Editor

TELANGANA

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి పరిపాలనా శాఖ అనుమతిచ్చింది. ప్రస్తుత అంబేద్కర్ భవన్ స్థానంలో 1 సెల్లార్ + గ్రౌండ్ + 10 అంతస్తులతో కొత్త టవర్ ఉంది. 12 ఏళ్లుగా వినియోగంలో లేని పాత అంబేద్కర్ భవన్ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌అండ్‌బీ అధికారులు భవన…

TELANGANA

నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం..! క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ..

సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గంపై తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ, హైదరాబాద్‌లోని కమిటీ ఎదుట హాజరై ఈ మేరకు తన వివరణను సమర్పించారు. తన కుమార్తె అయినంత మాత్రాన ఆమె వ్యక్తం చేసిన రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సముచితం కాదని, అది సహజ న్యాయ సూత్రాలకు…

TELANGANA

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల చట్టబద్ధత, ఉచిత పథకాలకు నిధుల వినియోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాల నిధుల విడుదలపై ఉన్న మధ్యంతర స్టేను ఎత్తివేసేందుకు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్ బెల్స్’ మోగుతున్నాయని హెచ్చరించిన ధర్మాసనం… పరిమితి లేకుండా ఉచిత పథకాలకు నిధులు మళ్లించడం వల్ల ఇతర అత్యవసర…

National

ఆవేశంలో అలా అన్నాను.. ఆర్మీకి క్షమాపణ చెప్పిన లడఖ్ ‘వి ఆర్ జెన్-జీ’ యువతి..

లడఖ్‌లో ‘వీ ఆర్ జెన్ జీ’ అంటూ భారత సైనికులతో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, భారత సైన్యం, జమ్మూ కశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది. సదరు వీడియో వైరల్ అయిన అనంతరం తొలిసారిగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది.లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో, కార్గిల్…

AP

జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీకి తేడా తెలియదు: మంత్రి నారా లోకేశ్..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేశ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.“ఏపీపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డీఎస్సీ అంటే ఏమిటో తెలియదు. రెండూ ఒకటే అని…

AP

స్థానిక పోరుకు జనసేన సై..! ఆ వ్యూహం గత ఎన్నికలకే పరిమితమన్న పవన్ కల్యాణ్..

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా, క్షేత్రస్థాయి బలాబలాలకు అనుగుణంగా ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావశీలమైన పోటీ ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం…

National

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్య..

జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే కావడం విశేషం. బుధవారం శ్రీనగర్‌లో ఆయన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు.ఈ సమావేశం అనంతరం సెర్గియో గోర్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌లో ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఇది ఎంతో రమణీయమైన ప్రదేశం” అని…

TELANGANA

సీటు రగడ.. సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు..

పరకాల టికెట్‌పై రేవంత్‌ను ప్రశ్నించిన కొండా సుష్మితరేవూరికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని నిలదీతటికెట్లను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టీకరణకొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నబీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్‌ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా…

TELANGANA

రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా..?

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 11న జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సుమారు 80 మందిని సమగ్రంగా విచారించారు. విచారణ ఆధారంగా.. చెడు వ్యసనాలకు బానిసలైన స్థానిక తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో…

AP

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత ఉందని జగన్‌ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్‌ ఫైర్ అయ్యారు.…