సీఐ నాగరాజు కేసులో మలుపు.. కస్టడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. నిందితుడిని రాజమండ్రి జైలులోనే విచారించాలంటూ గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దర్యాప్తునకు అనుకూలంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణ కోసం సీఐ నాగరాజును విజయవాడలోని దర్యాప్తు కేంద్రానికి గానీ,…

