జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం: కేసీఆర్ ధీమా, వ్యూహాలపై దిశానిర్దేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం…

