Editor

TELANGANA

నిమ్స్‌లో 1000 రోబోటిక్ సర్జరీలు.. దేశంలోనే కొత్త రికార్డ్..!

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఇదొక నూతన రికార్డు అని, సామాన్యులకు సైతం అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.ఈ అద్భుత ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం సీనియర్…

TELANGANA

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసులో మరో ట్విస్ట్..! ఏపీ మహిళతో రిలేషన్..

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? తీగలాగితే డొంక కదులుతోందా? తాజాగా మరో మహిళతో అతడికి రిలేషన్ షిప్ ఉందా? గదిలో ప్రేమ లేఖల మాటేంటి? సదరు మహిళ ఏపీకి చెందిన మహిళా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు కొత్త మలుపు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరో…

AP

ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాను నిరోధించేందుకు ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా పోలీసులను…

AP

రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి: సీఎం చంద్రబాబు..

రవాణా శాఖలో అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించి ప్రజలకు సులభతరమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం కీలక సూచనలు చేశారు.రవాణా శాఖలో సంస్కరణలకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్…

National

బీజేపీకి భారీ షాక్.. బంకీపూర్ కోట బద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో, ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 19,324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 32 రౌండ్ల…

National

ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్లకు కాక్రోచ్ లు భారీ నిధులు..? ఎందకంటే..?

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజెపి చేపట్టిన నిరసనలు ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురు ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.   డిజిటల్ ప్రచారం వెనుక భారీగా నిధులు?   సిజెపి చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగంగా నిరసనలకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించేందుకు సోషల్…

TELANGANA

ఆపరేషన్ ముస్కాన్ -12 సక్సెస్.. 6,307 మంది చిన్నారులను కాపాడిన తెలంగాణ పోలీసులు..!

బాల కార్మిక వ్యవస్థ.. బాలల అక్రమ రవాణాను అరికట్టటంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మహిళా…

TELANGANA

వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌-జీ తరం ఓటర్లే కీలక పాత్ర-: కేటీఆర్..

వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌-జీ తరం ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల నీట్ పరీక్ష వైఫల్యంపై జరిగిన పోరులో ‘ఇన్‌స్టా పిల్లలు’ విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువతరం ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   “యువతరం సరికొత్త రీతిలో ఢిల్లీలో కదం తొక్కింది. ఎవరితోనైతే ఘర్షణకు వెళ్లకూడదో, ప్రధాని మోదీ…

AP

భోగాపురం విమానాశ్ర‌యం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వే.. ఈ గడ్డపై అడుగుపెట్టడం ఎంతో గర్వకారణం: ప్రధాని మోదీ..

పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపై అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సహా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. నేటి రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక కీలకమైన రోజని అభివర్ణించారు.  …

AP

భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ వార్.. వైసీపీ కీలక ట్వీట్..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయింది. మరోవైపు, ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సాకారమవ్వడంపై మాజీ సీఎం జగన్ తరఫున ప్రజలకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు పునాది వేసి, కల నుంచి నిజం దిశగా నడిపించిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు ఎలాంటి పాత్ర లేకుండానే మొత్తం…