‘బుల్లెట్ రైల్’ హబ్గా హైదరాబాద్..! రాంచందర్ రావు కీలక ప్రకటన..
భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ…

