భారత్లో నకిలీ వస్తువుల మార్కెట్పై ఉక్కుపాదం..! రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్
అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్లో భారీగా విస్తరించిన నకిలీ వస్తువుల మార్కెట్పై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెర్సాచీ, మైఖేల్ కోర్స్, జిమ్మీ చూ వంటి ప్రఖ్యాత కంపెనీలు నకిలీ సరుకును అరికట్టేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్లను నియమించుకుంటున్నాయి. వీరు సాధారణ కస్టమర్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్లి, నకిలీ వస్తువులను విక్రయించే వారి సమాచారాన్ని సేకరించి కంపెనీలకు అందిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు…

