నెరవేరిన రైతుల కల… నిజామాబాద్ లో ‘పసుపు బోర్డు’ను ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా..
తెలంగాణ పసుపు రైతులు నాలుగు దశాబ్దాలుగా కంటున్న కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం నాడు నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన వినాయక్నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. …

