ఆన్ లైన్ మోసానికి గురైన యాంకర్ అనసూయ..!
ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను పంపించకుండా తనను మోసం చేశారంటూ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ చేసిన దుస్తులను ఇప్పటి వరకూ పంపలేదని మండిపడ్డారు. ఈమేరకు యాంకర్ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. దాదాపు నెల రోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్…

