Uncategorized

Uncategorized

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా..!

అయోధ్య రామ మందిరానికి నూతన సీఈవో గా జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆపరేషన్ సింధూర్ హీరో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా రామ్ మందిర్ తొలి సీఈఓగా కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. రామమందిర పరిపాలనను మరింత పారదర్శకంగా, వృత్తిపరంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక CEO పదవిని సృష్టించి మిశ్రాను ట్రస్టు ఎంపిక చేసింది. భారత వైమానిక దళంలో 38 సంవత్సరాలకు పైగా విశేష సేవలందించిన జితేంద్ర మిశ్రా, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్…

Uncategorized

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ వార్నింగ్..! అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్..

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావని… క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన కీలక సమయమని జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన…

Uncategorized

మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆయన్ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ…

Uncategorized

కశ్మీర్‌లో ఆసక్తికర పరిణామం..టాప్ టెర్రరిస్ట్ ఇంటిపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..!

జమ్మూ కశ్మీర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా దళాల మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. షాపియాన్‌లోని వారి నివాసంపై తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అబిద్ రంజాన్ షేక్, లోయలో…

Uncategorized

‘బుల్లెట్ రైల్’ హబ్‌గా హైదరాబాద్..! రాంచందర్ రావు కీలక ప్రకటన..

భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ…

Uncategorized

నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..!కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు.   ఎన్ కౌంటర్ల పేరుతో.. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు..…

TELANGANAUncategorized

నాకు మంత్రి పదవి ఇవ్వండి.. నీళ్లు తెచ్చి చూపిస్తా: హరీశ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తనకు మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే, కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.   మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు పవర్‌పాయింట్…

Uncategorized

వాహనదారులకు గుడ్ న్యూస్..! రెండు, మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం..

వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు, మూడు నెలల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన గురువారం వెల్లడించారు.   పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన నిల్వలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వినియోగిస్తున్నాయని మంత్రి వివరించారు. దీనివల్ల…

APUncategorized

కాపులను దూరం చేయడమే వైసీపీ స్ట్రాటజీ..! ఎమ్మెల్సీ హరిప్రసాద్ షాకింగ్ కామెంట్స్..

మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వైసీపీ పార్టీ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఆయన ఎండగట్టారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ పదవీ బాధ్యతల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.   పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర   జనసేన అధినేత పవన్…

APUncategorized

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి..

కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.   అయితే శునకం శుక్రవారం…