Editor

AP

స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల..

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరు చెప్పుకుని ‘ఒక్క ఛాన్స్’ అంటూ సీఎం అయిన జగన్, ఐదేళ్ల పాలనలో కేవలం స్విచ్‌లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్లీ మళ్లీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి…

AP

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన..

తన వార్డులో అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఉషా దేవి శంఖ్వార్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు చేయించుకుని నిరసన తెలిపారు. తన వార్డులో పౌర సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని, అభివృద్ధి పనులలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కొద్ది రోజులుగా ఆమె మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలుపుతున్నారు.   అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం…

TELANGANA

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్‌లోనే 16,000 దుకాణాలు క్లోజ్.!

ఆన్ లైన్ లో మెడిసన్స్ విక్రయాన్ని నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD).. రేపు బంద్ కు పిలుపునిచ్చింది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుమారు 12.40 లక్షలకు పైగా ఔషద దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు.. తమ సేవలను నిలిపివేయనున్నారు.   కేంద్రం ప్రభుత్వం ఆన్ లైన్ మందుల సరఫరాకు…

TELANGANA

పాలమూరు ప్రాజెక్టులకు లైన్..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు సాగునీటి ప్రాజెక్టును వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.   ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు సీఎం ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి…

AP

ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్..

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు అత్యంత చురుగ్గా సాగింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్, సంయుక్త కార్యదర్శి సుజాత శర్మలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరఫరా వ్యవస్థ సమన్వయంపై లోతుగా చర్చించారు.   అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మర్యాదపూర్వకంగా భేటీ అయి, ప్రజా…

TELANGANA

ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్‌లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.   ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్…

National

బెంగాల్‌లో బీజేపీ మరో సంచలన నిర్ణయం..!

బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లకు, హిందూ దేవాలయాల అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అలాగే కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వెనుకబడిన తరగతుల జాబితా (OBR)ను రద్దు చేసి.. కోటా అర్హతను నిర్ణయించడానికి కొత్త ప్యానెల్ ఏర్పాటు కేబినేట్ అమోదం తెలిపింది.…

TELANGANA

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త మండల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వేగంగా కొత్త కమిటీలు ఏర్పాటు కావాలని టీపీసీసీ ఆదేశించింది. అయితే ఇప్పటికే మూడేళ్ల పాటు కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం లేదు. కొత్తోళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. కానీ కొత్తగా మండల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వారు, అప్పటికే పార్టీలో కనీసం మూడేళ్ల పాటు కార్యకర్త గా పనిచేసి ఉండాలి. ఈసారి కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పారదర్శకమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది.…

TELANGANA

పోలీసుల చేతికి కొత్త అస్త్రం..! కృత్రిమ మేధతో సోషల్​ మీడియాపై నిఘా..

సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపటానికి హైదరాబాద్ పోలీసులు సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’ని సమకూర్చుకున్నారు. ఏఐ ఆధారితంగా పని చేసే దీని ద్వారా సోషల్ మీడియాలో జనం మధ్య విభేధాలు రెచ్చగొట్టేలా…వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసేలా పోస్టులు పెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టటంతోపాటు వారిపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ విభాగం రూపొందించిన సాక్ ఐ గురించి కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు తెలియచేస్తూ గతంలో సోషల్…

AP

లోకేష్ కాదు.. ‘లవ్ కాష్’.. అంబటి సెటైర్లు..!

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు రోడ్డెక్కాయి. గుంటూరు నగరంలో మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.   రిక్షా తొక్కిన మాజీ మంత్రి..   ధరల పెంపుదలపై తన నిరసనను వినూత్నంగా తెలియజేసేందుకు అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆయన స్వయంగా రిక్షా తొక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పెరిగిన ధరలతో…