Editor

TELANGANA

ఎవరి జాగీరు అని మీ ఫొటోలు వేసుకుంటున్నారు..? కాంగ్రెస్ నేతలపై ఈటల ఫైర్..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని… ఈ పాలనతో రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా వేయడం లేదని… కానీ కాంగ్రెస్ నేతలు ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ…

AP

పదోసారి సవాల్ చేస్తున్నా.. డేట్-టైమ్-ప్లేస్‌ ఫిక్స్ చెయ్ జ‌గ‌న్.. చర్చకు నేను రెడీ: నారా లోకేశ్..

జగన్.. నీకు పదోసారి సవాల్ విసురుతున్నా. డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్. పులివెందులకు రమ్మన్నా వస్తా, తాడేపల్లిలోని నీ కొంపకు రమ్మన్నా వస్తా. చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని నువ్వు నాకు నీతులు చెబుతావా?” అంటూ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. జగన్ లాంటి…

National

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు..!

నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు దాదాపుగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు పనిచేస్తున్నామని తెలిపింది. వందమంది భారత మూలాలు ఉన్నవారు కూడా గల్లంతయ్యారని, 400 మంది భారతీయులు చైనాలో నిలిచిపోయారని తెలిపింది. నేపాల్‌కు మరింత సహాయక సామాగ్రిని నేపాల్‌కు పంపుతున్నాము. చైనాలో చిక్కుకున్న 96 మంది భారతీయులు నేపాల్‌కి చేరుకున్నారని తెలిపింది. నేపాల్‌లో చిక్కుకున్న వారిని త్వరలో భారత్ తరలిస్తామని, తమిళనాడుకు చెందిన…

National

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్..!

నేపాల్ అకస్మిక వరదల్లో 200 మందికి పైగా భారతీయుల ఆచూకి మిస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రసూవా జిల్లాలో మెుత్తం 288 మంది భారతీయుల ఆచూకి తెలియరాలేదన్న ఆయన.. మరో 21 మందిని మాత్రం గుర్తించి సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. గల్లంతైన వారితో పాటు బాధితుల యోగ క్షేమాల కోసం నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా రసువా ప్రాంతంలో…

TELANGANA

ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా..? సీఎం రేవంత్ పై కవిత ఫైర్..!

యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్…

TELANGANA

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ..!

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన నిరంతర ప్రయత్నాల నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు…

AP

అమరావతిలోని వీఐటీ-ఏపీ, ఆక్టేవ్ మధ్య కీలక ఒప్పందం..!

అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ప్రముఖ సాంకేతిక సంస్థ ‘ఆక్టేవ్’ మధ్య రెండేళ్ల కాలపరిమితితో ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి వేగంగా ఎదుగుతున్న ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆచరణాత్మక శిక్షణను అందించడమే ఈ భాగస్వామ్య ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంలో భాగంగా ఆక్టేవ్ సంస్థకు చెందిన నిపుణులైన మెంటార్లతో కలిసి విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రాజెక్టులను రూపొందించనున్నారు. ప్రతి…

AP

జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం: అచ్చెన్నాయుడు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం పనులను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించి ఉంటే రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుపై 16 నెలల్లోనే రూ.3,500 కోట్లు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించామని అచ్చెన్నాయుడు తెలిపారు.…

TELANGANA

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌.. ఎన్విడియా వెరా రూబిన్‌ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్..!

హైదరాబాద్‌కు మరో మణిహారంగా నిలవనుంది ఏఐ ఫ్యాక్టరీ. ఆసియాలో మొదటి అత్యంత అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌ను ఏఎం ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఫార్మాలోనే కాదు ఐటీ రంగంలోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. తాజాగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండంలో తొలిసారి అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్లలో…

TELANGANA

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ..!

తన బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏళ్ల బిడ్డ, కొడుకు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ…