News

AP

తాళం వేసిన ఇంటిలో చోరీ, కేసు నమోదు…

కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల…

AP

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు: కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో సిఐటియు (CITU) నిరసన

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి ! కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం…

AP

కదిరిలో క్షుద్రపూజల కలకలం: కుమ్మరివాండ్లపల్లి రహదారిపై భయానక దృశ్యాలు

కదిరి మునిసిపల్ పరిధిలోని స్థానిక కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లేదారిలో క్షుద్రపూజలు భయాందోళనలోగ్రామ ప్రజలు నేషనల్ హైవే పక్కనే కుమ్మరివాండ్లపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డులో పెద్ద భయంకర ఆకారంలో క్షుద్ర బొమ్మ వేసి భయంకరమైన రూపం లో తల ఆకారంలో బూడిద భోగ్గుల పొడి వేప పలురకాల భూడిదలతో భయానక వాతావరణం నెలకొంది అంతే కాక స్థానిక వైస్సార్సీపీ cec సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన దారిఆ గ్రామం నుంచి కూలి పనులకోసం నిత్యం *వందలాది…

CINEMA

శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’: అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల

టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. చాలా కాలం తర్వాత ఆమె నేరుగా ఒక తెలుగు సినిమాలో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శోభిత…

TELANGANA

తెలంగాణ పోలీసుల సంచలనం: ఇంటి నుంచే ఫిర్యాదు.. మొబైల్‌కే ఎఫ్‌ఐఆర్ కాపీ!

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడించి తెలంగాణ పోలీస్ శాఖ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా వారి ఇంటి వద్దే ఫిర్యాదులు స్వీకరించేలా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు శారీరక ఇబ్బందులతో స్టేషన్‌కు రాలేని బాధితుల కోసం ఈ సేవలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ విధానం ద్వారా ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన వెంటనే దాని…

TELANGANA

హరీశ్ రావు సిట్ విచారణ పూర్తి: 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రే నోటీసులు అందుకున్న హరీశ్ రావు, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ విచారణలో పాల్గొని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో…

AP

తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…

AP

ఉత్సాహంగా ముగిసిన కదిరి మండల అండర్-12 క్రికెట్ పోటీలు….

ముగిసిన under 12 క్రికెట్ పోటీలు కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత…

CINEMA

రాజకీయాల్లోకి రాను.. మూగజీవుల హత్యలపై మౌనం వహించను: రేణు దేశాయ్

హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మీతో కలిసి నిర్వహించిన సమావేశంలో రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. కేవలం సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, జంతు ప్రేమికురాలిగా మాత్రమే తాను సమస్యలపై స్పందిస్తున్నానని వివరించారు. పదవుల కోసం కాకుండా, మూగజీవుల రక్షణే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా…

TELANGANA

“ముఖ్యమంత్రి రౌడీలా మాట్లాడుతున్నారు”: రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫిర్యాదు!

ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కలిసి కూల్చివేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య హింసను ప్రేరేపించేలా ఒక రౌడీ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ…