జపాన్ లో మరో రెండు కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం ఎంవోయూ..
తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా బృందం ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్లో ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జపాన్కు…

