‘పవన్ కల్యాణ్ కోరిక జరగాలి’: ఏపీలో కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలి – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లాలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదికలో మాట్లాడుతూ కీలక రాజకీయ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆయన అన్నారు. మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, 2047 నాటికి స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 58 లక్షలకు పెంచడమే…

