రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి..! సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్…

