4news HD TV

National

కేశినేని 100శాతం పార్టీ మార్పు?

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని టీడీపీని(Vijayawada TDP) డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ఇంచార్జిలను గొట్టంగాళ్లంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై దురుసుగా మాట్లాడారు. మహానాడుకు ఆహ్వానం ఇవ్వలేదని, ఆ గొట్టంగాళ్లు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత? అంటూ విరుచుకుపడ్డారు. ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ అధిష్టానంను సైతం ఇరకాటంలో పెడుతోన్న విజయవాడ ఎంపీ వాలకం అధిష్టానంకు తలనొప్పిగా మారింది.…

National

హత్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా నమోదు

మాజీ మంత్రి వివేకా హత్య(Viveka Murder) కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది. ఇప్పటి వరకు ఆయన నిందితుడా? అనుమానితుడా? అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే. అయితే, తాజాగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు కౌంటర్ వేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా(A8) చేర్చింది. హత్య జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారుచేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారని అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం దీనిపై విచారణ…

National

హైదరాబాద్‌లో శర్వానంద్ రిసెప్షన్.. KCRని స్వయంగా ఆహ్వానించిన శర్వా..

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) ఇటీవల జూన్ 3న వివాహం చేసుకున్నాడు. జైపూర్(Jaipur) లీలా ప్యాలెస్ లో రక్షిత(Rakshita) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ఘనంగా వివాహం చేసుకున్నాడు. రక్షిత టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. శర్వా వివాహానికి రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వివాహం జైపూర్ లో పెట్టడంతో కేవలం అతి సన్నిహితులను మాత్రమే…

National

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు..

ఎండాకాలం(Summer( అయిపోవచ్చింది. సమ్మర్ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం ఎండలు మరింత ఎక్కువ ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం, తొలకరి చినుకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) మరి కొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయి. నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు,…

National

గుడ్లు,పాలు కలిపి తీసుకుంటే లాభాలతో పాటు నష్టాలు కూడా?

సాధారణంగా చాలామంది గుడ్లు పాలు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే చాలా మంచిదని శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పచ్చి గుడ్డు పాలు తీసుకుంటే మరికొందరు ఉడకబెట్టిన గుడ్డు పాలు తీసుకుంటూ ఉంటారు. గుడ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే పాల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు, పచ్చి గుడ్లు, పచ్చి పాలు ఈ రెండు అధిక…

APNationalTELANGANA

వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?

సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ నకిలీ డాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది నకిలీ డాక్టర్లు బాగోతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా కూడా వ్యక్తి డాక్టర్ ని అని నమ్మించి వృద్ధురాలిని…

TELANGANA

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఎండలు కూడా తీవ్రమే, వడగాలుల అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి…

CINEMANational

రజినీకాంత్ కితాబు, అమెరికా ఇంజినీర్ల ప్రశంసలు: తెలంగాణ నెంబర్ 1 అంటూ కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. తెలంగాణలో సమగ్ర, సమత్యులత,సమ్మిళిత అభివృద్ధి జరిగిందని వివరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.   పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు…

National

భలే షాకిచ్చిన సిద్ధరామయ్య: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు- ఉచితాల భారం జనంపైనే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు అతి కీలకమైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం.. వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి కర్ణాటక…

NationalTELANGANA

వారందరికీ రూ. లక్ష సాయం: అర్హులైన వారు అప్లై చేసుకోండిలా, 9 నుంచే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తిపదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మే నెలలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం…