Editor

TELANGANA

రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్..

తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నిన్న జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రఘురాం రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సలహాలు, సూచనలు అందించారు.   ఈ సందర్భంగా…

National

రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది.   మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి…

National

ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.   “ఎన్నికల సంఘం ఫలితాలను ధ్రువీకరించిన క్షణం నుంచి ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు.…

National

టీవీకేకు మద్దతుగా అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.   ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి…

National

బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎల్లుండి (శుక్రవారం) కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని…

National

విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను విజయ్ చిత్తు చేసిన వైనం పెను రాజకీయ సంచలనంగా మారింది. ఇంతజేసీ విజయ్ పార్టీ స్థాపించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ, తన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా విజయ్ ఓటర్ల మనసులు గెలుచుకోగలిగాడు. విజయ్ గెలుపు ప్రస్థానంలో కీలకమైనది…

National

బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆమె తోసిపుచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, టీఎంసీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.   ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, 2021, 2024లోనూ…

AP

వాట్సాప్ వేదికగా వైద్య సేవలు.. ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు..

ప్రజలకు, వైద్యులకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా… ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు తమ మొబైల్ నుంచి 9552300009 వాట్సాప్‌ నంబర్‌కు “హాయ్” లేదా “Hi” అని మెసేజ్ పంపి.. తదనంతరం వచ్చే మెనూలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్‌ను ఎంచుకుని ఈ సేవలను…

AP

పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం..

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ…

TELANGANA

రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించారు.. ధర్మపురి అరవింద్ కిలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితతో పార్టీని పెట్టించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’ ప్రభావం కేసీఆర్, కేటీఆర్ పైనే ఉంటుందని అన్నారు. ఇక ఏ పార్టీపై ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఆమెకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు.   రానున్న…