Editor

TELANGANA

హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ..

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. రోడ్డు నెంబర్ 1లో గల తాజ్ బంజారా హోటల్ రూ.1.43 కోట్ల మేర పన్ను బకాయి పడిందని అధికారులు పేర్కొన్నారు.   పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు తెలిపారు. చివరిగా రెండు రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో,…

TELANGANA

కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్… అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.   ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్…

CINEMA

రామ్ చరణ్ మూవీలో ప్రగ్యా జైస్వాల్..?

RC 16.. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) అనగానే అందరికీ బాలయ్య(Balakrishna ) హీరోయిన్ అనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్యకు జోడీ గా అఖండ(Akhanda ), డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. అఖండ 2 లో అవకాశం దక్కించుకుంది. బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha menon) నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రగ్యా…

AP

నంద్యాల్ టు విజయవాడ ఆర్టీసీ బస్సులో 13 తులాల బంగారం అపహరణ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫ్యామిలీ తిరుణాల నిమిత్తం అహోబిలం వెళ్లి తిరిగి వస్తుండగా గాజులపల్లి సమీపంలో విజయవాడ బస్సులో గిద్దలూరు వరకు ప్రయాణం చేస్తుండగా 13 తులాల బంగారం అపహరణ అయిందని బాధితులు తెలిపారు..   పూర్తి వివరాలు పోలీసు ల విచారణలో తెలియాల్సింది…….

AP

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు..

అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా లోకేష్ చర్చించారు.  

National

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ…

TELANGANA

మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్..

మిస్ వరల్డ్-72 పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి యువతులు పాల్గొననున్నారు.   ‘బ్యూటీ విత్ ఏ పర్సన్’ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ వేదికగా…

TELANGANA

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్‌కు ఏమీ కాదని స్పష్టం చేశారు.   తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్ఎస్ అని ఆయన…

AP

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం.. త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో…

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాకిచ్చిన‌ హైకోర్టు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ కావాల‌ని వంశీ పిటిష‌న్ వేశారు. ఆయ‌న పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. కాగా, ద‌ళిత యువ‌కుడు స‌త్య‌వ‌ర్ధ‌న్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య‌వాడ…