Editor

National

వందేమాతరం బిల్లుకు లోక్ సభ ఆమోదం..

జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం ముద్ర వేసింది. జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నిన్న ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.   1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేపడుతుంది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జన…

AP

మంచిర్యాల జిల్లాలో వింత… వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు..!

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. వర్షపు నీటితో పాటు చిన్నపాటి చేపలు వీధుల్లోకి కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోడ్లపై కనిపిస్తున్న ఆ చేపలను పట్టుకోవడానికి పిల్లలు, యువకులు పోటీపడ్డారు.   పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వరద నీటిలో చేపలు కొట్టుకురావడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కొందరు ఇవి…

AP

అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే చంద్రబాబే: కాకాణి గోవర్ధన్..

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో ఏమీ సాధించకుండా టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలకు తమ ముఖం కూడా చూపించలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.   ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీల అమలులో ప్రభుత్వం కోతలు పెడుతోందని విమర్శించిన కాకాణి, “అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే…

AP

మహిళా ఎస్సైని తోసేసిన వైసీపీ నేత..!

శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ పర్యటించిన సందర్భంగా జిల్లా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనకు సంబంధించి రోడ్‌షోలు, జనసమీకరణ చేయకూడదని పోలీసులు విధించిన నిబంధనలు, ఆంక్షలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధిక్కరించారు.   మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్ నాయకత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు… జైలుకు కిలోమీటరు ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు…

AP

ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్.. మంత్రి నారా లోకేష్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయ‌ని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరిస్తున్నాయని ఆయన వెల్ల‌డించారు. పత్తికొండ సమీపంలోని హోసూరు వద్ద టాటా పవర్…

TELANGANA

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్..!

ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి తదితర…

AP

టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్..!

ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణే ముఖ్యం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నాయకుడు, కార్యకర్తను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి నష్టం చేకూర్చే చర్యలను ఎంతటి నాయకులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారుని గుర్తు చేశారు.   ఉద్యోగాలు కల్పన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కష్టం, త్యాగంతో…

National

‘వందేమాతరం’ను అవమానిస్తే ఇకపై శిక్ష.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం..

జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించే ‘జాతీయ గౌరవానికి అవమాన నిరోధక (సవరణ) బిల్లు-2026’కు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జాతీయ జెండా, జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణను ఇకపై వందేమాతరానికీ వర్తింపజేయనున్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఎగువ సభ దీన్ని ఆమోదించింది.   బిల్లుపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభకు రావాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.…

AP

ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ…

TELANGANA

ఆమెతో అలా పరిచయం.. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు అరెస్టయిన అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.…