Editor

AP

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.   ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల…

AP

ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..! వారంలో ఒక రోజు ‘నో వెహికిల్ డే’..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని…

AP

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.   ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి…

National

రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భారీ ఊరటనిచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.   రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. పెట్టుబడి ఖర్చుపై 50 శాతం అదనంగా కలిపి కొత్త ధరలను ఖరారు చేశారు. వరి క్వింటాల్‌కు రూ.…

AP

సైబర్ నేరాలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్..!

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేరాల కట్టడికి పటిష్ఠమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమే లక్ష్యంగా సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా…

TELANGANA

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా..! కేటీఆర్ తీవ్ర విమర్శలు..?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో…

TELANGANA

పోక్సో కేసులో కీలక పరిణామం..! పోలీసులకు బండి భగీరథ్ లేఖ..!

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఓ లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయినట్లు లేఖలో తెలిపారు. అయితే మే 15వ తేదీన సిట్ విచారణకు వస్తానని స్పష్టం చేశారు.   విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారుల…

AP

నారా లోకేష్ టీజర్ ట్వీట్..! మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. “మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?” అంటూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. దీనికి జతగా, ఓ అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం ఆకాశంలోకి దూసుకెళ్తున్న ఏఐ (ఏఐ) వీడియోను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ ద్వారా పుట్టపర్తిలో రాబోతున్న భారీ ప్రాజెక్టుపై ఆయన అంచనాలను పెంచారు.   శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో…

National

పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా ఇచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే ఆ భారాన్ని దేశీయ వినియోగదారులపై మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయపడ్డారు.   దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో హర్దీప్‌ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని హామీ…

TELANGANA

బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ..

ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.   రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై కేసీఆర్ ప్రత్యేక…