Editor

TELANGANA

డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’.. భారీ పెట్టుబడులే లక్ష్యం..

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరులో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు, సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను…

AP

నకిలీ పోలీసులతో ర్యాలీలా..? వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు..

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు.…

AP

ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలకు కూటమి పార్టీల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. మిత్రపక్షాల నాయకులను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు, విద్వేషపూరిత ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంయుక్తంగా హెచ్చరించాయి. ఈ మేరకు ‘ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ’ పేరుతో ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి.గత కొంతకాలంగా కూటమి పార్టీల…

National

ఝార్ఖండ్‌లో టెన్షన్‌.. బారికేడ్లు బద్దలుకొట్టిన విద్యార్థులు..

ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోల్లో కనిపించింది.నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీక్‌లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల…

TELANGANA

ట్రైనీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి సీబీఐ మాజీ డైరెక్టర్..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీ సీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీ.వీ.ఆనంద్‌ కు ఈ మెయిల్‌ పంపారు. ఈ కేసును సీబీ సీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పలు ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు. పని చేసే చోట లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్…

AP

డీఎస్సీపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు..

డీఎస్సీ‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తేవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? దాని పేరుతో నిరసనలు.. ర్యాలీలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోందా? ఈ ఇష్యూ ద్వారా జెన్ జీలను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసిందా? డీఎస్సీ వ్యవహారంపై కోర్టు కూడా సీబీఐ విచారణకు ససేమిరా చెప్పినా, ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? సోమవారం నిరసన ర్యాలీలో కీలక నేతలు అరెస్టుతో పెద్దగా స్పందన లేదా? ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది డీఎస్సీ నిర్వహించింది.…

AP

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల (2021-26) కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ. 12,620.53 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ప్రాజెక్టు…

TELANGANA

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో రగడ..! మంత్రి పొంగులేటి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి..

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రుల ప్రసంగాలపై స్థానిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు, లబ్ధిదారులకు పట్టాల పంపిణీ నిమిత్తం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పనులను అసంపూర్తిగా…

AP

దైవ నామాలను అపహాస్యం చేయొద్దు: పవన్ కల్యాణ్..

దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నామాలను కించపరచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటనను ఆయన ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ రాజకీయ పార్టీ, తమ కార్యక్రమాల్లో…

World

Donald Trump: బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ మరో కీలక నిర్ణయం.. రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు!

అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship), బర్త్ టూరిజంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దురదృష్టకరమని అభివర్ణించిన ట్రంప్.. ప్రస్తుత నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసినట్లు సమాచారం. గతంలో అమెరికా పౌరులు కానివారికి అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని పరిమితం చేసే ప్రయత్నం చేసిన ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా భూభాగంలో జన్మించిన వారికి…