Editor

National

స్వలింగ వివాహాలకు గ్రీన్‌సిగ్నల్..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా గ్రీస్‌లో అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లుకు తాజాగా గ్రీస్ పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. తద్వారా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. దీంతో గ్రీస్ ప్రభుత్వానికి LGBT సమాజం ధన్యవాదాలు తెలిపింది. స్వలింగ వివాహాలకు ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

National

‘యువ విజ్ఞాని’కి ఇస్రో దరఖాస్తుల ఆహ్వానం..

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యువ విజ్ఞాని కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1కి 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హులుని తెలిపారు.

TELANGANA

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలనుంది. ఆ పార్టీ ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడనున్నాయి. వారిలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు గాంధీ భవన్‌లో వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

TELANGANA

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు.  …

TELANGANA

హరీశ్ రావు సీఎం కావాలంటే ఏం చేయాలో చెప్పిన రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ తెలిపారు. గత రభుత్వ పదేళ్ల అన్యాయాలను గుర్తించిన ప్రజలు.. వారిని గద్దె దింపారని సీఎం స్పష్టం చేశారు.…

TELANGANA

తెలంగాణలో మరో 26 మంది డీఎస్పీల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.   బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న…

AP

అమిత్ షా – చంద్రబాబు భేటీ అందుకే తేల్చేసిన పురందేశ్వరి..!!

ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో, టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ, రెండు పార్టీల నుంచి పొత్తుల పైన అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పైన వేచి చూసే ధోరణిపైన టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో అసలు అమిత్ షా…

AP

కుర్చీలు మడతపెడతారు, ఖబడ్దార్ – చంద్రబాబు మాస్ వార్నింగ్..!!

సీఎం జగన్ , టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల యుద్దంలో కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపునిస్తే…టీడీపీ – జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతబెడతారని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయిందని విమర్శించారు. జగన్ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.   ఎన్నికల వేళ సీఎం జగన్ – చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసగుతోంది. తాజాగా వాలంటీర్ల…

AP

టీడీపీకీ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఏపీలో ఎణ్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు రాజీనామాలు.. నేతల పార్టీల మార్పులు తారా స్థాయికి చేరాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే సంకేతాలు ఉన్నా అధికారిక నిర్ణయంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఇదే సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో సీనియర్లు పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ రాజీనామా చేసారు.   టీడీపీకి రాజీనామా:…

AP

ఏపీకి ప్రధాని మోదీ, కీలక నిర్ణయం..

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ దాదాపు ఖాయమైనా…అధికారిక నిర్ణయం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.   ఏపీకి ప్రధాని మోదీ:…