News

AP

జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.   ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు…

TELANGANA

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. కోటి చొప్పున అందుకున్నవారు వీరే..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు.   తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోనూ, సాంస్కృతిక వైభవ వ్యాప్తిలోనూ కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.…

AP

జగన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్..!

విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన…

TELANGANA

గవర్నర్ తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సుందరీమణులు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తాజా ప్రపంచ సుందరి ఓపల్ సుచాత నేతృత్వంలోని సుందరీమణుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   గవర్నర్ ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీ…

National

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్ళీ బెదిరింపులు.. కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ వార్నింగ్..

తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సోమవారం వెల్లడించారు. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు రాజాసింగ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ బెదిరింపులు తనను భయపెట్టలేవని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు.   ఈ ఘటనకు సంబంధించి రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.…

National

ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్‌కు మలేషియా సంపూర్ణ మద్దతు..

భారత్ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం చూపబోదని, ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే దేశాలకు మధ్య ఇకపై ఎలాంటి తేడా చూపబోదని జేడీ(యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం సోమవారం మలేషియాలో స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి, అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఈ బృందం మలేషియాలోని ప్రముఖ మేధోమథన సంస్థలకు, విద్యావేత్తలకు వివరించింది. భారత్ చేపట్టిన ఈ చర్య కచ్చితమైనదని,…

AP

మంగళగిరిలో త్వరలోనే రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ… మంత్రి నారా లోకేశ్ సమీక్ష..

మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3 వేల మందికి శాశ్వత…

TELANGANA

కాళేశ్వరం విచారణ.. మాజీ సీఎం కేసీఆర్ హాజరు తేదీ మార్పు..!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్, విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత…

AP

బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు..

బుగ్గమఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 22న ఉత్తర్వులు జారీ…

National

దేశంలో 3 వేలకు చేరువైన కొవిడ్ కేసులు..

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది.  …