Editor

CINEMA

సంక్రాంతి సెంటిమెంట్‌తో మీనాక్షి చౌదరి……..

నటి మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. 2026 సంక్రాంతి పండుగ కానుకగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం విడుదల కానుంది. యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘మారి’ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, సంక్రాంతి సీజన్ మీనాక్షికి బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో…

TELANGANA

వివాదాల్లో వరల్డ్ ట్రావెలర్ అన్వేష్: “హిందువుగానే పుట్టా.. హిందువుగానే చస్తా” అంటూ భావోద్వేగ వీడియో!

హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ అన్వేష్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయనపై హైదరాబాద్‌లోని పంజాగుట్టతో పాటు ఖమ్మంలో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్వేష్ తాజాగా ఒక వీడియో విడుదల చేస్తూ తన ఆవేదనను పంచుకున్నారు. “నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే చస్తాను. కానీ కొంతమంది నా మతం మార్చడానికి, నన్ను మతం నుండి వెలివేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. 2025 ఏడాది తనకు…

TELANGANA

నివాస స్థలాల కోసం కవిత భూ పోరాటం: కరీంనగర్‌లో ఉద్యమకారులతో కలిసి ఆందోళన!

తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికీ 250 గజాల నివాస స్థలాన్ని అందిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కరీంనగర్ జిల్లాలో ఆమె “భూ పోరాటం” ప్రారంభించారు. అంతకుముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, అనంతరం మానకొండూరు సమీపంలో భూ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…

AP

టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు భారీ విరాళం: కోటి రూపాయల చెక్కును అందజేసిన విజ్ఞాన్‌ రత్తయ్య!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును స్వయంగా కలిసిన ఆయన, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. విద్యా రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో టీటీడీ చేస్తున్న కృషికి తన…

AP

అరకు గిరిజనులకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక: అనీమియా బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా అరకులో ఒక అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు మరియు తీవ్ర రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ తన కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ బ్లడ్…

TELANGANA

దుర్గం చెరువు కబ్జా గుట్టు రట్టు: శాటిలైట్ చిత్రాలతో హైడ్రా సంచలన ఆధారాలు!

చారిత్రక దుర్గం చెరువు (సీక్రెట్ లేక్) దశాబ్దాల కాలంలో ఎలా కుంచించుకుపోయిందో వివరిస్తూ హైడ్రా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంతో అలరారిన ఈ చెరువు, నేడు కేవలం 116 ఎకరాలకు పడిపోయింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సహకారంతో సేకరించిన ఈ చిత్రాలు, 1976 నుండి నేటి వరకు జరిగిన క్రమబద్ధమైన ఆక్రమణలను కళ్లకు కట్టాయి. 1976 నాటికే 29 ఎకరాలు మాయమవ్వగా, ఆ తర్వాతి కాలంలో రాజకీయ అండదండలతో…

CINEMA

60 ఏళ్ల వయసులోనూ నవ మన్మధుడు: నాగార్జున ఫిట్‌నెస్ మరియు డైట్ రహస్యాలివే!

నటుడు నాగార్జున తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకొని కఠినమైన డైటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్య సూత్రం చాలా సరళమైనది: సమయానికి భోజనం చేయడం మరియు మితంగా తినడం. 45 ఏళ్లుగా నిరంతరాయంగా వ్యాయామం చేయడం ఆయన దినచర్యలో ఒక భాగం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల ఆయన శక్తి (Energy) మరియు స్టామినా (Stamina) ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని, 2025లో కూడా తన కెరీర్…

AP

కూటమి ప్రభుత్వ 18 నెలల ప్రగతి ప్రస్థానం: 60 కీలక విజయాలు

2025లో కూటమి ప్రభుత్వ విజయాలు,కదిరి నియోజవర్గనికి చేసిన చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అనంతరం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ. 10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత…

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులు పోట్టేతారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూ సంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి.దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది.ఏకాదశి రోజున వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల…

AP

రెవెన్యూ క్లినిక్‌తో రైతులకు ఊరట: 24 గంటల్లోనే పరిష్కారమైన ఏళ్లనాటి 22A భూ సమస్య

రాష్ట్రంలో భూ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినికల్ నిర్వహిస్తుంది అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో కదిరి రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కొంతమంది చెందిన రైతుల భూ సమస్యల్ని రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సెక్షన్ 22A భూ సమస్య ను కేవలం 24 గంటల్లో కదిరి శాసనసభ్యులు…