Editor

AP

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం.. దేశమే కాదు ప్రపంచమే గర్వించతగ్గ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. అందుకు తగ్గట్లే రాజధాని ప్రాంతంలో చకచకా నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. సీడ్ యాక్సెస్ రోడ్డును సైతం ప్రారంభించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజధానిపై తమ వ్యతిరేక స్వరంగా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా పాటనే విడుదల చేశారు.…

AP

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా..: బొత్స సత్యనారాయణ..

రెండవ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అక్రమాల పై విచారణకు భయపడి పారిపోయిందని అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు చర్చ కోరితే పారిపోతున్నారని, అక్రమాలకు ఆధారాలున్నా స్పందంచడం లేదని అన్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే సమాధానం లేదు. ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారని అన్నారు. రెండులరోజులు పొడిగించైనా చర్చిద్దామంటే మాట్లాడటం లేదు. డీఎస్సీలో అక్రమాల పై విచారణకు భయపడపతున్నారంటేనే అనుమానాలు…

TELANGANA

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను నీరుగార్చే కుట్ర..! రేవంత్ ప్రభుత్వంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..

తెలంగాణలో పేదల సంక్షేమానికి సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పథకాలను యథాతథంగా కొనసాగించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్…

TELANGANA

రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది: హరీశ్ రావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?” అని ప్రశ్నించారు.…

AP

నాగబాబుకు కీలక పదవి.. కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ (Green Executive Committee) చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విశేషంగా పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవుల విస్తరణే లక్ష్యంగా పనిచేసే ఈ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీకి…

AP

ప్రతి ఏటా డీఎస్సీ..! ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… డీఎస్సీ నిర్వహణ, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకంగా 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి…

TELANGANA

తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు..!

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు చెప్పారు.మొత్తం ఓటర్లలో 78.03 శాతం మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు 73 లక్షల మంది ఓటర్లు…

AP

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి: వైసీపీకి చంద్రబాబు సవాల్ ..

మెగా డీఎస్సీ నియామకాల్లో ఒక్క డీవియేషన్ కూడా జరగలేదని, ప్రతిభ ఆధారంగానే అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ చేస్తున్నది కేవలం హిట్ అండ్ రన్ ఆరోపణలేనని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల జగన్ జెన్ జీ వృద్ధులతో ఫేక్ ప్రదర్శనలు చేయిస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ…

TELANGANA

ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలవను: కల్వకుంట్ల కవిత..

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీతో భవిష్యత్తులో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, “ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సంబంధాలు వేరని, రాజకీయాలు వేరని ఆమె తేల్చి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడం తమ సిద్ధాంతం కాదని కూడా అన్నారు.పార్టీ నుంచి తనను బహిష్కరించిన తీరుపై…

TELANGANA

బీఆర్ఎస్ చేతబడి చేయిస్తోంది.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత…