బీజేపీ కొత్త టీమ్తో ప్రధాని మోదీ భేటీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నూతన జాతీయ పదాధికారులతో సమావేశమయ్యారు. కొత్త ఆలోచనలు, దృక్పథాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో పార్టీకి ఉన్న సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సంస్థాగత సమావేశాలు ఇలాంటి కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఫొటోలను పంచుకున్నారు. “సంస్థాగత సమావేశాలు పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలతో సంబంధాలు…

