ఫోన్ ట్యాపింగ్ కేసు: హరీశ్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణ!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 20, 2026) ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును అత్యంత వేగంగా విచారిస్తోంది. గచ్చిబౌలిలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లిన పోలీసులు,…

