News

AP

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ, ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాజధానిని రాత్రికి రాత్రే నిర్మించలేరని ఆయన స్పష్టం చేశారు.   ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చారిత్రక నగరాల నిర్మాణాన్ని గుర్తుచేశారు. 1537లో కెంపె గౌడ స్థాపించిన బెంగళూరు, 1591లో కులీ కుతుబ్ షా నిర్మించిన…

National

ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్..!

ఎన్నికల్లో బయో మెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేయాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఇలా చేస్తే నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు అర్హత ఉన్న అంశమని అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది.   దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం సాధించిన పార్టీలపై ప్రతిపక్షాలు దొంగ ఓట్ల సాయంతో గెలిచాయంటూ…

TELANGANA

ఆర్టీసీలో సమ్మె సైరన్..! 22 నుంచి సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ..

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 21 అర్ధరాత్రి..22 (బుధవారం)నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసు లు ఇచ్చామని ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 31 డిమాండ్లను పెట్టామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డిలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ గా మారుబోతుందా..?

బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ గా మారుబోతుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ సైతం టీఆర్ఎస్ గా ఉంటేనే ప్రజల ఆదరణ ఉంటుందని, అది పార్టీ పేరులోంచి తొలగించిన తర్వాతే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్టీ కేడర్ ఒత్తిడి, మరోవైపు రాజకీయాల్లో గడ్డుకాలం నేపథ్యంలో మళ్లీ పార్టీ మార్పు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో విజయం…

AP

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు..! దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి..

క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్‌ బెడ్‌ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి అవతరించనుంది.   అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు   దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్‌ బెడ్స్‌‌ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్‌ బెడ్లను జాతికి అంకితం…

AP

రాష్ట్ర స్థాయి క్రికెటర్ తేజస్వినికి జనసేన నాయకుడు మల్లెం మోహన్ ప్రోత్సాహకం

పాత్రికేయ మిత్రులకు నమస్కారం వర్ధమాన క్రికెట్ క్రీడాకారిణికి ప్రోత్సాహకం కదిరి ACA – ADCA – RDT క్రికెట్ కోచింగ్ subcenter నుండి గత రెండు సంవత్సరాలనుండి వరుసగా under 15 బాలికల రాష్ట్ర జట్టుకు ఎంపిక అవ్వడమే కాక, U-15 జాతీయ క్రికెట్ క్యాంపు లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి తెజేశ్వని కి కదిరి సీనియర్ క్రీడాకారులు మరియు జనసేన నాయకులు మల్లెం మోహన్( రాము ) ఇంగ్లీష్ విల్లో క్రికెట్ bat ను ప్రోత్సాహకంగ…

National

ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం సాయంత్రం ఈ కీలక సమావేశం మొదలైనట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఖేర్ ఖలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి.   ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, లెబనాన్‌లో పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలు, స్తంభింపజేసిన తమ ఆస్తులను…

TELANGANA

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   అంగన్వాడీ టీచర్ల…

AP

అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి నాలుగోసారి మోసపోయారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు.   రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, కేవలం అమరావతిపైనే లక్షల కోట్లు కుమ్మరించడం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అమరావతి నగరం…

TELANGANA

అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. శనివారం నాడు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.   ఈ ఆపరేషన్‌లో భాగంగా, భూకబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం.ఏ.…