అమరావతిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ: కొల్లు రవీంద్ర..
ఆంధ్రప్రదేశ్ను క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోబోతున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. భారతదేశానికే ఆదర్శంగా రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’తో పాటు ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడానికి పీవీ సింధు, పుల్లెల…

