Editor

AP

ఆ రెండు పథకాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పింఛన్ నగదును పెంచి లబ్దిదారుల్లో ఆనందాన్ని నింపింది. అది కూడ పింఛన్ దారుడు మృతి చెందితే వెనువెంటనే సదరు లబ్దిదారుడి భార్యకు పింఛన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో పింఛన్ దారులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అంతేకాదు పింఛన్ మార్పుకు కూడ ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు దీపావళి రోజు దీపం 2.ఓ పథకాన్ని అమలు చేసి, ఏడాదికి మూడు…

AP

‘యశస్’ యుద్ధ విమానం నడిపిన రామ్మోహన్ నాయుడు..

పౌర విమానయాన మంత్రి గారికి యుద్ధ విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చింది. దేశ రక్షణ, భద్రతకు.. మన రక్షణ దళాలు వినియోగించే పైటర్ జెట్ ను స్వయంగా నడిపించారు. ఆ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిక్కోలు యువకుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. యుద్ధ విమానాన్ని నడిపించడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది అంటూ ఫోటోలూ పంచుకున్నారు. ఆయనకు ఏరో ఇండియా – 2025లో ఈ అవకాశం లభించింది.  …

National

చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ‘శివశక్తి’ పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలు..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగానూ రికార్డులకెక్కింది.   విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని భారత్ నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ శివశక్తి ప్రాంతానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు…

TELANGANA

తెలంగాణలో పెరంగున్న బీట్ల ధరలు..!

తెలంగాణ బీర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 శాతం మేరా పెంచుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరల పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫారసు మేరకు 15 శాతం ధర పెంచుతున్నట్లు ప్రభుత్వ వెల్లడించించింది.   ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం…

TELANGANA

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుందా..?

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుంది. పల్లెలు ఇందుకు వేదిక అవుతున్నాయి. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా పావులు కదుపుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక చేరింది. మండలం యూనిట్‌గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది.   రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనుంది ప్రభుత్వం. జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. ఈ ప్రాసెస్ జరిగిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల…

AP

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్..?

జగన్ 2.ఓ మొదలైందా? మొన్న కాంగ్రెస్ నుండి శైలజా నాథ్ వైసీపీలో చేరారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు.. వైసీపీలో చేరనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది కూడ ఈ నేత చేరికతో మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే కూటమిలోని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తమ్ముడికి సముచిత స్థానం కల్పిస్తే, ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో…

AP

జగన్‌కు విజయమ్మ, షర్మిల కౌంటర్..

సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది జగన్ వేసిన పిటిషన్‌పై ఆన్ లైన్‌లో కౌంటర్ చేశారు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల. నేరుగా కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ కోరడంతో ట్రైబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆరుకి వాయిదా వేసింది. ఇంతకీ విజయమ్మ, షర్మిల ప్రస్తుతం కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలను పరిశీలిద్దాం.   అసలు పిటిషన్ వివరాల్లోకి ఓసారి వెళ్దాం. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో…

National

ఢిల్లీ తరువాత బెంగాల్ వంతు.. మమతా బెనర్జీకి బిజేపీ నాయకుల హెచ్చరిక..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న బీజేపీ నాయకులు వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌ లో జరుగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని.. ఢిల్లీ తరువాత ఇక బెంగాల్ వంతు అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు. ముందుగా ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి.. పశ్చిమ బెంగాల్ సిఎం, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు.   కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడిన…

AP

గుంటూరు, విశాఖ కార్పొరేషన్‌పై టీడీపీ ఫోకస్…

గుంటూరు నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నాని పేరును ప్రకటించింది. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ్యులు నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్, కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర‌ని మేయర్ అభ్యర్థిగా నిర్ణయించారు.   గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా2019-24 వరకు ఆయన వ్యవహరించారు. పార్టీకి బలోపేతానికి ఎంతో కృషి చేశారు.…

AP

తిరుమల నెయ్యి కల్తీలో కీలక పరిణామం.. నలుగుర్ని అరెస్టు చేసిన సీబీఐ..

ఎట్టకేలకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టుల పర్వం మొదలైంది. మూడో కంటికి తెలీకుండా విచారణ జరుపుతోంది స్పెషల్ విచారణ టీమ్. లేటెస్ట్‌‌‌గా నలుగుర్ని సిట్ అరెస్ట్ చేయడం జరిగిపోయింది. వెంటనే న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టడం, ఈనెల 20 వరకు ఆయన రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారంతో వైసీపీ పెద్దల వెన్నులో వణుకు మొదలైంది.   తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తీగలాడితే డొంక కదులుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ ఆధ్వర్యంలోని…