Editor

National

ఇక 850 ఎంపీ స్థానాలు, కేంద్రం సంచలన ప్రతిపాదన..

దేశ రాజకీయ ముఖచిత్రం త్వరలో భారీ మార్పులకు లోనుకానుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు రూపొందించిన బిల్లు ముసాయిదాను ఇప్పటికే పార్లమెంటు సభ్యులకు పంపించినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు లభించే ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడమే ఈ భారీ కసరత్తు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.  …

TELANGANA

చర్చకు సిద్ధమా..? మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్..

సినీ గాయకురాలు మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆర్థిక మోసం వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. పరస్పర ఫిర్యాదులు, సవాళ్లతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడుల స్కామ్‌లో తన ప్రమేయం లేదని మంగ్లీ వాదిస్తుంటే, ఆమె ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని న్యాయవాది సింగపోగు సుబ్బారావు గట్టిగా వాదిస్తున్నారు. బుధవారం ఈ ఇరు పక్షాలు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.   డీజీపీ కార్యాలయం వద్ద…

TELANGANA

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కసరత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కార్యకర్తలకు త్వరలోనే శుభవార్త అందనుంది. బుధవారం సాయంత్రం సీఎంతో పార్టీ కీలక నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై సమగ్రంగా చర్చించారు.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు…

AP

తెలుగుదేశ పార్టీలో కీలక మార్పులు..! ఉపాధ్యక్షుడిగా నారా లోకేష్..

నుంచి యువ సైన్యాన్ని రెడీ చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడులను నియమించింది. ఇదే కాకుండా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది టీడీపీ హైకమాండ్.   తెలుగుదేశ పార్టీలో కీలక మార్పులు   ఎట్టకేలకు టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ,…

AP

2029లో వచ్చేది నేనే..! జగన్ మాస్ వార్నింగ్..

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు గారూ.. కళ్ళు మూసి తెరిచేసరికే మరో మూడేళ్లు అయిపోతుంది.. వచ్చేది మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే! ఈ జువ్వలదిన్నెలో మత్స్యకారుల పొట్టకొట్టి మీరు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను తిరిగి తీసుకుంటాం.. ఆ ప్రైవేట్ డిఫెన్స్…

AP

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ, ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాజధానిని రాత్రికి రాత్రే నిర్మించలేరని ఆయన స్పష్టం చేశారు.   ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చారిత్రక నగరాల నిర్మాణాన్ని గుర్తుచేశారు. 1537లో కెంపె గౌడ స్థాపించిన బెంగళూరు, 1591లో కులీ కుతుబ్ షా నిర్మించిన…

National

ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్..!

ఎన్నికల్లో బయో మెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేయాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఇలా చేస్తే నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు అర్హత ఉన్న అంశమని అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది.   దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం సాధించిన పార్టీలపై ప్రతిపక్షాలు దొంగ ఓట్ల సాయంతో గెలిచాయంటూ…

TELANGANA

ఆర్టీసీలో సమ్మె సైరన్..! 22 నుంచి సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ..

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి..22 (బుధవారం)నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు లు ఇచ్చామని ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 31 డిమాండ్లను పెట్టామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ గా మారుబోతుందా..?

బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ గా మారుబోతుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ సైతం టీఆర్ఎస్ గా ఉంటేనే ప్రజల ఆదరణ ఉంటుందని, అది పార్టీ పేరులోంచి తొలగించిన తర్వాతే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్టీ కేడర్ ఒత్తిడి, మరోవైపు రాజకీయాల్లో గడ్డుకాలం నేపథ్యంలో మళ్లీ పార్టీ మార్పు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో విజయం…

AP

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు..! దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి..

క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్‌ బెడ్‌ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి అవతరించనుంది.   అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు   దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్‌ బెడ్స్‌‌ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్‌ బెడ్లను జాతికి అంకితం…