Editor

AP

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు..! నాణేనికి మరో వైపు చూపిస్తా..! జగన్ షాకింగ్ కామెంట్స్..

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శాసనసభను దాదాపు రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత…

AP

ఉప్పాడ తీరానికి రక్షణ కవచం.. పవన్ సమక్షంలో మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం..

కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తీవ్రమైన కోత కారణంగా దెబ్బతింటున్న ఈ తీరాన్ని పరిరక్షించేందుకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ ప్రాజెక్టు కింద రూ.323 కోట్ల వ్యయంతో ఉప్పాడ తీరంలో రక్షణ గోడ…

National

గెలుపు తర్వాత నియోజకవర్గ యువతకు ప్రశాంత్‌ కిశోర్‌ తొలి హామీ ఇదే..

బాంకీపూర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు…

National

నా ఓటు కనిపించట్లేదు – ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడిగా, భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న ప్రశ్నా రావణ్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లకు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ “#జస్ట్ ఆస్కింగ్” అంటూ చెలరేగిపోయిన ప్రకాష్ రాజ్.. ఇటీవల…

TELANGANA

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ ధమాకా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు..!

తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో ఖేలో ఇండియా యూత గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు…

TELANGANA

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..! ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్, ఐదుగురి మృతి..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోని యూ-టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి…

TELANGANA

డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’.. భారీ పెట్టుబడులే లక్ష్యం..

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరులో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు, సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను…

AP

నకిలీ పోలీసులతో ర్యాలీలా..? వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు..

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు.…

AP

ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలకు కూటమి పార్టీల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. మిత్రపక్షాల నాయకులను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు, విద్వేషపూరిత ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంయుక్తంగా హెచ్చరించాయి. ఈ మేరకు ‘ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ’ పేరుతో ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి.గత కొంతకాలంగా కూటమి పార్టీల…

National

ఝార్ఖండ్‌లో టెన్షన్‌.. బారికేడ్లు బద్దలుకొట్టిన విద్యార్థులు..

ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోల్లో కనిపించింది.నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీక్‌లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల…