Editor

CINEMA

శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’: అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల

టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. చాలా కాలం తర్వాత ఆమె నేరుగా ఒక తెలుగు సినిమాలో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శోభిత…

TELANGANA

తెలంగాణ పోలీసుల సంచలనం: ఇంటి నుంచే ఫిర్యాదు.. మొబైల్‌కే ఎఫ్‌ఐఆర్ కాపీ!

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడించి తెలంగాణ పోలీస్ శాఖ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా వారి ఇంటి వద్దే ఫిర్యాదులు స్వీకరించేలా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు శారీరక ఇబ్బందులతో స్టేషన్‌కు రాలేని బాధితుల కోసం ఈ సేవలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ విధానం ద్వారా ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన వెంటనే దాని…

TELANGANA

హరీశ్ రావు సిట్ విచారణ పూర్తి: 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రే నోటీసులు అందుకున్న హరీశ్ రావు, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ విచారణలో పాల్గొని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో…

AP

తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…

AP

ఉత్సాహంగా ముగిసిన కదిరి మండల అండర్-12 క్రికెట్ పోటీలు….

ముగిసిన under 12 క్రికెట్ పోటీలు కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత…

CINEMA

రాజకీయాల్లోకి రాను.. మూగజీవుల హత్యలపై మౌనం వహించను: రేణు దేశాయ్

హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మీతో కలిసి నిర్వహించిన సమావేశంలో రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. కేవలం సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, జంతు ప్రేమికురాలిగా మాత్రమే తాను సమస్యలపై స్పందిస్తున్నానని వివరించారు. పదవుల కోసం కాకుండా, మూగజీవుల రక్షణే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా…

TELANGANA

“ముఖ్యమంత్రి రౌడీలా మాట్లాడుతున్నారు”: రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫిర్యాదు!

ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కలిసి కూల్చివేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య హింసను ప్రేరేపించేలా ఒక రౌడీ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: హరీశ్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణ!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 20, 2026) ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును అత్యంత వేగంగా విచారిస్తోంది. గచ్చిబౌలిలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లిన పోలీసులు,…

AP

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్

కదిరి, జనవరి 19: సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.…

AP

సమాజానికి దిశానిర్దేశం చేసిన ప్రజాకవి: ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం :- జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గాండ్లపెంట(కటారుపల్లి), జనవరి 19: విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన…