రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భారీ ఊరటనిచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. పెట్టుబడి ఖర్చుపై 50 శాతం అదనంగా కలిపి కొత్త ధరలను ఖరారు చేశారు. వరి క్వింటాల్కు రూ.…

