జీహెచ్ఎంసీ చట్టం రద్దు.. సరికొత్త పాలనపై ముసాయిదా విడుదల..!
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర పాలనను ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 1955నాటి జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి పలకనుంది. ప్రస్తుత మెట్రోపాలిటన్ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026 ముసాయిదాను ఆదివారం విడుదల చేసింది. 1955లో 15 లక్షల జనాభా ఉన్నప్పటి నిబంధనలు నేటి 1.3 కోట్ల జనాభా కలిగిన మెట్రో నగరానికి సరిపోవడంలేదని భావించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమీకృత పాలనా…

