Editor

National

చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు..! ప్రత్యేక ఫార్ములాను చైనాకు ప్రతిపాదించిన రాజ్ నాథ్ సింగ్..!

భారత్-చైనా మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా నాలుగు సూత్రాలతో కూడిన ఒక ప్రత్యేక ఫార్ములాను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాకు ప్రతిపాదించారు. చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం సందర్భంగా ఆయన చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో…

TELANGANA

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల.. లంచం తీసుకుంటుండగా ఇద్దరి అరెస్ట్..!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లుల మంజూరు కోసం వారు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.   ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బట్టల రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండ్ర…

AP

కాకాణి కుమార్తె ఖాతాలోకి రూ.70 లక్షలు.. సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..!

సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాణి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు, దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు స‌మాచారం.   కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు…

AP

కర్నూలు జిల్లాలో రిలయన్స్ భారీ ప్లాంట్..! రూ.1622 కోట్లతో

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1622 కోట్ల పెట్టుబడితో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.   వివరాల్లోకి వెళితే, శీతలపానీయాలు, పండ్ల రసాలు, మరియు డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను స్థాపించేందుకు రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.…

TELANGANA

ఎండిపోతున్న పంటపొలానికి బకెట్లతో నీళ్లు..! రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది..!

ఆశగా ఆకాశం వైపు చూస్తూ, ఎండిపోతున్న పంటను ఎలాగైనా బతికించుకోవాలని ఒక రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ అనే రైతు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.   ఆముదాల రమేష్ ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఈ ఏడాది…

AP

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్..

రాయలసీమ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీని వీడి, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు.   సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు.…

TELANGANA

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్..

బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎంతమాత్రం విశ్వసించవద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.   “కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టింది. దీనికి…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని.. డీకే అరుణ సంచలన వాఖ్యలు..!

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కాంగ్రెస్ నేతలకే తెలియాలని…

AP

ఎమర్జెన్సీ, జగన్ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, అటువంటి నియంతృత్వ పోకడలు, అహంకారం ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ చెల్లవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ మూల సిద్ధాంతాలను ఎవరూ విస్మరించరాదని ఆయన హితవు పలికారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్ 25) 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన “సంవిధాన్ హత్యా దివస్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

AP

ఏపీ మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటి హైకమిషనర్ భేటీ..!

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలిపారు. నిన్న రాజధాని అమరావతిలో మంత్రి నారాయణతో గారెత్ విన్ ఓవెన్‌తో కూడిన ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది.   ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి…