Editor

AP

జగన్ కు మరో షాక్..! చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని..

ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.…

National

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రపతి పాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో 2023 నుంచి మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.   అయితే, సీఎం ఓ వర్గానికే మొగ్గు చూపుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు.…

TELANGANA

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.   ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్…

TELANGANA

కులగణన మరోసారి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్పందించిన కేటీఆర్..

కులగణన సర్వే తప్పుల తడకని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కుల గణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.   ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, అసంపూర్తి…

AP

ఉత్తరాంధ్రకు వైసీపీ కొత్త బాస్..? ఎవరంటే..?

జగన్ నిర్ణయాలకు ఆ పార్టీ నేతలు షాకవుతున్నారా? నేతలు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి చేస్తున్నారా? ఉత్తరాంధ్రకు కొత్త బాస్‌ కన్నబాబు పేరు ప్రకటించడం ఏం జరిగింది? అధినేతపై ఎందుకు ఉత్తరాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీలో ఏం జరుగుతోంది?   ఏపీలో అధికార పోయినా మాజీ సీఎం జగన్ తీరు మారలేదా? అధినేతపై కొందరు ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారా? ప్రజల్లోకి…

AP

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు.. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదయింది.   వైసీపీ అధికారంలో…

National

ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు.. ఉచితాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి..

భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ స్వార్థం కోసం పార్టీలు ఓటర్లపై ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో నోటి ఏది వస్తే అది ఉచిత వాగ్ధానాలు చేస్తున్నారు. ప్రజల పని చేయడానికి ఇష్టం లేకుండా పార్టీలు చేస్తున్నాయి. ఏ పని చేయకుండానే ఆహారం, అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మహిళలకు అకౌంట్లలో డబ్బుల వేస్తాం, ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తాం.. ఇలా నోటికి వచ్చినట్లు…

National

ఈవీఎంలోని డేటాను తొలగించవద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..

ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించద్దని దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని, ఏ డేటాను రీలోడ్ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది. వాటిని పరిశీలించాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం…

APTELANGANA

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌..!

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి చెందినట్లు లెక్కలు వేశారు. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని వెటర్నరీ అధికారులు సూచించారు. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని.   మరోవైపు.. గోదావరి జిల్లాల్లో…

TELANGANA

స్థానిక ఎన్నికల షెడ్యూల్ మూహుర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

తెలంగాణ(Telangana)లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల(Local Body) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. గ్రామ పంచాయితీల(Gramapanchayati)కు కాల పరిమితి ఎప్పుడో ముగియగా, వివిధ కార్పోరేషన్లకు ఇటీవలే ప్రత్యేక అధికారుల్ని నియమించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే.. అనేక విషయాలపై అంతర్గతంగా అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించిన అధికారులు.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల(reservations) ఖరారుకు సిద్ధమయ్యారు.   ఇప్పటికే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister…