4news HD TV

Technology

అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఫోన్లు

మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది.…

NationalWorld

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్‌ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను…

POLITICSTELANGANA

కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు

రేవంత్ రెడ్డి… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక దిక్కు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్తాడని అంతా భావించారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా అదే ఆలోచించింది. అందకే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎందరో సీనియర్ నేతలను కాదని.. వాళ్లను పట్టించుకోకుండా వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రేవంత్…

POLITICS

జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి : మంత్రి ఆర్‌కే రోజా

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి క్రీడలు, శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, జగనన్న స్పోర్ట్స్ యాప్ ను రాష్ట్రంలో ఉన్న క్రీడకారులు ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్…

POLITICSTELANGANA

మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ నాస్తికుడు, అందుకే వినాయక నిమజ్జనాలకు ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. బుధవారం బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఓ వర్గం కోసమే ప్రభుత్వం కావాలని నిమజ్జనానికి ఆటంకాలు కల్పిస్తుందని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ట్యాంక్ బండ్ పైనే నిమజ్జనాలు నిర్వహిస్తామన్నారు. హిందువులు ప్రతిఒక్కరూ సద్దికట్టుకుని ట్యాంక్ బండ్ కు రావాలని ఆయన…

Technology

వేరొకరికి కనిపించకుండా వాట్సాప్ మెస్సేజ్ లు ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్ పై పనిచేస్తోంది. వాబీటా ఇన్ఫో సమాచారం మేరకు.. ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను అభివృద్ది చేస్తోంది. వాట్సాప్ ‘డిసప్పియరింగ్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే.. నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతాయి. కానీ, ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులోకి…

Technology

స్మార్ట్ ఫోన్ బాక్స్ లో చార్జర్ కనిపించదు ఇక..! అమలు చేయనున్న ఒప్పో

ఒప్పో ఫోన్లలో చార్జర్లు మాయమవుతున్నాయి..! ఆశ్చర్యపోకండి. కంపెనీలే చార్జర్లను ఇవ్వడం లేదు. ఇప్పటికే శామ్ సంగ్ ప్రీమియం ఫోన్లలో కొన్నింటికి చార్జర్లను జోడించడం లేదు. కావాలంటే వాటిని విడిగా కొనుక్కోవాల్సిందే. యాపిల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కంపెనీలపై చార్జర్ల వ్యయ భారం పడదు. పైగా పర్యావరణ వ్యర్థాలు కూడా తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అప్పటికే పాత ఫోన్ కు సంబంధించి చార్జర్ ఉన్నప్పుడు కొత్త ఫోన్ తో వచ్చే చార్జర్ ను ఏం…

Technology

వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందే ఫీచర్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ లో ఈ ఫీచర్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో ఒక సందేశాన్ని చెరిపేస్తే తిరిగి పొందే సదుపాయం…

Jobs

53 డీఏఓ ఉద్యోగాలకు …… తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని ఈ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. ముఖ్యాంశాలు… అప్లికేషన్ విండో ఆగస్టు 17న తెరుచుకోనుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 6. ఉద్యోగార్థులు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారై…