సిద్దిపేట నుంచే సమరం: మే నెలలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సుమారు 19 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్న తన సంస్థ ఇకపై రాజకీయ వేదికగా మారుతుందని, పార్టీ పేరులో కచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ కరువైందని, ఆ ఖాళీని భర్తీ చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో…

