ఆధారాలు లేని ఆరోపణలు సహించం..! సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ తీవ్ర హెచ్చరిక..!
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం…

