Editor

AP

గంజాయి అమ్మేవారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్..!

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ‘ఈగిల్’ గా (ELITE ANTI-NARCOTICS GROUP FOR LAW ENFORECEMENT – EAGLE)…

AP

ప్రధానితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ కలిశారు. ప్రధానితో సమావేశంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ లోనూ ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని తమ కోసం కేటాయించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.   “ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్ లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో…

CINEMA

నాని సినిమాలో విలన్ గా మోహన్ బాబు..!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘దసరా’ సినిమా సూపర్ హిట్ అయింది. నాని కెరీర్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.   ఈ సినిమాకు’ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంతో…

APUncategorized

ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు..!

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం కు వరాలు ప్రకటించారు. తన స్వంత నియోజకవర్గం పిఠాపురంకు సంబంధించి, కేంద్ర మంత్రులతో చర్చించి చివరకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్.   పిఠాపురం నియోజవర్గం నుండే పవన్ కళ్యాణ్ విజయదుందిభి మోగించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నియోజకవర్గం కూటమి జనసేనకు కేటాయించగా పవన్ నేరుగా ఇక్కడి నుండే పోటీ చేసి, సుమారు 70 వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు…

AP

ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం.. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ వివరాల మేరకు.. డిసెంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.   ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల నుండి ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడగా, ఏపీ నుండి మూడు రాజ్యసభ స్థానాలకు కలిపి మొత్తం 6 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను డిసెంబర్ మూడో తేదీన…

TELANGANA

ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.   అదేవిధంగా రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను…

TELANGANA

2025లో పాత‌బ‌స్తీకి మెట్రో..?

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి పీపీపీ మోడ‌ల్ మెట్రో మ‌న‌దేన‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా పూర్తి చేసామన్నారు. ఫేస్ 1 లో 69 కి.మీ మేర 57 స్టేషన్ లు ఉన్నాయని చెప్పారు. దీనికోసం రూ. 22,148 కోట్లు ఖర్చు చేసామన్నారు. 2024 ఆగస్టు 14వ తేదీ నాటికి 5.63…

National

ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. మహా సీఎం అతడే ఫిక్స్..?

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‌నాథ్‌ షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు.. మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపైనా ఉత్కంఠ నెలకొంది. ఫడణవిస్‌, షిండే, అజిత్‌ పవార్‌లో ఒకరు సీఎంగా ఎంపిక కానున్నారు.   మహారాష్ట్రలో మహావిజయం సాధించింది మహాయుతి కూటమి. 288 స్థానాలకు గానూ 230 సీట్లతో ఎన్డీయే కూటమికి…

National

వచ్చే నెల రెండు ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.   శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ బిల్డింగ్ లో పీఎస్ఎల్వీ సీ60 అనుసంధానం పనులు కొనసాగుతున్నాయి.  …

AP

పవన్ కు ఢిల్లీ పిలుపు – కీలక బాధ్యతలు..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ…