బలూచిస్థాన్లో బీఎల్ఏ దాడి.. 14 మంది పాక్ సైనికుల మృతి..
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో మరోసారి నెత్తురు పారింది. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 14 మంది పాకిస్థానీ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు బలూచిస్థాన్లో తీవ్రమవుతున్న తిరుగుబాటును, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీవోఎస్) రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో దాడికి…