Editor

TELANGANA

బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యతిరేక శక్తులను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దింపబోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికలకు బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని అన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల పై కుట్ర చేస్తుంది.  నాకు ఎమ్మెల్సీ ఇస్తే.. కొంతమంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను. 2008లో కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. పొత్తు కుదర్చుకున్నాను. కేసీఆర్ ను వదిలిపెట్టేది లేదు. అవినీతి విషయంలో…

National

యూపీఐ యూజర్లకు భారీ షాక్..! ఇకపై చెల్లింపులపై ఛార్జీలు వసూల్..

యూపీఐ (UPI) అనేది భారతదేశంలో రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ, ఇది మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.యూపీఐ లావాదేవీలు తక్షణమే జరుగుతాయి.అయితే ఇప్పటి వరకు ఫ్రీగా ఈ సేవలు అందించడం జరిగింది. యూపీఐ చెల్లింపుల అధిక మొత్తంలో జరగడంతో వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి…

TELANGANA

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… పిచ్చి కుక్క అంటూ ట్వీట్..

మీకు మీరే స్టేచర్ ఉందనుకుంటే ఎట్లా? స్టేచర్ ఉందని విర్రవీగిన వాళ్లను స్ట్రెచర్ మీదకు పంపించారు, ఇలానే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు అటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.   రేవంత్ వ్యాఖ్యల వీడియోను పంచుకున్న కేటీఆర్… ఈ పిచ్చి కుక్క సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను దాటేసింది అంటూ ఘాటుగా స్పందించారు.   “నేను…

TELANGANA

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (మార్చ్ 13) ఉదయం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ సమావేశం కానున్నారు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి.. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారని సమాచారం. కాగా, వీరి ఇరువురి సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటంటే.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన…

AP

జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట… పోసానికి 14 రోజుల రిమాండ్..

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.   పోసానిపై ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో… గుంటూరు సీఐడీ పోలీసులు…

AP

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు… హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది.   ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన…

AP

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు..

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కు విచ్చేసిన గౌరవనీయులు మానవవనరుల, ఐటి ,ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి,విద్యాశాఖల మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు

AP

ఈనెల 12న శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరును జయప్రదం చేయండి..

యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి జిల్లా YSRCP శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా YSCP అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ గారు   విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ..విధ్యార్ధులకు,నిరుద్యోగులకు అండా నిలుస్తూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 12న మన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించబోయే వైయస్సార్ కాంగ్రెస్…

AP

అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు..

అనంతపురం :   అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*l స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్న 61 మంది పిటీషనర్లు చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ   నిర్దిష్ట గడువులోపు చట్ట పరిధిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”…

AP

ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి..: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, మార్చి 10 : – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఎంఎస్ఎంఈ సర్వే, పి4 సర్వే, తదితర అంశాలపై డ్వామా పిడి, డిఎల్డివోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, ఏపీడీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా…