Editor

AP

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.   ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు   రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని…

AP

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫ్రంట్ ఆఫీస్ సేవలు.. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని…

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ బి. వీరబాబు, కానిస్టేబుల్ నెం.3851/ఆర్‌పీఎఫ్/కదిరి, కదిరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెం.1లో విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి…

National

వర్షాల కోసం వింత పూజ.. గాడిదలకు గులాబ్ జామూన్లు తినిపిస్తున్న జనం..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో స్థానికులు వర్షాల కోసం ఒక వింత ఆచారాన్ని ఆశ్రయించారు. నగరంలో తీవ్రమైన ఉక్కపోత, పొడి వాతావరణం నెలకొనడంతో.. వానలు పడాలని కోరుకుంటూ గాడిదలకు ‘గులాబ్ జామూన్లు’ తినిపించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాడిదలకు ఎంతో ఇష్టంగా ఈ భారతీయ సంప్రదాయ స్వీటును తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం…

TELANGANA

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ ఐపీఎస్ పై కేసు..

దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రమైన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న తీవ్ర ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.   వివరాల్లోకి వెళితే, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ఐపీఎస్ ప్రోబేషనర్, తన సహోద్యోగి అయిన…

AP

రామాయపట్నం పోర్టుపై జగన్ ట్వీట్… కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..

రామాయపట్నం పోర్టు విషయంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును టీడీపీ పెద్దల జేబులు నింపేందుకు ఓ భారీ స్కామ్‌గా మార్చారని, రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేందుకు సిద్ధమయ్యారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.   మా హయాంలో పురోగతి……

National

ఢిల్లీలో అఖిలపక్ష భేటీలో రగడ.. విపక్షాల వాకౌట్..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో గందరగోళం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలకు ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీల నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇది కేవలం సాంకేతిక నిరసన మాత్రమేనని తెలిపి, కొద్ది నిమిషాలకే తిరిగి సమావేశంలో పాల్గొన్నారు.   సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల అజెండాను చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన, పార్లమెంటరీ…

AP

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు..!

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న కరోనా కేసుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌లో ఆర్‌ఎఫ్‌-5 ఒకటి. ఈ వేరియంట్‌ కేసులు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.   ఏపీలో కరోనా కేసుల కలకలం-ఏపీలో కరోనా కేసుల గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. కడప జిల్లాకు చెందిన నాలుగు కేసులు నమోదైన పేషెంట్ల నుంచి నమూనాలను తీసి…

National

భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం.. నేడే ‘విక్రమ్-1’ ప్రయోగం..!

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, దేశంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఈ చరిత్రాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికైంది. ‘ఆగమన్’ (రాక) అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ మిషన్‌ను నేడు ఉదయం 11:30 గంటలకు ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి ఈ ప్రయోగం జరగనుంది.   విక్రమ్-1 రాకెట్…

Uncategorized

‘బుల్లెట్ రైల్’ హబ్‌గా హైదరాబాద్..! రాంచందర్ రావు కీలక ప్రకటన..

భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ…