Editor

AP

ఆధారాలు లేని ఆరోపణలు సహించం..! సోషల్‌ మీడియా దుర్వినియోగంపై పవన్‌ తీవ్ర హెచ్చరిక..!

సోషల్‌ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.   మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్‌ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం…

National

సీఎం విజయ్‌ ఖాళీ చేసిన స్థానం నుంచి పోటీ..! క్లారిటీ ఇచ్చిన లారెన్స్‌..

తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ప్రచారానికి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెరదించారు. ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని పార్టీ తరఫున తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.   ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో లారెన్స్‌ కొత్త వీడియో విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన తల్లి, సన్నిహితులు, తన సేవా సంస్థ సభ్యుల…

AP

చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు: భూమన..

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, వైసీపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు.   ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.…

National

అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు..! కేంద్రం హై అలర్ట్‌..!!

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో యాత్ర మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.   నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు…

NationalTechnology

టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం..! మెటా నుంచి సరికొత్త ‘బ్రెయిన్ రీడింగ్’ టెక్నాలజీ..!

టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం చోటుచేసుకుంది. టెక్ దిగ్గజం మెటా మన మెదడులోని ఆలోచనలను నేరుగా చదివి, వాటిని అక్షర రూపంలోకి మార్చే ఒక విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను ఆవిష్కరించింది. ‘బ్రెయిన్2క్వెర్టీ v2’ (Brain2Qwerty v2) పేరుతో పిలుస్తున్న ఈ టెక్నాలజీకి ఎలాంటి సర్జరీ లేదా ఇంప్లాంట్లు అవసరం లేకపోవడం అతిపెద్ద విశేషం. పక్షవాతం, మెదడుకు గాయాలు, ఇతర కారణాల వల్ల మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది.…

National

ఒక్క ఎముకతో డైనోసార్ల చరిత్ర రహస్యం..! ఎలా బయటపడిందంటే..!

ఈరోజు డైనోసార్ల గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. భారీ శిలాజాలు దొరికినా అవి ఏ జీవికి చెందినవో శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటి ఆసక్తికర సంఘటనే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో జరిగింది. తర్వాత అదే శిలాజం చరిత్రలో నమోదైన తొలి డైనోసార్‌ ఆనవాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.   1676లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సున్నపురాయి గనిలో కార్మికులు భారీ కాలి ఎముకను వెలికితీశారు. ఈ శిలాజాన్ని ప్రకృతి శాస్త్రవేత్త…

National

భారత్‌కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం..!

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా… 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక హెచ్చరించింది. అయితే, ఈ సంక్షోభమే రాబోయే దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేయనుందని పీఎల్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జల శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్), మురుగునీటి రీసైక్లింగ్, మురుగునీటి పారుదల…

National

పాత వాహనాలకు ఈ20 ప్రమాదమా..? సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పింది..?

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (ఈ20) కలిపే కార్యక్రమంపై ఇంకా ప్రయోగాత్మక అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విధానం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చే ఏడాదికి స్పష్టమైన ఫలితాలు అందుతాయని వెల్లడించింది. పాత వాహనాలపై ఈ20 పెట్రోల్‌ ప్రభావం చూపుతుందన్న చర్చలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఈ20 ఇథనాల్‌ సరఫరాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఈ విషయాన్ని…

AP

ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

TELANGANA

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. జులై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరిగే ఈ 34వ మంత్రిమండలి భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.   కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో సచివాలయంలో పరిపాలనా పరమైన హడావుడి మొదలైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన…