ విభాగం ప్రధానంగా దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. మెట్రోపాలిటన్ సిటీలతోపాలు టైర్ -2 నగరాల్లో ఆందోళలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం శాంతియుత నిరసనలు చేపట్టింది.   హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన   హైదరాబాద్‌లో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రారంభమైంది. ఇంటర్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి…

National

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అఘాయిత్యం..! తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం..

ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఐదేళ్ల పసికందుపై జరిగిన ఘోర అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టిన ఒక కామాంధుడిని బలియా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే స్పందించిన పోలీసులు, బాలికను రక్షించి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 11 రాత్రి బాన్సడీ రోడ్డు కూడలి దాటిన తర్వాత ఓ కోల్డ్…

AP

తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్..

కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   వివరాల్లోకి వెళితే.. కొందరు జనసేన కార్యకర్తలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో రీల్స్…

AP

వీడని మిస్టరీ..! చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..!

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన 400 మంది సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు.   తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో జూన్ 6న చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయింది. తోటలో పనిచేసే…

TELANGANA

ఖమ్మం బాలిక ఘటనపై కవిత ఫైర్.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్..

ఖమ్మం మైనర్ బాలిక అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నంతో పాటు ఆమెను బిల్డింగ్ పై నుంచి తోసేయటంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం పరామర్శించిన కవిత.. బాలిక ఆరోగ్య పరిస్థితి.. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను…

TELANGANA

హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!..

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వేదికపై పార్టీ సభ్యత్వాల జిల్లా ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల…

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున జరిగిన ఫెర్రో అలాయ్స్ (ఫెర్రోలాయ్స్) కుంభకోణం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముడిసరుకు కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాల కారణంగా ప్లాంట్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో యాజమాన్యం ఎట్టకేలకు గట్టి చర్యలు తీసుకుంది. ఈ అవినీతి వ్యవహారానికి పాల్పడిన బాధ్యులను ఏకంగా 15 మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, మరో 19 మందిని అంతర్గతంగా బదిలీ (ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్) చేయడం ప్లాంట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.…

APUncategorized

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి..

కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.   అయితే శునకం శుక్రవారం…

National

మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చి వివాదానికి తెరలేపారు. ఔరంగజేబు, మోదీ ఇద్దరూ ఒకే గడ్డపై పుట్టారని వ్యాఖ్యానించారు.   శనివారం పుణెలో జరిగిన విలేకరుల సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఔరంగజేబు ఏ మట్టిలో అయితే పుట్టాడో, మోదీ కూడా అదే మట్టిలో పుట్టారు. ఔరంగజేబు గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించారు కదా?” అని వ్యాఖ్యానించారు.…