Editor

AP

దస్తగిరి మరో ట్విస్ట్- టీడీపీ, సునీత, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప ఎంపీగా బరిలోకి దిగిన పీసీసీ ఛీఫ్ షర్మిలతో పాటు ఆమె సోదరి, సునీత, టీడీపీ వివేకా హత్య కేసును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్, జై భీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో దిగుతున్న దస్తగిరి ఈసీని ఆశ్రయించారు.   తెలుగుదేశం పార్టీ,…

National

మణిపూర్ మౌనం.. కనిపించని ఎన్నికల హడావిడి..

మణిపూర్ గత ఏడాది నుంచి అల్లర్లతో అట్టుడికిపోయింది. మైతీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న గొడవలతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ హింసాత్మకమైన ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయ పడ్డారు. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళన కారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షితప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.   ఇక ప్రస్తుతానికి గొడవలు…

TELANGANA

ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ మెట్రో రైలులో ఆ కార్డు రద్దు..?

వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది కూడా. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు అమలులో ఉంది. జూన్ 1వ తేదీన తరగతులు పునఃప్రారంభమౌతాయి.   అలాగే- ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాలిడే ఉంటుంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు సాగుతున్నాయి. ఈ…

TELANGANA

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే ..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలంగా వెంకటరావు కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.   భద్రాచలం నియోజకవర్గానికి…

AP

టీడీపీలో ఆ నేతలపై వైసీపీ గురి – ఆపరేషన్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్ది పార్టీలపై పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా సీట్లు దక్కని నేతల పై వైసీపీ గురి పెట్టింది. మూడు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సీఎం జగన్ సన్నిహిత నేతలు ఆపరేషన్ ప్రారంభించారు. చేరికలు మొదలయ్యాయి.   పొత్తులో భాగంగా సీట్లు దక్కని…

AP

ఏపీ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నోటీసు జారీ చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్ 5న జగన్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు.   వైఎస్‌ఆర్‌సిపి ‘మేమంత సిద్ధం’ సమావేశంలో చేసిన దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా…

National

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక..

తైవాన్ అధ్యక్ష ఎన్నికలలో ట్రయల్ రన్ తర్వాత భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలను తారుమారు చేయడానికి చైనా కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించవచ్చని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ ప్రకారం, ఉత్తర కొరియా మద్దతుతో చైనా సైబర్ గ్రూపులు యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియాలో ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయని వెల్లడించింది.   “చైనా తన ప్రయోజనాలకు లాభం చేకూర్చేందుకు AI- రూపొందించిన కంటెంట్‌ని సృష్టిస్తుంది. దాన్ని విస్తరింపజేస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం…

AP

జగన్‌కు షాక్.. కీలక నేత పార్టీకి గుడ్ బై ..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దికాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్…

AP

ఏపీలో రాజకీయ పార్టీలకు సీఈవో ఊరట..!

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గతంలో ఆదేశాలు ఇచ్చిన ఆయన.. ఇవాళ మాత్రం కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇంటింటి ప్రచార అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలన్నారు.  …

TELANGANA

సీబీఐ విచారణ వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్ళిన కవితకు కొత్త టెన్షన్..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ విచారణతో ఉన్న కవితను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిగిస్తున్న ఉచ్చు తోనే విలవిలలాడుతున్న కవిత, ఇప్పుడు కొత్తగా సిబిఐ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ నేపద్యంలో సిబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.   సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారించడానికి అనుమతి తీసుకున్న సిబిఐ…