కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు..! మంత్రి పదవి నుండి తొలగింపు..?
కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి అందించింది. అలాగే మరో సందర్భంలో సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చినట్లు కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి వెల్లడించారు.మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను ఉపేక్షించబోమని చెప్పారు.…

