Editor

National

దేశంలో 3 వేలకు చేరువైన కొవిడ్ కేసులు..

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది.  …

AP

ఏపీలో రేషన్ సరకుల పంపిణీలో మార్పులు..!

రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే వాహనంలో వచ్చి సరకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాదిగా అదే పద్ధతి కొనసాగించారు. కానీ ఇప్పుడు రేషన్ వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే మార్పులపై ఇప్పుడు చర్చ మొదలైంది. రేషన్ వాహనాలు నిలిపివేయడం సంచలన నిర్ణయమే. ఇప్పటి వరకు ఇంటి వద్దనే, లేదా వీధి…

TELANGANA

‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం… పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి…

TELANGANA

కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆస్తి గొడవలు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంపై, పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్ రావు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ విభేదాలు బయటపడి వారు విడిపోకుండా ఉండేందుకే వారంతా కలిసి డ్రామా ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.   కవిత రాసిన లేఖ, హరీశ్ రావు…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టును చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోల్చిన కేటీఆర్..

బలమైన నాయకత్వం, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంతటి ప్రగతినైనా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు కేవలం దేశానికే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాలకు సైతం ఒక నమూనాగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.   లండన్‌లో జరుగుతున్న ‘బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో…

TELANGANA

ఉమ్మడి వరంగల్ కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి..

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల మంజూరు ప్రక్రియలో నిర్లక్ష్యం తగదని అన్నారు.   లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, జూన్ 6వ తేదీలోగా అర్హులైన వారి పూర్తి జాబితాను తయారు చేయాలని ఆయన గడువు విధించారు. కేవలం జాబితా మాత్రమే కాకుండా, సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీలను కూడా జతచేసి అందించాలని మంత్రి…

National

పాకిస్థాన్‌కు ఇండియ‌న్ సిమ్ కార్డులు పంపిన వ్య‌క్తి అరెస్ట్.

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన కాసిం అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్‌లోని మేవాట్‌లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అత‌డు పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు.అధికారులు చెప్పిన వివ‌రాల‌ ప్రకారం… కాసిం రెండుసార్లు పాకిస్థాన్‌ను సందర్శించాడు. ఒకసారి 2024 ఆగస్టులో, అలాగే మళ్లీ 2025 మార్చిలో పాక్ వెళ్లాడు. మొత్తం 90 రోజులు అక్కడే…

AP

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం.. 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు..

ఏపీలోని కూట‌మి ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఎన్‌టీఆర్ భ‌రోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద 71, 380 మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు.   సామాజిక భ‌ద్ర‌త పింఛ‌ను తీసుకుంటున్న భ‌ర్త చ‌నిపోతే… అత‌ని భార్య‌కు ఆ త‌దుప‌రి నెల నుంచే పింఛ‌ను అందించేలా స్పౌజ్ కేటగిరీని…

TELANGANA

తెలంగాణ‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక వారికి మాత్రమే..

తెలంగాణ‌లో డిగ్రీలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై విశ్వవిద్యాల‌యాల‌ ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పొందేందుకు అర్హ‌త ఉండ‌ద‌ని ఉప‌కుల‌ప‌తుల భేటీలో నిర్ణ‌యించారు.   రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌యంలో ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏడు సంప్ర‌దాయ యూనివ‌ర్సిటీల వీసీల స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుండా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు అర్హ‌త లేద‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వ ఆదేశాలు…

AP

ఫ్యాన్ లేదు.. లాక‌ప్‌లో దోమ‌లు కుడుతున్నాయి: కోర్టులో నందిగం సురేశ్ పిటిష‌న్..

తుళ్లూరు పీఎస్ లాకప్‌లో ఫ్యాన్ లేకపోవ‌డంతో దోమ‌లు కుడుతున్నాయ‌ని మంగ‌ళ‌గిరి కోర్టులో నందిగం సురేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. లాక‌ప్‌లో ఫ్యాను, దోమ‌ల మందు వినియోగించుకునేందుకు అనుమతించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై గురువారం మంగ‌ళ‌గిరి కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.   తుళ్లూరు సీఐ శ్రీనివాస‌రావు కోర్టుకు హాజ‌రయ్యారు. లాక‌ప్ రూమ్‌లోకి ఫ్యాన్‌, పొగ‌వ‌చ్చే దోమ‌ల మందులు, విద్యుత్ దీపాల‌ను వినియోగించ‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వ‌ని న్యాయ‌స్థానానికి వివ‌రించారు. లాక‌ప్ బ‌య‌ట నుంచి గాలి వ‌చ్చేలా టేబుల్…