Editor

AP

ఏపీలో మోగనున్న స్థానిక నగారా.. ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలు..

ఏపీ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గతంలో జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 17న ఓటర్ల…

TELANGANA

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..!

రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం… చట్టబద్ధమైన ప్రక్రియ, అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం జీవోల ఆధారంగానే ప్రజాధనాన్ని వెచ్చించే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై…

National

రాజ్యసభనలో “లుంగీవాలా” వివాదం..!

రాజ్యసభలో బుధవారం ‘లుంగీవాలా’ వివాదం తీవ్ర దుమారం రేపింది. తనను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ఈ పదాన్ని ఉపయోగించారని కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.సోమవారం నాడు సభలో తాను ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో, పంచె కట్టుకుని ఉన్న తనను చూసి వెనుక సీటులో కూర్చున్న సుస్మితా…

National

జెన్-జీకి ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.రైల్వే స్టేషన్లలో…

TELANGANA

కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన..!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలను పరుగులు పెట్టించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పేదలకు ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, డిఫాల్ట్ రైస్‌మిల్లర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కేపీహెచ్‌బీ లో తొలి ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేపీహెచ్‌బీ…

TELANGANA

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ..!

భారత సాయుధ దళాల్లో తెలంగాణ యువత ప్రాతినిధ్యం పెరిగేలా, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లలో వారికి పూర్తి మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) లో ఉన్న ‘బోధి పెవిలియన్’ వేదికగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తో సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…

AP

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు..! నాణేనికి మరో వైపు చూపిస్తా..! జగన్ షాకింగ్ కామెంట్స్..

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శాసనసభను దాదాపు రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత…

AP

ఉప్పాడ తీరానికి రక్షణ కవచం.. పవన్ సమక్షంలో మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం..

కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తీవ్రమైన కోత కారణంగా దెబ్బతింటున్న ఈ తీరాన్ని పరిరక్షించేందుకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ ప్రాజెక్టు కింద రూ.323 కోట్ల వ్యయంతో ఉప్పాడ తీరంలో రక్షణ గోడ…

National

గెలుపు తర్వాత నియోజకవర్గ యువతకు ప్రశాంత్‌ కిశోర్‌ తొలి హామీ ఇదే..

బాంకీపూర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు…

National

నా ఓటు కనిపించట్లేదు – ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడిగా, భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న ప్రశ్నా రావణ్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లకు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ “#జస్ట్ ఆస్కింగ్” అంటూ చెలరేగిపోయిన ప్రకాష్ రాజ్.. ఇటీవల…