పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ..
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు పార్టీ నాయకత్వం తెలిపింది. ఈ క్రమంలో, పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు, ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత జగన్… ఇంధన సంక్షోభాన్ని ‘ప్రభుత్వ ప్రేరేపిత కృత్రిమ కొరత’గా అభివర్ణించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు,…

