Editor

AP

అమరావతిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ: కొల్లు రవీంద్ర..

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోబోతున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. భారతదేశానికే ఆదర్శంగా రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’తో పాటు ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడానికి పీవీ సింధు, పుల్లెల…

TELANGANA

ఓటర్ల తొలగింపుపై సీఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన నోటీసులు, పరిశీలనలు వెలువడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు సమగ్ర పరిశీలన అత్యవసరమని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నిర్ణయించిన గడువులోగా నోటీసులకు స్పందించడం, అభ్యంతరాలు నమోదు…

AP

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య (మెడికల్) కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజును 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రుసుములు 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్నాయి. ఎంబీబీఎస్ (MBBS) ఫీజులు: కన్వీనర్ కోటా: రూ. 18,150 మేనేజ్‌మెంట్ కోటా: రూ. 14.52 లక్షలు ఎన్నారై కోటా: రూ. 43.56 లక్షలు బీడీఎస్ (BDS) ఫీజులు: కన్వీనర్ కోటా: రూ. 15,730 మేనేజ్‌మెంట్…

TELANGANA

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట..! శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..!

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని…

AP

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు..! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో రకంగా జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక చరిత్ర. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ప్రకటించామని, సెప్టెంబర్ 2వ తేదీన పోలవరం లెఫ్ట్ కెనాల్‌కి జలహారతి ఇస్తాంమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల దశాబ్దాల కల అయినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు…

TELANGANA

ఎవరి జాగీరు అని మీ ఫొటోలు వేసుకుంటున్నారు..? కాంగ్రెస్ నేతలపై ఈటల ఫైర్..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని… ఈ పాలనతో రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా వేయడం లేదని… కానీ కాంగ్రెస్ నేతలు ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ…

AP

పదోసారి సవాల్ చేస్తున్నా.. డేట్-టైమ్-ప్లేస్‌ ఫిక్స్ చెయ్ జ‌గ‌న్.. చర్చకు నేను రెడీ: నారా లోకేశ్..

జగన్.. నీకు పదోసారి సవాల్ విసురుతున్నా. డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్. పులివెందులకు రమ్మన్నా వస్తా, తాడేపల్లిలోని నీ కొంపకు రమ్మన్నా వస్తా. చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని నువ్వు నాకు నీతులు చెబుతావా?” అంటూ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. జగన్ లాంటి…

National

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు..!

నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు దాదాపుగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు పనిచేస్తున్నామని తెలిపింది. వందమంది భారత మూలాలు ఉన్నవారు కూడా గల్లంతయ్యారని, 400 మంది భారతీయులు చైనాలో నిలిచిపోయారని తెలిపింది. నేపాల్‌కు మరింత సహాయక సామాగ్రిని నేపాల్‌కు పంపుతున్నాము. చైనాలో చిక్కుకున్న 96 మంది భారతీయులు నేపాల్‌కి చేరుకున్నారని తెలిపింది. నేపాల్‌లో చిక్కుకున్న వారిని త్వరలో భారత్ తరలిస్తామని, తమిళనాడుకు చెందిన…

National

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్..!

నేపాల్ అకస్మిక వరదల్లో 200 మందికి పైగా భారతీయుల ఆచూకి మిస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రసూవా జిల్లాలో మెుత్తం 288 మంది భారతీయుల ఆచూకి తెలియరాలేదన్న ఆయన.. మరో 21 మందిని మాత్రం గుర్తించి సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. గల్లంతైన వారితో పాటు బాధితుల యోగ క్షేమాల కోసం నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా రసువా ప్రాంతంలో…

TELANGANA

ఏపీ వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా..? సీఎం రేవంత్ పై కవిత ఫైర్..!

యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్…