ఇక 850 ఎంపీ స్థానాలు, కేంద్రం సంచలన ప్రతిపాదన..
దేశ రాజకీయ ముఖచిత్రం త్వరలో భారీ మార్పులకు లోనుకానుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంటు సభ్యులకు పంపించినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు లభించే ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడమే ఈ భారీ కసరత్తు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. …

