Editor

AP

కదిరిలో రూ. 32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. 75 మంది లబ్ధిదారులకు, 32 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ 18 నెలల కాలంలో 350 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసాం కూత వేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు…

AP

శబరిమలలో కనులపండువగా మకరజ్యోతి దర్శనం: పులకించిన లక్షలాది మంది భక్తులు!

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి వేళ అత్యంత పవిత్రమైన మకరజ్యోతి దర్శనం భక్తులకు లభించింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల నుండి 6:45 గంటల మధ్య పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి మూడుసార్లు ప్రకాశించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ భక్తులు చేసిన శరణుఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి. మకరజ్యోతి దర్శనానికి ముందు పందళం రాజప్రసాదం నుండి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను (స్వామివారి ఆభరణాలు)…

World

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: 80వ స్థానానికి ఎగబాకిన భారత పాస్‌పోర్ట్!

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పాస్‌పోర్ట్ శక్తిని అంచనా వేసే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 నివేదిక బుధవారం (జనవరి 14) విడుదలైంది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ గత ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 80వ స్థానంలో నిలిచింది. 2025లో భారత్ 85వ ర్యాంకులో ఉండగా, దౌత్య సంబంధాల బలోపేతం కారణంగా ఈ ఏడాది 80వ స్థానానికి చేరుకుంది. నైజర్ మరియు అల్జీరియా దేశాలు కూడా భారత్‌తో పాటు ఇదే స్థానాన్ని పంచుకున్నాయి. ఈ…

AP

విశాఖకు మరిన్ని వందే భారత్ రైళ్లు: కేంద్రానికి ఏపీ బీజేపీ ఎమ్మెల్యే లేఖ!

ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నగరం లోపలే ఉంది, అయితే ఇది జూన్ లేదా జూలై నెలల్లో భోగాపురానికి మారనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నగరం నుండి సుమారు 45-50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా రైల్వే సేవలను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి నగరాలకు అదనపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించాలని ఆయన తన లేఖలో విన్నవించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు…

TELANGANA

మృత్యుపాశంగా చైనా మాంజా: సంగారెడ్డిలో యువకుడి గొంతు తెగి దుర్మరణం!

సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ప్రాంతంలో సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిషేధిత చైనా మాంజా (నైలాన్ దారం) ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్‌పై వెళ్తున్న అద్వైత్ (22) అనే యువకుడి మెడకు గాలిపటం దారం చుట్టుకోవడంతో గొంతు తీవ్రంగా కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భారీగా రక్తస్రావం కావడంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అద్వైత్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వలస వచ్చిన అతను,…

CINEMA

‘అనగనగా ఒక రాజు’ రివ్యూ: నవీన్ పొలిశెట్టి మార్క్ నాన్-స్టాప్ కామెడీ.. సంక్రాంతికి అసలైన వినోదం!

నవీన్ పొలిశెట్టి అంటేనే స్క్రీన్ మీద ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ తర్వాత ఆయన కామెడీ టైమింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ చిత్రంలో ‘గౌరవపురం’ జమీందారు మనవడైన ‘రాజు’ అనే పాత్రలో నవీన్ ఒదిగిపోయారు. ఆస్తి లేకపోయినా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే తపనతో, కోట్ల ఆస్తి ఉన్న ‘చారు’ (మీనాక్షి చౌదరి)ని ముగ్గులోకి దించేందుకు హీరో చేసే ‘ఆపరేషన్ చారులత’ ప్రయత్నాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సినిమా విశ్లేషణకు…

TELANGANA

మాదాపూర్‌లో కుంగిన రోడ్డు: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మాదాపూర్‌లో రోడ్డు కుంగిపోవడంతో సైబరాబాద్ పోలీసులు కీలక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పారామం సమీపంలోని సైబర్ గేట్ వద్ద భూగర్భ మంజీరా నీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నిరంతరం నీరు లీక్ అవ్వడం వల్ల భూమి లోపల మట్టి పట్టు కోల్పోయి ఉపరితలం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఐకియా (IKEA) నుంచి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు…

TELANGANA

జడ్చర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 27 మందికి గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ భారీ ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన సమయంలో బస్సులో…

AP

పవన్ కళ్యాణ్ వల్లే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాధాన్యం: అంబటి రాంబాబు

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య హుషారుగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో (GO) ప్రతులను భోగి మంటల్లో వేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు నుంచే పోటీ చేస్తానని ఈ వేడుకల వేదికగా ఆయన స్పష్టం చేశారు. తనకు…

World

రాజౌరీ సరిహద్దులో పాక్ డ్రోన్ల కవ్వింపు: సైన్యం ఎదురు కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ (LoC) సమీపంలో పాకిస్థాన్ డ్రోన్లు మరోసారి కలకలం రేపాయి. మంగళవారం రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో దుంగా గాలా సెక్టార్‌లో భారత గగనతలంలోకి ప్రవేశించిన ఈ డ్రోన్లను గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపింది. సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో, ఆ డ్రోన్లు వెనక్కి మాయమయ్యాయని అధికారులు ధృవీకరించారు. గత 48 గంటల్లోనే పాక్ డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.…