Editor

TELANGANA

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌-తమిళి సై రాజీనామా ఆమోదం..!

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కొత్త గవర్నర్ గా అదనపు బాథ్యతలు కట్టబెట్టింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మరో అదనపు బాధ్యత ఇచ్చింది. అలాగే తమిళి సై సౌందర రాజన్ చేసిన రాజీనామాను కూడా ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.   ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన…

TELANGANA

సుప్రీంకోర్టులో కవిత మరో రిట్ పిటిషన్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు.   తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్…

AP

ఏపీలో విపక్ష కూటమికి ఈసీ భారీ ఊరట-కీలక ఆదేశాలు జారీ..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ప్రతీ విషయంలోనూ పోటాపోటీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్దాయిలో అన్ని పార్టీలకు ఎన్నికల్లో పోటీ, ప్రచారం, ఇతరత్రా అంశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. అయినా చాలా సార్లు ఈ మాటలు అమలు కావడం లేదు. కానీ ఇవాళ ఏపీలో మాత్రం ఎన్నికల సంఘం ఓ కీలక అంశంలో మాత్రం విపక్షాలకు ఊరటనిచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.   ఎన్నికల నేపథ్యంలో…

AP

టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారు: అంబటి రాంబాబు..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన తెలుగుదేశం-జనసేన- బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ప్రజాగళం విఫలం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. టీడీపీ కూటమి జనంలో ఆదరణ కోల్పోయిందనడానికి ప్రజా గళం నిదర్శనమని, ప్రజలు తమ వెంటే ఉన్నారనడానికి ఆ సభే ఉదాహరణ అని అన్నారు.   తనపై వైఎస్‌ఆర్సీపీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు చెప్పుకొంటోన్నాడని, నిజానికి ఆయనే ఓ పెద్ద మానిప్యులేటర్…

National

ఎన్నికల షెడ్యూల్‌లో సవరణలు చేసిన ఈసీ.. జూన్ 2వ తేదీ నాడే ఓట్ల లెక్కింపు..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలను నిర్వహించడంలో తలమునకలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, విజయం సాధించడానికి అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతున్నాయి.   లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ శనివారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ…

TELANGANA

సరికొత్త ప్రచారాస్త్రాన్ని చేపట్టిన తెలంగాణ బీజేపీ..

సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సరికొత్త ప్రచారాస్త్రాన్ని సిద్దం చేసింది. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్‌సైట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.   కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.…

TELANGANA

కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీని కలిసిన కేటీఆర్, హరీశ్ రావు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ తోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం కలిశారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ అనిల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.   కవిత తొలిరోజు విచారణ పూర్తి  …

AP

కేంద్రంలో బీజేపీ రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటోన్నారు: మోదీ..

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల…

AP

మోడీ వచ్చింది అందుకే.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారు.   అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక బలాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే (NDA) పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని…

National

7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.   రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు.…