4news HD TV

CINEMANational

అబ్బురపరుస్తున్న అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్

ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నారు. థియేటర్ పని మొత్తం పూర్తయింది. ఈనెల 15వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్ అంటే ఎంతో ఫేమస్. దీన్ని సర్వ హంగులతో పునర్నిర్మించి AAA సత్యం మల్టీప్లెక్స్ గా ప్రారంభిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే…

National

‘తమిళనాడు ప్రధాని’ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్..

తమిళనాడులోని వేలూరులో తాజాగా పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అలాగే డీఎంకే పార్టీని కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల భేటీలో కీలకవ్యాఖ్యలు చేశారు. గతంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు నేతల్ని ప్రధాని కాకుండా డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగంగా స్పందించారు. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలని అమిత్ షా ఆదివారం తమిళనాడులోని తమ…

National

ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవటానికి ఇంకా నాలుగురోజులే సమయం.. హర్రీఅప్!!

చాలామంది ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ సమాచారంలో తప్పులు ఉన్నట్లయితే వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆధార్ కార్డులో మార్పులకు రిజిస్టర్డ్ మీసేవ, ఈసేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి 50 రూపాయలు డబ్బులు చెల్లించి మరీ చేసుకుంటారు.   అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వాటిని దిద్దుకోవడానికి వాటిని సరి చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్లో జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా…

National

అప్సర హత్య: పోస్టుమార్టం, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: అందుకే హత్య, నెట్‌లో సెర్చ్ చేసి..

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా, ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం పోస్టుమార్టం చేశారు. ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు వైద్యులు తెలిపారు. అనంతరం అప్సర మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో వారు సరూర్‌నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కూతుర్ను దారుణంగా హత్య…

National

ఏపీలో 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు ? ఆ ఎంపీ సీటుతో పాటే- రఘురామ తాజా డిమాండ్….

ఏపీలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఫిరాయింపుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీకి, అలాగే టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఫిరాయించిన 7 సీట్లలో ఉపఎన్నికలు పెట్టాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ…

TELANGANA

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల తేదీ ఖరారు: ఎప్పుడంటే?, ఇలా తెలుసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల…

National

ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో భారీ పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు; ఖమ్మం మార్కెట్లో మంటలు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందర్నీ పాటన్‌చెరులో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారం పారిశ్రామికవాడలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ ఆవరణలోనే రెండు యూనిట్లు నడుపుతున్నారు. ఒకదానిలో ఆర్వీ ఇంజినీరింగ్…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

NationalTELANGANA

ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?

ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది. ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని…

National

పబ్‌లో ఊ అంటావా.. ఊఊ అంటావా మావా.. వరుణ్ ధావన్‌తో సమంత!!

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సమంత అటు సినిమాలతోనే కాకుండా, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో సిటాడెల్ లో సమంత నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సమంత సిటాడెల్ కోసం విదేశాలలో ఉన్నారు. ప్రస్తుతం సెర్బియాలో హంగామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సెర్బియాలో రాష్ట్రపతిని కలిసిన సిటాడెల్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు.…