ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్..
తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ రెండేళ్లన్నర పాలనను, బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల…

