News

National

భారత్‌ను తాకితే ‘డాట్ డాట్ డాట్’.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది. పహల్గాం సమీపంలోని బైసరణ్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే పాకిస్థాన్‌కు అత్యంత శక్తిమంతమైన హెచ్చరికలు జారీ చేశారు.     “భారత్ తనంతట తానుగా ఎవరిపైనా దాడి చేయదు. కానీ మా పొరుగున ఒకే ఒక దేశం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంది. ఆ దేశం…

TELANGANA

బీజేపీ – బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్..

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు కేవలం సాంకేతికపరమైన అంశాలకే పరిమితమని, అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.   కోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కానీ, దాని విచారణను కానీ తప్పుబట్టలేదని… కేవలం నివేదిక రూపకల్పనలో అనుసరించిన విధానాన్ని మాత్రమే…

AP

పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి..!

కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంతో మొదలైన ఈ గొడవ, తోపులాట వరకు దారితీయడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి ఘటనలు కూటమికి నష్టం కలిగిస్తాయని, పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.   వివరాల్లోకి వెళితే… మంగళవారం పిఠాపురంలో జరిగిన…

National

తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల కీలకమైన “నిశ్శబ్ద సమయం” (సైలెన్స్ పీరియడ్) అధికారికంగా ప్రారంభమైంది. దీంతో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రసంగాలకు ఫుల్‌స్టాప్ పడింది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, బెంగాల్ లో తొలి దశ పోలింగ్ జరగనుంది.  …

AP

అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్… ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.   ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం…

TELANGANA

చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్..

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీంతో కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి RTC ఉద్యోగులు సమ్మెలోకి దిగనన్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంకోసం ప్రభుత్వం కమిటీ 4 వారాల సమయం కోరింది. దీంతో అందుకు ఆర్టీసీ జేఏసీ సంఘం అంగీకరించలేదు. కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్…

TELANGANA

కుషాయిగూడలో రైతుల మహా ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి…

AP

ఏపీకి పెట్టుబడుల వరద.. సింగపూర్‌లో ఏడు రోజుల పాటు మంత్రుల వ్యూహాత్మక పర్యటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఏపీకి చెందిన మంత్రుల బృందం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటన ఏప్రిల్ 21న ప్రారంభమై, ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలను రాష్ట్రంలో అమలు చేయడం ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ నేతలు ఈ…

National

భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి..

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (Lee Jae-myung) మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఆయనకు అధికారిక సైనిక వందనం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన సైనికుల గౌరవాన్ని స్వీకరించారు. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడి పర్యటన వెనుక కీలక అజెండా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో భేటి సందర్భంగా ఇరువురి నేతల మధ్య చర్చకు…

Uncategorized

కేసీఆర్ సంచలన ప్రకటన..! బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం…

జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో అమలవుతున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తామని ప్రకటించారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…