AP

టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే ప్రజలముందుకొచ్చాని తెలిపారు. టీడీపీ అధినేత, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని పాలకొల్లు సభలో అన్నారు.

 

రఘురామకృష్ణ రాజు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలు నచ్చక వైసీపీలోనే ఉంటూ రెబెల్‌గా మారారు. కొద్దిరోజుల క్రితం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కూటమిలో భాగంగా నరసాపురం ఎంపీ సీటు బీజేపీకే వచ్చింది. కానీ రఘురామకృష్ణ రాజును కాదని ఆ టికెట్ భూపతి శ్రీనివాసవర్మకు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఏ సీటు టికెట్ సంపాదిస్తారో వేచి చూడాల్సిందే.