News

TELANGANA

కాళేశ్వరం దర్యాప్తులో కీలక ట్విస్ట్..! విచారణకు మాజీ సీఎం కేసీఆర్..?

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన (క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన) తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.   వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో…

AP

ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు..? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..!

కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఘటనపై స్పందించారు. సీఎస్, డీజీపీలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు.   జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో…

AP

అరెస్టుల వేళ జగన్ వరుస భేటీలు..! కారణం అదేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.   జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో…

National

భారత సైన్యానికి కీలక అధికారాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం..

పాకిస్థాన్ తో ఇటీవలి ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకు కీలక అధికారాలను అప్పగించింది. అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సుమారు రూ.40,000 కోట్ల పరిమితితో అత్యవసర ఆయుధ సేకరణ (ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ – ఈపీ) అధికారాలను త్రివిధ దళాలకు కల్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేసినట్లు…

AP

నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు. పాత కక్షలు ఉండటంతోనే దాడి చేశారు.. సురేష్ సోదరులు రాజును కొట్టి బైకుపై ఇంటికి తీసుకుని వెళ్లారు.. ఇంటి దగ్గర కూడా పడేసి కాళ్లతో బాధితుడు రాజును కొట్టడం జరిగింది.. రాజును చంపి కృష్ణా…

AP

రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్ట్..?

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే కీలక ప్రాజెక్టుల్ని తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. వాటిని గ్రౌండ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్నీ ప్రతిపాదిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి రాజధానిలో సెమీ హైస్పీడ్ సర్కులర్ రైల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ…

TELANGANA

‘తెలంగాణ రైజింగ్’ అంటే ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడమేనా..: హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని, మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే ‘మార్పు’ అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి, కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, “ఎక్సైజ్ ఆదాయంలో ‘తెలంగాణ రైజింగ్’ అంటే ఇదేనా?” అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.   హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను అటకెక్కించి,…

TELANGANA

నకిలీ వైద్యులపై వేటు వేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్..!

తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా వైద్యులు పుట్టుకొస్తున్నారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో కొంతకాలం సహాయకులుగా పనిచేసి, ఆ తరువాత వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే రోగులకు యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్నారు.   ఈ క్రమంలోనే అర్హత లేని వైద్యుడు, అనుమతులు లేని ఆసుపత్రిలో ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా, వైద్యం వికటించి…

TELANGANA

సిద్దిపేట జవాన్‌ భూ కబ్జా ఆరోపణ.. వీడియో షేర్ చేసిన హరీశ్ రావు..!

దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ఓ సైనికుడి భూమి కబ్జాకు గురైందంటూ వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాను, తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు వెంటనే స్పందించారు.   జవాన్ రామస్వామి ఎదుర్కొంటున్న సమస్యను ఆయన తీవ్రంగా…

National

పాక్ గూఢచర్యం కేసులో ప్రముఖ యూట్యూబర్‌తో జ్యోతి మల్హోత్రా అరెస్ట్..

హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.   ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ…