నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..!కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ల పేరుతో.. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు..…

