AP

సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ; ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.

 

సివిల్‌ జడ్జి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే 39 పోస్టులు ఉండగా ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మరో 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అవుతాయని వెల్లడించారు.

 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి అర్హత లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు -ఆన్ లైన్ విధానంలో చేయాలి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజుగా పదిహేను వందల రూపాయలు చెల్లించాలి. ఎస్సీలు ఎస్టీలు మరియు దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

 

జనవరి 31వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం కానుండగా దరఖాస్తులకు తుది గడువు 01 మార్చి 2024 గా చెప్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ 15 మార్చి 2024 నుండి చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష తేదీ 13 ఏప్రిల్ 2024. స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి మూడు పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది.

 

ప్రతి పేపర్ కు వంద మార్కులు చొప్పున మార్కులు కేటాయించారు. ఒక్కొక్క పేపర్ రాయడానికి మూడు గంటల సమయాన్ని కేటాయించారు. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో ఈ మేరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల మరియు అభ్యంతరాలను 18 ఏప్రిల్ 2024న స్వీకరిస్తారు.

 

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్క్రీనింగ్ టెస్ట్ మరియు రాత పరీక్ష, వైవా, వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. పై పరీక్షలు అన్నింటిలోనూ సెలెక్ట్ అయిన వారితో తుది జాబితా ఉంటుంది.