News

National

ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ..

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత భయాలతో హైదరాబాద్ నగరంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద వరుస కడుతున్నారు. నిన్న, నేడు నగరవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపించింది. నిల్వలు తగ్గిపోవడం లేదా విపరీతమైన డిమాండ్ కారణంగా పలు పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేశారు.   పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా డీజిల్ దొరకడం లేదు.…

TELANGANA

శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు..

ప్రజలను భాగస్వాములను చేస్తూ ఫ్యూచర్‌ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సీపీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.   కొంత మంది ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం విషయంలో…

National

ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని.. సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడబోతోందని ఆయన హెచ్చరించారు. “ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలను మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై…

National

మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు..

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో భారతీయ నావికులున్న ఒక రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు జరిపినట్లు భారత ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. టోగో దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సైరన్’ అనే ఈ ట్యాంకర్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించినట్లు తెలిపింది.   ఏప్రిల్ 25న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఆ నౌక సమీపంలో ఇతర నౌకలు కూడా ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ…

AP

ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.   కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం గమనిస్తూ, ప్రతీ 3…

TELANGANA

బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని ఆయన అన్నారు. “చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు.. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది” అంటూ విరుచుకుపడ్డారు.     పదేళ్ల అహంకార పూరిత పాలన వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, దాని మనుగడే ప్రశ్నార్థకమైందని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కల్వకుంట్ల…

TELANGANA

కవిత స్థాపించిన ‘టీఆర్ఎస్’పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు .

తన సోదరి కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ గురించి చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారని, వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.   తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది మేమే…

AP

పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు..! దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సహజంగా ఏర్పడిన సంక్షోభం కాదని, కూటమి నాయకులు, పెట్రోల్ బంకుల డీలర్లు కుమ్మక్కై సృష్టించిన కృత్రిమ కొరత అని సంచలన ఆరోపణలు చేశారు. సమస్య వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకుని దోచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ అదే జరుగుతోందని విమర్శించారు.   ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయనే…

CINEMA

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో మారిన హీరోయిన్..

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు అలాగే క్రీడ రంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subbalakshmi) బయోపిక్ సినిమా కూడా ప్రేక్షకులుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Gawtham Tinnanuri) దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్…

TELANGANA

ఇక మా టైం మొదలైంది.. కవిత ట్వీట్ వైరల్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె, ఆ తర్వాత చేసిన తొలి ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది” అంటూ ఎక్స్‌లో ఆమె పోస్టు పెట్టారు.   శనివారం హైదరాబాద్‌లోని మునీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత తన పార్టీ పేరును అధికారికంగా…