Editor

National

భారత్‌కు పెను ముప్పు తప్పదా..? బ్రహ్మపుత్రపై చైనా ‘వాటర్ బాంబ్’..

భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై (టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్‌పో) చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ‘వాటర్ బాంబ్’గా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు, భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మిస్తుండటంతో, ఒకవేళ ఇది విఫలమైతే ఈశాన్య భారత్ సహా బంగ్లాదేశ్‌లో ఊహించని జలప్రళయం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రముఖ వ్యూహాత్మక విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ కథనం ప్రకారం.. ఈ నిర్మాణ ప్రాంతంలోని నేల…

TELANGANA

తొలగింపు కాదు.. రాజీనామానే: కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం నిర్ణయం..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం కంటే, గౌరవప్రదంగా రాజీనామా చేయించడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వాటిల్లుతుందని సీఎం రేవంత్ రెడ్డి…

TELANGANA

కవిత వాక్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

కవిత వాక్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నేను వారిని విడదీయటానికి ప్రయత్నించానా కలపటానికి ప్రయత్నించానా కెసిఆర్‌కు తెలుసని అన్నారు. కవిత మొండిగా వ్యవహరించి పార్టీ లైన్ దాటారు కాబట్టే పార్టీ నుండి తొలగించారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం మేమని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన చర్చల్లో మాది ప్రముఖ పాత్ర ఉందన్నారు. బీఆర్ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్…

TELANGANA

ఫీజు బకాయిల పెండింగ్‌పై కాంగ్రెస్ సర్కార్ ను హరీశ్ రావు నిలదీత..

కాంగ్రెస్ తన 1000 రోజులు పాలనలో ప్రజలకు చేసిన మంచి కంటే సృష్టించిన విధ్వంసమే ఎక్కువ ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఇందుకు రోడ్డున పడుతున్న విద్యార్థుల భవిష్యత్తే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ బడాయి కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతి…

AP

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా.!

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ ఫేక స్వామీజీ బండారం బట్టబయలైంది. సంతాన ప్రాప్తి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తానంటూ నమ్మించి అమాయకులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ దంపతుల వద్ద దాదాపుగా రెండు కోట్లకు పైగా డబ్బు కాజేసిన సంఘటన కలకలం రేపుతుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్ళచెరువు సమీపంలో నైమిసారణ్యం ఆశ్రమం నిర్వహిస్తూ రమణ పొలకల స్వామి అలియాస్ రమణానంద మహర్షి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్టు దంపతులు పేర్కోన్నారు. అయితే బెంగళూరు ప్రాంతానికి చెందిన…

CINEMA

సరిహద్దులో గోల్డ్ మాఫియా, చిక్కిన మహిళ నుంచి 15 కేజీల బంగారం..!

దేశంలో గోల్డ్ మాఫియా రంగంలోకి దిగిందా? సరిహద్దుల ద్వారా ఇండియాలోకి బంగారం వస్తుందా? ఇండియా మీదుగా విదేశాలకు బంగారం ఎగుమతి చేస్తున్నారా? ఓ మహిళ నుంచి 15 కేజీల బంగారం ఎలా దొరికింది? అధికారులు రంగంలోకి తీగలాగితే డొంక కదులుతోంది? అసలు ఏం జరుగుతోంది? భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భారీగా బంగారం చిక్కింది. ఓ మహిళ అక్రమంగా రవాణా చేస్తున్న 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు బీఎస్‌ఎఫ్‌ అధికారులు. మార్కెట్లో దాని విలువ రూ.24.95 కోట్లు. పశ్చిమ…

TELANGANA

రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్..

హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ కి చెక్ పెట్టె క్రమంలో ‌తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ముఖ్యంగా తూర్పు హైదరాబాద్‌ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక మూసారాంబాగ్‌ హై లెవల్‌ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో మూసీ నదిపై దాదాపు రూ.52 కోట్ల భారీ అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవైనతో అంబర్ పేట నుండి ప్రయాణ సమయం తగ్గడంతో…

AP

వెలిగొండ ప్రాజెక్టుపై క్రెడిట్ చోరీ మొదలు..! ఎక్స్ వేదికగా కొన్ని విషయాలు బయటపెట్టిన జగన్..

ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ మొదలైందా? కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రతీ పని తమ ఘనతేనని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? నిన్న భోగాపురం ఎయిర్‌పోర్టు.. నేడు వెలిగొండ ప్రాజెక్టు.. రేపు పోలవరం ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం ఏది చేసినా తాము చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందా? ఇంతకీ వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్  వైఎస్ ఖాతాలోకి వైసీపీ జమ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో మళ్లీ క్రెడిట్ చోరీ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. వెలిగొండ…

AP

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమైంది. పశ్చిమ ప్రకాశంలోని కరవు పీడిత ప్రాంతాలకు జీవనాడిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ప్రాజెక్టు సొరంగాల నుంచి ఉరకలేస్తూ వచ్చిన కృష్ణా జలాలకు ఆయన భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ చారిత్రక ఘట్టంతో ఆ ప్రాంత రైతులు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా…

TELANGANA

ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.వరద నీరు లేకున్నా, ఎటువంటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి…