News

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: హరీశ్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణ!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 20, 2026) ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును అత్యంత వేగంగా విచారిస్తోంది. గచ్చిబౌలిలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లిన పోలీసులు,…

AP

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్

కదిరి, జనవరి 19: సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.…

AP

సమాజానికి దిశానిర్దేశం చేసిన ప్రజాకవి: ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం :- జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గాండ్లపెంట(కటారుపల్లి), జనవరి 19: విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన…

AP

పులగంపల్లి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు – సిమెంట్ లారీ ఢీ, 10 మందికి గాయాలు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి పులివెందుల దిశగా వెళ్తున్న సిమెంట్ లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర వాహనం ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు…

AP

ఉత్సాహంగా సాగిన కదిరి మండల అండర్-12 క్రికెట్ ఎంపికలు…

కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు under 12 క్రీడాకారుల సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ లో under 12 విభాగం లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యలను పరీక్షించారు. ఈ ఎంపికకు సీనియర్ క్రీడాకారుడు సంపంగి అనిల్ కుమార్ సెలెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రీడాకారులకు మ్యాచ్ లు నిర్వహించి తుది జట్టును అనంతపురం లో జరుగు పోటీలకు పంపుతారు. ఈ సందర్బంగా సెలెక్టర్ అనిల్…

AP

కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్ దే పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకం పటేల్, పట్వారి వ్యవస్థలకు…

CINEMA

వరుసగా నాలుగో హిట్: ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ మీట్‌లో నవీన్ పోలిశెట్టి భావోద్వేగం!

ప్రేక్షకులే నా వెనుక ఉన్న శక్తి: సంక్రాంతి పోటీలో పెద్ద సినిమాల మధ్య తన సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. “బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల చిన్న ఆందోళన ఉండేది.. కానీ ప్రేక్షకులు దీన్ని బ్లాక్ బస్టర్ చేసి నా భయాన్ని పోగొట్టారు” అని ఆయన అన్నారు. కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరిగిన రోజులను గుర్తుచేసుకుంటూ, వరుసగా నాలుగు హిట్లు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత…

National

ఇండిగోకు షాక్: రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించిన డీజీసీఏ!

వైఫల్యాలపై డీజీసీఏ విచారణ: గత ఏడాది డిసెంబర్ నెలలో ఇండిగో సంస్థ వేలాది విమానాలను రద్దు చేయడం వల్ల దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ విచారణ చేపట్టింది. విమానాలు మరియు సిబ్బంది వినియోగంలో సరైన ప్రణాళిక లేకపోవడం (Over-optimization), సాఫ్ట్‌వేర్ లోపాలు మరియు కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను పాటించడంలో వైఫల్యమే ఈ సంక్షోభానికి కారణమని కమిటీ…

TELANGANA

పాలమూరుపై గత ప్రభుత్వానిది కడుపు మంట: బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!

ప్రాజెక్టుల అసంపూర్తిపై నిలదీత: గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు జిల్లాకు చెందిన ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. “పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంట్రాక్టర్లకు ₹25,000 కోట్లు చెల్లించారు కానీ, ఉద్దండాపూర్ భూసేకరణకు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు?” అని ఆయన ప్రశ్నించారు. సంగంబండ వంటి ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేశారని, కేవలం బిల్లుల కోసమే ప్రాజెక్టులను వాడుకున్నారని మండిపడ్డారు. రాజకీయ వివక్ష మరియు కడుపు మంట:…

AP

కాకినాడలో రూ.18 వేల కోట్ల భారీ ప్రాజెక్టు: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

రాష్ట్ర భవిష్యత్తుకు ‘గేమ్ ఛేంజర్’: సుమారు రూ.18,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమగా రూపొందుతోందని, పర్యావరణహిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తొలి దశ ఉత్పత్తి 2027 జూన్ నాటికి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సహజ వనరుల వినియోగం – ఎగుమతుల…