News

National

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కీలకమైనప్పటికీ, భారత అధికారులకు ఇది ఒక కొత్త రకమైన దౌత్యపరమైన సవాలును విసిరింది. సమావేశాల సందర్భంగా ఏ దేశపు జెండాను ప్రదర్శించాలనే అంశం ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.   ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.…

AP

అలాంటి పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారు.   ఉప్పాడ మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని…

AP

అధికారంలో ఉన్నా, లేకున్నా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం: జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్మికుల పక్షానే నిలబడతామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం నర్సీపట్నం, విశాఖపట్నం పర్యటనలో భాగంగా తనను కలిసిన ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.   పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్‌ను కలిసి,…

TELANGANA

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు…

TELANGANA

తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసిన ఎన్నికల సంఘం..! ఎందుకంటే..?

తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అనూహ్యంగా బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది.   స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అనుసరించి, ఎన్నికల ప్రక్రియను…

National

స్వదేశీని మంత్రాన్ని స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చేయండి: ప్రధాని మోదీ..

దేశ ప్రజలు ‘స్వదేశీ’ని స్వీకరించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా, యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.   “ప్రతి ఒక్కరూ గర్వంగా ‘స్వదేశీ’ అని చెప్పాలి. ఇది ప్రతి పౌరుడికి, మార్కెట్‌కు ఒక మంత్రంలా మారాలి. ప్రజలు…

TELANGANA

రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.   రేపు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్..

చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ఈ ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరిప్ లను విక్రియించకూడదని.. తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం జరిగింది.   ఉపశమనానికి వేసిన దగ్గు మందు చిన్నారుల ప్రాణం తీసింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు మరణాలతో కేంద్రం అలర్ట్…

AP

పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! పశుగ్రాసం సాగుకు 100% రాయితీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

AP

రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 274 రహదారుల మరమ్మత్తుల కోసం తాజాగా ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రహదారుల్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.   అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వ…