Editor

National

ఒక్క ఎముకతో డైనోసార్ల చరిత్ర రహస్యం..! ఎలా బయటపడిందంటే..!

ఈరోజు డైనోసార్ల గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారీ శిలాజాలు దొరికినా అవి ఏ జీవికి చెందినవో శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటి ఆసక్తికర సంఘటనే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో జరిగింది. తర్వాత అదే శిలాజం చరిత్రలో నమోదైన తొలి డైనోసార్‌ ఆనవాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.   1676లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సున్నపురాయి గనిలో కార్మికులు భారీ కాలి ఎముకను వెలికితీశారు. ఈ శిలాజాన్ని ప్రకృతి శాస్త్రవేత్త…

National

భారత్‌కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం..!

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా… 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక హెచ్చరించింది. అయితే, ఈ సంక్షోభమే రాబోయే దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేయనుందని పీఎల్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జల శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్), మురుగునీటి రీసైక్లింగ్, మురుగునీటి పారుదల…

National

పాత వాహనాలకు ఈ20 ప్రమాదమా..? సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పింది..?

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (ఈ20) కలిపే కార్యక్రమంపై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విధానం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చే ఏడాదికి స్పష్టమైన ఫలితాలు అందుతాయని వెల్లడించింది. పాత వాహనాలపై ఈ20 పెట్రోల్‌ ప్రభావం చూపుతుందన్న చర్చలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఈ20 ఇథనాల్‌ సరఫరాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఈ విషయాన్ని…

AP

ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

TELANGANA

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. జులై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరిగే ఈ 34వ మంత్రిమండలి భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.   కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో సచివాలయంలో పరిపాలనా పరమైన హడావుడి మొదలైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన…

National

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్‌తో కలుస్తామని హెచ్చరిక..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.   ఈ ఆందోళనలో పాల్గొన్న పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ఆహారం,…

National

భారత్‌లో నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం..! రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్

అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్‌లో భారీగా విస్తరించిన నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెర్సాచీ, మైఖేల్ కోర్స్, జిమ్మీ చూ వంటి ప్రఖ్యాత కంపెనీలు నకిలీ సరుకును అరికట్టేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్లను నియమించుకుంటున్నాయి. వీరు సాధారణ కస్టమర్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్లి, నకిలీ వస్తువులను విక్రయించే వారి సమాచారాన్ని సేకరించి కంపెనీలకు అందిస్తున్నారు.   ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు…

National

అయోధ్య చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు..

అయోధ్యలోని ప్రసిద్ధ శ్రీరామ జన్మభూమి దేవాలయ కానుకల చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి దాదాపు రూ. 58 లక్షల నగదును రికవరీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును…

TELANGANA

కొడంగల్‌లో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి… వాటితోనే రేవంత్ గెలిచారా?: కవిత..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు ‘సర్‌’ ప్రక్రియ జరిగిందని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 వేల ఓట్లు తీసేశారని… దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కేవలం…

TELANGANA

ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు.. తెలంగాణ కొత్త విధానం..! గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్..

తెలంగాణ రాష్ట్రం కేవలం ధాన్యం పండించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా అవతరించబోతోంది. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న విస్తృత అవకాశాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోబోతోందని స్పష్టం చేశారు.   ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు..…