Editor

National

ఢిల్లీలో హింసాత్మక నిరసనలు.. 5 ఎఫ్ఐఆర్‌ల నమోదు..

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నేడు ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిన్న‌ జరిగిన ఈ ఆందోళనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.   వివరాల్లోకి వెళితే.. నీట్ పేపర్ లీకేజీ…

AP

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్.. దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కుదిరిన మరో కీలక ఒప్పందం కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు పడింది. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ…

National

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి..

ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిచివున్న ఒక సరకు రవాణా (కార్గో) నౌకపై జరిగిన భీకర దాడిలో నలుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. యుద్ధ వాతావరణం నడుమ జరిగిన ఈ ఘోర ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.   అధికారుల సమాచారం ప్రకారం.. గినియా-బిసావు దేశ పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ గోల్డెన్ లియో’ అనే వాణిజ్య నౌక ఒడెసా…

TELANGANA

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు..!

రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించారని.. ప్రభుత్వం ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టపోయారన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని మండిపడ్డారు.   బాన్సువాడ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ ను తెలంగాణ భవన్ లో…

TELANGANA

‘ఆమెతో ఏడాదిగా రిలేషన్.. ఆధారాలు ఉన్నాయి’.. సూసైడ్ నోట్‌లో ట్రెయినీ ఐపీఎస్ సంచలనాలు..!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడే ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. దాంట్లో తన ఆత్మహత్యకు నలుగురు కారణమని ఉదయ్ కుమార్ రాసినట్టు సమాచారం. ఇక, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రెయినీ మహిళా ఐపీఎస్ తో తాను సంవత్సర కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది.   సదరు మహిళా అధికారికి పెళ్లి అయిన తర్వాత…

AP

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.   ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు   రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని…

AP

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫ్రంట్ ఆఫీస్ సేవలు.. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని…

AP

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం.

కదిరి రైల్వే స్టేషన్‌లో ఇంటి నుండి పారిపోయిన ముగ్గురు మైనర్ బాలురను ఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం. ఈ రోజు 18.07.2026 తేదీన రాత్రి 00:30 గంటలకు, శ్రీ టి. కృష్ణ మోహన్, సబ్-ఇన్‌స్పెక్టర్/ఆర్‌పీఎఫ్/కదిరి, మరియు శ్రీ బి. వీరబాబు, కానిస్టేబుల్ నెం.3851/ఆర్‌పీఎఫ్/కదిరి, కదిరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెం.1లో విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి…

National

వర్షాల కోసం వింత పూజ.. గాడిదలకు గులాబ్ జామూన్లు తినిపిస్తున్న జనం..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో స్థానికులు వర్షాల కోసం ఒక వింత ఆచారాన్ని ఆశ్రయించారు. నగరంలో తీవ్రమైన ఉక్కపోత, పొడి వాతావరణం నెలకొనడంతో.. వానలు పడాలని కోరుకుంటూ గాడిదలకు ‘గులాబ్ జామూన్లు’ తినిపించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాడిదలకు ఎంతో ఇష్టంగా ఈ భారతీయ సంప్రదాయ స్వీటును తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం…

TELANGANA

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ ఐపీఎస్ పై కేసు..

దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రమైన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న తీవ్ర ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.   వివరాల్లోకి వెళితే, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ఐపీఎస్ ప్రోబేషనర్, తన సహోద్యోగి అయిన…