News

AP

బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి: ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ..

సోలార్ విద్యుత్ పరిశ్రమ కోసం ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిన్న పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది.   ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. అలాగే ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్…

TELANGANA

నెరవేరిన రైతుల కల… నిజామాబాద్ లో ‘పసుపు బోర్డు’ను ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా..

తెలంగాణ పసుపు రైతులు నాలుగు దశాబ్దాలుగా కంటున్న కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం నాడు నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.  …

TELANGANA

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై వీడిన ఉత్కంఠ.. కొత్త సారథిగా రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ, వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామచందర్‌రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్‌ను సమర్పించనున్నారు.   రాష్ట్రంలో…

AP

నేడు తాడేపల్లికి జగన్..!

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని నివాసానికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటారు.   రోడ్డు ప్రమాదానికి సంబంధించి వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి…

TELANGANA

అక్రమ టోల్ గేట్ కేసు.. మ‌ళ్లీ పోలీస్ కస్ట‌డీకి మాజీ మంత్రి కాకాణి..

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు.   వివరాల్లోకి వెళితే… కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ టోల్ గేట్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు…

National

ఎల్‌వోసీ వద్ద భారీ కుట్ర భగ్నం.. సైన్యానికి చిక్కిన పాకిస్థానీ గైడ్..!

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన భారీ చొరబాటు కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. రజౌరీ జిల్లాలోని గంభీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన చొరబాటుదారులకు మార్గనిర్దేశం చేస్తున్న ఒక పాకిస్థానీ గైడ్‌ను సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు గాయపడి వెనక్కి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.   రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. ఆదివారం…

National

పూరి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట.. పలువురు మృతి..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరీలో మరోసారి విషాద ఘటన చోటు చేసుకుంది. గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట జరగడంతో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నియంత్రించలేని విధంగా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.   భక్తుల ఉత్సాహం..…

TELANGANA

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు..?

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? పార్టీ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీజేపీ కొత్త చీఫ్ ఎవరేది ఆసక్తికరంగా మారింది. బలమైన రేవంత్ సర్కార్‌ని ఎదుర్కొని నిలబడడమేంటే ఆషామాషీ కాదు. పోటీపడుతున్న వారిలో ముగ్గురు ఎంపీలే కావడంతో త్రిముఖ పోటీ నెలకొంది.   బీజేపీ నిర్ణయాలు చాలామంది రాజకీయ నేతలకు అంతుబట్టవు. రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంపికలో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది కేవలం 48 గంటల్లో తేలిపోనుంది.…

TELANGANA

టీవీ చానెల్ ఆఫీస్‌‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!

వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా BRS కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా.. ఏకంగా ఆఫీసులోకి జొరబడి, అద్దాలు పగులగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే…

AP

ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ వార్నింగ్..!

అహంకారం, ఇగోలను పక్కన పెట్టండి.. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడండి..! కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి జనాలకు వివరించండి..ఇదీ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు.. మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏర్పాటై ఏడాది పూర్తైన నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లు జనంలోకి వెళుతున్న వేళ.. నారా లోకేశ్ చేసిన హితబోధ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ లోకేశ్ హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?   అంతటి…