News

TELANGANA

జీఎస్టీ కమిటీని నియమించిన తెలంగాణ బీజేపీ..

బీజేపీ రాష్ట్ర స్థాయిలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పై తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు, సవరణలను ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసేందుకు.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాపార వర్గాలకు సమాచారం అందించడం, కేంద్ర విధానాలను సమర్థవంతంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ముందుకు సాగనుంది. కమిటీలో ప్రముఖులు బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రాముఖ్యత కలిగిన నేతలను చేర్చింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,…

TELANGANA

విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం..

తెలంగాణలో SPDCL, NPDCL‌తోపాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో.. ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, మేజర్-మైనర్ లిప్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ నీటి సరాఫరాలను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.   ప్రతిపాదనల నేపథ్యంలో ప్రణాళిక సిద్ధం…

National

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: జైషే మహమ్మద్ వీడియో వైరల్..

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  …

TELANGANA

తెలంగాణలో అసమర్థ పాలన కొనసాగుతోంది: కేటీఆర్ విమర్శలు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత మానవత్వం…

TELANGANA

ఎంపీల ఓట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు: కౌశిక్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను ఆయన బీజేపీకి అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.   ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్…

AP

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ భారీ గుడ్ న్యూస్..! ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేష‌న్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.   ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్‌మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. వీటిలో రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఒక బీసీ హాస్టల్ వెల్ఫేర్…

AP

అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి..!

రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కేబుల్ వంతెన నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక వంతెన నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అందులో ఎక్కువ ఓట్లు పొందిన రెండో నమూనా ఎంపికైంది.   కూచిపూడి నృత్య భంగిమలో రూపకల్పన   ఈ…

National

కృత్రిమ మేధపై కేంద్రం కీలక వైఖరి.. నిర్మల సీతారామన్ స్పష్టత..

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) సాంకేతికత ఒక స్ప్రింటర్ వలె వేగంగా పరుగెడుతోందని, దానికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థ కూడా అంతే వేగంతో కదలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే నైతిక విలువలను విస్మరించకుండా బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.   సోమవారం ఢిల్లీలో నీతి ఆయోగ్ రూపొందించిన “వికసిత భారత్ కోసం ఏఐ: ఆర్థిక వృద్ధికి అవకాశాలు”…

AP

ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల..

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎన్నికల సంఘం.. స్వతంత్రత కోల్పోయిందని, అది పూర్తిగా బీజేపీ ప్రయోజనాలకే పనిచేస్తోందని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఆరోపణలు.. ఇప్పుడు మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.   షర్మిల వ్యాఖ్యల సారాంశం   హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన షర్మిల మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ ఇప్పటికే దేశం ముందుకు ఒక నిజాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం నేడు మోదీ చేతిలో బందీ అయ్యింది.…

AP

ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు మహర్థశ..! ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు..!

అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ఏపీలో చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఏయే రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామో కలెక్టర్లకు వివిధ శాఖల కార్యదర్శులు వివరించారు. ఏడాదిగా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల గురించి జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తెలియజేశారు.   ఏదైనా సమస్యలు వస్తే వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్న పారిశ్రామిక వేత్తలతో కలెక్టర్లు మాట్లాడాలని సంకేతాలు ఇచ్చేసింది ప్రభుత్వం. ఏపీలోని ఐదు డిఫెన్స్ క్లస్టర్లుగా ప్లాన్ చేసింది కూటమి సర్కార్. అందులో ఉత్తరాంధ్ర-రాయలసీమకు మహార్ధశ పట్టనుంది.…