Editor

TELANGANA

ఎమ్మెల్సీ కవితే ప్రధాన కుట్రదారు..–:ఈడీ..

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కవిత ఆప్ ముఖ్య నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రా సౌత్ గ్రూపును నడిపించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ ద్వారా డబ్బులు రాబట్టడానికి రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు గుర్తించామని తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది.   కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు…

TELANGANA

తెలంగాణలో 17 స్థానాల పోలింగ్, కౌంటింగ్ ముహూర్తం ఖరారు..!!

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరనుంది. ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అందులో భాగంగా నాలుగో విడతలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో, వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.   తెలంగాణలోకి 17 ఎంపీ…

AP

ఎన్నికల షెడ్యూల్ వేళ సంచలనం… టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మాగంటకు కుండువా కప్పి ఆహ్వానించారు.   వీరితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గురటయ్య, బాచిన కృష్ణచైతన్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా…

AP

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది.   ఏపీలో పోలింగ్ ఇలా సార్వత్రిక ఎన్నికల…

National

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల(Lok Sabha election 2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు గురువారం రాత్రి వెల్లడించింది.   చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు…

TELANGANA

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. కాగా, టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే టెట్ నోటిఫికేషన్ రావడం గమనార్హం.   అంతకుముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.…

TELANGANA

మల్కాజిగిరి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది.   సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. కాగా,…

AP

పిఠాపురంలో బిగ్ టర్న్ – పవన్ Vs మాజీ ఎమ్మెల్యే వర్మ, గెలిచేదెవరు..!

ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. పవన్ కల్యాణ్ పోటీ పైన ప్రకటన చేసారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో, ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ అనుచరులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్గం చేసారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రేపు వర్మ తన మద్దతుదారులతో భేటీ ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.   మారుతున్న…

AP

టీడీపీకి మరో షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు.. రెండో జాబితాలో అయిన తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండో జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.   బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ వంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో…

National

ఈసీ చేతికి రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు.. సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌.. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దాన్ని పాటించినట్లు వివరించింది.   ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన…