అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర గళం బలంగా వినిపించిన క్షణమిదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కలలను…

